పూర్వం నారదుడు శివుడుతో “స్వామీ! ఉపవాసాలు చేసే శక్తి లేనివారు, వ్యాధులతో బాధపడేవారు. అనాయాసంగా శుభఫలితాలను పొందాలంటే ఏవ్రతం చేయాలో చెప్పండి అని వేడుకున్నాడు. శివుడు ఇలా చెప్పాడు.
నారదా! ఉపవాసం చేయలేనివారు నక్తం (పగలు ఉపవాసముండి రాత్రి భోజనం చేయటం) వుండి చేయతగ్గ మహావ్రతం ఒకటుంది. దానినే ఆదిత్య శయన వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని సప్తమి - ఆదివారం-హస్తానక్షత్రం-సూర్యుడు ఏదో ఒక రాశిలో ప్రవేశించే సమయం. వీటిలో ఏదో ఒకరోజుగానీ,
ఇవన్నీ కలిసిన రోజుగానీ ఈ వ్రతాన్ని చేస్తే అన్ని కోరికలూ తీరుతాయి.
వ్రతవిధానం : ఈ వ్రతం చేసేవారు పూజామందిరంలో శివుడు లేక సూర్యుడి ప్రతిమలలో ఒక్కదానినే వుంచాలి. ఎందుకంటే ఇద్దరికీ భేదం లేదు కనుక. ఈ వ్రతం చేసే రోజు నూనె, మాంసం, ఉప్పుకారం లేని భోజనాన్ని చేయాలి. ఇది పద్నాలుగు సంవత్సరాలు వరుసగా చేయవలసిన వ్రతం. ప్రతి సంవత్సరం వ్రతం చివర ఒక కుంచెడు వరి బియ్యాన్ని మేడి కర్రతో చేసిన పాత్రలో వేసి నేయి, బంగారంతో సహా విప్రుడికి దానం ఇవ్వాలి. ఏడో సంవత్సరంలో వ్రతం చేసేడప్పుడు వీటితో పాటు వస్త్రాలని కూడా దానం చేయాలి. పద్నాలుగో సంవత్సరంలో బ్రాహ్మణులకి, బెల్లం, పాయసంతో కూడిన భోజనాన్ని పెట్టాలి.
ఎనిమిది అంగుళాల వ్యాసంతో ఒక బంగారు పద్మాన్ని చేయించాలి. దానికి ఎనిమిది రేకులుండాలి. మధ్యలో దుద్దు ఉండాలి. ఆ ఎనిమిది రేకుల్లో పద్మరాగమణుల్ని తాపడం చేయాలి. ముడులు లేని మంచి కొయ్యతో ఒక మంచాన్ని తయారుచేయించాలి. వీటితోపాటు, దిండ్లు, చాందినీలు, పరుపు,
విసనకర్ర, చెప్పులు, పాదుకలు, గొడుగు, చామరాలు, కాలిపీట, అద్దం, అలంకారాలు, పళ్ళు, వస్త్రాలు, గంధద్రవ్యాలు సిద్ధం చేసుకోవాలి. ఆ మంచం మీద బంగారు పద్మాన్ని చెప్పిన వస్తువులన్నిటినీ ఉంచాలి.
