సూర్యాస్తమయ చంద్రోదయముల వర్ణనము
కాలమనే కిరాతుడు, ఆకాశమనే అరణ్యంలో, చీకటి అనే ఏనుగును బంధించడానికై పూనుకొని మచ్చుపెట్టుటకు తయారుచేసిన మామిడిచిగుళ్ల చెండా అన్నట్లుగా మార్తాండుడు మందగించిన కాంతితో పడమటి పర్వతంమీద చూడముచ్చట గొలిపాడు.
పరీక్షిన్మహారాజా! ఆకాశమనెడి వనిత లేతవయసువాడూ, చల్లని కిరణాలుగలవాడూ (చల్లని చేతులవాడు) అయిన చంద్రుణ్ణి వలచి, వృద్ధుడూ వాడికిరణాలు గలవాడూ (కరకు చేతులవాడు) అంటూ తన్ను త్రోసి రాజన్న విధంగా భానుడు పడమటి కొండదగ్గర అస్తమించాడు.
తాను షోడశ కళాపూర్ణుడగు గాక! లక్ష్మీదేవి తనకు తోబుట్టువగుగాక! తాను శివుని సిగనెక్కి నిక్కుగాక! అన్యుడైన ఆ చంద్రుడిపొత్తు మాకు అక్కరలేదు. తపింపజేసేవాడయినప్పటికీ మా భర్త సూర్యుడే అని పతివ్రతవలె పద్మినీజాతి మూతి ముడుచుకుంది.
ఒప్పిదమైన సాయంకాలసంధ్యావందనంలో బ్రాహ్మణులయొక్క అర్ఘ్యప్రదానజలాలనే వజ్రాయుధంచేత ఖండించబడిన మందేహులనే రాక్షసులయొక్క దేహాలనుంచి వెలువడే రక్తస్రావమో అన్నట్లుగా సంజకెంజాయ పడమటి దిక్కులో వ్యాపించింది.
(అమృత పానవిషయంలో ఏర్పడిన నష్టం కారణంగా - రాక్షసుల్లోని - మందేహుడు, అరుణుడు అనేవాళ్లు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, సూర్యునితో యుద్ధం చేస్తుండేటుగా వరంపొందారు. వీళ్లు సూర్యగమనాన్ని అడ్డుకొంటుంటారు. వీళ్లను చంపడానికి మూడుసంధ్యల్లో బ్రాహ్మణులు గాయత్రీ మంత్రంతో వదిలే అర్ఘ్యంకారణంగా - ఆ యిద్దరూ హతులవుతారు. కానీ బ్రహ్మ ఇచ్చిన వరప్రభావం వల్ల మరలా బ్రదుకుతుంటారు. ఈ విషయం సాయంసంధ్యావర్ణనమైన అని ఇక్కడ ప్రస్తావించబడింది.
నారాయణమూర్తియొక్క కీర్తి అనే క్షీరసాగరం భూమినుండి గగనం వరకు వ్యాపించింది. అది కర్కట, మకర, మీనరాశులచే అతిశయించింది. అట్టి పాలవెల్లిలోని తుంపురులో అన్నట్లు చుక్కలు ఆకాశంలో ప్రకాశించాయి.
(కీర్తి అనే క్షీరసాగరంలోని తుంపురు - ఆకాశంపైకి ఎగిరాయి. అది ఆకాశంలో కర్కటక, మకర, మీన రాశుల్లాగా ఉన్నాయి.)
అన్ని దిక్కులందు నిండిన లక్ష్మీనాథునిమహిమ పరిమళించుటకై బ్రహ్మదేవుడు చల్లిన కస్తూరి కాబోలు అన్నట్టు ఆకాశ వీథులన్నింటిలో చీకట్లు ముసురుకున్నాయి.
(కస్తూరి నల్లగా ఉంటుంది కనుక చీకట్లను కస్తూరిగా భావించడమైంది.)
గగనవీథులంతటా నిండిన కారుచీకటి తన వెంటబడి తరుమగా భయపడి సూర్యుడు తూర్పుదిక్కునుంచి చౌకళిస్తూ పరుగెత్తి, మేరుగిరిని అడ్డదారిలో క్షేమంగా చేరినాడే తప్ప - ఆ చీకటిని ఎదిరించి నిలిచితే అతడు తప్పక పరాజయం పాలయ్యేవాడే!
సూర్యుడు అస్తమించాడు. చీకటి ఏర్పడబోతున్నది. ఆ చీకటి తామరలను జూచి ఓ తమ్ములారా! చంద్రుడు మీకూ మాకూ శత్రువే. అతడు దోషాకరుడు - అంటే రాత్రిని కలుగజేసేవాడు. అడుగో రాబోతున్నాడు. మా బాలకులను స్వీకరించి భద్రంగా మీ కడుపుల్లో పెట్టుకొని కాపాడండి అంటూ చీకటి తన పిల్లలను దాచడానికి అప్పగించిన రీతిగా తుమ్మెదలు తామర మొగ్గలందు చిక్కుకొని, వెలుపలికి రాలేక రాత్రి అంతా అక్కడే నివసించాయి.
చకోరపక్షులకు ప్రీతినీ, విటకాండ్రకు భీతినీ కలిగిస్తూ చంద్రుడు ఉదయించాడు. అతడు తూర్పుదిక్కనే కోమలి ముఖంపై దీపించే కుంకుమబొట్టు అన్నట్లుగానూ, వియోగుల ధైర్యమనే తీగల్ని త్రెంచడానికి గర్వంతో మన్మథుడెత్తిన కొడవలి అన్నట్లుగానూ, కాలుడనే బోయవాడు చీకటి అనే మృగాన్ని ఖండించడానికి జళిపించే కత్తి అన్నట్లుగానూ, ఆకాశమనే కానుగుచెట్టు యొక్క తూర్పుకొమ్మలో మెరిసే మెత్తని చిగురాకు అన్నట్లుగానూ ఉన్నాడు. అతణ్ణి చూచి కలువలు వికసించాయి. దొంగలు భయపడ్డారు. సాగరం తరగలెత్తి అంబరమంటింది.
ఓ పరీక్షిన్మహారాజా! త్రుళ్ళిపడుతున్న చుక్కలరేడు చక్కగా ప్రకాశించగా పండువెన్నెల గగనతలమంతా వ్యాపించడంచేత బ్రహ్మాండం కర్పూరంతో నిండిన బరణి మాదిరి వెలుగొందింది.
ఆ వెన్నెలరాత్రి బలరామకృష్ణులు గోపకులతో కలసి పాలబువ్వ ఆరగించి, మనసులో కంసుని ప్రయత్నాలన్నీ గమనిస్తూ యథేచ్చావిహారాలతో ఆ నగరోపవనంలో జాగరూకులై గడిపారు.
కంసుడు తన పట్టణానికి బలరామకృష్ణులు రావటమూ, తన అనుచరులను వధించడమూ, పెను ధనుస్సును విరిచి వేయడమూ విన్నాడు. అతనికి నిద్రపట్టలేదు. మనసు కలక బారింది.
భోజభూపతి కంసుడికి మరణకాలం సమీపించడంవల్ల చెవిరంధ్రాలను చేతులతో మూసినపుడు తనలోపలి ప్రాణవాయువుయొక్క సంచారధ్వని వినిపించడం లేదు. నీళ్ళు, అద్దం మొదలైన వాటిలో తన ప్రతిబింబాన్ని చూచినపుడు తన శరీరంమీద తల కనిపించడం లేదు.
ముక్కుకొసను వ్రేలుంచి పైకి వీక్షించినపుడు ఆదిత్యాదిగ్రహాలు, అశ్వని మొదలైన నక్షత్రాలు ఒక్కొక్కటి రెండు రెండుగా కనిపించాయి. వెలుతురులో నిలబడి తన నీడను చూచినప్పుడు ఆ నీడ నడుమరంధ్రాలు కనిపించసాగాయి. నేలమీద తాను నడచిన అడుగుల గుర్తు కనిపించడంలేదు. అతని కంటికి కనిపించే చెట్లన్నీ బంగారు వన్నెతో భాసించాయి. అతని బుద్ధి కలత చెందింది.
(మరణం దగ్గర్లో రానున్నవారికి - ఇక్కడ చెప్పిన దుస్సంఘటనలు గోచరిస్తాయి. ఇలా జరిగితే మృత్యువు తప్పదని శాస్త్రం.)
కంసుడు విషం తిన్నట్లు, శవాన్ని కౌగిలించుకొన్నట్లు, దిసమొలతో ఉన్నట్లు, నూనెతో తలంటుకొన్నట్లు, గాడిద నెక్కినట్లు కలగన్నాడు. (ఇలాంటి స్వప్నాలూ సన్నిహిత మృత్యువునే సూచిస్తాయి.)
ఇంకా ఎర్రని పూలదండలు ధరించి ఏకాకై ఎక్కడికో వెళుతున్నట్లు అతడు కల గాంచాడు. మరణానికి కారణమైన భయంతో కంసుడు దుఃఖాక్రాంతుడై నిద్రపోక ఆ రాత్రి ఎలాగో వేగించాడు.
సూర్యోదయ వర్ణనము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
(మరణం దగ్గర్లో రానున్నవారికి - ఇక్కడ చెప్పిన దుస్సంఘటనలు గోచరిస్తాయి. ఇలా జరిగితే మృత్యువు తప్పదని శాస్త్రం.)
కంసుడు విషం తిన్నట్లు, శవాన్ని కౌగిలించుకొన్నట్లు, దిసమొలతో ఉన్నట్లు, నూనెతో తలంటుకొన్నట్లు, గాడిద నెక్కినట్లు కలగన్నాడు. (ఇలాంటి స్వప్నాలూ సన్నిహిత మృత్యువునే సూచిస్తాయి.)
ఇంకా ఎర్రని పూలదండలు ధరించి ఏకాకై ఎక్కడికో వెళుతున్నట్లు అతడు కల గాంచాడు. మరణానికి కారణమైన భయంతో కంసుడు దుఃఖాక్రాంతుడై నిద్రపోక ఆ రాత్రి ఎలాగో వేగించాడు.
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment