Thursday, April 23, 2026

The teachings of Goddess Jaganmata - జగన్మాత చేసిన జ్ఞానబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాత చేసిన జ్ఞానబోధ

శ్రీ దేవి యిట్లనెను: దేవతలారా! సావధానముగ నా పలుకులు వినుడు: వానిని విన్నంత మాత్రాన నా సారూప్యము సిద్దింపగలదు. ఓ పర్వతరాజా! ఈ సృష్టికి పూర్వము నే నొక్కతే నుంటిని. ఇతరము లేదు. అట్టి నన్నే అత్మరూపమని- చిత్తని- బ్రహ్మమని యుందరు. అత్మ యనుమానమునకు సర్వ లక్ష్యములకు ఉపమానములకు జన్మమరణాది వికాములకు నతీతము. 

నా యాత్మ యొక్క సహజ సిద్దశక్తిని మాయ యందురు. ఈ మాయ సత్తుగాదు (ఉన్నది అనుటకు తగదు.) అసత్తుగాదు(ఇది లేకవ్యవహరముసాగదు.) ఈ యుభయముగాదు. ఈ మాయకంటె విలక్షణమైన యొక వస్తువు నిత్యమై వెల్గును. అగ్ని నుండి వేడిమి రవి నుండి కిరణములు జాబిల్లి నుండి వెన్నెలలు వెల్వడు నటులహయ నా యాత్మ స్వరూపమునుండి సహజముగ తప్పక కల్గును: 

గఢసుషుప్తిలో వ్యవహరము లన్నియునడంగును. అటులే మాయలో నెల్లజీవులు- జీవకర్మలు-కాలము సర్వము నొక్కటియై విలయ మొందును. నేను నిర్గుణను. ఐనను మాయాశక్తి సంయోగమున నెల్ల జీవులు - జీవర్మలు - కాలము సర్వము నొక్కటియై విలయమొందును. నేను నిర్గుణను. ఐనను మాయాశక్తి సంయోగమున నెల్లలోకములకు కారణరూపిణినైతిని. 

ఇది నన్నే యావరించియుండుటవలన దానిలో నావరణదోషము గలదు. ఈ మాయ చైతన్యముతో గలిసినపు డది జగములకు నిమిత్తకారణ మగును. ఈ ప్రపంచ పరిణామములు మాయసమవాయి ను కారణమగుటచే జరుగును. ఇటి మాయనుతపమని - తమమని జడమని - జ్ఞానమనని-మాయయని- ప్రకృతియని -ప్రధానమని-శక్తియని- అజయని పల్వురు పలువిధమువ పలుకుదురు. 

శైవాగమ వీశారదులు దీనిని విమర్శ మందురు. వేదతత్త్వార్ద చింతకులు దీనిని ఆ విద్య యందురు. ఇట్లు మాయకు నిగమాగమములందు పెక్కు పేర్లు గలవు. మాయ దృశ్యమగుటవలన జడమని జ్ఞానమును నశింపచేయుటవలన అసత్తు. మిధ్య అని యందురు. ఈ కనిపించున దంతయును జడమే శుద్ధచైతన్యము దృశ్యముగదు కనుక జడముగాదు. చైతన్యము స్వయంప్రకాశము. ఇతరముచే ప్రకాశింపచేయబడదు.

చైతన్యమును ప్రకాశిత మనుకొన్న మఱి దానినెవరు ప్రకాశింపజేతురను అనవస్దదోష మేర్పడును. ఒకేకాలముననొకే వస్తువునకు కర్తృత్వము - కర్మత్వము నుండవు. కనుక చైతన్య వస్తువు దీపమువలె స్వయంప్రకాశ వస్తువని తెలియవయును. 

గిరిరాజా ! చైతన్యము స్వయంప్రకాశమై పరులను ప్రకాశింపజేయును. కనుక అజ్ఞాన స్వరూపము నిత్యము సత్యము. జాగ్రత్‌-స్వప్న-సుషువ్తులందు దృశ్యమునుకు వ్యభిచారము (అన్ని కాలములందును లేకపోవుట) గల్గును. కాని దివ్య జ్ఞానమున కెన్నడును వ్యభిచార మనునది (అనగా అన్ని కాలములందు నుండుకుండుట) లేదు. 