తరువాత కొమ్ములతో పొడవని, మంచిగా పాలు ఇచ్చే దూడతో సహా వున్న కపిలగోవుని వస్త్రంతో, బంగారు కొమ్ములతో, వెండిగిట్టలతో అలంకరించి పాలు పితికే కంచు పాత్రని చేర్చి పై తెలిపిన మంచం ఇతర వస్తువులతో సహా మధ్యాహ్నం దాటకుండా యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానం చేయాలి. దానం చేసేడప్పుడు
యధైవాదిత్యః శయన మసూన్యంతవ సర్వదా ।
కాంత్యాధృత్యా శ్రియా రత్యాతథామే సంతు వృద్ధయః ।
యథానదేవాశ్శ్రేయాంసం త్వదన్య మనఘం విదుః ।
తథా మాముద్దరాశేష దుఃఖసంసార సాగరాత్ ॥
(ఆధ్యా-55, శ్లో॥26-27)
“ఓ ఆదిత్యా! నీ పడక ఎప్పుడూ కాంతితో, శోభతో ఆనందంతో నిండివున్న విధంగా నాకు కూడా అన్ని రకాల అభివృద్దులూ కలుగుగాక!. దేవతలు కూడా నీ కన్నా వేరెవ్వరినీ పూజ్యుడుగా భావించరు. ఎందుకంటే నీవు అందరు దేవతల కన్నా గొప్పవాడివి కనుక నన్ను సంసార దుఃఖం
నుంచి ఉద్ధరించు” అని ప్రార్థించి, ఆ బ్రాహ్మణుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ దాన ద్రవ్యాలన్నిటినీ అతడికి సమర్పించాలి. తరువాత ఆద్రవ్యాలని బ్రాహ్మణుడి ఇంటికి వ్రతం చేసిన యజమానే చేర్చాలి.
పూర్వం ఈ వ్రతాన్ని వసిష్ఠుడు, కుబేరుడు, అర్జునుడు ఆచరించారు. ఈ వ్రతం గురించి కీర్తించినా చాలు పాపాలు నశిస్తాయి. ఈ దివ్య వ్రతవిధానాన్ని చదివినా, విన్నా బోధించినా ఇంద్రుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించిన వాడి పితరులు నరకంలో వున్నా స్వర్గానికి చేరుకుంటారు.
ఆదిత్యవ్రత పూజావిధి
ఆదిత్యశయన వ్రతంలో భాగంగా పూజామందిరంలో శివ లేక సూర్యప్రతిమని ఉంచి ఈ క్రింద తెలిపిన మంత్రాలతో పూజించాలి.
1. సూర్యాయనమః - హస్తా నక్షత్రే పాదే పూజయామి
2. అర్కాయ నమః - చిత్తా నక్షత్రే గుల్ఫే పూజయామి
3. పురుషోత్తమాయనమః - స్వాతీ నక్షత్రే జంఘే పూజయామి
4. ధాత్రే నమః - విశాఖా నక్షత్రే జానునీపూజయామి
5. సహస్ర భానవేనమః - అనురాధా నక్షత్రే ఊరూం పూజయామి
6. అనంగాయ నమః - జ్యేష్టా నక్షత్రే గుహ్యం పూజయామి
7. సోమాయ నమః - మూలా నక్షత్రే కటిం పూజయామి
8. త్వష్ట్రే సప్త తురంగాయ నమః - పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రే నాభిం పూజయామి
9. తీక్ష్ణాంశవే నమః - శ్రవణా నక్షత్రే కుక్షిం పూజయామి
10. వికర్తనాయ నమః - ధనిష్టా నక్షత్రే పృష్టం పూజయామి
11. ధ్వాంతవినాశనాయ నమః - శతభిషానక్షత్రే వక్షః స్థలం పూజయామి
12. చండకరాయ నమః - పూర్వాభాద్ర నక్షత్రే, ఉత్తరాభాద్రా నక్షత్రే బాహూం పూజయామి
13. సామ్నామధీశాయ నమః - రేవతీనక్షతే హస్తా పూజయామి
14. సప్తాశ్వదురంధరాయ నమః - అశ్వినీ నక్షత్రే నఖానిపూజయామి
15. కఠోరధామ్నే నమః - భరణీనక్షత్రే కంఠం పూజయామి
16. దివాకరాయ నమః - కృత్తికా నక్షత్రే గ్రీవం పూజయామి
17. అంబుజేశాయ నమః - రోహిణీ నక్షత్రే అధరం పూజయామి
18. రవయే నమః - మృగశీర్షా నక్షత్రే దంతాన్ పూజయామి
19. సవిత్రే నమః - ఆర్ద్రానక్షత్రే నాసికాం పూజయామి
20. అంభోరుహవల్లభాయ నమః - పునర్వసూ నక్షత్రే లలాటం పూజయామి
21. వేదశరీరధారిణే నమః - పుష్యమీ నక్షత్రే అంకాన్ పూజయామి
22. విబుధ ప్రియాయ నమః - ఆశ్లేషానక్షత్రే శిరః పూజయామి
23. గ్రహగణేశాయ నమః - మఖా నక్షత్రే కర్ణే పూజయామి
24. గో బ్రాహ్మణ నందనాయనమః - పూర్వఫల్గుణీ నక్షత్రే నేత్రాణి పూజయామి
25. విశ్వేశ్వరాయ నమః - ఉత్తర ఫల్గుణీ నక్షత్రే భ్రువే పూజయామి
పై తెలిపిన మంత్రాలతో ఆయా నక్షత్రాలు ఉన్న రోజు ఆయా అవయవాలని ప్రధానంగా భావిస్తూ సర్వాంగ పూజని సంపూర్ణంగా ప్రతిరోజూ (25) రోజులు చేయాలి. ఈ పూజలో భాగంగా ప్రతిరోజూ
నమోస్తు పాశాంకుశ పద్మశూల కపాల ఖడ్గేఘ ధ నుర్ధరాయ।
గజాసురానంగ పురాంధకాది వినాశమూలాయ నమశ్శివాయ ॥
అనే శ్లోకాన్ని పఠించి శివుణ్ణి భక్తితో ప్రార్థించాలి.
శ్రీకృష్ణాష్టమీ వ్రతం
పరమేశ్వరుడు నారదుడికి ఈ కృష్ణాష్టమీ వ్రతం గురించి ఉపదేశించాడు. నారదా! సర్వపాపాలనీ పోగొట్టి నరులకు శాంతిని ముక్తిని ఇచ్చే వ్రతమే కృష్ణాష్టమీ వ్రతం. ఈ వ్రతాన్ని కృష్ణాష్టమినాడు మాత్రమే ఆచరించాలి.
వ్రతవిధానం : మార్గశిరమాసం నుంచి కార్తీకమాసం వరకు పన్నెండు మాసాలలో వరుసగా
3. మాఘమాసంలో మహేశ్వరుడు
8. ఆషాఢమాసంలో ఉగ్రుడు
ఈ వ్రతం చేసే అష్టమీ తిధిరోజు గోమూత్రం, ఆవునేయి, ఆవుపాలు, నువ్వులు-దర్భలు వేసి వుంచిన నీళ్ళు, ఆవు కొమ్ములో పోసి వుంచిన నీరు, గోమయం (ఆవుపేడ), తెల్లజిళ్లేడాకు, మారేడాకు, ఆవుపెరుగు వీటిని ఆహారంగా (ఏదో ఒకటిగా గానీ వీలైనవిగానీ)తీసుకుని రాత్రిపూట పరమేశ్వరుణ్ణి పూజించాలి.
మార్గశిరమాసం నుంచి ప్రతి రెండు మాసాలు వరుసగా-రావి, మర్రి, మేడి, జువ్వి, మోదుగ, నేరేడు పుల్లలతో పళ్ళుతోముకుని ఆ చెట్లకిందే ఆహారాన్ని భుజించాలి. ఆ విధంగా ఒక సంవత్సరం పాటు వ్రతాన్ని ఆచరించాలి.
వ్రతసమాప్తి (ఉద్యాపన) : వ్రతాన్ని దిగ్విజయంగా ముగించిన తరువాత పెరుగన్నం, చాందినీ, చామరం, దండాలు, నల్లని ఆవులు, బంగారం, వివిధరకాల వస్త్రాలు శక్త్యానుసారం బ్రాహ్మణుడికి దానం చేయాలి. శక్తి లేనివాడు కనీసం ఒక్కగోవునైనా దానం చేయాలి. ధనానికి (ఉన్నవాడు) లోభిస్తే
దోషం కలుగుతుంది.
