కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట
"మునిశ్రేష్ఠా నా వృత్రాంమును తెలియజేయుదును గాన ఆలకింపుము.
"నా జన్మస్థానము గోదావరినది సమీపమందున్న ఒక కుగ్రామము.న తండ్రి పేరు హరిశర్మ. నాపేరు మంజుల. నన్ను నాతండ్రి కావేరీతీర్థవాసియగు జ్ఞానానందుడనువానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి, మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్ళకు మాఘము ప్రవేశించినది.
ఒకనాడు నాభర్త "సఖీ"మాఘమాసము ప్రవేశించినది, మాఘమాసము చాల పవిత్రమైనది, దీని మహత్తు చాల పవిత్రమైనది. నేను నాచిన్నతనమునుండీ ప్రతి సంవత్సరమూ మాఘస్నానములు చేయచున్నాను, నీవు నాభార్యవు గావున నీవును ఈమాఘమాసమంతయు యీకావేరీనదిలో స్నానమాచరించును. ప్రతిదినము ప్రాతఃకాలము నిద్రనుండి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానంచేయుము ప్రభాతసూర్యునికి నమస్కరించిన తరువాత నదిఒడ్డున విష్ణువుయుక్క చిత్రపటము పెట్టి పువ్యులతోను మంచి గంధము అగరు ధూపదీపములను వెలిగించి, స్వామికి ఖండశర్కర పటికి బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరింప్తుము, తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము, దీనివలన నీకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా నుండును” అని హితబోధ చేసెను.
నేను అతనిమాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా జూచితిని. నాభర్త చాలా శాంతస్వరూపుడు, అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపమువచ్చి శపించినాడు.
"ఓసీ మూర్ఖురాల! నాయింటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో నుండతగవు మాఘమాసవ్రతము నీకింత నీచంగా కనిపించినదా?
సరియే నీపాపము నిన్నేశిక్షించును, గాన నీవు కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొఱ్ఱలో మండూకరూపంలో నుందువుగాక" అని నన్ను శపించెను.
వారి సింహగర్జనకు వణకిపోయితిని. వారి శాపమునకు భయపడిపోతిని వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. నాతప్పు నేను తెలుసుకున్నాను. అన్నా ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని” అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే భర్త పాదములపై బడి రెండుపాదాలు పట్టుకొని "నాకీశాపము ఎట్లు పోవును మరల నిన్నెటుల కలుసుకొందును నాకు ప్రాయశ్చిత్తములేదా అని పరిపరివిధాల ప్రార్ధించగా నాభర్త కొంతతడవలొచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా గౌతమమహర్షి గోదావరీ నదీతీరమందున్న తన యాశ్రమమునుండి ఉత్తర దేశయాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధదశమినాటికి కృష్ణానదీస్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించిన యెడల ఆ మహర్షి ప్రభావమువలన్న నీకు నిజరూపముకలుగును” అని చెప్పుచుండగా నేను కప్పరూపముదాల్చితిని. నా భర్త కూడా నామూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్నిదినాలకు కృష్ణానదీ తీరాననున్న ఈ రావిచెట్టు తొఱ్ఱలో నివాస మేర్పరచుకొని జీవించుచూ మీరాకకోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు" అని తన వృత్తాంతము గౌతమమునికి తెలియజేసెను.
"అమ్మాయీ! భయపడకుము నీకీశాపము కలిగి వెయ్యేడ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేకకష్టములు పది జీవించినావు. నీభర్తయును ఏకాంతముగా చాలాకాలముజీవించి హరినామసంకీర్తనలు చేయుచు మృతుడయెను. అతడిప్పుడు వైకుంఠములో వున్నడు. నీవు తనమాటలు విననందున ఎంతకష్టపడినావో తెలిసినదిగదా! మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకలసౌభాగ్యాలు పుత్రసంతతి ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధన మైనట్టిది కూడా. దీనికి మించిన మరియొకవ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనదీ వ్రతము ఇటువంటి వ్రతమాచరింపుమని నీభర్త ఎంత చెప్పిననూ వినిపించుకొనవైతివి. నీభర్త దురదృష్టి గలజ్ఞాని. అతని గుణగణాలు సంతసించెడివారు. నిన్ను పెండ్లియాడినతరువాత తన వంశాభివృద్ధి చూసినవలయుననెడి ఆశతో నుండేవాడు. నీవలన. అతని ఆశలన్ని నిరాశలయి పోయినవి. నీ మూర్ఖత్వమువలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసివచ్చెను? నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొఱ్ఱలో జీవించమని శపించినాడు.
