కైలాసపర్వత వర్ణన
హిమాలయాలలో అత్రి ఆశ్రమానికి ఉత్తర దిక్కున త్రిపురారి అయిన పరమేశ్వరుడు ఆనందంగా నివసించే సుందర కైలాసపర్వతం ఉన్నది. అది కల్పద్రుమాలతో అలంకరించబడి, వివిధ రత్నాలతో కూడిన శిఖరాలతో అలంకరించబడి వుంటుంది. ఆ దివ్య పర్వతానికి సమీపంలోనే శ్రీమంతుడైన కుబేరుడు గుహ్యకులతో కలిసి నివసిస్తుంటాడు. అలకా నగరానికి ప్రభువైన కుబేరుడు అప్పరసలతో సహా కైలాస పర్వతం నుంచి ప్రభవించే శీతమైన పవిత్రమైన జలాన్ని చూసి ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే ఆ జలం కైలాసం నుంచి పుట్టిన దివ్య మందాకినీ నదీ జలం.
ఈశాన్య దిక్కు: దివ్యకైలాసానికి ఈశాన్య దిశలో సౌగంధిక పర్వతానికి, సువేల పర్వతానికి దగ్గర్లో సముద్రజలాల లాంటి కాంతితో ప్రకాశించే చంద్రప్రభ అనే పర్వతం వుంది. దాని సమీపంలోనే అచ్చోదం అనే దివ్య సరస్సు వుంది. ఆ సరోవరం నుంచే అచ్చోదకం అనే దివ్యనది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీరంలో ఎంతో గొప్పదైన చైత్రరథం అనే సుందరమైన వనం వున్నది. ఆ వనంలో శూరులు, కూరులు అయిన గుహ్వకులు (యక్షులు) తమ సేనాధిపతి అయిన మణిభద్రుడితో కలిసి నివసిస్తుంటారు. ఈ అచ్చోదానదినే మందాకినీ నది అని కొందరు వ్యవహరిస్తారు. ఈ నది భూమండలం మీద ప్రవహించి మహా సముద్రంలో కలుస్తుంది.
ఆగ్నేయదిక్కు: కైలాసపర్వతానికి ఆగ్నేయదిశలో సకలౌషధులకీ నిలయమైన, మణిశిలలతో కూడుకున్న శబలపర్వతం వున్నది. ఆ పర్వతానికి దగ్గర్లో మంచు శిఖరాలతో సూర్యుడిలా ప్రకాశించే లోహిత పర్వతం నెలకొంది. ఆ పర్వతపాదాన మహిమాన్వితమైన “లహితం” అనే సరోవరం వున్నది. ఆ సరోవరం నుంచి లోహితానది ఆవిర్భవించి ప్రవహిస్తోంది. ఆ సరోవర తీరంలో 'అశోకం' అనే వనం వుంది. ఆవనంలో సౌమ్యులు ధార్మికులు అయిన గుహ్యకులు తమ నాయకుడైన మణిధారుడితో కలిసి నివసిస్తుంటారు.
నైరృతీ దిక్కు: కైలాసపర్వతానికి నైరృతీ దిశలో కకుద్మత అనే పర్వతం వుంది. ఇది మూడు శిఖరాలు గల పర్వతం. ఈ త్రికకుద్మంత పర్వతం మీద వున్న శిఖరాలపైనే రుద్రుడు ఆవిర్భవించాడు. ఈ దివ్య పర్వత పాదాన సిద్ధసేవితమైన “మానసం” అనే సరస్సు వుంది. ఆ సరస్సు నుంచి పవిత్రమైన సరయూనది ప్రవహిస్తోంది. ఆ సరోవరానికి సమీపంలో 'వైబ్రాజం' అనే ప్రసిద్ధమైన వనం వున్నది. ఆవనంలో కుబేరుడి ప్రధాన అనుచరుడైన “ప్రహీతి అనేవాడి కుమారుడు మహాపరాక్రమ వంతుడైన “బ్రహ్మథానుడు” అనే రాక్షసుడున్నాడు.