వ్రతఫలం : ఈ విధంగా నియమపూర్వకంగా శ్రద్దా భక్తులతో కృష్ణాష్టమీ వ్రతాన్ని ఆచరించిన వారు ఏడువందల కల్పాల పాటు దేవతల పూజ లందుకుంటారు. చివరికి శివలోకంలో సుఖంగా నివసిస్తారు.
సాభాగ్యశయన ప్రతం
మత్స్యరూపంలో వున్న నారాయణుడు నారద మహర్షికి అత్యంత పుణ్యప్రదమైన సౌభాగ్యశయన వ్రతం గురించి ఇలా బోధించాడు.
వ్రతకథ : నారాద! పూర్వం ప్రళయకాలంలో అన్ని లోకాలు దగ్ధమైపోయాయి. అయితే ఆయా లోకాలలో వున్న అన్ని భూతాల సౌభాగ్యాలు ఒక్కటిగా చేరి వైకుంఠానికివెళ్ళి శ్రీమహావిష్ణువు వక్షస్థలంలో నిలిచాయి. తిరిగి చాలాకాలం తరువాత పునః సృష్టి ప్రారంభమైంది. లోకంలో పురుషాహంకారం అంతా ఆవరించింది. దాని ప్రభావంతో బ్రహ్మ విష్ణువులకి పోటీ ఏర్పడింది. నేను
గొప్పంటే? నేను గొప్ప అని వాదులాడుకోసాగారు. అప్పుడు వారిద్దరి మధ్యలో లింగాకృతితో ఒక మహాజ్వాల ఏర్పడింది. ఆ లింగజ్వాల వేడికి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో నిలిచిన “సౌభాగ్యం” కరిగి ఒక ముద్దగా మారి బైటికి వచ్చింది. అది ఎగిరి భూమి మీద పడబోతుండగా బ్రహ్మ మానస పుత్రుడైన దక్షుడు దాన్ని పట్టుకుని తినేసాడు. ఆ సౌభాగ్యాన్ని భక్షించిన ప్రభావంతో దక్షుడి
శరీరం అపూర్వమైన లావణ్యంతో తేజస్సుతో ప్రకాశించింది.
దక్షుడు సౌభాగ్యాన్ని పట్టుకుని తినేటప్పుడు ఆ ముద్దలోని కొన్ని చుక్కలు నేల మీదపడి ఓషధులుగా మారాయి. అవి.
5.విరిగిన ఆవుపాలు
సౌభాగ్యవతి అయిన కుమార్తె జన్మించింది. ఆమే సతీదేవి. ఆమె ఎంతో లలితంగా లావణ్యంగా వుంటుంది కాబట్టి ఆమే లలిత. పరమేశ్వరుడు ఆ సతీదేవిని వివాహం చేసుకున్నాడు. సతీ దేవి సౌభాగ్యంతో పుట్టింది కాబట్టి ఆమెని ఆరాధించిన వారికి సౌభాగ్యం కలుగుతుంది.
వ్రతవిధానం : వసంతమాసం ప్రారంభంలో అనగా చైత్ర శుక్ష తృతీయ తిధినాడు ఉదయంపూట నువ్వుల పిండితో నూనెతో అభ్యంగనం చేసుకుని శుచిగా స్నానం చేయాలి. ఈ తిథినాడే పరమేశ్వరుడు లలితాపరమేశ్వరి అయిన సతీదేవిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల ఈ తిథినాడు, శ్రీ లలితాపరమేశ్వరుల ప్రతిమని స్థాపించి వాటికి విధి విధానంగా షోడశోపచార పూజచేయాలి.
