శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల శ్రావణము. సహజంగా శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వస్తుంది. శ్రావణ మాసం నుండి వర్షఋతువు ప్రారంభం అవుతుంది. దీని మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.
శ్రావణమాసం పూజల మాసం, శుభప్రదమైన మాసం, లక్ష్మీప్రదమైన మాసం, పండుగల మాసం, మహిళలకు ప్రీతిపాత్రమైన మాసం, వర్ష ఋతువుతో పరిసరాలు కళకళలాడే మాసం, ఈ సకల శుభాల శ్రావణమాసం. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో దేవతా పూజలతో అలరారుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. గొప్ప పవిత్రమాసం.
దక్షిణాయణంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణమాసం. శ్రీమన్నారాయణ జన్మనక్షత్రం శ్రవణం ఆ పేరు మీద వచ్చిన నక్షత్రం కావడంతో లక్ష్మీదేవికి ఈ నెల అత్యంత ప్రీతికరం.ఇళ్లన్నీ పూజాధికాలతో శోభిల్లే కాలం ఇది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు , శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం.
శ్రీకృష్ణుడు పుట్టినది శ్రావణమాసంలోనే అలానే శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే. శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు ఈ మాసంలో మహావిష్ణువుని పూజిస్తాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేదు. ఈ నెలలో చేసే దైవకార్యం శుభ ఫలితాన్నిస్తుంది. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.
సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా , అలా సాధ్యంకానీ పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు.
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం, సంపద కలుగుతాయి. ఈ నెలలో శివుని ఆరాధించడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.
ఈ మాసంలో అన్నిరోజులు పవిత్రమైనవే కావున మహిళలు భక్తిశ్రద్ధలతో నోములు, వ్రతాలు ఆచరించి విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించమని లక్ష్మీదేవిని వేడుకుంటారు.
ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, పుత్రదా ఏకాదశి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీ కృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పోలాల అమావాస్య చాలా ముఖ్యమైన పర్వదినాలు.
ఈ మాసంలో మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులతో పాటు,పెండ్లికాని యువతులు ఈ మంగళగౌరి వ్రతం భక్తితో నిర్వహిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం.
క్షీర సముద్ర మథనంలో ఆవిర్భవించిన హాలాహలం విశ్వాన్ని దహించి వేస్తుండగా దేవతలు రాక్షసులు శివుని శరణు వేడగా, విశ్వరక్షకుడు, లయకారకుడు అయిన శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించి తన కంఠంలో దాచుకున్నాడు.
కానీ తింటున్నవాడు తన భర్త అని, తింటున్నది విషమని, తింటే లోకానికి మేలవుతుందని తెలిసిన పార్వతి 'మింగివేయండి'(పరవాలేదు) అన్నది. ఆ తల్లికి ఆ స్వామి కట్టిన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో!
(పార్వతికి 'సర్వమంగళ' అని పేరు. వధువులు భర్తల ప్రాణరక్షణార్థం మంగళగౌరీ వ్రతం చేస్తారు. ఈ కథే దీనికి మూలం.)
ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి , శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. క్రొత్తగా పెళ్లి అయిన స్త్రీలు మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసం లో వచ్చే అయిదు మంగళవారాలు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి.
శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.
శ్రావణ శుద్ద చవితి, పంచమి రోజున నాగుల చవితి, నాగపంచమిని జరపుతారు. ఆ రోజున పుట్టలో పాలుపోస్తే సర్వదోషాలు తొలిగిపోతాయని భావిస్తారు.
శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వత్రాన్ని మహిళలు భక్తితో కొలుస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు.
పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాని పటించాలి.
శ్లోకం :
ఈ మాసంలో అన్నిరోజులు పవిత్రమైనవే కావున మహిళలు భక్తిశ్రద్ధలతో నోములు, వ్రతాలు ఆచరించి విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించమని లక్ష్మీదేవిని వేడుకుంటారు.
ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, పుత్రదా ఏకాదశి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీ కృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పోలాల అమావాస్య చాలా ముఖ్యమైన పర్వదినాలు.
ఈ మాసంలో మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులతో పాటు,పెండ్లికాని యువతులు ఈ మంగళగౌరి వ్రతం భక్తితో నిర్వహిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం.
క్షీర సముద్ర మథనంలో ఆవిర్భవించిన హాలాహలం విశ్వాన్ని దహించి వేస్తుండగా దేవతలు రాక్షసులు శివుని శరణు వేడగా, విశ్వరక్షకుడు, లయకారకుడు అయిన శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించి తన కంఠంలో దాచుకున్నాడు.
కానీ తింటున్నవాడు తన భర్త అని, తింటున్నది విషమని, తింటే లోకానికి మేలవుతుందని తెలిసిన పార్వతి 'మింగివేయండి'(పరవాలేదు) అన్నది. ఆ తల్లికి ఆ స్వామి కట్టిన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో!
