పెండ్లిగుమ్మడి గౌరీ నోము కథ
"పెండ్లిగుమ్మడి గౌరీ పేరక్కపట్టింది
ఇండ్లు వాకిండ్లలో నెపుడు కళ్యాణాలే
ఇండ్లు వాకిండ్లలో నెడతెగని పంటలే
ఇండ్లు వాకిండ్లలో నెడతెగని భాగ్యమే
గుమ్మడి పండువంటి కొడుకులూ అల్లుండ్రు
గుమ్మడి పండ్లువంటి కూతుండ్రు కోడండ్రు
మాణిక్యములవంటి మనుమలామందలు
పసుపులు కుంకుమలు పాయని భూషణములు
కలిగెనానందాలు కన్నుల పండుగలు
ఈనోము నోచిన యింతులకు కొదవే?"
ఈ పాట పాడుకొని అక్షతలు వేసికొనవలెను.
ఉద్యాపనము: మూడు బూడిద గుమ్మడిపండ్లు తెచ్చి వుంచుకొనవలెను. అందులో నొకపండు, మానెడు బియ్యము దక్షిణ తాంబూలములనుంచి, అవి పట్టుకొని బ్రాహ్మణుని యింటికివెళ్ళి అవి ఆయనకిచ్చి నమస్కరించి "నోము నోచికొందును వాయన మందు కొనుటకు రావలెన" ని యా బ్రాహ్మణ వృద్దుని బీలువవలెను. ఆయన మనయింటికి వచ్చిన తరువాత రెండవ గుమ్మడిపండు,
అడ్డెడు తవ్వెడు బియ్యము దక్షణ తాంబూలము ఆయనకిచ్చి నమస్కరించవలెను, ఆ తరువాత మూడవ గుమ్మడిపండును అయిదుశేర్ల బియ్యము, స్వయంపాకముతో పట్టుకొని బ్రాహ్మణుని యింటికివెళ్ళి, ఆయన భార్యకు వాయనమంతా అందించి, వారి యింటిలోనే ఆనాడు నోము చేసికొన్న యిల్లాలు భోజనము చేయవలెను.
No comments:
Post a Comment