పూజావిధి :
1. పాటలాయై నమః - శివస్యదేవ్యాశ్చ పాదౌ పూజయామి
2. జయాయై-శివాయచ నమః - గుల్ఫే పూజయామి
3. భవానై- త్య్రంబకాయ నమః - జంఘే పూజయామి
4. విజయాయై-భద్రేశ్వరాయ నమః - జానునీపూజయామి
5. వరదాయై-హరికేశాయ నమః - ఊరూం పూజయామి
6. ఈశానాయై-శంకరాయ నమః - కటిం పూజయామి
7. కాళిన్యై-శూలపాణయే నమః - కుక్షి ద్వయం పూజయామి
8. మంగళాయై-మంగళేశాయ నమః - ఉదరం పూజయామి
9. ఈశాన్వై - సర్వాత్మనే నమః - కుచద్వయం పూజయామి
10. రుద్రాణ్యై-వేదాత్మనే నమః - కంఠం పూజయామి
11. అనంతాయై-త్రిపురఘ్నాయ నమః - కరౌ పూజయామి
12. కాలానలప్రియాయై- త్రిలోచనాయ నమః - బాహూం పూజయామి
13. సౌభాగ్యభవాయై-సౌభాగ్య భవనాయ నమః - భూషణాని పూజయామి
14. స్వాహాస్వధాయై-ఈశ్వరాయ నమః - ముఖం పూజయామి
15. అశోక మధువాసిన్యై-అశోకమధువాసినే నమః - ఓష్ఠౌ పూజయామి
16. చంద్రముఖప్రియాయై- స్థాణవే నమః - ఆస్యం పూజయామి
17. అఖిలాంగ్యై-అర్ధనారీశ్వరాయ నమః - నాసికాం పూజయామి
18. లలితాయై-ఉగ్రాయ నమః - భ్రువౌ పూజయామి
19. వాసవ్యై - శర్వాయ నమః - అలకాన్ పూజయామి
20. శ్రీకంఠనాధాయై-శివాయ నమః - కేశాన్ పూజయామి
21. భీమోగ్ర సమరూపిణ్యై - సర్వాత్మనే నమః - శిరః పూజయామి
ఈ విధంగా లలితా - పరమేశ్వరుల్ని పూజించిపైన తెలిపిన సౌభాగ్యాష్ట ద్రవ్యాలని వారికి నైవేద్యంగా సమర్పించి ఉత్తర పూజ చేయాలి. తరువాత గోశృంగం (ఆవుకొమ్ము) ఉంచిన నీటిని త్రాగి ఉపవాసం వుండి నేల మీదే నిద్రించాలి.
మర్నాడు ఉదయం అనగా చవితినాడు స్నానం, జపంచేసి, మంచి వస్త్రాలతో, ఆభరణాలతో బ్రాహ్మణ దంపతుల్ని పూజించి, లలితా పరమేశ్వరుల ప్రతిమల్ని సౌభాగ్యాష్టక ద్రవ్యాల్ని “శ్రీలలితా పరమేశ్వరః ప్రీయతాం” అని పఠిస్తూ వారికి దానం చేయాలి. ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ప్రతినెల తదియనాడు ఈ వ్రతాన్ని చేయాలి.
ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతినెలా ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, దానంచేసేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి అంటే?
1. చైత్రమాసంలో గోశృంగంలోని నీటిని ఆహారంగా తీసుకుని దానం చేసేడప్పుడు
7.ఆశ్వయుజమాసంలో పాలని ఆహారంగా తీసుకుని 'వాసుదేవీప్రీయతాం' అనే మంత్రాన్ని పఠించాలి.
చదవాలి.
చదువుతూ దానం ఇవ్వాలి.
