Tuesday, February 3, 2026

Magha Puranam 22 - మాఘ పురాణం 22 గంగాజల మాహాత్మ్యము

మాఘ పురాణం - 22 వ అధ్యాయం

గంగాజల మాహాత్మ్యము

ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమాహాత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధికట్టిన చోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి వారధినిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు  సముద్రమును దాటునపుడు శివుని 
ధ్యానించి, రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి  సముద్రమును దాటెను.అర్జునుడు యుద్ధమునకు బయలు దేరేముందు శివపూజచేసి యుద్ధరంగములో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకొనిరి. గనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణు పాదములనుండి పుట్టినదియు, శివుని శిరస్సునుండి ప్రవహించునట్టియు అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలములో స్నానము చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును. గాన గంగాజలము అంత ప్రాముఖ్యత వున్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది యేమనగాఏ నదిలోగాని, సెలయేరులోగాని, చెరువునందుగాని స్నానము చేయునపుడు 'గంగ గంగ గంగ!' అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్ళు చల్లుకొనినచో అది గంగా జలముతో సమానమయినదగును.

గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము గనుక గంగాజలముతో సాటియగు జలము ఈ ప్రపంచమునందెచ్చటనూలేదు. అని గంగాజలమునుగురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించెను.

No comments:

Post a Comment

The Enmity between Lord Narayana (Vishnu) and the Asuras - రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట

రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట ఓ మునిశ్రేష్ఠా! శుకమహర్షీ! వికుంఠలోకాధిపతి విష్ణుమూర్తి. అన్ని ప్రాణుల పట...