పచ్చిమదిక్కు: కైలాసపర్వతానికి పశ్చిమదిశలో బెషధులతో నిండిన దివ్య పర్వతం వున్నది. అది బంగారు రంగులో వుండే గైరికాది ధాతువులతో ప్రకాశిస్తూ చూడటానికి బంగారు కొండలా కనిపిస్తుంది. శివుడికి ఈ పర్వతం అంటే ఎంతో ప్రీతి. బంగారు రంగు శిఖరాలతో ఆకాశాన్ని తాకేంత ఎత్తులో వున్నతంగా ఈ “అరుణ పర్వతం” నెలకొంది. ఈ పర్వతానికి సమీపంలోనే దివ్యమై ముంజవత్పర్వతం, మహోన్నతమైన దుర్గశైలం అనే పర్వతం నెలకొన్నాయి. అరుణ పర్వతం మీద ధూమ్రలోహిత రూపుడైన పరమేశ్వరుడు నివసిస్తాడు. ఈ అరుణ పర్వత పాదాలనుంచి 'శైలోదం' అనే సరస్సు ఆవిర్భవించింది. ఆ సరస్సు నుంచి 'శైలోదయా' అనే నది ప్రవహిస్తుంది. ఇది దక్ష-శీత పర్వతాల మధ్యగా ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలుస్తుంది.
ఉత్తర దిక్కు: కైలాస పర్వతానికి ఉత్తర దిశలో ఓషధులతో నిండిన పర్వతం వుంది. దానికి హంసాలం అనే వనానికి మధ్యలో గౌర వర్ణంతో ప్రకాశించే “హిరణ్య శృంగం” అనే పర్వతం నెలకొంది. ఆ పర్వత పాదంలో బంగారు ఇసుకతో కూడుకున్న బిందు జరోవరం ఆవిర్భవించింది. ఆ సరోవర తీరంలోనే పూర్వం భగీరథుడు తన పూర్వీకుల్ని గంగాజలంతో తడిపి పునీతుల్ని చేద్దామనే ఆశయంలో కఠోరమైన తపస్సు చేసాడు.పూర్వం త్రిపథగా(మూడు మార్గాలలో ప్రవహించే) ఉండే గంగానది ఇక్కడే వుండేది. అక్కడ ఇప్పటికీ మణిమయాలైన యూపస్తంభాలు, బంగారంతో చేసిన హోమగుండాలు ఉన్నాయి. అక్కడ ఇంద్రుడు దేవతాగణాలతో కలిసి ఎన్నో యాగాలుచేసి కామితఫలాలు పొందాడు.
భగీరథుడి తపః ప్రభావంతో గంగానది మొదట శివుడి శరీరం మీదకి దూకింది. దానిని ఆయన తన యోగశక్తితో తన జటాజూటంలో బంధించాడు. ఆ సమయంలో ఆ జటాజూటం నుంచి కొన్ని బిందువులు జారి భూమి మీద పడ్డాయి. ఆ బిందువులతో ఏర్పడిన సరోవరమే ఈ బిందు సరోవరం.
పరమేశ్వరుడు తనని జటూ జూటంలో బంధించటంతో గంగాదేవికి ఎంతో కోపం వచ్చింది. తన ప్రచండమైన శక్తితో ఆయన్ని కూడా పాతాళానికి తనతో తీసుకుపోవాలనుకుంది. ఆమె అభిప్రాయాన్ని శివుడు గ్రహించాడు. వెంటనే గంగని తన శరీరంలోనే లయం చేయాలనుకున్నాడు. అయితే ఆయనకి ఎదురుగా నమస్కరిస్తూ భగీరథుడు కనిపించాడు. భగీరథుడు తపస్సు చేసీ చేసీ చిక్కి శల్యమైవున్నాడు. అంతలో ఆయనకి భగీరథుడికి తానిచ్చిన వరం గుర్తుకు వచ్చింది. తనకోపాన్ని తమాయించుకుని తన జటాజూటంలో బంధించిన గంగని ఏడు ధారలుగా భూమి మీదకి వదిలాడు.
పరమేశ్వరుడి జటాజూటం నుంచి వెలువడ్డ ఏడు ధారలలో
హిమాలయాలలో అత్రి ఆశ్రమానికి ఉత్తర దిక్కున త్రిపురారి అయిన పరమేశ్వరుడు ఆనందంగా నివసించే సుందర కైలాసపర్వతం ఉన్నది. అది కల్పద్రుమాలతో అలంకరించబడి, వివిధ రత్నాలతో కూడిన శిఖరాలతో అలంకరించబడి వుంటుంది. ఆ దివ్య పర్వతానికి సమీపంలోనే శ్రీమంతుడైన కుబేరుడు గుహ్యకులతో కలిసి నివసిస్తుంటాడు. అలకా నగరానికి ప్రభువైన కుబేరుడు అప్పరసలతో సహా కైలాస పర్వతం నుంచి ప్రభవించే శీతమైన పవిత్రమైన జలాన్ని చూసి ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే ఆ జలం కైలాసం నుంచి పుట్టిన దివ్య మందాకినీ నదీ జలం.