పన్నెండు మాసాలలో లలితా పరమేశ్వరులని వరుసగా
2.అశోకం
8. కరవీరం (ఎర్రగన్నేరు)
12.ప్రీంకణం ఈ పూలతో పూజించాలి
వ్రత ఉద్యాపనం : ఈ విధంగా విధివిధానంగా పన్నెండు నెలలపాటు వ్రతాన్ని చేశాక చివరిమాసంలో తాము పూజించిన లలితా - పరమేశ్వరుల ప్రతిమని, దానంచేసే వస్తువుల్ని ఒక కొత్త మంచం మీద వుంచి దాన్ని బ్రాహ్మణ దంపతులకే దానమివ్వాలి. అలాగే యథాశక్తి మరి కొంతమంది బ్రాహ్మణ దంపతులకి వస్త్రాల్ని, ఆభరణాల్ని, ఆవుల్ని దానం చేయాలి. ధనం వున్నవారు దానానికి లోభించకూడదు. అహంకలిగించకూడదు.
వ్రతఫలం : భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. వారు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. కీర్తి ప్రతిష్టలు ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి. ఈ దివ్య వ్రతాన్ని వరుసగా పన్నెండు సంవత్సరాలు గానీ, పద్దెనిమిది సంవత్సరాలు గానీ చేసినవారు పదివేలకల్పాల వరకూ దేవతలచేత సేవలందుకుంటూ కైలాసంలో నివసిస్తారు.
ఈ సౌభాగ్యశయన వ్రతాన్ని చదివిన వారికి, వినిపించినవారికీ విద్యాధరత్వం, స్వర్గలోక నివాసం లభిస్తాయి. పూర్వం బ్రహ్మదేవుడు, కార్తవీర్యార్దునుడు వరుణుడు, నంది ఈ వ్రతాన్ని ఆచరించారు.
అక్షయ తృతీయ ప్రతం
పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయతృతీయ వ్రతాన్ని ఉపదేశించాడు. ఈ అక్షయ తృతీయ నాడు చేసిన దానం, జపం, హోమం అక్షయంగా ఫలితాన్నిస్తుంది.
వైశాఖమాసంలో శుక్ష పక్షంలో వచ్చే తృతీయనే అక్షయ తృతీయ అంటారు. ఈ తిథి బ్రహ్మదేవుడికి ప్రీతికరమైనది. కనుక ఈ పుణ్య తిథినాడు ఉపవాసంవుండి ఎలాంటి పుణ్యకర్మల్ని ఆచరించినా శుభం జరుగుతుంది. ఈ దివ్య తిథినాడు నాశనం (క్షయం) లేని దేవతలందరూ శ్రీమహావిష్ణువుని పూజిస్తారు. అందుకే ఈ తిథి అక్షయతృతీయ అయ్యింది.
వ్రతవిధానం : అక్షయతృతీయనాడు అక్షతల్ని నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. తరువాత అక్షతలతో శ్రీమహావిష్ణువుని పూజించాలి. ఆరోజు యోగ్యులైన విప్రులకి యథాశక్తి అన్నవస్త్రాలని దానంగా ఇవ్వాలి. ఆ రోజు అక్షతలతో చేసిన అన్నాన్ని భుజించాలి. ఈవిధంగా వైశాఖశుక్ష తృతీయనాడు వ్రతాన్ని ఆచరించి ఆ తరువాత వచ్చే ప్రతిమాసంలో శుక్లపక్ష తృతీయనాడు ఇదే విధానంతో ఉపవాసం వుండి శ్రీమహావిష్ణువుని అర్చించాలి. ఈ విధంగా ఒక సంవత్సరకాలం వ్రతాన్ని ఆచరిస్తే రాజసూయ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది.
అక్షతలు అంటే ఏమాత్రం విరగకుండా వున్న బియ్యం గింజలు అని అర్ధం. అవి యవధాన్యానివి గానీ, వరిధాన్యానివి గానీ, గోధుమ ధాన్యం నుంచి తీసినవి కానీ కావచ్చు. అక్షతాన్నం అంటే వరిబియ్యం లేదా యవ ధాన్యం, గోధుమలతో వండిన ఆహారం.
No comments:
Post a Comment