Monday, August 3, 2026

Why is Goddess Gauri made using turmeric? - గౌరిదేవిని పసుపుతో ఎందుకు చేస్తారు?

గౌరిదేవిని పసుపుతో ఎందుకు చేస్తారు?

పసుపు శుభానికి చిహ్నం.. గాయాలకు ఔషధం.. పవిత్రకు ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాదు జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపును వృద్ధికారకం చూస్తారు. అందుకే వివాహాది శుభకార్యలప్పుడు వధువు తల్లి దండ్రులు ఆమెకు అల్లుడితో పాటు పసుపును బహుమతిగా అందిస్తారు. అంతేకాకుండా అత్తింటి వారింట్లో ఆయురారోగ్యఐశ్వర్యాలతో సంతోషాన్ని వ్యాప్తి చెందించాలని ఇస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపును ఉపయోగించడం వల్ల కొన్ని ఉపయోగకరాలు ఉన్నాయి. వీటిని అనుసరించడం ద్వారా ఇంట్లో ఎప్పుడు డబ్బుకు కొదవ ఉండదు. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం సొంతమవుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి అశుభం జరగకుండా ఆర్థిక సమస్యలకు పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం.

హిందూ సంప్రదాయంలో ఏ పూజ లేదా వ్రతం ప్రారంభించినా పసుపు వినాయకుడిని, పసుపు గౌరమ్మను తయారుచేసి పూజించడం ఆనవాయితీ. 

గౌరిదేవిని పసుపుతో చేయడానికి ప్రధాన కారణాలు పవిత్రత, సౌభాగ్యం మరియు దైవిక శక్తికి అది చిహ్నంగా ఉండటం. పసుపును ప్రకృతి సిద్ధమైన పవిత్రమైన పదార్థంగా, మంగళప్రదంగా భావిస్తారు.

మంగళకరం & పవిత్రత:
పసుపును మంగళద్రవ్యంగా, శ్రీ మహాలక్ష్మి మరియు గౌరీ దేవి ప్రత్యక్ష స్వరూపంగా భావిస్తారు.
'గౌరి' అంటే పసిడి (బంగారు) ఛాయ కలది అని అర్థం. పసుపు రంగు గౌరీ దేవి దివ్య తేజస్సుకు ప్రతీక.

సౌభాగ్యానికి ప్రతీక:
ముత్తైదువులు పసుపు గౌరమ్మను పూజించడం వల్ల మాంగల్య బలం (ఐదవతనం) పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు, సమృద్ధి లభిస్తాయని నమ్ముతారు. వరలక్ష్మి వ్రతం, శ్రావణ మంగళవారం, వినాయక చవితి వంటి పండుగలలో పసుపు గౌరమ్మ పూజకు ప్రత్యేక స్థానం ఉంది.

పురాణ నమ్మకం: అమ్మవారు పార్వతీదేవి తన ఒంటికి రాసుకున్న పసుపుతోనే వినాయకుడిని సృష్టించింది. అందుకే పసుపుతో దైవ రూపాన్ని చేయడం ఆచారంగా వస్తోంది.

భక్తికి ఆడంబరాలు అవసరం లేదు:
అమ్మవారికి వెండి, రాగి లేదా ఇతర విగ్రహాలు లేకపోయినా, కేవలం ఇంట్లో ఉండే పసుపుతోనే దేవి రూపాన్ని తయారుచేసి అత్యంత భక్తితో పూజించవచ్చు.

భగవంతుడికి కావాల్సింది ఆడంబరం కాదు, నిశ్చలమైన భక్తి మాత్రమే అని ఇది తెలియజేస్తుంది.

ఔషధ గుణాలు & ఆరోగ్నం:
పసుపుకు సహజసిద్ధమైన క్రిమిసంహారక మరియు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ప్రతికూల శక్తులను తొలగించి, ఇంటికి సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు.

పూజా వాతావరణంలో పసుపును ఉపయోగించడం వల్ల గాలి శుద్ధి అవ్వడమే కాకుండా, ప్రతికూల శక్తులు తొలగిపోయి ధనాత్మక శక్తి వ్యాపిస్తుంది.

పర్యావరణ హితం:
పూజ పూర్తయిన తర్వాత పసుపు గౌరమ్మను నీటిలో నిమజ్జనం చేయడం లేదా మొక్కల్లో వేయడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు.

పసుపులో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే పసుపును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటుంటాం. ప్రతీ కూరలో కచ్చితంగా పసుపు వేయాల్సిందే. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దెబ్బ తగిలిన వెంటనే పెద్దలు పసుపు రాయమని సలహాలిస్తుంటారు. ఇంతటి మేలు చేసే పసుపును రోజూ ఉదయం పరగడుపు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

No comments:

Post a Comment