ఈశాన్య దిక్కు: దివ్యకైలాసానికి ఈశాన్య దిశలో సౌగంధిక పర్వతానికి, సువేల పర్వతానికి దగ్గర్లో సముద్రజలాల లాంటి కాంతితో ప్రకాశించే చంద్రప్రభ అనే పర్వతం వుంది. దాని సమీపంలోనే అచ్చోదం అనే దివ్య సరస్సు వుంది. ఆ సరోవరం నుంచే అచ్చోదకం అనే దివ్యనది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీరంలో ఎంతో గొప్పదైన చైత్రరథం అనే సుందరమైన వనం వున్నది. ఆ వనంలో శూరులు, కూరులు అయిన గుహ్వకులు (యక్షులు) తమ సేనాధిపతి అయిన మణిభద్రుడితో కలిసి నివసిస్తుంటారు. ఈ అచ్చోదానదినే మందాకినీ నది అని కొందరు వ్యవహరిస్తారు. ఈ నది భూమండలం మీద ప్రవహించి మహా సముద్రంలో కలుస్తుంది.
ఆగ్నేయదిక్కు: కైలాసపర్వతానికి ఆగ్నేయదిశలో సకలౌషధులకీ నిలయమైన, మణిశిలలతో కూడుకున్న శబలపర్వతం వున్నది. ఆ పర్వతానికి దగ్గర్లో మంచు శిఖరాలతో సూర్యుడిలా ప్రకాశించే లోహిత పర్వతం నెలకొంది. ఆ పర్వతపాదాన మహిమాన్వితమైన “లహితం” అనే సరోవరం వున్నది. ఆ సరోవరం నుంచి లోహితానది ఆవిర్భవించి ప్రవహిస్తోంది. ఆ సరోవర తీరంలో 'అశోకం' అనే వనం వుంది. ఆవనంలో సౌమ్యులు ధార్మికులు అయిన గుహ్యకులు తమ నాయకుడైన మణిధారుడితో కలిసి నివసిస్తుంటారు.
నైరృతీ దిక్కు: కైలాసపర్వతానికి నైరృతీ దిశలో కకుద్మత అనే పర్వతం వుంది. ఇది మూడు శిఖరాలు గల పర్వతం. ఈ త్రికకుద్మంత పర్వతం మీద వున్న శిఖరాలపైనే రుద్రుడు ఆవిర్భవించాడు. ఈ దివ్య పర్వత పాదాన సిద్ధసేవితమైన “మానసం” అనే సరస్సు వుంది. ఆ సరస్సు నుంచి పవిత్రమైన సరయూనది ప్రవహిస్తోంది. ఆ సరోవరానికి సమీపంలో 'వైబ్రాజం' అనే ప్రసిద్ధమైన వనం వున్నది. ఆవనంలో కుబేరుడి ప్రధాన అనుచరుడైన “ప్రహీతి అనేవాడి కుమారుడు మహాపరాక్రమ వంతుడైన “బ్రహ్మథానుడు” అనే రాక్షసుడున్నాడు.
పచ్చిమదిక్కు: కైలాసపర్వతానికి పశ్చిమదిశలో బెషధులతో నిండిన దివ్య పర్వతం వున్నది. అది బంగారు రంగులో వుండే గైరికాది ధాతువులతో ప్రకాశిస్తూ చూడటానికి బంగారు కొండలా కనిపిస్తుంది. శివుడికి ఈ పర్వతం అంటే ఎంతో ప్రీతి. బంగారు రంగు శిఖరాలతో ఆకాశాన్ని తాకేంత ఎత్తులో వున్నతంగా ఈ “అరుణ పర్వతం” నెలకొంది. ఈ పర్వతానికి సమీపంలోనే దివ్యమై ముంజవత్పర్వతం, మహోన్నతమైన దుర్గశైలం అనే పర్వతం నెలకొన్నాయి. అరుణ పర్వతం మీద ధూమ్రలోహిత రూపుడైన పరమేశ్వరుడు నివసిస్తాడు. ఈ అరుణ పర్వత పాదాలనుంచి 'శైలోదం' అనే సరస్సు ఆవిర్భవించింది. ఆ సరస్సు నుంచి 'శైలోదయా' అనే నది ప్రవహిస్తుంది. ఇది దక్ష-శీత పర్వతాల మధ్యగా ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలుస్తుంది.
