శ్రీదేవీ యిట్లనెను: మందభాగ్యులగు మీరెక్కడ! ఈ నో లోకాద్బుత దివ్యరూపమెక్కడ! ఐనను మీ మీది వాత్సల్యముతో మీకు నా దివ్యరూపము చూపితిని. ఈ నా దివ్యరూపమును కేవలము నాదయవలన గాక వేదాధ్యయనమున గాని యోగ దానముల వలన గాని యజ్ఞ తపముల వలన గాని చూడ సాధ్యము గాదు.
ఓ రాజేంద్ర! ఇక ప్రస్తుతము వినుము. పరమాత్మ తాను పెక్కు విధముల యుపాధులతో గూడి జీవత్వమంది కర్తృత్వము వహించును. జీవుడు నానా యోనుల యందు బుట్టుచు ధర్మా ధర్మాత్మకములైన పెక్కు పనులు చేయుచు సుఖదుఃఖము లనుభవించుచు నుండును.
అట్లు పూర్వ వాసనల వలన నానా కర్మరతుడై పెక్కు విధముల జన్మములు దాల్చచు సుఖదుఃఖము లనుభవించు చుండును. జీవుడు నీటి యంత్రము వలె (ఎద్దులు గాని ఒంటె గాని గుండ్రముగా తిరుగుటచే బావిలో చక్రాకారమున తిరుగు నీటి బొక్కెనల మాల నీటితో పైకి వచ్చును. ఇది ఘటీ యంత్రముగా పూరాణములలో చెప్పబడినది) విశ్రాంతి లేక తిరుగుచుండును.
అతని కజ్ఞానము కోరికలు కొనలు సాగును. కోర్కులు దీర్చుకొనుట కతడెన్నో పనులు చేయును. ఈ జన్మపరంపరలు తుదముట్టుట కజ్ఞానము తప్పక నశింపవలయును. అజ్ఞానము జ్ఞానము (విద్య) వలన నశించును. పురుషార్థముల కోర్కెలు-తాపములు-తొలగిపోగా జీవన్ముక్తదశ గల్గును.
అజ్ఞానమున పుట్టిన కర్మ మజ్ఞానమును నశింపజేయజాలదు. కనుక నజ్ఞాన నాశమునకు కర్మమును నమ్ముకొని యుండరాదు. ఈ కర్మములన్నియు ననర్థ దాయకములు. వీని వలన సంతలో రాగము నంతలో ద్వేషాగ్ని పుట్టును. ఇట్టి యనర్థ కర్మములు పల్మారు పుటుచుండెను. ''కుర్వన్నే వేహ కర్మాణి'' యను వేదాను వచనము ప్రకారముగ మంచి కర్మములు చేయుట మంచిధే. కాని మనుజుడెల్లభంగుల జ్ఞానమే పొందవలయును. దివ్యజ్ఞానము వలననే వైకల్యము ప్రాప్తించును.
సత్కర్మము జ్ఞానమునకు తోడుపడును. మేలు చేకూర్చును. ఈ రెంటికిని విరోధము లేదని కొందఱందరు. అది సరికాదు. ఏలన జ్ఞాన ఖడ్గముననే కర్మములక తావగు హృదయ గ్రంథి ఛేదించబడును.
చీకటి వెలుగులోకచో గలియవు. వానికి విరోధము గలదు. అట్లే కర్మ జ్ఞానములకు విరోధ ముండుటనవి యొకచోగలియవు. కనుక నరుడు వైదికాది కర్మము లన్నియు సంస్కారము లన్నియును చిత్తశుద్ది కొఱకు ప్రయత్న పూర్వకముగ చేయుచుండవలయును. చిత్తశుద్ధి గల్గునంతవఱకే శమదమములు-తతిక్షవైరాగ్యము నత్యా వశ్యకములై యుండును.
చీకటి వెలుగులోకచో గలియవు. వానికి విరోధము గలదు. అట్లే కర్మ జ్ఞానములకు విరోధ ముండుటనవి యొకచోగలియవు. కనుక నరుడు వైదికాది కర్మము లన్నియు సంస్కారము లన్నియును చిత్తశుద్ది కొఱకు ప్రయత్న పూర్వకముగ చేయుచుండవలయును. చిత్తశుద్ధి గల్గునంతవఱకే శమదమములు-తతిక్షవైరాగ్యము నత్యా వశ్యకములై యుండును.
అటు పిమ్మట కర్మముతో నెట్టి యావశ్యకతయు గల్గదు. చివర కాత్మ వంతుడు సర్వ ధర్మములు పరిత్యజించి నిష్కపటమైన భక్తితో శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడునగు సద్గురువు నాశ్రయింపవలయును. అతడు నిశ్చల నిర్మల చిత్తముతో వేదాంత శ్రవణము నిరంతర మొనరింపవలయును.
తత్త్వ మస్యది వాక్యముల సత్యార్థమును చింతింపవలయును. తత్త్వ మస్యాది వ్యాక్యార్థము జీవ బ్రహ్మల యేకత్వము దెల్పును. ఈ రెంటి యేకత్వము తెలిసిన నరుడు నిర్బయుడైనా సారూప్యమందగలడు. మొదట పదముల యర్థమెఱింగి పిదప వాక్యములలోని యర్ద మెఱుంగవలయును.