ఒకవేళ ఉన్నద్వనుకొన్నను దాని నెఱుగు సాక్షియునువా డొకడు గలడు. జ్ఞానము నిత్యమనియు సాక్షి యెఱుంగుననియు నెల్లరికి విదితమే కదా ! కనుక సచ్ఛాస్త్రవిదులగు కోవిదులు జ్ఞానము నిత్యము. పరమప్రేమ కాలవాల మగుట నది సచ్చిదానందరూపము. అనియు వక్కాణింతురు. 

ఈ యానందము ప్రేమలోనే యుండును. కనుక నేనున్నాననుట కంటె నేను బాగుగ నున్నానని ప్రతివాడుననును. ఇందువలనను మఱియు జగము మిధ్య యగుట వలనను నాకు సంగదోషము లేదు. లోకమందలి యే ధర్మమందై నను జడత్వము- పరిచ్చిన్నత్వము నుండును. జ్ఞాన మాత్మ ధర్మముగాదు. జ్ఞానమాత్మయే. అది యపరిచ్చిన్నము. జ్ఞానము చిత్స్వరూపము. 

అందుచే దానికి జడత్వముండుటగాని యున్నట్లు చూడబడుటగాని జరుగదు. చిత్పదార్దము-చిత్తు-నొకటే కనుక ఆత్మ-జ్ఞానము-ఆనందము-నిత్యము-సత్యము-పరిపూర్ణము-నిస్సంగము-ద్వైతజాలరహితము. అట్టియాత్మతన మాయ వలన తొల్లిటి సంస్కారములవలన కాల-కామ్యకర్మ పిరిపాకమువలన సృష్టికాముడగును. తత్త్వము నెఱుంగనం దున ఆత్మ సృష్టికి పూనుకొనును. 

ఓ నగరాజా! ఇట్టి సృష్టికార్యము కాలకర్మగుణ పరిపాకముననే సంభవించును గాని బుద్దిపూర్వకముగ జరుగు సృష్టిగాదు. నేను నీకు ప్రభోధించిన యీతత్త్వము నా సత్వరూపమే - ఇది లోకోత్తరము. లోకాతీతము. అవ్యాకృతము-అవ్యగ్రము- మాయాశబలము. సర్వకారణ కారణమని సకల శాస్త్రములందును చెప్పబడెను. నా యీ పరతత్త్వము తత్త్వములన్నిటికి మూలకారణము-సచ్చిదానంద విగ్రము.

సర్వ కర్మల ఘనీభావము. ఇచ్చాజ్ఞాన క్రియాశ్రమము. నాతత్త్వము హ్రీంకార మంత్ర వాచ్యము ఆదితత్త్వమని పేర్కొనంబడుము. అట్టి నా మహత్తత్త్వము నుండి శబ్గ తన్మాత్రా రూపమగు ఆకాశ ముత్పన్నమయ్యెను. దాని నుండి స్పర్శతన్మాత్రగల వాయువు దాని నుండి తేజో రూపము గల్గేను. తేజమునుండి రసాత్మకమైన జలమును దాని నుండి గంధ గుణము గల భూమియు గల్గెను. 

ఆకాశమున కోశబ్ద గుణమే కలదు. వాయువునకు శబ్ద స్పర్శములు గలవు. తేజముశబ్దస్పర్శ-రూపములను గుణత్రయము గలదని బుధులందురు. జలమునందు శబ్ద-స్పర్శ-రూప-రసమాత్రలు గలవనీ పండితులందురు. శబ్దము - స్పర్శము- రూపము-రసము- గంధమను గుణ పంచికము గలది భూమి. 

వీనిఅటన్నిటికలయిక వలన మహత్సూత్రము గల్గెను. ఆది సర్వవ్యాపకము. దానినే లింగ దేహమనియు నందురు. ఈ లింగదేహము సర్వప ప్రాణాత్మకము. దీనినాత్మయొక్క సూక్ష్కమదేహమనియు వచింతురు. అవ్యక్తము కారణదేహము దానిని ముందే వచించితిని పరమాత్మ యొక్క రెండవ కారణ దేహము నందు జగద్బీజములుండును. ఆది లింగ దేహములకు కారణభూతము. పిమ్మట పంచీకృతము గాని పంచ భూతముల వలన స్థూల పంచభూతములు గల్గెను. 

ఇట్లు పంచీకరణము వలన పంచభూత సృష్ఠి గల్గిన ప్రకారము చెప్పబడుచున్నది. వెనుక చెప్పిన ప్రతి భూతమును రెండుగ విభజింపవలయును. పిదప ప్రతిభూతము యోక్క రెండవ భాగముతో తక్కిన భూతముల నాల్గవ భాగములు గల్పిన ఒకస్థూల మహిభూతమగును. ఇట్లు పంచీకృతమైన పంచమహాభూతముల కార్యమే విరాడ్దేహము. 

