సుధర్ముడు తండ్రిని చేరుట
అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయంగలవాడయ్యెను. ప్రతి దినము తులసిపూజ భగవన్నామ స్మరణ చేస్తూ న"న్ను కాపాడుము తండ్రీ అనాధరక్షకా" అని ప్రార్ధించుచు, ఒకొక్కప్పుడు విరక్తుడై "ఛీ ఎంత ప్రార్ధించినా నాగతి ఇంతేనా? నేను బ్రతికెందుకు? అని దుఃఖించుచుండగా, ఆకాశవాణి "ఓ బాలచంద్రా! నీ విట్లు విచారింపకుము. ఈ సమీపముననే ఒక కోనేరు వున్నది. మాఘమాసము ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానము చేసిన యెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును" అని పలికిన మాటలు ఆకాశమునుండి వినిపించినవి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘస్నానం చేసి శ్రీహరిని స్తుతించెను.
ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా నీ కేమి కావలయునో కోరుకొనుము” అని యనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనాపాలనా చేయువారైనను లేరు. పుట్టినది మొదలు కష్టములేతప్ప సుఖమన్నది ఎరుగను. ఈవనచరములే నన్నురక్షించి పోషించుచున్నవి. గాన మీ సన్నిధానముకు నన్ను తీసుకొని పొండు. మరేమియు అక్కర లేదు.” అని ప్రార్ధించెను.
"ఓయీ రాజనందనా! నీవు ఇంకను బుకొకమునందు ధర్మముగా పరిపాలన చేయవలసిన యవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి, నీకన్నతల్లిని గురించి బెంగతో వున్నాడు, గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము” అని చెప్పి ఆకొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరుని తోడుయిచ్చి సులక్షణుని వద్దకు పంపెను.
అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా వుండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో, యని తన రాజ్యమంతయు వెదకించి తానును వెదకి వారిజాడ తెలియనందున విచారమనస్కుడై రాచ కార్యములు చూడకుండెను. ఆటువంటి సమయములో ముని వెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని యా బాలుని జన్మవృత్తాంతము తెలియ జేయుసరికి సులక్షణ మవో రాజు అమి తానందభరితు డై ఇాలుని కౌగలించుకొని మునీక(రునికి oo కుమాగునికి మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలుచేసి కుమారునికి సుధర్ముడని పేరుపెట్టి పట్టాభిషేకము చేసెను.
No comments:
Post a Comment