ఈ దినము నా సమక్షములో ధైవసన్నిధిని పడినందున నీభర్త శాపము ప్రకారము, మరల నీ నిజ రూపము పొందగలిగినావు. అందునా యిది మాఘమాసము. కృష్ణానదీతీరము కాగా మాఘమాస వ్రత సమయము నీ కన్నివిధాలా అనుకూలమైన రోజు.అందుచే నీవు వెంటనేశుచివై రమ్ము. స్త్రీలుగాని, పురుషులుగాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణుసాన్నిధ్యము పొందుదురు. ఎవరయినా తెలిసిగాని, తెలియకగాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందును, పాడ్యమిరోజుననూ నదీస్నానమాచరించిన యెడల వారి పాపాలు నశించును. మాఘశుద్ధ పొడ్యమినాడు స్నానముననూ అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానముచేసి శ్రీమన్నారాయణుని పూజించి, పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్దించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపూర్ణము వినిన మోక్షప్రాప్తి కలుగును.
సరియే నీపాపము నిన్నేశిక్షించును, గాన నీవు కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొఱ్ఱలో మండూకరూపంలో నుందువుగాక" అని నన్ను శపించెను.
వారి సింహగర్జనకు వణకిపోయితిని. వారి శాపమునకు భయపడిపోతిని వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. నాతప్పు నేను తెలుసుకున్నాను. అన్నా ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని” అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే భర్త పాదములపై బడి రెండుపాదాలు పట్టుకొని "నాకీశాపము ఎట్లు పోవును మరల నిన్నెటుల కలుసుకొందును నాకు ప్రాయశ్చిత్తములేదా అని పరిపరివిధాల ప్రార్ధించగా నాభర్త కొంతతడవలొచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా గౌతమమహర్షి గోదావరీ నదీతీరమందున్న తన యాశ్రమమునుండి ఉత్తర దేశయాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధదశమినాటికి కృష్ణానదీస్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించిన యెడల ఆ మహర్షి ప్రభావమువలన్న నీకు నిజరూపముకలుగును” అని చెప్పుచుండగా నేను కప్పరూపముదాల్చితిని. నా భర్త కూడా నామూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్నిదినాలకు కృష్ణానదీ తీరాననున్న ఈ రావిచెట్టు తొఱ్ఱలో నివాస మేర్పరచుకొని జీవించుచూ మీరాకకోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు" అని తన వృత్తాంతము గౌతమమునికి తెలియజేసెను.
"అమ్మాయీ! భయపడకుము నీకీశాపము కలిగి వెయ్యేడ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేకకష్టములు పది జీవించినావు. నీభర్తయును ఏకాంతముగా చాలాకాలముజీవించి హరినామసంకీర్తనలు చేయుచు మృతుడయెను. అతడిప్పుడు వైకుంఠములో వున్నడు. నీవు తనమాటలు విననందున ఎంతకష్టపడినావో తెలిసినదిగదా! మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకలసౌభాగ్యాలు పుత్రసంతతి ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధన మైనట్టిది కూడా. దీనికి మించిన మరియొకవ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనదీ వ్రతము ఇటువంటి వ్రతమాచరింపుమని నీభర్త ఎంత చెప్పిననూ వినిపించుకొనవైతివి. నీభర్త దురదృష్టి గలజ్ఞాని. అతని గుణగణాలు సంతసించెడివారు. నిన్ను పెండ్లియాడినతరువాత తన వంశాభివృద్ధి చూసినవలయుననెడి ఆశతో నుండేవాడు. నీవలన. అతని ఆశలన్ని నిరాశలయి పోయినవి. నీ మూర్ఖత్వమువలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసివచ్చెను? నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొఱ్ఱలో జీవించమని శపించినాడు.
ఈ దినము నా సమక్షములో ధైవసన్నిధిని పడినందున నీభర్త శాపము ప్రకారము, మరల నీ నిజ రూపము పొందగలిగినావు. అందునా యిది మాఘమాసము. కృష్ణానదీతీరము కాగా మాఘమాస వ్రత సమయము నీ కన్నివిధాలా అనుకూలమైన రోజు.అందుచే నీవు వెంటనేశుచివై రమ్ము. స్త్రీలుగాని, పురుషులుగాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణుసాన్నిధ్యము పొందుదురు. ఎవరయినా తెలిసిగాని, తెలియకగాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందును, పాడ్యమిరోజుననూ నదీస్నానమాచరించిన యెడల వారి పాపాలు నశించును. మాఘశుద్ధ పొడ్యమినాడు స్నానముననూ అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానముచేసి శ్రీమన్నారాయణుని పూజించి, పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్దించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపూర్ణము వినిన మోక్షప్రాప్తి కలుగును.
అని గౌతమముని ఆ మునివనితతో చెప్పినటుల మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.
No comments:
Post a Comment