Wednesday, April 29, 2026

Sri Lakshmi Narasimha Swamy Temple - Antarvedi - శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం - అంతర్వేది

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం - అంతర్వేది

అంతర్వేది క్షేత్రం
కోనసీమ బంగాళాఖాతానికి అంచున ఉన్న అంతర్వేది పుణ్యక్షేత్రం మరియు ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధి. పశ్చిమ గోదావరి నుంచి నరసాపురం, తూర్పు గోదావరి నుంచి రాజోలు, మలికిపురం మార్గాల ద్వారా భక్తులు అక్కడ చేరతారు. సాగరం, నది కలిసే అద్భుత దృశ్యం ఇక్కడి ప్రత్యేకత.

అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కోనసీమ జిల్లా, సఖినేటిపల్లె మండలం లోని అంతర్వేది అనే ఆలయ పట్టణంలో ఉంది. ఈ ఆలయం బంగాళాఖాతం, గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ట గోదావరి కలిసే ప్రదేశంలో ఉంది. 

ఇది శాలి వాహన శక సంవత్సరములు [1745] క్రీ .శ 1823 (chala gap)లో అగ్ని కుల క్షత్రియులు కొప్పనాతి కృష్ణమ్మ వర్మ గారిచే (పల్లవ వంశం) నిర్మించబడింది. ఈ ఆలయం కోనసీమ జిల్లాలో ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది తూర్పు తీరంలోని అత్యంత అంతర్గత భాగంలో ఉంది. 

హిందూ పురాణాల ప్రకారం సప్త ఋషులలో ఒకరైన వశిష్ఠుడు మహర్షి ఈ నదిని తీసుకువచ్చాడని చెబుతారు. అంతర్వేది నిజానికి వశిష్ట నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. 

ఇది నర్సాపూర్‌కు అతి సమీపంలో ఉంది. ఈ ప్రదేశం  ప్రత్యేకత కారణంగా సంవత్సరం పొడవునా భక్తులు దర్శించుకుంటారు. బంగాళాఖాతం, గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ఠ నది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం, నది సంగమించే ప్రదేశాన్ని "సాగర సంగమ ప్రదేశం" అని అంటారు. దీనిని స్థానికులు "అన్నా చెల్లి గట్టు" అని కూడా పిలుస్తారు. 

ఈ ప్రాంతంలోని నీరు తీపిగా, చల్లగా, ఆహ్లాదకరంగా ఉండటం వల్ల భక్తులు దీనిని ప్రసాదం రూపంలో సేవిస్తారు. పురాణాల ప్రకారం, క్షీర సాగర మథనం, త్రేతాయుగం ఘట్టం ఇక్కడ జరిగిందని నమ్ముతారు. భక్తులు ముఖ్యంగా ఫాల్గుణ మాసం (జనవరి)లో, ఫాల్గుణ మాసం (మార్చి)లో జరిగే డోలేపౌర్ణమి వేడుకలలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి వస్తారు. 

ఆ సమయంలో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పూజిస్తారు. ఈ ఆలయం భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుందని, అందుకే దీనిని "ముక్తి క్షేత్రం" అని కూడా అంటారు.

స్థల పురాణం
వశిష్ట మహర్షి ఆశ్రమానికి తగిన స్థలంగా ఈ క్షేత్రాన్ని ఎంపిక చేశారు. రత్నలోచనుడు చేసిన కిరాతకృత్యాలు వశిష్టుని బాధించడంతో, శ్రీమహావిష్ణువు నరసింహవతారం తీసుకొని రత్నలోచనుని సంహరించారు. ఆ తర్వాత రక్తధార అశ్వరూఢాంబికను స్థానికులు “గుర్రాలక్క” అని పిలుస్తారు.

ఆలయ చరిత్ర
పురాణాల ప్రకారం, సృష్టికర్త బ్రహ్మ  శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని "రుద్రయాగం" నిర్వహించటానికి ఈ స్థలంలో "వేదిక" ని సిద్ధం చేసాడు. అందుకే దీనికి "అంతర్వేది" అని పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు రుద్రయాగంలో భాగంగా నీలకంఠేశ్వరుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. దీనికి ముందు, వశిష్ఠ మహర్షి ఇక్కడ గోదావరి నది శాఖను సృష్టించి, దానిపై ఆశ్రమాన్ని స్థాపించాడు. 

హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవిలోచనుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వశిష్ట నది ఒడ్డున పదివేల సంవత్సరాలకు పైగా తపస్సు ఆచరించాడు. భగవంతుడు రక్తవిలోచనుని తపస్సుకు సంతోషించి అతనికి వరం అనుగ్రహించాడు. రక్తవిలోచనకు చాలా అసాధారణమైన కోరిక ఉంది - యుద్ధంలో తన శరీరం నుండి నేలపై పడే రక్తపు బిందువుల వల్ల తడిసిన ఇసుక రేణువుల సంఖ్య, తనంత బలం, శక్తితో సమాన సంఖ్యలో రాక్షసులను ఉత్పత్తి చేయాలని, వారు తనకు సహాయం చేసేవిధంగా వరం కోరతాడు. ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. 

ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడుకి వశిష్ఠుడుకి ఆసమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙపై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరించాడు. తన కుమారులు హత్యకు గురైనప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న వశిష్ట మహర్షి, తన ఆశ్రమానికి తిరిగి వచ్చి నరసింహస్వామి అనుగ్రహం కోసం ప్రార్థించాడు.

ప్రహ్లాద వరదం విష్ణుం నృసింహం పరదైవతం.
శరణం సర్వలోకానామాపన్నారతి నివారణం.

వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనంపై నృసింహ రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నృసింహ స్వామి సుదర్శనంను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నృసింహ స్వామి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తిని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు.

ఈ రక్తావలోచనుని సంహరించిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నృసింహ స్వామి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్య నదిలోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధంను శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.

కలియుగంలో వశిష్టుడు తర్వాత, కేశవదాసు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. 1822లో ఆయన కుమారుడు కోపనాతి కృష్ణమ్మ ఆలయం పూర్తి చేశారు. 1844లో బ్రిటిష్ పాలకులు ఆలయం ధర్మకర్తృత్వాన్ని మొగల్తూరు రాజులకు అప్పగించారు. వంశపారంపర్యంగా వారి కుటుంబీకులు నిత్యకైంకర్యం చేస్తున్నారు.

శిలా శాసనము ప్రకారం 
శ్రీయుతుడైనా శ్రీ కొప్పనాతి అది నారాయణ అంతర్వేది క్షేత్ర స్వామియైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయము, ప్రాకార విమాన మండపాదులు కొన్ని కట్టించి , భగవదర్పణ బుద్దితో, తానారంభించిన నిర్మాణ కార్యమును కృష్ణమ్మ దివ్యమై, భవ్యమైన మహామహిమ యొప్పనట్లుగా శాలి వాహన శక సంవత్సరములు [1745] క్రీ .శ 1823, స్వభాను నామ సంవత్సరాధిక చైత్ర కృష్ణ దశమి భాను వాసరము నాటికీ పూర్తి చేయించ నిష్కళంకమైన భక్తి గల్గిన సజ్జనులు మెచ్చుకొనునట్లుగా, నిర్మించి తరించాడు.

ఆలయ ప్రాముఖ్యత
అంతర్వేది ఆలయం నది, సముద్రం కలిసే ప్రదేశంలో ఉన్నందున దీనిని ద్వీప దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయం మరొక ప్రత్యేకత, ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం భారతదేశంలోని అన్ని దేవాలయాలకు భిన్నంగా తూర్పు వైపుకు కాకుండా పశ్చిమం వైపుగా చూస్తుంటుంది. 

ఈ ఆలయం పదిహేనవ లేదా పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయ ప్రధాన దైవం విష్ణువు దశావతారాలలో ఒకటి అయిన శ్రీలక్ష్మీ నృశింహ స్వామి అవతారం. అంతర్వేది ఆలయ నిర్మాణం దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిలో ఉంటుంది. "గర్భగుడి" పై ఎత్తైన అయిదు అంతస్తుల "విమానం గోపురం" ఉంది.

ఆలయ ప్రవేశ ద్వారం 
ఇరువైపులా గరుడ హనుమ విగ్రహం లు దర్శనమిస్తాయి.ఆలయ గర్భగుడి పైకప్పుపై శ్రీకృష్ణుని విగ్రహం "వటపత్ర సాయి" రూపంలో ఉంటుంది. ఈ విగ్రహం ఒకే రాతితో చెక్కబడింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఒడిలో కూర్చున్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ వీక్షించవచ్చు.

