Thursday, June 18, 2026

Srivari Sankhu Chakralu(The Lord's Conch and Discus) - శ్రీవారి శంఖు చక్రాలు

శ్రీవారి శంఖు చక్రాలు

శంఖు చక్రాలు
స్వామి కుడి చేతిలో సుదర్శన చక్రం, ఎడమ చేతిలో పాంచజన్య శంఖం. ఇవి ఆయుధాలు కావు, ఆభరణాలు.

బంగారంతో చేసి, రత్నాలు పొదిగి ఉంటాయి. రోజూ ఉదయం అర్చకులు స్వామి చేతుల్లో అమర్చుతారు.

శంఖు చక్రాల కథ:

చక్రం కథ: సుదర్శనం అంటే మంచి దర్శనం ఇచ్చేది. విష్ణువు కోరిక మేరకు అగ్ని దేవుడు విశ్వకర్మతో చేయించాడు. కోటి సూర్యుల తేజస్సు ఉంది. ధర్మాన్ని రక్షిస్తుంది, అధర్మాన్ని నాశనం చేస్తుంది.

శంఖం కథ: పాంచజన్యం అంటే 5 రకాల జ్ఞానం ఇచ్చేది. సముద్ర మథనంలో పుట్టింది. స్వామి ఊదితే ధర్మం వైపు నిలబడే వాళ్లకు ధైర్యం, అధర్మం చేసే వాళ్లకు భయం వస్తుంది.

రహస్యం: స్వామి చేతుల్లో శంఖ చక్రాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయట. మన కంటికి కనిపించవు. భక్తుల కర్మలు చూసి చక్రం తిరుగుతుంది.

నమ్మకం: శంఖ చక్రాలతో స్వామిని దర్శిస్తే శత్రు భయం పోతుంది. కోర్టు కేసులు, గొడవలు ఉన్నవారు "ఓం సుదర్శనాయ నమః" అంటే పరిష్కారం దొరుకుతుంది.

పురాణం కథనం:

సుదర్శన చక్రం: శివ పురాణం ప్రకారం, రాక్షసుల బాధలు భరించలేక దేవతలు శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. వారిని రక్షించడానికి విష్ణువు కైలాసానికి వెళ్లి, పరమశివుడిని వేయి నామాలతో అర్చిస్తూ వెయ్యి తామర పూలతో పూజించడం ప్రారంభించాడు. విష్ణుమూర్తి భక్తిని పరీక్షించడానికి శివుడు ఆ పూలలో ఒక పూవును దాచిపెడతాడు. ఒక పూవు తక్కువైందని గమనించిన విష్ణువు, తన కన్ను తామర పువ్వులా ఉంటుందని భావించి ఆ కంటినే శివునికి సమర్పించడానికి సిద్ధమవుతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, విష్ణువు భక్తికి మెచ్చి త్రిలోకాలను జయించగల శక్తిని కలిగిన సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు.

పాంచజన్యం: ద్వాపర యుగంలో బలరాముడు, కృష్ణుడు సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసిన సమయంలో ఒక సారి సాందీపముని కుమారుడు సముద్రంలో స్నానం చేయుచుండగా కెరటాల ఉధృతి వలన సముద్రము లోకి కొట్టుకు పోయెను . ఆతడిని పంచజనుడు అను రాక్షసుడు మింగివేసాడు. గురు పుత్రుడు ఆ రాక్షసుని శరీరము నందున్న శంఖము లోకి ప్రవేశించెను. బలరామ కృష్ణులు తమ గురువు గారైన సాందీప మహర్షికి గురు దక్షణగా అతని పుత్రుడుని తీసుకు రావాలని తలచి, గురుపుత్రుడు స్నానానికి వెళ్ళిన సముద్ర తీరానికి వెళ్లి సముద్రుడిని అడుగగా సముద్రుడు పంచజనుడు గురు పుత్రుడిని మింగెనని చెప్పెను. అప్పుడు వారు పంచజనుడిని వెతికి అతడిని చంపి అతడి శరీరమును చీల్చగా శంఖము లభించెను. అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ శంఖమును తీసుకుని యమపురికి వెళ్లి అక్కడ ఆ శంఖమును ఉదేను. ఆ శబ్దమునకు యముడు అదిరిపడి వచ్చి శ్రీ కృష్ణుని చూసి వచ్చినపని తెలుపమని కోరగా శ్రీ కృష్ణుడు వచ్చిన పనిని తెలిపెను అప్పుడు యముడు గురు పుత్రుడిని శ్రీ కృష్ణుడికి అప్పగించెను . శ్రీ కృష్ణుడు అతడిని గురువు గారికి అప్పగించెను . పంచజన్యుడి శరీరంలో దొరికిన శంఖమును ఆ నాటి నుండి తాను ధరించెను.

నిత్య స్తోత్రావళి

పంచాంగం

No comments:

Post a Comment