''తత్'' అను పదమున కర్థము భగవతినగు నేనే యని చెప్పబడును. ''త్వం'' అను పదమునకు జీవుడని ముఖ్యార్థము. ఈ రెంటికి ''అసీ'' యను పదము జేర్చి యైక్యము గూర్తురు. వాచ్యార్థములకు విరోధమువలన నైక్యము గుదురనపుడు లక్ష్యార్థములతో వేద నిర్దిష్టములగు ''తత్-త్వం'' పదములకు కర్థము చెప్పవలయును.
జీవ-ఈశ్వరుల ప్రత్యేక ధర్మములు తొలగిపోగరెంటి యైక్య మిట్లెఱుంగుట వలన సద్వయము సిద్దించును. ఆ దేవదత్తు డితడే యన్న వాక్యములో ''ఆ-ఈ'' యను రెంటి ధర్మములు తొలగగ మిగిలిన వాడొక్కడే కధా ! అదే లక్షణ యనబడను. అటులే ఈ స్థూల దేహాది భేదములు తొలగినపుడు నరుడు బ్రహ్మత్వమందును. ఈ స్థూలదేహము పంచీకృత మహాభూతముల నుండి యుత్పన్నయ్యెను. ఇదెల్ల భోగాల కాటపట్టు. జరా వ్యాధులకు కర్మములకు తావలము.
ఈ దేహము మిథ్య. ఐనను మాయాభ్రాంతిచే నున్నట్లు తోచును. గిరిరాజా! ఇట్టి శరీరమే యాత్మయొక్క స్థూలమైన యుపాధి. జ్ఞాన కర్మేంద్రియంబులు-ప్రాణపంచకము-మనోబుద్దులు గలిసిన దేహమును సూక్ష్మమైన యుపాధిగ బుధులందురు. ఈ రెండవ యుపాధి యాత్మయొక్క సూక్ష్మమైన యిపాధి. ఇది పంచీకృతము కాని పంచ భూతముల వలన గల్గును. ఇది అంతఃకరణము యొక్క సుఖదుఃఖాదులు తెలుపుచుండును.
ఈ దేహము మిథ్య. ఐనను మాయాభ్రాంతిచే నున్నట్లు తోచును. గిరిరాజా! ఇట్టి శరీరమే యాత్మయొక్క స్థూలమైన యుపాధి. జ్ఞాన కర్మేంద్రియంబులు-ప్రాణపంచకము-మనోబుద్దులు గలిసిన దేహమును సూక్ష్మమైన యుపాధిగ బుధులందురు. ఈ రెండవ యుపాధి యాత్మయొక్క సూక్ష్మమైన యిపాధి. ఇది పంచీకృతము కాని పంచ భూతముల వలన గల్గును. ఇది అంతఃకరణము యొక్క సుఖదుఃఖాదులు తెలుపుచుండును.
ఓ గిరీశ్వరా!నా యాత్మయొక్క మూడవ యుపాధి కారణాత్మ. అది అనిర్వాచ్యము. అనాది-అజ్ఞానము జరుగును. ఈ మూడుపాధులు తొలగిపోగా కేవలమగు ''ఆత్మ'' మిగిలివెలుగును. పంచకోశము లీ మూడు దేహము లందును సతతము విలసిల్లుచుండును. ఈ పంచకోశములు తొలగిపోగా తుదకు బ్రహ్మనిష్ఠ ప్రాపించును. ఇట్లు ''నేతి-నేతి'' యను వాక్యార్థము వలన నాత్మరూపము వెల్లడియగును. అట్టి ''ఆత్మ'' పుట్టునది -చచ్చునది-పూర్వముండి యిపుడు లేనిదిగాదు: అది నిత్యము-చచ్చునది కాదు. అజము-శాశ్వతము-పురాణము.
ఈ శరీరాదులు చంపబడుచున్నను నది చంపబడదు. చంపువాడు తాను చంపెననియును చంపబడువాడు నేను చచ్చితి ననియు తలంతురు. కాని వారిర్వురును తెలియనివారే. ఏలన ''ఆత్మ'' చావదు. చంపబడదు. ఆత్మ అణువుకంటెనణువు; మహత్ కంటె మహీయము. అయ్యు నది యెల్ల ప్రాణుల హృదయగుహలందు వెలుగును.
జీవుడు పరమాత్మదయ వలన నాత్మమహిమ మెఱిగివిగత శోకుడు గాగలడు. ఆత్మ-రథికుడు; శరీరము-రథము; బుద్ధి-సారథి; మనస్సు-ఇంద్రియములను మూడును గలిసి భోక్త యనబరగునని పెద్దలందురు. అవివేకి-అమనస్కుడు-అశుచియగు మూర్ఖుడు తత్పద మెఱుగలేక దురిత సంసార సాగరమున మునుకలు వేయుచుండును.
వివేకి-సమనస్కుడు -శ్రోత్రియుడు-నిష్కాముడునగు వాడు పునరావృత్తి లేని తత్పదమును కైసేయగలడు. బుద్ధియను సారథి మనస్సను కళ్లెమును గట్టిగ బట్టుకొన్నచో సంసార దుస్తర మార్గములు దాటి పరమపద మలంకరింపగలడు.
వివేకి-సమనస్కుడు -శ్రోత్రియుడు-నిష్కాముడునగు వాడు పునరావృత్తి లేని తత్పదమును కైసేయగలడు. బుద్ధియను సారథి మనస్సను కళ్లెమును గట్టిగ బట్టుకొన్నచో సంసార దుస్తర మార్గములు దాటి పరమపద మలంకరింపగలడు.
No comments:
Post a Comment