మరుక్షణంలో ఆ మహామహుని బుద్ధి పనిచేయుడం మొదలు పెట్టింది.
రామ వియోగంలో ఉన్న సీత అన్న పానాలు ముట్టదు; అలంకారాలూ, నిద్రా అమె దరి జేరవు.
దేవేంద్రుడయినా సరే, అమె వానిని కన్నెత్తి చూడదు. ముల్లోకాలలో రామునివంటి పురుషు డుండనప్పుడు సీతాదేవి పరపురుషునివైపు ఎందుకు చూస్తుంది, అని విచారించి అంతఃపురం విడిచి పానశాల చేరాడు.
అక్కడ
ఆటలాడి, పాటలు పాడి, నాట్యం చేసి, తెగత్రాగి అలసిన నారీజనం కొందరు మద్దెళ్ళమీద, మరికొందరు పీటలమీద, మరెందరో తివాసీలమీద పడి నిద్రిస్తున్నారు.
అందరూ అందకతెలే. చక్కని అలంకారాలతో, నాట్యశాస్త్ర మర్యాద లెరిగినవారే, హాయిగా సంయోగసుఖంతో అలసి సుఖంగా నిద్రిస్తున్నారు.
ఇందరు స్త్రీల నడుమ, గోగణమధ్యంలో వృషభరాజులా ఉన్నాడు, రావణుడు. ఆడ ఏనుగుల మధ్య గజేంద్రుని వలె ఉన్నాడు.
పానశాల ప్రక్కకు చూశాడు హనుమంతుడు.
దున్నపోతుల, అడవిపందుల, లేళ్ళ మాంశాలు పోగులు పోగులుగా ఉన్నాయి, వెండి పాత్రలలో, బంగారు గిన్నెలలో తింటూ తింటూ విడిచిన నేమళ్ళ, కోడిపెట్టల మాంసాలున్నాయి. సగం సగం ఆరగించిన చకోరాలు, చేపలు, మేకలు.
షడ్రసోపేతమయిన వంటకాలు, పువ్వులు. పళ్ళు...... రకరకాల మద్యాలు, బంగారు కమండలువులలో ఉన్నాయి. మణులు పొదిగిన వెండి చెంబులు, బంగారు పాన పాత్రలు.
కొన్ని పాత్రలలో సగం త్రాగిన మద్యం, కొన్ని పూర్తిగా ఆరగించినవి, కొన్ని యింకా ముట్టకుండా నిండుగా తొణీకిసలాడుతున్నవి.
త్రాగుతూ మత్తులో బోర్లగిల పడవైచిన కుండలు, కమండలాలు. వాటికి యెడంగా వండిన దుంపలు, పండిన పళ్ళు, పూలమాలలు,
మళ్ళీ వెనుదిరిగాడు.
అక్కడ స్త్రీలు ఒకరి చీర లొకరు చుట్టబెట్టుకున్నవారు, వస్త్రాలే లేనివారు, ఒకరి నొకరు దగ్గరగా కౌగలించుకుని నిద్రిస్తున్నారు.
మధురమయిన మద్యపు వాసనతో, మంచి గంధపు వాసనలు మేళవించి ఆ భవనం అంతా వ్యాపిస్తున్నాయి.
స్త్రీలలో కొందరు నీలిరంగువారు, కొందరు నలుపు, కొందరు బంగారు ఛాయ మేనివారు. అందరూ పద్మలతల్లా ఉన్నారు. అందరినీ చూశాడు; కాని, జానకీ దేవి కనపడలేదు.
ఆ దశలో వున్న స్త్రీలను చూసిన హనుమంతుని మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అంతఃపురంలోని నారీజనం, పయిగా ఆచ్చాదనలు లేకుండా వున్నారు. పరస్త్రీని చూడడమే పాపం! కాగా ఈ స్థితిలో చూడడం మరెంత పాపం-
అయితే యిందరు సుందరాంగులను చూసినా నా మనస్సు ఎటువంటి వికారానికి లోనుకాలేదు. ఇంద్రియాలన్నిటిలో ప్రధానమయినది మనస్సు. అది నిశ్చలంగానే ఉంది.
పయిగా సీతాదేవిని స్త్రీ జన మధ్యంలో గాక ఎక్కడ వెదకాలి?
స్త్రీని వెదకడానికి అడవిలో లేడి గుంపు మధ్యకు వెడతామా! నా మనస్సు నిశ్చలంగా, నిర్మలంగా ఉంది కనక పాపభీతి లేదు.
దేవ, గంధర్వ, నాగకన్యలున్నారే తప్ప ఆ అంతఃపురంలో సితాదేవి జాడలేదు. పానశాల విడిచి యీవలకు వచ్చాడు.
కొన్ని పాత్రలలో సగం త్రాగిన మద్యం, కొన్ని పూర్తిగా ఆరగించినవి, కొన్ని యింకా ముట్టకుండా నిండుగా తొణీకిసలాడుతున్నవి.
త్రాగుతూ మత్తులో బోర్లగిల పడవైచిన కుండలు, కమండలాలు. వాటికి యెడంగా వండిన దుంపలు, పండిన పళ్ళు, పూలమాలలు,
మళ్ళీ వెనుదిరిగాడు.
అక్కడ స్త్రీలు ఒకరి చీర లొకరు చుట్టబెట్టుకున్నవారు, వస్త్రాలే లేనివారు, ఒకరి నొకరు దగ్గరగా కౌగలించుకుని నిద్రిస్తున్నారు.
మధురమయిన మద్యపు వాసనతో, మంచి గంధపు వాసనలు మేళవించి ఆ భవనం అంతా వ్యాపిస్తున్నాయి.
స్త్రీలలో కొందరు నీలిరంగువారు, కొందరు నలుపు, కొందరు బంగారు ఛాయ మేనివారు. అందరూ పద్మలతల్లా ఉన్నారు. అందరినీ చూశాడు; కాని, జానకీ దేవి కనపడలేదు.
ఆ దశలో వున్న స్త్రీలను చూసిన హనుమంతుని మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అంతఃపురంలోని నారీజనం, పయిగా ఆచ్చాదనలు లేకుండా వున్నారు. పరస్త్రీని చూడడమే పాపం! కాగా ఈ స్థితిలో చూడడం మరెంత పాపం-
అయితే యిందరు సుందరాంగులను చూసినా నా మనస్సు ఎటువంటి వికారానికి లోనుకాలేదు. ఇంద్రియాలన్నిటిలో ప్రధానమయినది మనస్సు. అది నిశ్చలంగానే ఉంది.
పయిగా సీతాదేవిని స్త్రీ జన మధ్యంలో గాక ఎక్కడ వెదకాలి?
స్త్రీని వెదకడానికి అడవిలో లేడి గుంపు మధ్యకు వెడతామా! నా మనస్సు నిశ్చలంగా, నిర్మలంగా ఉంది కనక పాపభీతి లేదు.
దేవ, గంధర్వ, నాగకన్యలున్నారే తప్ప ఆ అంతఃపురంలో సితాదేవి జాడలేదు. పానశాల విడిచి యీవలకు వచ్చాడు.
No comments:
Post a Comment