నారదా! భోజనానికి ముందు ప్రాణాగ్నిహోత్రమని ఒకటి ఉంది. అదికూడా పనిలోపని చెప్పేస్తాను. తెలుసుకో. దీన్ని తెలుసుకున్నా ఆచరించినా పాపవిమోచనం తథ్యం. ఋణత్రయ విముక్తి కలుగుతుంది. సర్వయజ్ఞ ఫలం దక్కుతుంది. ఇరవైయొక్క తరాలు తరిస్తాయి.
ఈ పంచప్రాణాగ్నిహోత్రానికి హృదయపద్మమే ఆరణి. మనస్సు మంథానం. వాయువు అనే రజ్జువుతో అగ్నిని మధించాలి. దీనికి నేత్రాలు అధ్వర్యువు. తర్ణనీ మధ్యమాంగుష్ఠాలతో ప్రాణాగ్నికి మధ్యమానామికాంగుష్ఠాలతో అపానాగ్నికి, కనిష్ఠికానామికాంగుష్ఠాలతో వ్యానాగ్నికి, కనిష్ఠికా తర్జన్యంగుష్టాలతో ఉదానాగ్నికి, అయిదువేళ్ళతోనూ తీసుకుని సమానాగ్నికి అన్నం మెతుకులు ఆహుతులుగా లోపలికి వెయ్యాలి.
ప్రణవాద్యాలూ స్వాహాంతాలుగా నామమంత్రాలు జపించాలి. (ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా - ఇత్యాదిగా). ముఖంలో ఆహవనీయాగ్ని, హృదయంలో గార్హపత్యాగ్ని నాభిలో దక్షిణాగ్ని స్మర్తవ్యాలు. అధోభాగంలో అసథ్యకులిద్దరూ సభ్యులు.
ఈ హోమానికి వాక్కు హోత, ప్రాణమేమో ఉద్గాత, చక్షువు సరే అధ్వర్యుడు, మనస్సు బ్రహ్మ, శ్రోత్రమేమో అగ్నీధ్రుడు, అహంకారమే పశువు, ప్రణవమే పయస్సు, బుద్ధియే పత్ని, గృహస్థాశ్రమ వాసి దీనికి ఆధీనుడు, వక్షఃస్థలమే యజ్ఞవేదిక, రోమాలే దర్భలు. చేతులే స్రుక్ స్రువాలు (హోమాగ్నిలోకి నెయ్యి పోసే కర్రగరిటెలు).
బంగారపు రంగులో ఉండే(రుక్మవర్ణం) క్షుధాగ్నియే ప్రాణమంత్రానికి ఋషి, ఆదిత్యుడు దేవత, గాయత్రియే ఛందస్సు, "ఓం ప్రాణాయ స్వాహా" అనీ "ఇదమాదిత్యాయ న మమ" అనీ మంత్రం.
ఇక అపానమంత్రానికి ఆవుపాలలాగా తెల్లగా ఉండే శ్రద్దాగ్నియే ఋషి, సోముడు దేవత, ఉష్ణిక్కు ఛందస్సు. ఓం అపానాయ స్వాహా. సోమాయేదం న మమ - అనేది మంత్రం.
వ్యానమనబడే ప్రాణవాయు మంత్రానికి పద్మవర్ణంలో ఉండే అగ్నియే ఋషి అగ్నియే దేవత, అనుష్ఠుప్పు ఛందస్సు, ఓం వ్యానాయ స్వాహా. అగ్నయ ఇదం న మమ - అనేది మంత్రం.
ఉదాన ప్రాణవాయు మంత్రానికి ఇంద్రగోపవు రంగులో ఉండే అగ్నియే ఋషి వాయువే దేవత. బృహతీఛందస్సు. ఓమ్ ఉదానాయ స్వాహా. వాయవ ఇదం న మమ - అనేది మంత్రం.
సమాన ప్రాణవాయుమంత్రానికి మెరుపురంగులో విరూపుడుగా ఉండే అగ్నియే ఋషి. పర్జన్యుడు దేవత. పంక్తి - ఛందస్సు. ఓం సమానాయ స్వాహా. పర్జన్యాయేదం న మమ అనేది మంత్రం,
ఇవి పంచప్రాణాహుతులు. ఇవి చెబుతూ అయిదుసార్లు కాసిని కాసిని మెతుకులు తిన్నాక ఆరవ ఆహుతి ఇవ్వాలి. దానికి వైశ్వానరాగ్ని దేవత. గాయత్రి ఛందస్సు. ఆత్మయే దేవత. ఓం పరమాత్మనే స్వాహా. పరమాత్మన ఇదం న మమ - అనేది మంత్రం, ఇవి ఆరూ అయ్యాక అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావిస్తూ ఆరగించాలి.
భోజనం ముగించాక అమృతాపిధానమిత్యాది మంత్రాన్ని చదువుతూ కొన్ని మెతుకులు ఉచ్చిష్ఠాన్నాన్ని విస్తరి చివర నేలమీదకు తొయ్యాలి. నా వంశంలో పుట్టి అన్నకాంక్షులైన వారందరూ దీనితో తృప్తి పాందుదురుగాక అనే మంత్రం పఠించాలి.
భోజనం ముగించాక అమృతాపిధానమిత్యాది మంత్రాన్ని చదువుతూ కొన్ని మెతుకులు ఉచ్చిష్ఠాన్నాన్ని విస్తరి చివర నేలమీదకు తొయ్యాలి. నా వంశంలో పుట్టి అన్నకాంక్షులైన వారందరూ దీనితో తృప్తి పాందుదురుగాక అనే మంత్రం పఠించాలి.
అలాగే - రౌరవ పుణ్యనిలయ పద్మార్బుదనివాసులై దాహార్తులైన మా వూర్వీకులందరికీ ఈ ఉదకం అక్షయ్యమై అందుగాక అని ఆకాంక్షిస్తూ నీళ్ళు వదిలిపెట్టి పవిత్రగ్రంధిని(దర్భముడి) విప్పి నేలమీద(మండలంలో) పడవెయ్యాలి. భోజన పాత్రలోమాత్రం(విస్తరి) వెయ్యకూడదు.
పొరపాటున అలా వేసినవాడు పంక్తిదూషకుడవుతాడు. అలాగే ఉచ్చిష్ఠాన్ని కుక్క తాకినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రాత్రి అంతా ఉపోష్యం ఉండి మర్నాడు మంచగవ్యంతో శుద్ధిచేసుకో వాలి. (అనుచ్చిష్ట సంస్పర్శకు స్నానంతో శుద్ధి).
నారదా! ఏకాహుతిప్రదానమే కోటియజ్ఞఫలం ఇస్తుంది. పంచాహుతులూ చేస్తే ఫలం అనంతం. ప్రాణాగ్నిహోత్ర విధానంలో భోక్తకూ దాతకూ పుణ్యఫలం సమానం. ఇద్దరికీ స్వర్గప్రాప్తి తప్పదు.
పవిత్రం ధరించి భోజనం చేసే బ్రాహ్మణుడు ముద్దముద్దకూ పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు. ఇలాగ నిత్యమూ త్రిసంధ్యల్లోనూ జపతర్పణ హోమాదులు చేసి బ్రాహ్మణులతో కలిసి భుజించడాన్నే పురశ్చరణమంటారు.
బ్రహ్మచర్యం
No comments:
Post a Comment