Thursday, June 18, 2026

Sri Brahmasutra Marakata Shivalinga Devasthanam, Chandippa Village, Shankarpally, Ranga Reddy District, Telangana - శ్రీ బ్రహ్మసూత్ర మరకత ​​శివలింగం దేవస్థానం, చండిప్ప గ్రామం, శంకర్‌పల్లి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

శ్రీ బ్రహ్మసూత్ర మరకత ​​శివలింగం దేవస్థానం, చండిప్ప గ్రామం, శంకర్‌పల్లి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, చం
డిప్ప గ్రామంలో మరకత శివలింగ దేవాలయం మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన ఈ మరకత శివలింగానికి శతాబ్దాల చరిత్ర ఉంది.

ఉదయకాల సూర్యాభిషేకం సమయంలో ఒక ప్రత్యేకమైన ఆకుపచ్చని కాంతిని వెదజల్లడం ఈ శివలింగ ప్రత్యేకత.

మూసీనది (ముచుకుందానది) ఒడ్డునున్న ఈ దేవాలయంలోని మరకత సోమేశ్వర లింగాన్ని పూజిస్తే వ్యాధులు నయమవుతాయిని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని భక్తుల నమ్మకం.

భక్తులు మరకత లింగానికి నేరుగాఅభిషేకం చేసుకోవచ్చు.

చమత్కార శిల: ఆలయ ప్రాంగణంలో, భక్తులు 'చమత్కర శిల'ను చూడవచ్చు. ఇది ఒక పవిత్రమైన రాయి, దాని బరువు చాలా ఎక్కువ అయినప్పటికీ, దానిని తాకి ప్రార్థించినప్పుడు అది స్వేచ్ఛగా తిరుగుతుందని చెబుతారు.

చరిత్ర
ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న మరకత లింగం కొలువై ఉన్న ఈ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సామాన్య శకం 1076-1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు చక్రవర్తి శ్రీత్రిభువన మల్లబిరుదాంకింతుడైన ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని, క్రీ.శ.1101 సంవత్సరం కార్తిక శుద్ధ పంచమి గురువారం నాడు ప్రతిష్ఠ ఉత్సవం జరిగిందని ఇక్కడి శాసనం ద్వారా తెలుస్తోంది.

దేవాలయ ప్రాంగణంలో వెలిసన క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు ఈ దేవాలయాన్ని రక్షిస్తున్నాడు. ఆదివారం కాలభైరవుడిని పూజిస్తే సమస్త గ్రహదోషాలు పోతాయిని, సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తూ ఉంటాడని భక్తుల విశ్వాసం.

శ్రీ త్రిభువన మల్లదేవ మహారాజుల వారు తన అతి విశాల భూభాగ సామ్రాజ్యమునందు నిత్యభూదాన, యజ్ఞ వశాత్ చందిప్ప గ్రామమును, వేద పారంగతులైన భూసురులకు (బ్రాహ్మణులకు) అగ్రహారముగా ప్రకటించి ఈ గ్రామ సీమయందు గల సమస్త భూమిని అగ్రహారమునకు కేటాయించారు.

పూజలు
శ్రావణమాసం, కార్తీకమాసం పర్వ దినాలలో ఇక్కడ విశేష పూజలు నిర్వహించబడుతాయి. శివరాత్రి రోజున ఉత్సవాలు జరుగుతాయి. ఐదు సోమవారాలు కానీ, ఐదు పౌర్ణములు కానీ, ఐదు మాస శివరాత్రులు కానీ ఇక్కడి మరకత లింగాన్ని అర్చిస్తే సకల కోరికలూ నెరవేరుతాయని పండితులు చెప్పుతున్నారు. పౌర్ణమినాడు లింగాభిషేకం చేసిన జలాలతో శిరస్సున జలుకుంటే వైకుంఠప్రాప్తి కలుగుతుందని ఇక్కడి చరిత్ర చెబుతోంది.

దర్శన వేళలు: ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

No comments:

Post a Comment