ఉత్తర దిక్కు: కైలాస పర్వతానికి ఉత్తర దిశలో ఓషధులతో నిండిన పర్వతం వుంది. దానికి హంసాలం అనే వనానికి మధ్యలో గౌర వర్ణంతో ప్రకాశించే “హిరణ్య శృంగం” అనే పర్వతం నెలకొంది. ఆ పర్వత పాదంలో బంగారు ఇసుకతో కూడుకున్న బిందు జరోవరం ఆవిర్భవించింది. ఆ సరోవర తీరంలోనే పూర్వం భగీరథుడు తన పూర్వీకుల్ని గంగాజలంతో తడిపి పునీతుల్ని చేద్దామనే ఆశయంలో కఠోరమైన తపస్సు చేసాడు.పూర్వం త్రిపథగా(మూడు మార్గాలలో ప్రవహించే) ఉండే గంగానది ఇక్కడే వుండేది. అక్కడ ఇప్పటికీ మణిమయాలైన యూపస్తంభాలు, బంగారంతో చేసిన హోమగుండాలు ఉన్నాయి. అక్కడ ఇంద్రుడు దేవతాగణాలతో కలిసి ఎన్నో యాగాలుచేసి కామితఫలాలు పొందాడు.
భగీరథుడి తపః ప్రభావంతో గంగానది మొదట శివుడి శరీరం మీదకి దూకింది. దానిని ఆయన తన యోగశక్తితో తన జటాజూటంలో బంధించాడు. ఆ సమయంలో ఆ జటాజూటం నుంచి కొన్ని బిందువులు జారి భూమి మీద పడ్డాయి. ఆ బిందువులతో ఏర్పడిన సరోవరమే ఈ బిందు సరోవరం.
పరమేశ్వరుడు తనని జటూ జూటంలో బంధించటంతో గంగాదేవికి ఎంతో కోపం వచ్చింది. తన ప్రచండమైన శక్తితో ఆయన్ని కూడా పాతాళానికి తనతో తీసుకుపోవాలనుకుంది. ఆమె అభిప్రాయాన్ని శివుడు గ్రహించాడు. వెంటనే గంగని తన శరీరంలోనే లయం చేయాలనుకున్నాడు. అయితే ఆయనకి ఎదురుగా నమస్కరిస్తూ భగీరథుడు కనిపించాడు. భగీరథుడు తపస్సు చేసీ చేసీ చిక్కి శల్యమైవున్నాడు. అంతలో ఆయనకి భగీరథుడికి తానిచ్చిన వరం గుర్తుకు వచ్చింది. తనకోపాన్ని తమాయించుకుని తన జటాజూటంలో బంధించిన గంగని ఏడు ధారలుగా భూమి మీదకి వదిలాడు.
పరమేశ్వరుడి జటాజూటం నుంచి వెలువడ్డ ఏడు ధారలలో
1.నళింది
2.హ్లాదిని
2.హ్లాదిని
3.ప్లావని అనే మూడు ధారలు తూర్పుదిశగా
4.సీత
5. చక్షుష్
6.సింధు అనే మూడు ధారలు పడమర దిశగా ప్రవహించాయి. చివరిదైన ఏడోధార భగీరథుడి వెంట నడిచి దక్షిణదిక్కుగా ప్రవహించి సముద్రంలో కలిసింది. అందుకే గంగకి “భాగీరథి” అనే పేరు వచ్చింది. ఆ విధంగా కైలాస పర్వతం దాని పరిసర పర్వతాలు ఎన్నో పుణ్యప్రదమైన నదులకి పుట్టిల్లుగా అయినందువల్ల పరమపవిత్రమైన దివ్య పర్వతంగా కైలాసం ప్రఖ్యాతి చెందింది.
6.సింధు అనే మూడు ధారలు పడమర దిశగా ప్రవహించాయి. చివరిదైన ఏడోధార భగీరథుడి వెంట నడిచి దక్షిణదిక్కుగా ప్రవహించి సముద్రంలో కలిసింది. అందుకే గంగకి “భాగీరథి” అనే పేరు వచ్చింది. ఆ విధంగా కైలాస పర్వతం దాని పరిసర పర్వతాలు ఎన్నో పుణ్యప్రదమైన నదులకి పుట్టిల్లుగా అయినందువల్ల పరమపవిత్రమైన దివ్య పర్వతంగా కైలాసం ప్రఖ్యాతి చెందింది.
No comments:
Post a Comment