ఇది పరమాత్మ యొక్క మూడవ స్థూల దేహము. ఈ పంచ మహాభూతముల సతాలీంశము వలన శ్రోత్రాది జ్ఞానేంద్రియముల లోని ప్రతి దాని సత్త్వాంశము వలన నాల్గు భేదములు గల యంతఃకరణ మేర్పడును. దానిలో సంకల్ప వికల్పాత్మక వృత్తి గలది మనస్సు ఏ సంశయము లేక నశ్చయ జ్ఞాన వత్తి గలది బుద్ది యనబడును.

చిత్తమను సంధాన పూపమైన వృత్తిగలది. నేనే చేయుచున్నానను నాత్మ వృత్తి - యహంకారమనబడును. తర్వాత పంచ మహ భూతముల రజోంశమున వాగాది కర్మేంద్రియంబు లుత్పన్నమగును. ప్రతికర్మేంద్రియము రజోంశమున ప్రాణాది పంచ వాయువులు గలుగును. ఆ వాయువులతో ప్రాణము హృదయమందును. ఈ పానము గుహ్య మందును వ్యానము నాభి యందును ఉదానము కంఠమందుము సమానము

శరీరమంతటను నుండును. పంచజ్ఞానేంద్రియములు-పంచ కర్మేంద్రియములు-పంచప్రాణములు-మనో బుద్దులు మొత్తము పదనేడగును. ఈ మొత్తమును నా సూక్ష్మ శరీర మనియు లింగ శరీరమనియు నందురు. అందలి ప్రకృతి రెండు విధములుగ నుండును. అందు సత్త్వాత్మకమైన ప్రకృతి మాయగ గుణమయమగు ప్రకృతియవిద్యగపేర్కొనబడును. 

తన్నాశ్రయించిన దానిని రక్షించునది మాయ యమబడును మాయమందలి పరమాత్మప్రతిబింబమనే యీశ్వరుడందురు. ఈ యీశ్వరుడు వ్యాపక బ్రహ్మము నెఱుగగలడు. ఈశ్వ రుడు సర్వజ్ఞుడు- సర్వకర్త- సర్వానుగ్రహకారకుడు. ఓ నగపతీ! ఇక ఆనిద్య యందును పరమాత్మ ప్రతిబింబించును. 

అట్టి ప్రతిబింబమును జీవుడని చైతన్యమని యందురు. ఈశ్వర జీవులను వీరిర్వురును విద్యవలన మూడేసి దేహములుండును. వీరిర్వురికిని తమతమ మూడు దేహము లందు నభీమానముండుట వలన వీరికి మూడేసి పేర్లు గలవు. జీవుడు కారణ దేహీభి మానియైనపుడు ప్రాజ్ఞుడనియు సూక్ష్మదేహాభిమానియైనపుడు తైజసుడనియు స్థూలదేహభిమానియైనపుడు విశ్వుడనియు నందురు. 

ఇదే విధముగ నీశ్వరుడను పై యాభిమానముల వరుసగ ఈశుడు-సూత్రాత్మ-విరాట్టు ననబరగును. నీరిర్వురిలో జీవుడు వ్యష్టి దేహాభిమాని. ఈశ్వరుడు సమష్ఠి దేహీభమీని. ఈ సర్వేశ్వరుడు కేవలము జీవులనను గ్రహించు కోర్కె గల్గి యుండును. అట్టి తన కోర్కె సాధించుట కీశ్వరుడు జీవుల కొఱకు పెక్కుభోగభాగ్యముల కాటపట్టగు విశ్వమును చిత్ర విచిత్రముగ తల ప్రభావముతో విరచించును. అతడీ సృష్టినంత యును నా శక్తి ప్రేరణచేత నాయుందన్న వాడై రచించుచుండును.

జగన్మాత - విరాద్రూప ప్రదర్శన

No comments:

Post a Comment

Jaganmata - Viradrupa performance - జగన్మాత - విరాద్రూప ప్రదర్శన

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాత - విరాద్రూప ప్రదర్శన శ్రీదేవి యిట్లనెను:  గిరీశ ! ఈ చరాచర జగమంతయును నా మాయాశక్తిచే నిండియున్నది. ఆద...