Tuesday, February 3, 2026

Magha Puranam 25 - మాఘ పురాణం 25 సులక్షణ మహారాజు వృత్తాంతము

మాఘ పురాణం - 25 వ అధ్యాయం

సులక్షణ మహారాజు వృత్తాంతము

వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి నూర్గురు భార్యలు గలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు.తన దేశ ప్రజల కేయాపద వచ్చిననూ తనదిగా భావించి తన్నివారణోపాయం చేసెడివాడు.

సులక్షణ మహారాజెంతటి రాజాధిరాజైననూ యెంతటి తరగని సంపత్తికలవాడైన నేమిలాభం? “అపుత్రస్యగతిర్నాస్తి” అనునటుల పుత్ర సంతానము లేక పోవుటచే తనకు గతులులేవు కదా! కాగా తన వంశము ఎటుల అభివృద్ధి చెందును? తనతో తన వంశము అంతరించి పోవలసినదేనా? అని దిగులు చెందుచుండెను.

ఒకనాడు తాను తన రధమెక్కి నైమిశారణ్యమున గొప్ప తపశ్శాలురున్న ప్రదేశమునకు వెళ్ళెను. అచట తపోధనులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికీ సులక్షణ మహారాజు నమస్కరించి యిటుల పలికెను.

"మునిశ్రేష్టులారా! నేను వంగ దేశాధీశుడను. న పేరు సులక్షణుడందురు. నాకు నూర్గురు భార్యలు అయిననేమి? ఒక్క సంతానమైనను కలుగ లేదు. గాన నాకు పుత్రసంతానం కలుగునట్లొనరింపుడు” అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహా రాజు పలుకులాలకు ముని శ్రేష్ఠులు విని జాలినొందిరి. "రాజా! నీవు సంతానహీనుడవగుటకు కారణ మేమనగా-పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రముని పాలించి యుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘమాసస్నానమైనా చేయలేదు. ఒక్క దానమైననూ ఇవ్వలేదు. ఒక బ్రాహ్మణునకు గుమ్మడి కాయ నైనా దానం చేసియున్నచో ఈజన్మలో పుత్రసంతతి కలిగివుండేది. గాన వెనుక కర్మ ఫలంవలననే నీకీ జన్మలో పుత్ర సంతతి కలుగ లేదు. ఎవరు మాఘమాసములో శుద్ధ సప్తమి రోజున కుష్మాండదానము చేయుదురో వారికి తప్పక పుత్రసంతానము కలుగగలదు. ఇందుకు సందేహమేమియు లేదు" అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి “దీనిని నీ భార్యలచే జీనింపచేయుయు” అని పలికిరి. మహా భాగ్యం అని ఫలమును కండ్ల కద్దుకొని యింటికి వెళ్ళిఫోయినాడు.

భర్తరాకవిని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద దీర్చిరి. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి "భోజనానంతరం సేవింపుడు" అని తన గదియుదు ఫలమును భద్రపరచి తాను భోజనసాలకు పత్నులతో వెడలిపోయెను. నూర్గురు భార్యలలో కడ భార్యకు మిక్కిలి ఆశకలిగి మిక్కిలి ఆశకలిగి ఫలమంతయు నేనే భుజించెదనని తలపోసి, రహాస్యమార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆఫలమును భుజించి ఏమియు ఎరుగనిదానివలే అందరితో కలిసి తిరుగుచుండెను.

సులక్షణమహారాజు, అతని భార్యలు భోజనము చేసి మంత్ర ఫలమువద్దకు వచ్చిరి. బంగారు పళ్ళేమందుంచిన ఫలము కనిపించలేదు. రాజుకు యెక్కడ లేని కోపము వచ్చి సింహగర్జన చేసినాడు. మాకేమియు తెలియ" దని అందరూ ప్రమాణముగా చెప్పిరి.

ఎంతో కష్టపడి మహామునుల అనుగ్రహమువలన సంపాదించిన మంత్ర ఫలమును చేతులారా పోగొట్టుకొంటిని అని దిగులు చెంది బెంగతో మంచము పట్టినాడు. మంత్ర ఫలము తినిన చిన్న భార్య భర్త కడకువచ్చి “నాధా! నా అశకొలదీ ఆఫలము నేనే తినివేసినాను క్షమింపు"మని వేడుకొనెను. అప్పటికి రాజు కొంత తృప్తి చెంది, వంశోద్ధారకుడు ఒక్కడైనా పుట్టగలడని ఊరకుండెను. గారాబముతో అమెను చూచెను.

కనిష్ఠ గర్భవతి అయినందున నవమాసములు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెఱ్ఱతో ఓర్వ లేకపోయారు. ఆమె పుత్రవతి అయినచో తమను రాజు సరిగా చూడడని అలోచించి ఆమె గర్భము చెడులాగున, అమె తిను ఆహారములో ఓషధము కలిపి పెట్టినారు, వరపుత్రుడుగా పుట్టుచున్నాడు గనుక గర్భములోని శిశువునకు ఏ అపాయమూ కలుగలేదు. కాని ఓషధముయొక్క తీవ్రతవలన ఆమెకు పిచ్చిఎత్తినది. ఆ పిచ్చివలన ఒకనాటి రాత్రి ఆమె అడవీలోనికి వెళ్ళిపోయినది. అప్పటికి నిండుచూలాలు అయివున్నందున ఆ యడవిలో బండరాతిమీద మగశికువును ప్రసవించినది. ఆమె ప్రసవించినచోట ఒక పులి కాచుకొని వున్నందున, వెంటనే పురిటి వాసనను పసికట్టి వచ్చి ఆమెను చంపితినెను.

పాపమాపసిబిడ్డ రక్తపుమరకలతో నుండి ఏడ్చుచుండెను. రాజహంసలు ఆహారము కొరకు తిరుగుచూ ఆ రాజబిడ్డను చూచి దగ్గరకు వచ్చి రెక్కలతో ఆ బాలుని తడియార్చి వాటిముక్కులతో
మెత్తటి గడ్డి తెచ్చి పరచి దానిపై పరుండబెట్టినవి.ఆ బాలునికి తేనె పండ్లు తినిపించి ఒక ఏడాది వరకు పెంచినవి. ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాటికి నీరు దొరకవని ఆ బాలుని తీసుకొని కొంత దూరములోనున్న తమజాతి హంసలకు అప్పగించివెళ్ళిపోయినవి.

ఆ హంసలు ఆ బాలునికి కావలసిన పండ్లు, తెనె గుజ్జు మొదలగునవి తెచ్చి పెంచుచుండగా ఒక తపస్వి తనయిద్దరి భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానముచేసి దుస్తులు మార్చుకొనుచుండగా హంసలతో తిరుగుచు తప్పటడుగులు వేస్తూ కొలనువద్దకువస్తున్న బాలుని చూచి మక్కువ కలిగి వారి వెంట తీసుకొనిపోయిరి.

రాజకుమారుడు వారి ఆశ్రమములో మూడు సంవత్సరములు గడిపెను. కొద్దికొద్దిగా మాటలు వచ్చుచున్నవి. వానిని చూచి నాకొడుకు అని పెద్దభార్యకు ఈర్ష్యజనించెను. పిల్లవాడు సాయంత్ర సమయమున ఆడుకొనుచుండగా వానిని ఎత్తుకొనిపోయి అడవిలో దిగ బెట్టి వచ్చెను. భర్తవచ్చి పిల్లవాడేని ఆడిగననూ నిజపుసంగతి చెప్పలేదా దుర్మార్గురాలు.

No comments:

Post a Comment