Wednesday, November 19, 2025

Sri Dhumavati Prardhana - శ్రీ ధూమావతి ప్రార్ధన

శ్రీ ధూమావతి ప్రార్ధన

వివర్ణా చంచలా దుష్టా దీర్ఘా చ మలినాంబరా
విముక్త కుంతలా రూక్షా విధవా విరళద్విజా ॥ 01
 ॥

కాకధ్వజ రథా రూఢా విలంబిత పయోధరా
శూర్పహస్తాతిరూక్షాక్షా ధూతహస్త వరాన్వితా ॥ 02
 ॥

ప్రవృద్ధ ఘోషణాతు భృశం కుటిలా కుటిలేక్షణా
క్షుత్పిపాసార్థితా నిత్యం భయదా కలహ ప్రియా ॥ 03
 ॥

Sri Dhumavati Hrudaya Sthotram - శ్రీ ధూమవతీ హృదయస్తోత్రం

శ్రీ ధూమవతీ హృదయస్తోత్రం

ఓం అస్య శ్రీ ధూమవతీ హృదయస్తోత్ర మహామంత్రస్య పిప్పలాద
ఋషిః, అనుష్టుప్ఛందః శ్రీ ధూమవతీ దేవతా - ధూం బీజం హ్రీం
శక్తిః క్లీం కీలకం సర్వశత్రుసంహారార్థే జపే వినియోగః -

కరాంగన్యాసః
ఓంధాం అంగుష్ఠాభ్యాం నమః
ఓం ధీం తర్జనీభ్యాం స్వాహా
ఓం ధూం మధ్యమాభ్యాం వషట్‌
ఓం ధైం అనామికాభ్యాం హుం
ఓం ధౌం కనిష్ఠకాభ్యాం వౌషట్‌
ఓం ధః అస్త్రాయఫట్‌

అంగన్యాసః
ఓం థాం హృదయాయ నమః
ఓం ధీం శిరసే స్వాహా
ఓం ధూం శిఖాయై వషట్‌
ఓం ధైం కవచాయ హుం
ఓం ధౌం నేత్రత్రయాయ వౌషట్‌
ఓం ధః అస్త్రాయఫట్‌

ధ్యానమ్‌
ఓం ధూమ్రాభాం ధూమ్రవస్త్రాం ప్రకటితదశానాం ముక్తవాలాంబ
రాఢ్యాం కాకాంకస్యందనస్థాం ధవళకరయుగాం శూర్పహస్తాతిరూక్షామ్‌,
కంకాంక్షు తాక్షంతదేహాం ముహురుతి కుటిలాం వారిదాభాం విచిత్రాం
ధ్యాయేద్ధూమా వతీం కుటిలితనయ నాం భీతిదాం భీషణాస్యామ్‌ ॥ 01 ॥

కల్పదౌ యా కాళికాద్యాచీకలన్మధుకైటభౌ
కల్పాంతే త్రిజగత్సర్వం భజే ధూమావతీమహమ్‌ ॥ 02 ॥

గుణాగారా గమ్యగుణా యా గుణాగుణవర్ధినీ
గీతావేదార్థతత్త్వజ్ఞైః భజే ధూమావతీమహమ్‌ ॥ 03 ॥

ఖట్వాంగధారిణీ ఖర్వఖండినీ ఖలరక్షసాం
ధారిణీ ఖేటకస్యాపి భజే ధూమావతీ మహమ్‌ ॥ 04 ॥

ఘూర్ణ ఘూర్ణకరాఘోరా ఘూర్ణితాక్షీ ఘనస్వనా
ఘాతినీ ఘాతకానాంయా భజే దూమావతీమహమ్‌ ॥ 05 ॥

చర్వంతీ మస్తిఖండానాం చండముండ విదారిణీం
చండాట్టహాసినీం దేవీం భజే ధూమావతీమహమ్‌ ॥ 06 ॥

ఛిన్నగ్రీవాం క్షతాంచ్చన్నాం ఛిన్నమస్త స్వరూపిణీం
ఛేదినీం దుష్టసంఘానాం భజే ధూమావతీమహమ్‌ ॥ 07 ॥

జాతాయా యాచితాదేవై రసురాణాం విధాతినీ
జల్పంతీ బహుగర్జంతీ భజేతాం ధూమరూపిణీమ్‌ ॥ 08 ॥

ఝంకార కారిణీ ఝంఝాం
 ఝంఝాంమాం మవాదినీం
ఝటిత్యాకర్షిణీందేవీం భజే ధూమవతీమహమ్‌ ॥ 09 ॥

హేతిపటంకారసంయుక్తాన్‌ ధనుష్టంకారకారిణీం
ఘోరాఘంఘటాటోపాం వందే ధూమవతీమహమ్‌ ॥ 10 ॥

ఠంఠంఠం మనుప్రీతిం ఠఃఠః మంత్రస్వరూపిణీం
ఠమకాహ్నగతిప్రీతాం భజే ధూమావతీమహమ్‌ ॥ 11 ॥

డమరూ డిండిమారావాం డాకినీగణమండితాం
డాకినీభోగసంతుష్టాం భజే ధూమావతీమహమ్‌ ॥ 12 ॥

ఢక్కానాదేన సంతుష్టాం డక్కావాదన సిద్ధిదాం
ఢక్కావాదచలచ్చిత్తాం భజే ధూమావతీమహమ్‌ ॥ 13 ॥

తత్వవార్తా ప్రియప్రాణాం భవపాయోధితారిణీం
తారస్వరూపిణీం తారాం భజే ధూమావతీమహమ్‌ ॥ 14 ॥

థాం థీం థూం థేమంత్రరూపాం థైంథోథంథః స్వరూపిణీం
థకారవర్ణసర్వస్వాం భజే ధూమావతీమహమ్‌ ॥ 15 ॥

దుర్గాస్వరూపిణీందేవీం దుష్టదానవదారిణీం
దేవదైత్యకృతధ్వంసాం వందే ధూమావతీమహమ్‌ ॥ 16 ॥

థ్వాంతా కారాంధకధ్వంసాం ముక్తద్ధమ్మిల్లధారిణీం
ధూమధారాప్రభాం ధీరాం భజే ధూమావతీమహమ్‌ ॥ 17 ॥

నర్తకీనటనప్రీతాం నాట్యకర్మ వివర్ధినీం
నారసింహీం నరారాధ్యాం నౌమి ధూమావతీమహమ్‌ ॥ 18 ॥

పార్వతీపతిసంపూజ్యాం పర్వతోపరి వాసినీం
పద్మారూపాం పద్మపూజ్యాం నౌమి ధూమావతీమహమ్‌ ॥ 19 ॥

ఫూత్కారసహితశ్వాసాం ఫట్‌ మంత్ర ఫలదాయినీం
ఫేత్కారిగణసంసేవ్యాం సేవే ధూమావతీమహమ్‌ ॥ 20 ॥

బలిపూజాం బలారాధ్యాం బగళారూపిణీం వరాం
బ్రహ్మాదివందితాం విద్యాం వందే ధూమావతీ మహమ్‌ ॥ 21 ॥

భవ్యరూపాం భవారాధ్యాం భువనేశ్వరీ స్వరూపిణీం
భక్తభవ్యప్రదాం దేవీం భజే ధూమావతీమహమ్‌ ॥ 22 ॥

మాయాం మధుమతీం మాన్వాం మకరధ్వజమానితాం
మత్స్యమాంసమహాస్వాదాం మన్యే ధూమావతీమహమ్‌ ॥ 23 ॥

యోగయజ్ఞప్రసన్నాస్యాం యోగినీపరిసేవితాం
యశోదాం యజ్ఞఫలదాం యజేధూమావతీమహమ్‌ ॥ 24 ॥

రామారాధ్యపదద్వంద్వాం రావణధ్వంసకారిణీం
రమేశరమణీపూజ్యామహం ధూమవతీంశ్రయే ॥ 25 ॥

లక్షలీలాకళాలక్ష్యాం లోకవంద్య పదాంబుజాం
లంబితాం బీజకోశాఢ్యాం వందే ధూమవతీమహమ్‌ ॥ 26 ॥

బకపూజ్య పదాంభోజాం బకధ్యానపరాయాణాం
బలాంబ కారిసంధ్యేయాం వందే ధూమావతీమహమ్‌ ॥ 27 ॥

శంకరీం శంకరప్రాణాం సంకటధ్వంసకారిణీం
శత్రుసంహారిణీం శుద్ధాం శ్రయే ధూమవతీమహమ్‌ ॥ 28 ॥

షడాననారిసంహంత్రీం షోడశీరూపధారిణీం
షడ్రసాస్వాదినీం సౌమ్యాం సేవే ధూమవతీమహమ్‌ ॥ 29 ॥

సురసేవిత పాదాబ్జాం సురసౌఖ్య ప్రదాయినీం
సుందరీ గణసంసేవ్యాం సేవే ధూమావతీమహమ్‌ ॥ 30 ॥

హేరంబజననీం యోగ్యాం హాస్యలాస్యవిహారిణీం
హరిణీం శత్రుసంఘానాం సేవే ధూమావతీమహమ్‌ ॥ 31 ॥

క్షీరోదతీరసంవాసాం క్షీరపాన ప్రహర్షితాం
క్షణదేశేజ్యపాదాబ్జాం సేవే ధూమావతీమహమ్‌ ॥ 32 ॥

చతుస్త్రింశద్వర్ణకానాం ప్రతివర్ణాదినామభిః
కృతం తు హృదయంస్తోత్రం ధూమావత్యాస్సుసిద్ధిదమ్‌ ॥ 33 ॥

య ఇదం పఠతిస్తోత్రం పవిత్రం పాపనాశనం
సప్రాష్నోతిపరాం సిద్ధం ధూమావత్యాః ప్రసాదతః ॥ 34 ॥

పఠన్నేకాగ్రచిత్తోయో యద్యదిచ్చతి మానవః
తత్సర్వం సమవాప్నోతి సత్యం సత్యం వదామ్యహమ్‌ ॥ 35 ॥

ఇతి శ్రీ ధూమావతీ హృదయం సోత్రం సంపూర్ణం 

Tuesday, November 18, 2025

Bharathiya Janatha Party - భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం

1980లో ఇందిరాగాంధీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చారు. అంతకుముందు జనతా ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్ ఫిబ్రవరి 28న ద్వంద్వ సభ్యత్వ అంశాన్ని వదులుకోనని, తుది నిర్ణయం తీసుకునే వరకు అలా కొనసాగుతానని ప్రకటించారు.

ద్వంద్వ సభ్యత్వం అంటే జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ రెండింటిలోనూ ఒకేసారి సభ్యుడిగా ఉండటం. చాలామంది సీనియర్ నాయకులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసంఘ్ సహా పలు పార్టీలు కలిస్తే ఏర్పడినదే ఈ జనతా పార్టీ.

అయితే, జనసంఘ్ సభ్యులు ఆర్ఎస్ఎస్‌ను విడిచిపెట్టకపోతే, వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని జనతా పార్టీ వర్కింగ్ కమిటీ 1980 ఏప్రిల్ 4న నిర్ణయించింది. దీనిని జనసంఘ్ సభ్యులు ముందే ఊహించారు.

ఈ ఘటన గురించి కిన్షుక్ నాగ్ 'ది సాఫ్రాన్ టైడ్: ది రైజ్ ఆఫ్ ది బీజేపీ' పుస్తకంలో రాశారు.

"1980 ఏప్రిల్ 5, 6 తేదీలలో జనతా పార్టీలోని జనసంఘ్ విభాగం దిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. దాదాపు 3,000 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడే భారతీయ జనతా పార్టీ ఏర్పాటును ప్రకటించారు" అని పుస్తకంలో తెలిపారు.

అటల్ బిహారీ వాజ్‌పేయిని పార్టీకి అధ్యక్షుడిగా నియమించగా, ఎల్.కె. అద్వానీ, సూరజ్ భాన్, సికందర్ బఖ్త్‌లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

1980 ఎన్నికలలో జనతా పార్టీ 31 సీట్లను గెలుచుకోగా, అందులో 16 సీట్లు జనసంఘ్ నుంచే వచ్చాయి. అయితే, ఈ గెలిచిన 16 మంది సభ్యులు 14 మంది రాజ్యసభ సభ్యులు, ఐదుగురు మాజీ క్యాబినెట్ మంత్రులు, ఎనిమిది మంది మాజీ రాష్ట్ర మంత్రులు, ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు కొత్త పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, వారందరూ తామే నిజమైన జనతా పార్టీ అని చెప్పుకున్నారు.

ఎన్నికల గుర్తుగా కమలం
జనతా పార్టీలో చోటుచేసుకున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ ఎన్నికల చిహ్నమైన 'హల్ధార్ కిసాన్'ను ఎన్నికల సంఘం తాత్కాలికంగా(ఫ్రీజ్) స్తంభింపజేసింది.

కొత్తగా ఏర్పాటైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి జాతీయ పార్టీ హోదాను మంజూరు చేసింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం బీజేపీకి కమలం గుర్తును కేటాయించింది.

అంతకుముందు చక్రం, ఏనుగు వంటి ఎన్నికల చిహ్నాలను కేటాయించాలని బీజేపీ కోరింది, కానీ ఎన్నికల సంఘం అంగీకరించలేదు.

జనతాపార్టీ చిహ్నం హల్ధార్ కిసాన్ ఫ్రీజ్ నిర్ణయాన్ని సమీక్షించాలని మాజీ ప్రధాని, జనతా పార్టీ నేత చంద్రశేఖర్ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు.

ఆరు నెలల తర్వాత హల్ధార్ కిసాన్ చిహ్నంపై ఆంక్షలను ఎత్తివేసింది కమిషన్.

బయటి నేతలకు ప్రాధాన్యం
అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌ వెలుపలి నాయకులను బీజేపీ విస్మరించలేదు. నళిన్ మెహతా పుస్తకం 'ది న్యూ బీజేపీ' ప్రకారం..

శాంతిభూషణ్ (కేంద్ర మాజీ మంత్రి), ప్రఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలానీ, కె.ఎస్.హెగ్డే (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి), సికందర్ బఖ్త్‌ (కాంగ్రెస్ మాజీ నాయకుడు)ను స్వాగతించింది. అంతేకాదు, పార్టీ రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీలోని ముగ్గురు సభ్యులలో ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ వెలుపలివారే.

దేశ విభజన తర్వాత సింధ్ నుంచి శరణార్థిగా భారత్‌కు వచ్చారు రామ్ జెఠ్మలానీ. సికందర్ బఖ్త్ దిల్లీకి చెందిన ముస్లిం.

పార్టీ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును సికందర్ ప్రతిపాదించగా, దీనికి రాజస్థాన్‌కు చెందిన భైరాన్ సింగ్ షెకావత్ మద్దతు ఇచ్చారు.

గాంధీ సోషలిజం
బీజేపీ సైద్ధాంతికంగా గాంధీ సోషలిజం ను స్వీకరించింది, కానీ ప్రారంభంలో పార్టీలోని కొన్ని వర్గాల నుంచి మద్దతు లభించలేదు.

'ది సాఫ్రాన్ టైడ్: ది రైజ్ ఆఫ్ ది బీజేపీ' పుస్తకం ప్రకారం..

విజయరాజే సింధియా నాయకత్వంలో చాలామంది బీజేపీ నాయకులు 'సోషలిజం' అనే పదం ఉపయోగించడాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే దీనికి కమ్యూనిస్టుల ముద్ర ఉండటమే.

ఇక 'గాంధీ సోషలిజం'ను స్వీకరించడం వల్ల పార్టీ కాంగ్రెస్‌కు కాపీలా కనిపిస్తుందని, వాస్తవికతను దెబ్బతీస్తుందని కొందరు నాయకులు భావించారు.

ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ బాలా సాహెబ్ దేవరస్ 'గాంధీ సోషలిజం'ను స్వీకరించడానికి అనుకూలంగా లేరనీ అనుకున్నారు, కానీ ఆయన కూడా అంగీకరించారు.

కిన్షుక్ నాగ్ పుస్తకం ప్రకారం..
హిందువులు కాని వారిని పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ సంతోషంగా లేదు. అయినప్పటికీ, జనసంఘ్ పాత సిద్ధాంతాలను వదిలేసి కొత్తగా ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించుకుంది. బహుశా అందుకే జయప్రకాశ్ నారాయణ్‌తో పాటు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలను పార్టీ వేదికపై పెట్టారు.

ముంబయిలో బీజేపీ జాతీయ సమావేశం
1980 డిసెంబర్ చివరి వారంలో ముంబయిలో శివాజీ పార్క్‌లో పార్టీ బహిరంగ సభ జరిగింది, వేలమంది పార్టీ కార్యకర్తలు అందులో పాల్గొన్నారు.

లాల్ కృష్ణ అద్వానీ తన ఆత్మకథ 'మై కంట్రీ, మై లైఫ్‌'లో అప్పటికి 25 లక్షల మంది బీజేపీలో సభ్యులుగా చేరారని, జనసంఘ్ ప్రభావం ఎక్కువున్న సమయంలో 16 లక్షల మంది వరకే ఉన్నారని తెలిపారు.

1981 జనవరి 31న ఇండియా టుడేలో సుమిత్ మిత్రా 'బీజేపీ కన్వెన్షన్, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్' శీర్షికతో రాసిన కథనం ప్రకారం.. 54,632 మంది ప్రతినిధులలో 73 శాతం మంది ఐదు రాష్ట్రాల (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్) నుంచి వచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ బాలా సాహెబ్ దేవరస్ సోదరుడు భావురావు దేవరస్ కూడా సభకు హాజరయ్యారు.

జయప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతమైన 'గాంధీ సోషలిజం'ను అంగీకరించడం తనకు కష్టమని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు శేషాద్రి చారి అన్నారు.

ఒక ఇంటర్వ్యూలో ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ.. "చాలామంది బీజేపీ సభ్యులు గాంధీ సోషలిజం, పార్టీ కొత్త జెండాతో ఏకీభవించలేదు. ఆ సమయంలో నేను స్వయం సేవకుడిని కాబట్టి నాకు ఇది తెలుసు. ఈ భిన్నాభిప్రాయం విస్తృతంగా ఉంది కానీ, దానిని బహిరంగంగా ప్రకటించలేదు" అని అన్నారు.

విజయ రాజే సింధియా వ్యతిరేకత
అప్పటి బీజేపీ సీనియర్ నాయకురాలు విజయ రాజే సింధియా పార్టీ కొత్త సిద్ధాంతాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. గాంధీ సోషలిజం నినాదం సాధారణ బీజేపీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తోందంటూ పార్టీ ప్రతినిధులకు ఐదు పేజీల లేఖ రాశారు. బీజేపీని ఈ నినాదం కాంగ్రెస్ ఫోటోకాపీగా మార్చుతుందని, పార్టీ వాస్తవికతను నాశనం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

విజయరాజే రాసిన రాయల్ టు పబ్లిక్ లైఫ్‌ ప్రకారం.. ‘‘నేను ఈ నినాదాన్ని వ్యతిరేకించాను, ముంబయి సమావేశంలో ఆ నినాదాన్ని పార్టీ మార్గదర్శక సూత్రంగా అంగీకరించారు. జనతా పార్టీ నుంచి బయటకు వెళితే 'గాంధీ సోషలిజం'పై ఆధారపడవలసిన అవసరం లేదని అప్పట్లో చాలామంది పార్టీ నాయకులు భావించారు.’’

క్రిస్టోఫర్ జాఫర్లెట్ తన పుస్తకం 'ది హిందూ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ అండ్ ఇండియన్ పాలిటిక్స్‌' ప్రకారం..

‘‘చివరికి, ఒక మధ్యే మార్గం కనుగొన్నారు. విజయరాజే తన వాదనను ఉపసంహరించుకునేలా ఒప్పించారు. మార్క్స్ సోషలిజానికి బీజేపీ సోషలిజం పూర్తిగా వ్యతిరేకమని పార్టీ సీనియర్ నాయకులు స్పష్టంచేశారని ఆమె ఒక విలేఖరుల సమావేశంలో తెలిపారు. బీజేపీ సోషలిజం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ సమగ్ర మానవతావాదం, సంక్షేమవాదం భావనలపై ఆధారపడి ఉందని చెప్పారు.’’

ఈ మొత్తం చర్చలో వాజ్‌పేయి జోక్యం చేసుకుని, 'గాంధీ సోషలిజం' సిద్ధాంతం నుంచి పార్టీ వెనక్కి తగ్గబోదని స్పష్టంచేశారు.

సానుకూల లౌకికవాదం
డిసెంబర్ 30న రాత్రి వాజ్‌పేయి తన ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్ సమానత్వ సూత్రాన్ని బీజేపీ స్వీకరిస్తుందని ప్రకటించారు. అంతేకాదు, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజు అవలంభించిన 'సానుకూల లౌకికవాదం' విధానం పార్టీలో ఉంటుందన్నారు.

శివాజీ ఆగ్రాలో బందీగా ఉన్న సమయంలో ఆయన సేవకుడు ముస్లిం అని వాజ్‌పేయి చెప్పారు. 1661లో ముస్లిం సాధువు యాకుత్ బాబా ఆశీర్వాదంతో శివాజీ తన కొంకణ్ స్వాధీన ప్రయత్నాలను ప్రారంభించారని వాజ్‌పేయి అన్నారు.

"జనతా పార్టీ విడిపోయి ఉండవచ్చు, కానీ జయప్రకాశ్ నారాయణ్ కలలను మేం ఎప్పటికీ చెదిరిపోనివ్వం" అని వాజ్‌పేయి అన్నారు.

'గాంధీ సోషలిజం' గురించి పార్టీలో సైద్ధాంతిక చీలికను సూచిస్తున్న వార్తాపత్రిక రిపోర్టులను ఆయన తోసిపుచ్చారు.

వాజ్‌పేయి తన ప్రసంగంలో "ఈ పశ్చిమ కనుమల ఒడ్డున నిలబడి చెబుతున్నదేంటంటే.. చీకటి తొలగిపోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుందని నమ్మకంగా చెప్పగలను" అన్నారు.

బీజేపీకి మొహమ్మద్ కరీం మద్దతు
సభకు ముఖ్య అతిథిగా మొహమ్మద్ కరీం చాగ్లా పాల్గొన్నారు. ఆయన నెహ్రూ, ఇందిరా మంత్రివర్గంలో పనిచేశారు.

విభజనకు ముందు చాగ్లా మొహమ్మద్ అలీ జిన్నాకు సహాయకుడిగా కూడా పనిచేశారు. చాగ్లాను అటల్ బిహారీ వాజ్‌పేయి స్వాగతించారు, ఆయన లౌకికవాదానికి చిహ్నం అని అన్నారు. వాజ్‌పేయి భవిష్యత్ ప్రధానమంత్రి అని చాగ్లా అభిప్రాయపడ్డారు.

మొహమ్మద్ కరీం తన ఆత్మకథ 'రోజెస్‌ ఇన్ డిసెంబర్' లో.. "ఆ సమయంలో రాజకీయాలు, చట్టం రెండింటిలోనూ జిన్నా నాకు ఆదర్శంగా నిలిచారు. ఆయన జాతీయవాదిగా ఉన్నంత కాలం నేను మద్దతు ఇచ్చాను. కానీ ఆయన మతతత్వంలోకి మారి రెండు దేశాల సిద్ధాంతాన్ని సమర్థించడంతో మా మార్గాలు వేరయ్యాయి" అని తెలిపారు.

సమావేశానికి జిన్నా మనవడి నిధులు
మొత్తం కార్యక్రమానికి రూ. 20 లక్షలు ఖర్చయ్యాయి, ఆ సమయంలో ఇది పెద్ద మొత్తం.

వినయ్ సీతాపతి పుస్తకం 'జుగల్‌బందీ: ది బీజేపీ బిఫోర్ మోదీ' ప్రకారం..
‘‘ఈ సమావేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త నుస్లీ వాడియా ఎక్కువ నిధులు అందించారని ఆ కార్యక్రమానికి హాజరైన ఒక సీనియర్ బీజేపీ నాయకుడు చెప్పారు. 1970ల చివరి నాటికి జిన్నా మనవడైన నుస్లీ వాడియా బీజేపీకి అతిపెద్ద ఆర్థిక మద్దతుదారులలో ఒకరిగా మారారు.’’

పార్టీ తొలి సమావేశం జరిగిన 16 సంవత్సరాల తర్వాత అంటే 1996లో బీజేపీకి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మొదటిసారి ఆహ్వానం అందింది. కానీ ఆ పార్టీ పార్లమెంటులో తన మెజారిటీని నిరూపించుకోలేకపోయింది. అటల్ బిహారీ వాజ్‌పేయి 13 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది.

కానీ అది తరువాతి రెండు ఎన్నికలలో గెలిచింది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం 1998లో ప్రమాణ స్వీకారం చేసింది.

Sri Dhumavati Laghu Kavacham - శ్రీ ధూమావతీ లఘు కవచం

శ్రీ ధూమావతీ లఘు కవచం

ముఖం ధూమవతీపాతు ధూంధూం స్వాహాస్వరూపిణీ
లలాటం విజయాపాతు మాలినీ నిత్యసుందరీ
కల్యాణీ హృదయం పాతు హసరీ నాభిదేశకం
సర్వాంగం పాతుదేవేశీ నిష్కలా భగమాలినీ
సుపుణ్యం కవచం దివ్యం యఃపఠేద్భక్తి సంయుతః
సౌభాగ్య మతులం ప్రాప్యచాంతే దేవీ పురం వ్రజేత్‌

Sri Dhumavathi Kavacham - 1 - శ్రీ ధూమావతి కవచం - 1

శ్రీ ధూమావతి కవచం - 1

శ్రీ పార్వత్యువాచ :
ధూమావత్యర్చనం శంభో శ్రుతం విస్తరతో మయా
కవచం శ్రోతుమిచ్ఛామి తస్యా దేవ వదస్వ మే
 ॥ 01 ॥

శ్రీ బైరవ ఉవాచ:
శృణు దేవి పరం గుహ్యం న ప్రకాశ్యం కలౌయుగే
ధూమావత్యాస్తు కవచం శత్రువిగ్రహకారకమ్‌
 ॥ 02 ॥

బ్రహ్మాద్యా దేవి సతతం యద్వశాదరిఘాతినః
దేవా భవంతి శత్రుఘ్నా యస్యాధ్యాన ప్రభావతః
 ॥ 03 ॥

ఓం అస్యశ్రీ ధూమవతీకవచస్య పిప్పలాద ఋషిః అనుష్టుప్‌ చ్ఛందః
శ్రీ ధూమవతీ దేవతా ధూం భీజం స్వాహా శక్తిః ధూమవతీ కీలకం,
శత్రుహననే జపే వినియోగః

ఓం ధూం బీజం మే శిరఃపాతు లలాటం సదావతు
ధూమ నేత్రయుగం పాతు వతీ క
ర్ణౌ సదావతు ॥ 04 ॥

దీర్ఘాతూదరమధ్యే తు నాభిం మే మలినాంబరా
శూర్పహస్తా పాతు గుహ్యం రూక్షా రక్షతు జానునీ
 ॥ 05 ॥

ముఖం మే పాతు భీమాఖ్యా స్వాహా రక్షతు నాసికాం
సర్వవిద్యావతాత్కంఠం వివర్ణా బాహుయుగ్మకమ్‌
 ॥ 06 ॥

చంచలా హృదయం పాతు దుష్టా పార్శ్వం సదావతు
ధూమహస్తా సదా పాతు పాదౌ పాతు భయాపహా
 ॥ 07 ॥

ప్రవృద్ధరోమా పాతు భృశం కుటిలా కుటిలేక్షణా
క్షుత్పిపాసార్దితా దేవీ భయదా కలహప్రియా
 ॥ 08 ॥

సర్వాంగం పాతు మే దేవీ సర్వశత్రు వినాశినీ
ఇత్యే తత్కవచం పుణ్యం కథితం భువి దుర్లభమ్‌
 ॥ 09 ॥

న ప్రకాశ్యం న ప్రకాశ్యం న ప్రకాశ్యం కలౌయుగే
పఠనీయం మహాదేవి త్రిసంధ్యం థ్యానతత్పరైః
 ॥ 10 ॥

దుష్టాభిచారో దేవేశి తద్గాత్రం నైవ సంస్పృశేత్‌

॥ ఇతి భైరవీ భైరవ సంవాదే శ్రీ ధూమావతీ కవచమ్‌ సంపూర్ణం 

Sri Dhumavati Dyanam - శ్రీ ధూమావతీ ధ్యానం

శ్రీ ధూమావతీ ధ్యానం 

వివర్ణా చంచలా దుష్టా దీర్ఘా చ మలినాంబరా ।
విముక్తకుంతలా రూక్షా విధవా విరలద్విజా ॥ 01 ॥

కాకధ్వజరథారూఢా విలంబితపయోధరా ।
శూర్పహస్తాతిరూక్షాక్షా ధూతహస్తా వరాన్వితా ॥ 02 ॥

ప్రవృద్ధఘోణా తు భృశం కుటిలా కుటిలేక్షణా ।
క్షుత్పిపాసార్ధి తా ధ్యేయా భయదా కలహస్పదా ॥ 03 ॥

అత్యుచ్చా మలినాంబరాఖిలజనోద్వేగావహా దుర్మనా
రూక్షాక్షిత్రితయా విశాలదశనా సూర్యోదరీ చంచలా ।

ప్రస్వేదాంబుచితా క్షుధాకులతనుః కృష్ణాతిరూక్షప్రభా
ధ్యేయా ముక్తకచా సదాప్రియకలిర్ధూమావతీ మంత్రిణా॥ 04 ॥

ఇతి శ్రీధూమావతీ ధ్యానం

Sri Dhumavati Sthotram 2 - శ్రీ ధూమావతి స్తోత్రం-2

 శ్రీ ధూమావతి స్తోత్రం-2

ప్రాతర్యాస్యాత్కుమారీ కుసుమకలికయా జాపమాలాం జపంతీ
మధ్యాహ్నే ప్రౌఢరూపా వికసితవదనా చారునేత్రా నిశాయాం,
సంధ్యాయాం వృద్ధరూపా గలితకుచయుగా ముండమాలాం
వహంతీ సా దేవీ దేవదేవీ త్రిభువన జననీ కాళికా పాతు యుష్మాన్‌ ॥ 01 ॥

బధ్వా ఖట్వాంగకోటౌ కపిలవరజటామండలం పద్మయోనేః
కృత్వాదైత్యో త్తమాంగే స్రజమురసి శిరశ్శేఖరం తారక్ష్యపక్షైః
పూర్ణం రక్తై స్సురాణాం యమమహిషమహాశృంగ మాదాయ పాణౌ
పాయాద్వో వంద్యమాన ప్రలయ ముది తయా భైరవః కాళరాత్య్రామ్‌ ॥ 02 ॥

చర్వంతీ మస్తిఖండం ప్రకటకటకటా శబ్దసంఘాత ముగ్రం
కుర్వాణా ప్రేతమధ్యే కహకహ కహకహా హాస్యముగ్రం కృశాంగీ
నిత్యం నిత్య ప్రసక్తా డమరు డిమడిమాన్‌ స్ఫారయంతీ ముఖాబ్జం
పాయాన్నశ్చండికేయం ఝఝమఝమా  జల్పమానా భ్రమంతీ ॥ 03 ॥

టం టం టం టం టంటాప్రకర టమటమానాటఘంటాం వహం తీ
స్ఫేం స్ఫేం స్ఫేం స్ఫార కారాటకటకితహసా నాదసంఘట్టభీమా,
లోలం ముండాగ్రమాలా లల హలహలహా లోలలోలాగ్ర వాచం
చర్వంతీ చండముండం మటమటముటితే చర్వయంతీ పునాతు ॥ 04 ॥

వామేకర్ణే మృగాక ప్రళయపరిగతం దక్షిణే సూర్యబింబం
కంఠే నక్షత్ర హారం వరవికటజటాజూటకేముండమాలాం
స్కంధే కృత్వోరగేంద్రం ధ్వజనికరయుతం బ్రహ్మకంకాలభారం
సంహారే ధారయంతీ మమ హరతు భయం భద్రదా భద్రకాళీ ॥ 05 ॥

తైలాభ్య క్తైక వేణీత్రపుమయవిలసత్కర్ణికా క్రాంతకర్ణా
లోహేనై కేన కృత్వా చరణనళినకా మాత్మనః పాదశోభాం
దిగ్వాసార సభేన గ్రసతి జగదిదం యా యవాకర్ణపూరా
వర్షిణ్యాతి ప్రబద్దా ధ్వజవితతభుజా సాసి దేవి త్వమేవ॥ 06 ॥

సంగ్రామే హేతికృత్యై స్సరుధిరదశనై ర్యద్భటానాం శిరోభిః
మాలామాబద్ధ్వమూర్థ్ని ధ్వజవితతభుజా త్వంశ్మశానే ప్రవిష్టా
దృష్టా భూత ప్రభూతైః పృథుతర జఘనా బద్ధనాగేంద్రకాంచీ
శూలాగ్రవ్యగ్రహస్తా మధురుధిరవసా తామ్రనేత్రా నిశాయామ్‌ ॥ 07 ॥

దంష్ట్రారౌద్రే ముఖేస్మిం స్తవ విశతి జగద్దేవి సర్వం క్షణార్థాత్‌
సంసారస్యాంతకాలే నరరుధిర వసాసంప్లవే భూతధూమే
కాళి కాపాలికీ సా శవశయనరతా యోగినీ యోగముద్రా
రక్తారూక్షా సభాస్థా మరణభయహర త్వం శివా చండఘంటా ॥ 08 ॥

ధూమావత్యష్టకం పుణ్యం సర్వాపద్వినివారణం
యః పఠేత్సాధకో భక్త్యా సిద్దిం విందతి వాంఛితామ్‌ ॥ 09 ॥

మహాపది మహాఘోరే మహారోగే మహారణే
శత్రూచ్చాటే మారాణాదౌ జంతూనాం మోహనేతథా ॥ 10 ॥

పఠేత్‌ స్తోత్రమిదం దేవి సర్వతః సిద్ధిభాగ్భవేత్‌
దేవదానవగంధర్వ యక్షరాక్షసపన్నగాః ॥ 11 ॥

సింహవ్యాఘ్రాదికాస్సర్వే స్తోత్రస్మరణమాత్రతః
దూరాద్దూరతరం యాంతికింపునర్మానుషాదయః ॥ 12 ॥

స్తోత్రేణానేన దేవేశి కిన్న సిధ్యతి భూతలే
సర్వ శాంతిర్భవేద్దేవి అంతే నిర్వాణతాం వజ్రేత్‌ ॥ 13 ॥

ఇత్యూర్వ్వామ్నాయే శ్రీ ధూమవతీ స్తోత్రమ్‌ సమాప్తం 

Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...