1. మధుమేహం ఉన్నవారికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగి జావా చక్కని ఔషధంగా పనిచేస్తుంది. మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.
2. వాల్ నట్స్ లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మేలు చేస్తుంది. అలాగే ప్రీబయోటిక్ కాంపౌండ్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.
3. సీతాఫలంలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, జింక్, రాగి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మొటిమలు, అలర్జీలు, ఇతర చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి.
4. నారింజ పండ్లలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఈ పండ్లని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధులు దూరమవుతాయి.
5. డ్రై ఫ్రూట్స్ బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి నట్స్ సహజంగా మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఎందుకంటే వాటిలో ఇతర తాజా పండ్ల కంటే ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ ఉంటాయి.
6. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా టీ తాగితే ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి జీర్ణ సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది.
7. ఆకు కూరలలో విటమిన్ ఎ, సి మరియు కె అలాగే అనేక ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఆకు కూరలు మీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శీతాకాలంలో పొడి చర్మాన్ని నివారించడంలో సహాయపడతాయి.
8. అరటిపండులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. అరటిపండు తినేప్పుడు నీళ్లు ఎక్కువగా తాగితే.. కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్ లు కరిగిపోతాయి. దీని కారణంగా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.
9. నారింజలో విటమిన్ సితో పాటు విటమిన్ సి ఫోలేట్, బి విటమిన్ ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలకి కూడా ఇది చాలా అవసరం.
10. గంధంలో శీతలీకరణ ప్రభావాలు ఉంటాయి. గంధం పేస్ట్ ను తలకు రాసి విశ్రాంతి తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
11. వాల్ నట్స్ లోని ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి.
12. పసుపులో శరీరానికి ఉపయోగపడే ఔషధ గుణాలెన్నో ఉంటాయి. ఇందులో ఉండే కర్క్యుమిన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లామేటరీ ఏజెంట్ మాదిరిగా పనిచేస్తుంది. యాంటీ క్యాన్సర్ ఔషధంగా కూడా పసుపు పనిచేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ కణాలు వృద్ధిచెందకుండా ఉంటాయి.
13. డ్రాగన్ ఫ్రూట్ లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి.
14. రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రాగులను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపాలు వంటి వాటిని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
15. శరీరంలో వెంట్రుకలు, గోళ్లు పెరగడానికి విటమిన్ బీ7 తోడ్పడుతుంది. కాలిఫ్లవర్, క్యారెట్లు, అరటి, పొట్టు తీయని ధాన్యాలు, గుడ్లు, చికెన్ లో బయోటిన్ ఎక్కువగా లభిస్తుంది.
16. పరగడుపున మజ్జిగ తాగితే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ తగ్గుతాయి.
17. రోజూ పరగడుపున గోధుమ జావ తాగితే రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది.
18. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి త్రాగితే జీర్ణ క్రియ వేగవంతం అవుతుంది.
19.శనగలు తినడం వలన శరీరానికి ఐరన్, జీర్ణక్రియ, చక్కెరస్థాయిని అదుపులో ఉంచుతాయి
20. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి.
21. ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
22. పెరుగు, జీలకర్రని కలిపి తీసుకుంటే అందులోని పోషకాలు రెంట్టింపు అవుతాయి. రెండు వేర్వేరుగా తినడం కంటే రెండింటిని కలిపి తింటే చాలా వరకూ బరువు తగ్గుతారు.
23. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతోపాటు హైబీపి కూడా తగ్గుతుంది. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
24. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రొటీన్ ఫుడ్స్ సక్రమంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.
25. మిరియాలు మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని మసాజ్ ఆయిల్ తయారీలో ఒక పదార్థంగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్తో మర్థనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
26. గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ఒక వెల్లుల్లి రేకు ముక్కలుగా చేసి వేసి బాగా మరగనిచ్చి ఆ పాలు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
27. కోసిన యాపిల్ ముక్క రంగు మారకుండా ఉండాలంటే నిమ్మరసాన్ని కోసిన యాపిల్ భాగములో రాయాలి, ఆక్షిడేషన్ కారణముగా యాపిల్ రంగు మారకుండా ఊంటుంది.
28. తాజాపండ్లు, పొట్టుగల పదార్దములు, ఆకుకూరలు, కాయకూరలు పీచు గలవి మలనపదార్దములను బయటకు పంపించడములో పీచు ఉన్న పదార్దములదే కీలకపాత్ర.
29. క్యారెట్లు తినడం వల్ల చర్మానికి రక్షణనిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కిడ్నీలు బాగా పనిచేస్తాయి. కంటిచూపు, కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.
30. ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని పొడి చేసి నీటిలో కలుపుకుని త్రాగడం వల్ల అధిక వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
31. వైట్ బ్రెడ్ లో పీచు పదార్థం ఉండదు. దీంతో.. ఇది జీర్ణక్రియకు మంచిది కాదు. ఇది ఎక్కువ తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా వైట్ బ్రెడ్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
32. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ జీర్ణక్రియ ప్రక్రియను పెంచుతాయి. అల్లం టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
33. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతోపాటు హైబీపి కూడా తగ్గుతుంది. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
34. తాజా తమలపాకుల్ని తీసుకుని నమిలితే నోటిలోని దుర్వాసన తగ్గుతుంది. దీనిని నమలడం వల్ల సలైవా రిలీజ్ అవుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ స్టిమ్యులేట్ అయి జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
35. పులిహొర తిన్న వెంటనే గోరు వెచ్చని నీరు ఒక గ్లాసుడు తాగితే తొందరగా జీర్ణం అవుతుంది. వేడి కూడ చేయదు.
36. భోజనంలో తప్పనిసరిగా పచ్చి కూరగాయల సలాడ్లు ఉండేలా చూడాలి. ఇవి శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి, చర్మం కాంతివంతంగా ఉండటానికి దోహదం చేస్తాయి.
37. కీర దోసకాయలో పొటాషియం, మెగ్నీషియం మూలకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ఇందులోని నీరు.. బాడీలో రక్తం యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా ఎండలో తిరిగినా మనం వెంటనే నీరసించిపోకుండా బలంగా ఉంటాం.
38. ఆకు కూరల్లో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది కాబట్టి ఆకు కూరాల్ని ముఖ్యంగా గోంగూర (పుంటి కూర) శరీరానికి చక్కటి చలువ చేస్తుంది.
39. జీలకర్ర జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం. అజీర్తి లాంటి వాటితో సతమతమౌతుంటే జీలకర్ర సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
40. దగ్గు నుంచి తక్షణ ఉపశమనానికి పరగడుపున నాలుగైదు తులసి ఆకులను అర టీ స్పూను తేనెతో కలిపి తీసుకోవాలి.
41. కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకల ఆరోగ్యానికి మంచివి. వీటిని తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకల నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది.
42. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ హెల్దీగా మారుతుంది. దీంతో చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, మైగ్రేన్ వంటి సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి.
43. చియా గింజలు మెగ్నీషియం, కాల్షియం మరియు పొటాషియంతో సహా గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో మరియు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి.
44. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, కాల్షియం, ప్రోటీన్, ఐరన్, పొటాషియం ఉంటాయి.
45. బీరకాయల్లో ఎక్కువగా పీచుపదార్థం, నీటి శాతం ఉంటుంది. ఇవి షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. ఇది షుగర్ ఉన్నవారిలో గ్లూకోజ్ ని మెల్లిగా విడుదల చేస్తుంది. అంతేకాకుండా, తిన్నప్పుడు కడుపునిండుగా ఉంటుంది. దీంతో ఎక్కువగా ఆకలి వేయదు. ఆరోగ్యానికి కూడా మంచిది.
46. కందిపప్పు కూడా షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంచడమే కాకుండా, కండరాలకి మేలు చేస్తుంది. అంతేకాకుండా, మెటబాలిజం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో పులుసు చేసుకుని తింటే నోటికి రుచిగా ఉండడమే కాకుండా షుగర్ ఉన్నవారికి కూడా మంచిది.
47. బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు వంటి ధాన్యాలు శక్తిని అందిస్తాయి. పూర్తి ధాన్యాలను ఎంచుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
48. గుడ్లు, చేపలు, కాయధాన్యాలు, గింజలు, పాల ఉత్పత్తులు కండరాల బలాన్ని, కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
49. నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మెదడు వికాసం పొందుతుంది.
50. నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. తులసి రసాన్ని రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
51. మొక్కజొన్నలతో చేసిన రొట్టె కూడా చలికాలంలో ఎక్కువగా తింటారు. దీనికి కారణం ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండడమే. కానీ, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. దీంతో త్వరగా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అయితే, జీర్ణం కావడానికి కాస్తా కష్టంగా మారి గ్యాస్, బరువు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి, తక్కువగా తినాలి.
52. రాగి రొట్టె అనేది హెల్దీ ఆప్షన్. ఎందుకంటే రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర తగ్గేందుకు, బలమైన ఎముకలకి, జీర్ణక్రియకి, దీర్ఘకాలిక శక్తికి, మంచి నిద్రకి, పిల్లల పెరుగుదలకి రాగి రొట్టె చాలా మంచిది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, ఇది బెస్ట్ రోటీ.
53. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రాగులను తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం అంది తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.
54. తులసి, యూకలిప్టస్ నూనెలను నుదురు, కణతులకు పట్టించి, నెమ్మదిగా మర్దన చేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
55. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు ఆహారం తీసుకున్న తర్వాత సోంపు తింటే కొంత ఉపశమనం లభిస్తుంది.
56. డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి రావచ్చు. కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తాగితే తలనొప్పి తగ్గే అవకాశం ఉంది.
57. వాల్ నట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ కడుపును నిండుగా ఉంచుతుంది, ఆకలిని తగ్గిస్తుంది. దీంతో తక్కువగా తింటారు. ఇది బరువును కంట్రోల్ లో ఉంచుతుంది.
58. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ఒక వెల్లుల్లి రేకు ముక్కలుగా చేసి వేసి బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
59. ఉసిరికాయలో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. ఎండిపోయిన కాయలోను విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్ళ కాంతిని పెంపొందించే గుణం ఇందులో ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
60. క్యారెట్లు తినడం వల్ల చర్మానికి రక్షణనిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కిడ్నీలు బాగా పనిచేస్తాయి. కంటిచూపు, కాలేయం పని తీరు మెరుగుపడుతుంది.
61. రాగి జావను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.
62. పసుపులో శరీరానికి ఉపయోగపడే ఔషధ గుణాలెన్నో ఉంటాయి. ఇందులో ఉండే కర్క్యుమిన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ ఏజెంట్ మాదిరి పని చేస్తుంది. యాంటీ క్యాన్సర్ ఔషధంగా కూడా పసుపు పని చేస్తుంది.
63. క్వినోవాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్వినోవాలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. క్వినోవాలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ బీ6, జింక్, ఫోలెట్, మాంగనీస్, ఐరన్, కాపర్ వంటివి మెండుగా ఉంటాయి.
64. జుట్టు రాలడానికి కారణం కుదుళ్ళు ఆరోగ్యంగా లేకపోవడమే.. ఇందుకు ప్రోటీన్ లోపం, ఐరన్ లోపం. ఈ రెండు లోపాల కారణంగా జుట్టు రాలుతుంది. అయితే, కరివేపాకు తింటే ఈ సమస్యలు దూరమవుతాయి. కరివేపాకులో విటమిన్ బి12, విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
65. ఇడ్లీలు పులిసిన వాసన రాకుండా రుచిగా ఉండాలంటే.. పిండి రుబ్బేటప్పుడు మూడు చెంచాలు నానబెట్టిన సగ్గుబియ్యం చేర్చాలి.
66. బత్తాయిలు, నిమ్మకాయల్ని పదినిమిషాలు వేడినీటిలో ఉంచితే.. రసం ఎక్కువగా వస్తుంది.
No comments:
Post a Comment