(పార్వతికి 'సర్వమంగళ' అని పేరు. వధువులు భర్తల ప్రాణరక్షణార్థం మంగళగౌరీ వ్రతం చేస్తారు. ఈ కథే దీనికి మూలం.)
ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి , శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. క్రొత్తగా పెళ్లి అయిన స్త్రీలు మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసం లో వచ్చే అయిదు మంగళవారాలు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి.
శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.
శ్రావణ శుద్ద చవితి, పంచమి రోజున నాగుల చవితి, నాగపంచమిని జరపుతారు. ఆ రోజున పుట్టలో పాలుపోస్తే సర్వదోషాలు తొలిగిపోతాయని భావిస్తారు.
శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వత్రాన్ని మహిళలు భక్తితో కొలుస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు.
పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాని పటించాలి.
శ్లోకం :
బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే
పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే
అని పటిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం , మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి.
నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. అష్టఐశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారికి ప్రార్ధిస్తారు.
అదే విధంగా శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమని శ్రావణ పూర్ణిమగా, రక్షబంధనంగా జరుపుతారు. అదే రోజున అక్క చెల్లెలు అన్నదమ్ములకు రాఖీ కడతారు.
ఈ పూర్ణిమని జంధ్యాల పూర్ణిమగా జరుపుతారు. ఉపనయనం అయిన ప్రతి ఒక్కరు ఈ రోజు నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు.
శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆరోజున శ్రీ కృష్ణాష్టమి ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. చిన్నారులతో కృష్ణుడి వేషాలు, ఆడపిల్లలు గోపిక వేషాలతో ఉట్టి సంబరాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది.
శ్రావణ మాసం కృష్ణ పక్ష అమావాస్యను పోలాల అమావాస్యగా పిలుస్తారు. సంతానాన్ని కోరుకునే వారు, పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోవాలనుకున్నవారు ఈ అమావాస్యను నిర్వహిస్తారు.
శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది.
ఈ నెలలో శివుడితో పాటు గౌరీదేవి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. ప్రతిరోజూ దీపారాధన, దేవుని ధ్యానం, పుణ్యక్షేత్రాల సందర్శన, దానధర్మాలు చేయడం మంచిదని నమ్ముతారు.
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే ఈ నెలలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలను కూడా ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.
ఈ మాసంలో వచ్చే పండుగలు
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతి.
నాగపంచమి,
వరలక్ష్మీ వ్రతం
రాఖీ పౌర్ణమి,
హయగ్రీవ స్వామి జయంతి,
పుత్రదా ఏకాదశి,
రాఘవేంద్ర జయంతి,
శ్రీ కృష్ణాష్టమి,
కామిక ఏకాదశి,
మాసశివరాత్రి,
పోలాల అమావాస్య
వ్రతాలు
మంగళ గౌరీ వ్రతం,
వరలక్ష్మీ వ్రతం
నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. అష్టఐశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారికి ప్రార్ధిస్తారు.
అదే విధంగా శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమని శ్రావణ పూర్ణిమగా, రక్షబంధనంగా జరుపుతారు. అదే రోజున అక్క చెల్లెలు అన్నదమ్ములకు రాఖీ కడతారు.
ఈ పూర్ణిమని జంధ్యాల పూర్ణిమగా జరుపుతారు. ఉపనయనం అయిన ప్రతి ఒక్కరు ఈ రోజు నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు.
శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆరోజున శ్రీ కృష్ణాష్టమి ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. చిన్నారులతో కృష్ణుడి వేషాలు, ఆడపిల్లలు గోపిక వేషాలతో ఉట్టి సంబరాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది.
శ్రావణ మాసం కృష్ణ పక్ష అమావాస్యను పోలాల అమావాస్యగా పిలుస్తారు. సంతానాన్ని కోరుకునే వారు, పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోవాలనుకున్నవారు ఈ అమావాస్యను నిర్వహిస్తారు.
శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది.
ఈ నెలలో శివుడితో పాటు గౌరీదేవి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. ప్రతిరోజూ దీపారాధన, దేవుని ధ్యానం, పుణ్యక్షేత్రాల సందర్శన, దానధర్మాలు చేయడం మంచిదని నమ్ముతారు.
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే ఈ నెలలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలను కూడా ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.
ఈ మాసంలో వచ్చే పండుగలు
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతి.
నాగపంచమి,
వరలక్ష్మీ వ్రతం
రాఖీ పౌర్ణమి,
హయగ్రీవ స్వామి జయంతి,
పుత్రదా ఏకాదశి,
రాఘవేంద్ర జయంతి,
శ్రీ కృష్ణాష్టమి,
కామిక ఏకాదశి,
మాసశివరాత్రి,
పోలాల అమావాస్య
వ్రతాలు
మంగళ గౌరీ వ్రతం,
వరలక్ష్మీ వ్రతం
No comments:
Post a Comment