ఆలయానికి తూర్పు వైపున, గోడలో రాజ్యలక్ష్మి దేవి, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఉత్తరాన భూదేవి, రంగనాధ స్వామి ఉన్నారు. సంతాన గోపాల స్వామి, కేశవ స్వామి గోడకు పశ్చిమాన చివరగా దక్షిణం వైపున ఆచార్యులు, ఆళ్వార్ల సన్నిధి (చిన్న దేవాలయాలు), చతుర్భుజ (నాలుగు చేతులతో) ఆంజనేయుడు విగ్రహాలు ఉన్నాయి. 

ఈ ఆలయంలో బ్రహ్మ, విష్ణు, శివుని విగ్రహాలు కూడా ఉన్నాయి. నీలకంఠేశ్వర (శివుడు) దేవాలయం కూడా ఉంది, ఇది గోదావరి ఒడ్డుకు దాదాపు సమీపంలో ఉంది, దీనిని వశిష్ట గోదావరి అని కూడా పిలుస్తారు. 

ఈ దేవతను శ్రీ రాముడు ప్రతిష్ఠించాడని, బ్రహ్మ స్వయంగా పూజించాడని నమ్ముతారు. ఈ ప్రదేశాలలో స్నానాలు చేసి దానధర్మాలు చేసిన తర్వాత తమకు పునర్జన్మ ఉండదనే నమ్మకంతో భక్తులు వస్తారు. గయలో, గంగా నది తీరాలలో జరిగే వేడుకల మాదిరిగా పూర్వీకులకు జప తర్పణాలు విడుస్తారు.

ముఖ్యమైన ప్రదేశాలు
సముద్రతీరం:
వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది.

అన్న చెళ్ళెళ్ళ గట్టు : సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత

వశిష్ట నది: అంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగా సముద్రతీరానికి దగ్గరగా ఈ వశిష్టాశ్రమం ఉంది.

రక్తకుల్య నది: మహా విష్ణువు సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరించిన రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా మాయాశక్తి తో రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడి దురాలోచనకు అడ్డుకట్ట వేసాడు.

చక్రతీర్థం: చక్రతీర్థ రాక్షసులందరినీ సంహరించిన తర్వాత భగవంతుడు తన చక్రాయుధాన్ని కడిగిన ప్రదేశం.

వశిష్టాశ్రమం:అంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగా సముద్రతీరానికి దగ్గరగా ఈ వశిష్టాశ్రమం ఉంది. ఈ ఆశ్రమం వికసించిన కమలం మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సరోవరం మధ్య కలువపూవు ఆకారంలో ఈ ఆశ్రమం అత్యంత అద్భుతమైన కట్టడం. దీనికి సమీపంగా ద్యానమందిరం, పఠశాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి ఉన్నాయి. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడాలు ఉన్నాయి.

గుర్రాలక్క: నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం దేవాలయానికి ఒక కిలోమీటరు దూరములో ఉంది. మాయాశక్తి గుర్రాన్ని స్వారీ చేసిందని, అందుకే దీనిని 'అశ్వారూఢంబ' లేదా 'గుర్రాలక్క' అని పిలుస్తారు.

లైట్ హౌస్: దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా 
బ్రిటిష్ పాలకుల కాలంలో లైట్ హౌస్ నిర్మించారు.

ఇతర ఆలయాలు
లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతాలలోనూ, అంతర్వేది గ్రామంలోనూ, సముద్రతీరానికి వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైనవి. క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామి, విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు, గ్రామదేవతల ఆలయాలు ఉన్నాయి.


ప్రత్యేక విశేషాలు
బంగాళాఖాతం ఒడ్డున నిలిచిన నరసింహుడు ప్రజలను తుపానులు, సునామీల నుండి రక్షిస్తాడనేది భక్తుల విశ్వాసం. భీష్మ ఏకాదశి నాటి పర్వదినంలో, సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకుతాయి. ఆలయం వెనుక నదీ తీరంలో గల శిలలు సాలగ్రామాలుగా పూజలు పొందుతాయి.

రోడ్డు మార్గం: 
రాజమండ్రి నుండి (సుమారు 100 కి.మీ.): మార్గం పట్టుకొని మోరి చేరి అక్కడి నుండి అంతర్వేది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం నుండి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం: సమీప ప్రధాన రైల్వే స్టేషన్లు: రాజమండ్రి (సుమారు 100 కి.మీ.), కాకినాడ టౌన్ (సుమారు 90 కి.మీ.)

విమాన మార్గం: సమీప విమానాశ్రయం: రాజమండ్రి ఎయిర్.పోర్ట్ (మధురపూడి ఎయిర్.పోర్ట్), సుమారు 110 కి.మీ. దూరంలో.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

No comments:

Post a Comment