శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవతాకృత దేవీస్తుతి
ఆ దయామతల్లిని దర్శించి దేవత లెల్లరును నమస్కరించిరి. వారికనులనిండ నందబాష్ఫములు నిండగ నోట మాట రాకుండిరి. నారు తుదకెట్టులో గుండె చిక్కబట్టుకొని భక్తి వినమ్రతతో తలలు వంచి కన్నుల ప్రేమాశ్రులు నిండార జగదంబను సన్నుతింపసాగిరి. శ్రీదేవి - మహ దేవి - శివ- పరాప్రకృతి - భద్రయగుతల్లికి నిరంతరము తప్పక మేము నమస్సు లర్పింతుము. జ్ఞానులలో హృదయాగ్ని రూపిణి- చైతన్య రాశి-కర్మఫలము లందిపంనెల్లర సేవలందుకొను తల్లి-సంసారతారిణి-తపః సముజ్జ్వలయగు దుర్గకు మనస్సులర్పింతుము.
దేవతలు దైవీభషను సృజించిరి. ప్రాణులు దానిని పెక్కరూపముల పేర్కొందురు. అట్టి వాక్స్వరూపిణి-కామధేనువు-దేని - మాకన్నాదులుప్రసాదించుగాక.శ్రీకాళరాత్రి-బ్రహ్మస్తుత-వైష్ణవి-స్కందమాత-సరస్వతి-అదితి-దక్షకన్య-పావన-పావన-శివయగు తల్లికి నమస్సు లర్పింతుము. మేము శ్రీమహలక్ష్మిని తెలిసికొనుచున్నాము.
అమెను సర్వశక్తిస్వరూపిణిగ ధ్యానించుచున్నాము. అట్టి శ్రీ దేవి మాబుద్దులను ప్రేరించుగాక. శ్రీ విరాట్స్వరూపిణి-సూత్రాత్మమూర్తి- అవ్యాకృత రూపిణి- బ్రహ్మమూర్తియగు తల్లికి నమస్సులర్పింతుము. త్రాటిని చూడగపామను భ్రమ గలునటుల నిన్ను తెలియనందున జగద్ర్బాంతి గల్గును. ఏ దేవి జ్ఞానము జగద్ర్బ తొలగునో యట్టి త్రిభువనేశ్వరికి నమస్సు లర్పింతుము.
పంచకోశాతిరిక్త - అవస్దాత్రయ సాక్షిణి | త్వంపదలక్ష్యార్ద- ప్రత్యగాత్మ స్వరూపిణియగు దేవికి నమస్సులర్పింతుము. ప్రణవ రూప - హ్రుంకారమూర్తి - నానా మంత్రాత్మిక - దయామయియగు దేవికి నమస్సు లర్పింతుము. అని మణి ద్వీపాధినాసినిని దేవత లెల్ల రభినుతించిరి.
అంత దేవి మత్తకోకిల కంఠముతో తీయగ వారికిట్లు పలితెను. ఓ దేవతలారా! మీరే మి పని మీద ఇట గుమిదూడితిరి. నేను నిత్యమును వరము లోసంగుదానను. ఎప్పుడును భక్తుల కోర్కులు దీర్చు కల్పకమను నేను మీ యందుండగ మఱి భక్తి పరులగు మీ కిక చెంత యేల ? నేను నా సద్బక్తులను తప్పక దుఃఖసంసార సాగరమునుండి తరింపచేయగలను.
ఓ యమరులారా! ఇదే నా సత్యప్రతిజ్ఞ నా యెఱంగుడు. అను దేవి ప్రేమపూర్ణవచనము లాలించి వేల్పులు సంతోషించిరి. రాజా! అపుడు దేవతలు నిరభయముగ తమ దుశఖ మిట్లు తెల్పుకొనిరి.
ఓ దేవీ ! ఈ ముల్లోకము లందు నీ వెఱుంగనిది కొంచెమైనను లేదు. పరమేశ్వరీ ! నీవు సర్వజ్ఞవు. సర్వ సాక్షిస్వరూపిణివి. మేము రేయింబవళ్ళు తారకాసురుడు పెట్టు భాదాలు తాళలేకునానము. ఓ మహేశ్వరి! వాడు శివున కుద్బవించు కుమారుని వలనగాని చావడని బ్రహ్మ నిర్ధేశించును.
శివున కిపుడా భార్యలేదని నీకు తెలియును గదా. సర్వజ్ఞురాలవగు నీ యందు పామరుల మేము పలుక గలము. అంతయును సూక్ష్మముగ దెలిపితిమి. తల్లీ! సర్వము నీవే యెఱుంగుము. నీ దివ్యపదపద్మములం దేమఱక మా చిత్తము నిశ్చలముగ నుండుగాత. శివుని కుమారనికొఱకు నీవు తనువు దాల్చవలయునని మా ప్రార్థన.
పార్వతిగా అవతరణ
No comments:
Post a Comment