మహార్షీ! అర్జునుడు కృష్ణుని సోదరి ఐన సుభద్రను ఏ విధంగా పెళ్లి చేసుకొన్నాడు? ఆ వివరాలు నాకు చెప్పు. అని పరీక్షిత్తు అడగగా శుకమహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఇంద్రకుమారుడు అర్జునుడు పూర్వం తీర్థయాత్రల మీది ఉత్సాహంతో తిరుగుతూ ప్రభాసతీర్థానికి వచ్చినాడు. దానికి దగ్గరలో శ్రీకృష్ణుని ఇంటగల సుభద్రపై ప్రేమకారణంగా ఆమెను చూడాలనుకున్నాడు. బలరాముడు ఆమెను దుర్యోధనునకు ఇచ్చి పెండ్లిచేయాలని సంకల్పించినట్టు తెలుసుకున్న అర్జునుడు
సుభద్రను చూడాలనే కోరిక తన మనసులో ఉత్తేజపరుస్తుండగా, సన్యాసి వేషంతో ద్వారకకు వచ్చి, పురజనులు భక్తి స్నేహాలతో కొలువగా, తనకోరిక తీరేవరకు ఓపికగా ఎదురుచూస్తూ వానకాలం వెళ్లేవరకు ఆ ద్వారకలో ఉండి
అర్జునుని కపటరూపాన్ని గుర్తించక, నిజమైన సన్యాసిగా భావించి, ఆతడు చాలాకాలం ద్వారకలో ఉండి, వెల్లిపోవడంచూచి, తన మందిరానికి సాదరంగా ఆహ్వానించాడు.
బలరాముడు కపట సన్యాసిని తన ఇంటికి తెచ్చి ఆతిథ్యమిస్తుండగా అర్జునుడు అక్కడే ఉండి రోజూ భిక్షను గ్రహిస్తూ ఉండగా మన్మథుని సమ్మోహనాస్త్రంవలె ఉన్న వీరులను కూడా మిక్కిలి మోహపరుస్తోందా! అన్నట్లున్న సుభద్ర విహారంగా సంచరిస్తూంది.
అలా కపటసన్యాసిని అర్జునుడుగా గుర్తించి, అర్జునునిపైగల ప్రేమతో సన్యాసిని ప్రీతితో చూస్తూ సుభద్ర అక్కడే సంచరిస్తున్న వేళలో
శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర కపటసన్యాసి అయిన అర్జునుని ముందు ఇటునటూ తిరుగాడుతుంటే ఆ సౌందర్యరాశి వయోవిలాసాలు, సొగసులు అర్జునునిమన్మథబాధను పెంచాయి. తన చిత్తాన్ని ఆమెయందే ఉంచి మన్మథబాధకు గురి అయినాడు.
అర్జునుని వంటిదే సుభద్రస్థితి. కీర్తిమంతుడు, కల్మషరహిత మానసుడు, మన్మథునివంటివాడైన ఇంద్ర నందనుని చూచి సుభద్ర అర్జునునిపట్ల అనురాగంతో మన్మథబాధ పొందింది. సిగ్గు, ప్రేమ, మోహం కన్నుల్లో ప్రతిఫలిస్తున్నా స్త్రీ సహజ భయంతో వ్యక్తంచేయలేని స్థితిలో ఉంది.
ఇట్లు సుభద్రార్దునులు పరస్పరానురాగంతో, మన్మథ భావాలచే మనస్సు ముసురుకొనగా, ఓపికలు నశించి సిగ్గుతో జగడమాడుతుండగా ఒకరోజు దేవతలకొరకు జాతరసాగగా, దానిలో పాల్గొనడానికి నగరం వెలుపలికి సుభద్ర వచ్చింది. అర్జునుడు కూడా కృష్ణ, దేవకీ, వసుదేవుల అనుమతిపొంది వారిఅంగీకారంతో సుభద్రను అనుసరించి ఊరి వెలుపలకి వచ్చినాడు.
శరత్కాలంలోని నిండువెన్నెలలో ప్రకాశించే పున్నమిరాత్రివలె ఉన్నదీ, నిండు చంద్రబింబంనుండి కిందికి దిగి భూమిపై నడయాడే జింక పిల్లవలె ఉన్నదీ, మేఘమండలంనుండి ఇలకు దిగివచ్చి తిరుగుతున్న మెరుపుతీగెవలె ఉన్నదీ, మణులు పొదిగిన బంగారుబొమ్మకు చైతన్యంవచ్చి కదులుతున్నట్టు తిరుగుతున్నద్దీ, ప్రతికదలికలోనూ కాంతులుచిమ్మే కళలొలికిస్తూ, శృంగార రసాధిదేవత రూపుగొన్నట్టిదీ, ఉట్టిపడే మంచి గుణాలచే మంగళ కరమైనదీ అయిన ఆ సుభద్రను చూచినవాడై అర్జునుడు
అర్జునుడు సుభద్ర దగ్గరకువెళ్లి, ఆమెను తీసుకొని రథంమీద కూర్చుండబెట్టుకొని, కైకొనిపోతూండగా, యదుసైన్యాలు అడ్డగించాయి. ఆయన గాండీవం స్వీకరించి బాణాలతో వారిని చిందరవందరచేసి, గెలిచి, ఇంద్రప్రస్థ నగరానికి చేరాడు. బలరామునికి ఈవార్త తెలిసి, చెల్లెలిని అనుమతిలేకుండా తీసుకొనిపోయిన అర్జునునిపై ప్రళయకాలాగ్నివలె మండిపడ్డాడు. శ్రీకృష్ణుడు, తక్కిన చుట్టాలు అందరూ ఆయన పాదాలకు నమస్కరించి, ఆయనను శాంతపరచి, మృదువైన తియ్యనైన మాటలతో పరిస్థితులు వివరించి, సుభద్ర అర్జునుల దాంపత్యానికి అంగీకరింపజేశారు. బలరాముడు కోపం మానుకొని మనసు తేట పంచుకున్నాడు. తరువాత
బలరాముడు ప్రేమగా తనచెల్లెలు సుభద్రకు పెళ్లిలో తల్లిగారింటి బహుమతిగా రాజోచితమైన ఏనుగులు, గుర్రాలు, రథాలు, రత్నాలు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, దాసదాసీజనాన్నీ ఇచ్చి పంపాడు.
శ్రీకృష్ణుని సలహామేరకు, అతడు ఇష్టపడేలా, సుభద్రార్జునులకు లోపం రానివ్వకుండా ఘనంగా సార ఇచ్చి పంపినాడని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో తరువాతికథను చెప్పసాగాడు.
శ్రీకృష్ణుడు ఋషిసమేతుడయి మిథిలానగరమునకు బోవుట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment