Tuesday, July 14, 2026

Maila and Suthakam - మైల మరియు సూతకం

మైల మరియు సూతకం

ఎప్పుడు ఎలా...........!!మైల, సూతకం అనే విషయాలు ధర్మసింధు అనే గ్రంథంలో వివరించబడ్డాయి. 

తాశౌచ(పురుడు) మ్రుతాశౌచ(మైల) కాలాలో అందరూ, రజోదర్శన కాలంలో(ముట్టు) స్త్రీలు అస్ప్రుశ్యులుగా భావించబడతారు. 

సూతకం రెండురకాలు. జాతాశౌచం, మృతాశౌచం. షోడశ సంస్కారాల్లో ఒకటి అశౌచం. చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు. 

సూతకం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? ఎవరి ఇంట్లో శిశువు జన్మించింది? ఎవరి ఇంట్లో మరణం సంభవించింది? ఆయా ఇళ్ళల్లో నివసించే వారందరికీ మాత్రమే వర్తిస్తుంది. జాతికి, వంశానికి, గోత్రానికి సంబంధం లేదు. 

వారితో కలిసి కాక దూరంగా ఉండేవారికి వర్తించదు. కొత్తగా పెళ్లయిన అమ్మాయికి మేనమామ చనిపోతే మూడు రోజుల పాటు మైల ఉంటుంది. అయితే, అమ్మాయి భర్తకు ఉండదు. ఇది 12 రోజుల లోపు తెలిస్తే ఒక రోజు మైల ఉండును. 

మన తెలుగు సంప్రదాయం ప్రకారం బ్రహ్మణ, క్షత్రియ, వైశులకు, మాత్రం తప్పనిసరిగా సంవత్సరికం వరకు గృహప్రవేశాదులు, దైవరాధానులు కూడా నిషిద్ధం. సంవత్సర సూతకం దాటిన తరువాతే వీటిని నిర్వహించే అధికారం ఉంది. 

ద్వెజీతరాలకు ఈ విషయాలలో కొంత సడలింపు ఉంది. చనిపోయినా పెద్దలకు పితృపక్షంలో సంవత్సరికం చేసే ఆచారం ఉంటే గృహప్రవేశం చేసుకోవచ్చు. అలా పెద్దలో కలపకపోతే గృహ ప్రవేశం సంవత్సరికం దాటిన తరువాతే చేయడం శ్రేయస్కరం. 

తప్పనిసరి పరిస్థితి కలిగితే ఆడబిడ్డలు ఎవరైన ఉంటే ఆ దంపతులు మీ వంశికులేవ్వరు కనుక వారి చేత గృహప్రవేశం చేయించి, మీ ఇంటిలో సంవత్సర కార్యం తరువాత అ నూతన గృహంలో మీరు నివసించవచ్చు. 

ఆ సందర్భంలో కూడా గణపతి, నవగ్రహ, వాస్తు హోమాలు నిర్వహించుకొని, మీ ఇష్టదైవ వ్రతం చేసుకుంటే జీవితం సుఖప్రదంగా ఉంటుంది. 

సనాతన ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు. వాటిలో ఈ విషయాలన్నీ నిర్ణయించారు. పురుడుని జాతాశౌచం అంటారు. జాత అశౌచాన్ని దేవాలయ అర్చకులు తప్ప మిగతావారు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది పురుడు కలిపేసుకుంటే శుభమని అసలు అశౌచాన్నే పాటించరు. కాని గృహంలో జరుపుకునే ఆరాధనలు ఆ సమయంలో పదోరోజు వరకు పనికిరావు. 

తల్లిదండ్రులు మరణిస్తే మృత అశౌచం తీరిపోయాక ఇంట్లో పూజలు మామూలుగానే చేసుకోవాలి. కొందరు ఏడాది దాకా దీపం కూడా పెట్టరాదంటారు. అది తప్పు. దీపారాధన మైల సమయంలో తప్ప ఎప్పుడూ ఆపకూడదు. 

మామూలుగా ఆలయాలలో దైవదర్శనం దోషం కాదు. అయితే ఉత్సవాలు నిర్వహించడం పనికిరాదు. ఒక వ్యక్తి తన తండ్రితో కలిపి మూడు తరాల వరకు పితృకార్యాలు చేయాలి తాను ఉన్నంతవరకు చేస్తాడు. ఆ తర్వాత మొదటి తరం పోయి ఇతనితో కలిపి మూడుతరాలకు అతని కొడుకు చేస్తాడు. 

వివాహం, గృహప్రవేశం ఇతర శుభకార్యాల తరవాత ఆరు నెలల తరవాత అదే గృహంలో పితృకార్యాలు చేయవచ్చు. అలాగే కర్మకాండలు జరిగిన గృహంలో వివాహాలు జరగవచ్చు.

చనిపోయినవారి కొడుకులకు సంవత్సరం వరకు వివాహం చేయరు. కూతుళ్లకు మాత్రం చనిపోయినవారికి కన్యదాన ఫలం దక్కేందుకు గాను అదే సంవత్సరం వీలైతే వివాహం చేస్తారు.

బ్రహ్మచారులకు మైల కాలం తీరిపోయాక ఇక ఏ అశౌచం ఉండదు. అశౌచ సమయాలలో ఏ పారాయణం అయినా బయటకు వినపడకుండా మనసులో చదువుకోవచ్చు. కొత్తవి చదవాల్సిన అవసరం లేదు. భగవన్నామస్మరణ అన్నివేళలా శ్రేయోదాయకమైనదే.

Meaning of the mantra - మంత్రం అర్దం

మంత్రం అర్దం

ఒక మంత్రం అర్దం తెలియకుండా, ఏదో దేవతలు ప్రసన్నం అయి వరం ఇస్తారనే భావనతో జపించడం కంటే అర్థం తెలిసి జపించడం వలన ఆ మంత్రం తాద్యాత్మికత మన అనుభవంలోకి వస్తుంది. యోగులు, ఋషులు, తపస్వులు విశ్వశక్తిని కాశ్మిక్ ఎనర్జీని ధ్యానింఛండి అంటే ఈ మంత్రం అర్దం అదే!!

రామ లక్ష్మణ భరత శతృఘ్నులు నలుగురు వశిష్ఠుడు దగ్గర విద్యాభ్యాసం చేసారు.

ఒకనాడు వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని వున్నారు. గురువు వశిష్ఠుడు వారందరి చిరు మందహాస ప్రశాంత వదనాలు చూసి - నాయన లక్ష్మణ చాలా ప్రశాంతంగా వున్నావు. అని అడుగగా, 

అవును గురువుగారు నాకు ఈ సమయం నా తల్లి చూడాలని వుంది. నా తల్లి సాన్నిహిత్యం, వారి ప్రేమ పొందాలని వుంది! అని తెలుపగా,

పక్కనున్న మరో స్నేహితుడు 'తల్లి ఇక్కడికి రాలేదు.చూడలేము కాని పాముని చూడలనుకో అదైతే ఇక్కడే వుంది. కొట్టి తీసుకురాగలను' అన్నాడు. దగ్గరున్న పాముని కొట్టి అయినా తీసుకొని రాగలము, కానీ తల్లి సాన్నిహిత్యం ప్రేమ పొందాలంటే మాత్రం వీలుకాదు. అని ఆ స్నేహితుడు అనగానే!! 

అప్పుడు వశిష్ఠుడు. "అంతే నంటవా రామ! నీవు చెప్పు దీనికి సమాధానం'. దానికి రాముడు "గురువు గారు మా తల్లి యెుక్క ప్రేమ సాన్నిహిత్యం మేము పొందగలం, ఇక్కడనుండే? అదెలా? అది ధ్యానం ద్వారా!

అదెలా చెప్పు రామా!

నిరంతరం మనస్సులో మా తల్లి భావన ద్వారా, ధ్యానం చేయడం ద్వారా!

వశిష్ఠుడు చాలా సంతోషించాడు రాముని జవాబు తో 'నీవు సరిగ్గా చెప్పావు నాయనా!
ఏ వస్తువు నైతే నిరంతరం ధ్యానిస్తామో, అంటే ఏ వస్తువు యెుక్క భావన మనస్సులో కొనసాగుతూ వుంటుందో వాటి గుణ ధర్మాలు ధ్యానం చేసే వారిలోకి ప్రవేశిస్తాయి.తల్లిని ధ్యానిస్తే తల్లి యెుక్క ప్రేమ సాన్నిధ్యం, మమత పొందుతావు. పాముని ధ్యానిస్తూ వుంఠే పాము యెుక్క ప్రవృత్తి, దాని భయం మనకు ప్రవేశిస్తుంది.

మనమందరం తేజోవంతులం కావలంటే పరమ ప్రకాశవంతమైన పరమాత్మ స్వరూపమైన సూర్యుని ధ్యానిస్తాము!

ఇప్పుడు నాకు ఒక సందేహం అని గుహుడు అడిగాడు.

పరమ తేజోవంతులైన వారంటే రాక్షసుల్లో రావాణాసురుడుు భాణసురుడు వున్నారు. వారిని ధ్యానిస్తే?

వారు తేజోవంతులైన వారైనప్పటికి వారిలో ధర్మనిరతి లేనందున వారిని మనం ద్యానిస్తే అపకీర్తి పాలు అవుతాము!

మెదటి విషయం ఏమిటంటే మనము సూర్యుని తేజస్సును ధ్యానిస్తున్నాము. అసురినిదో దైత్యునిదో కాదు!

రెండో విషయం శ్రేష్ఠమైన తేజస్సు ను ధ్యానిస్తున్నాము!

గురుదేవా! అలాంటి శ్రేష్ఠమైన తేజస్సును, పరమ చైతన్య తత్వాన్ని అనుభూతీ చెందిన వారు ఎవరైనా వున్నారా? అని అడిగాడు రాముడు! 'అవును అలాంటి దివ్వ తేజస్సు ను అనుభూతి చెందిన వారు ఒకరున్నారున్నారు. ఆ భావాన్ని ఒక మంత్రం గా చేసి ఆవిష్కరించారు! ఆ మంత్రానికి గాయిత్రి అనే చందస్సును చేర్చి లోకానికి ఆ మంత్రరాజాన్ని అందించిన వారు "బ్రహ్మర్షి విశ్వామిత్రుడు"

ఆ మంత్రం చంధస్సు గాయిత్రి కనుక ఆ మంత్రానికి గాయిత్రి మంత్రమని పేరు!

సకలదేవతల దివ్య తేజస్సును కీర్తిని దేవతాశక్తులను ఉపాసన గావిస్తుంది.

ఓం అని ప్రణవాన్ని ఉచ్చరించి, మెదట ఆ పరమ చైతన్యాన్ని స్మరిస్తాము.

భూర్భవః స్వః కనిపించే భూమి ఆకాశం అంతరిక్షం( ఇక్కడ అంతరిక్షం అంటే సకల బ్రహ్మాండాలు స్వర్గం అని అర్థం)

తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి

ఇక్కడ సవితు అంటే సూర్యుని తేజస్సుని ప్రకాశాన్ని ధీ అంటే ధ్యానిస్తున్నాము!

ధియోయోనః ప్రచోదయాత్! వారి తేజస్సు మా బుద్దులను ప్రచోదనం లేదా ప్రేరేపించును గాక! స్పందన కలుగ చేయను గాక!

ఈ పూర్తి మంత్రాన్ని ఒకసారీ నీ ముఖతః చెప్పు రామా అని వశిష్ఠుడు అనగానే

"ప్రణవ స్వరూప మైన బ్రహ్మ కి నమస్కారం! భూమి, ఆకాశం, అంతరిక్షం నందువ్యాపించిన ఆ సూర్యుని దివ్య కిరణాల తేజస్సును మేము ధ్యానిస్తున్నాము! ఆ తేజస్సు మా బుద్దులను ప్రేరించును గాక, స్పందన కలిగించును గాక!

బాగా చెప్పావు రామా! గాయిత్రి మంత్ర అర్దాన్ని! అని వశిష్ట మహర్షి ఎంతో సంతోషించాడు.

64 Yoginis - 64 యోగినీలు

64 యోగినీలు

తాంత్రిక సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన దైవిక స్త్రీ శక్తులు దుర్గా/పార్వతి యొక్క వివిధ అంశాలే ఈ 64 శక్తి స్వరూపాలు.

64 యోగినీలు - అష్టమాత్రుకల యొక్క అధీనంలో ఉంటాయి.

అష్టమాత్రుకలు - ప్రధాన నాయికా దేవతలు
1. బ్రాహ్మీ : మహావిద్యా, సరస్వతి, అంబిక, గాయత్రీ, సావిత్రీ, వాగ్దేవి, ధీశక్తి

2. మహేశ్వరి : రుద్రాణీ, కాళీ, త్రిపురభైరవి, భవానీ, శివదూతి, భైరవి, దక్షిణకాళీ

3. కౌమారి: స్కందమాత, సేనాని, శక్తి, కుమారి, గుహ్యకాళి, సుబ్రహ్మణ్యశక్తి, శక్తి దేవి

4. వైష్ణవి: మాధవి, నారాయణి, లక్ష్మీ, గోవింది, కామాక్షి, శాంతి, విష్ణుమాయ

5. వారాహీ: ధూమావతీ, బగళాముఖి, చిన్నమస్తా దేవి, త్రిపురసుందరీ, భువనేశ్వరీ, తారాదేవి, కామేశ్వరి.

6. ఇంద్రాణీ: అహల్య, శచి, వజ్రిణి, తేజస్విని, స్వర్ణకాంతి, జ్వాలాముఖి, అధితి

7. చాముండ: కాళరాత్రి, కాపాలిని, రక్తదంతికా, ఉగ్రచండా, భద్రకాళి, శూలిని, కాళీ

8. మహాలక్ష్మీ: కమలాత్మికా, అన్నపూర్ణ, శ్రీదేవి, పద్మావతి, ధనలక్ష్మీ, గజలక్ష్మీ, విజయలక్ష్మీ

అయితే వివిధ పురాణాల ప్రకారం, తంత్ర గ్రంధాల ప్రకారం వారి యొక్క పేర్లు మారుతాయి.

Names of Lord Vishnu - Meanings - విష్ణుమూర్తి పేర్లు - అర్థం

విష్ణుమూర్తి పేర్లు - అర్థం

విష్ణుమూర్తిని ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు. విష్ణుమూర్తికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ప్రతి పేరులో ఉన్న అర్థం ఏమిటి? విష్ణు పేరుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ ధర్మం లో అధికమాసం అని పిలువబడే మాసాన్ని పూర్తిగా విష్ణువుమూర్తికి అంకితం చేశారని పురాణాల్లో ఉంది. ఇది విష్ణువు ఆరాధన. హిందూ ధర్మంలో అచ్యుత, జనార్దన, శ్రీహరి, నారాయణ, అనంత మొదలైన అనేక పేర్లతో విష్ణువును పిలుస్తారు. శ్రీహరి యొక్క ప్రతి పేరు దాని స్వంత నేపథ్యం, ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. విష్ణువు యొక్క అనేక పేర్లలో నారాయణుడు ఒకటి. నారద మహర్షుల పెదవుల నుండి ఈ పేరు మనం తరచుగా వింటూ ఉంటాము. విష్ణుమూర్తిని నారాయణ అని ఎందుకు అంటారు? ఈ పేరు యొక్క ప్రాముఖ్యత ఏంటి...? తెలుసుకుందాం..

1. పురుషోత్తమ:
విష్ణువు పేరు పురుషోత్తమ అంటే 'పురుషులలో ఉత్తముడు'. విష్ణువు యొక్క ఈ పేరు అతని అనేక అవతారాలలో ఒకదానిని సూచిస్తుంది.

2. అచ్యుత
అచ్యుత అంటే ఎప్పటికీ నశించనివాడు లేదా శాశ్వతంగా అమరుడు. విష్ణువు భూమిపై శాశ్వతుడు కాబట్టి విష్ణువుకు ఈ పేరు పెట్టారు.

3. హరి

విశ్వంలో పతనమైనప్పుడల్లా విష్ణువు వివిధ అవతారాలు ధరించి భూమిని రక్షిస్తాడని మత విశ్వాసం. అందుకే విష్ణువును విశ్వ రక్షకుడిగా పేర్కొంటారు. హరి అంటే ఒక వ్యక్తి యొక్క అన్ని బాధలను దాచేవాడు.

4. నారాయణ
ఇదివరకే మనం పురాణాలలో చెప్పుకున్నట్లుగా నారదుడు విష్ణువును నారాయణ, నారాయణ అని పిలిచేవాడు. నీరా అనేది నీటికి పర్యాయపదం, సంస్కృతంలో అమీర్ని ప్రత్యేక సందర్భాలలో నర అని కూడా పిలుస్తారు. నీరు మొదటి అధిష్ఠానం లేదా నివాసం. వైకుంఠ ధామంలో క్షీరసాగరంలో నివసించే శ్రీ హరితో ఈ నీటికి గాఢమైన అనుబంధం ఉంది. అందుకే శ్రీహరిని నారాయణ అని కూడా అంటారు.

5. విష్ణువు
లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన విష్ణువు కన్నులు తామరపువ్వులవంటివి. కౌస్తుక పూసలతో అలంకరించబడి, చతుర్భుజాలలో వివిధ ఆయుధాలను ప్రయోగించి విశ్వమంతటా తన శక్తిని ప్రదర్శిస్తాడు. అందుకే నారాయణుడిని విష్ణువు అంటారు.

Housewarming Ceremony - గృహప్రవేశం

గృహప్రవేశం

కొత్త ఇల్లు కట్టుకున్నాక లేదా కొన్నాక 'గృహప్రవేశం' చేయడం హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు మరియు ఆంతర్యం ఇక్కడ ఉన్నాయి.

శాంతి, సుఖసంతోషాలు: గృహ ప్రవేశ పూజ శాస్త్రోక్తంగా నిర్వహించడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారికి సుఖ శాంతులు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

దైవానుగ్రహం: కొత్త ఇంట్లోకి దేవుణ్ణి, దేవతలను ఆహ్వానించి, పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ ఇల్లు దైవానుగ్రహంతో నిండి ఉంటుందని విశ్వాసం.

వాస్తు దోష నివారణ: గృహ ప్రవేశ సమయంలో చేసే పూజలు, హోమాలు (ఉదాహరణకు వాస్తు పూజ) ఇంటి నిర్మాణంలో జరిగిన చిన్న చిన్న వాస్తు దోషాలను తొలగిస్తాయని చెబుతారు.

నకారాత్మక శక్తి తొలగింపు: పూజా కార్యక్రమాల వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు (Negative energies) పోయి, సానుకూల శక్తి (Positive energy) ప్రవేశిస్తుంది.

శుభారంభం: జీవితంలో కొత్త అధ్యాయాన్ని, శుభప్రదంగా ప్రారంభించడానికి ఈ పూజ ఒక మంచి ఆరంభంగా పరిగణించబడుతుంది.

సరైన సమయం: గృహప్రవేశాన్ని మంచి ముహూర్తం చూసి చేయడం వల్ల ఇంట్లో నివసించే వారి జీవితం మరింత సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. వీలైతే బ్రహ్మ ముహూర్తం నుండి సూర్యోదయం లోపల చేసిన యెడల శుభం.

క్లుప్తంగా చెప్పాలంటే, కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు వచ్చే కష్టాలను తొలగించి, ఆ ఇల్లు సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో తులతూగాలని చేసే ఒక పవిత్రమైన విధి.

vaaramu prayanamu - వారము ప్రయాణము

వారము ప్రయాణము

ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు పనులయందు ఆటంకం కలగకుండా ఉండాలంటే ఈ ప్రతి రోజు వారానికి తగట్టు మలుచుకోండి.

ఆదివారం
ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు... తమలపాకు నమలడం లేదా ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే, అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.

సోమవారం
సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకుని ఇంట్లో నుండి బయటకు రావాలి. వీలైతే కోడి గుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి.

మంగళవారం
హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం ఉదయం స్నానం చేసి, హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. బెల్లం తింటే మరీ మంచిది.

బుధవారం
బుధవారం బయటకు వెళ్లేప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ చాలా ప్రయోజనం ఉంటుంది.

గురువారం
గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమల కుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకూ అలాగే ఉంచాలి.

శుక్రవారం
ముఖ్యమైన పనిమీద శుక్రవారం వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగును ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి.

శనివారం
అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. ప్రతి శనివారం కొద్దిగా అల్లం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరిసంపదలు మీ దరిచేరతాయి.


గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

Guru Moodami - గురు మూఢమి

గురు మూఢమి

మూఢం అనే మాట ఎన్నోసార్లు వినే ఉంటారు. అసలు మూఢం అంటే ఏంటి, ఎందు కొస్తాయి, మూఢాలతో సమస్యేంటి, ఈ రోజుల్లో శుభకార్యాలు చేయొద్దని అంటారెందుకు. ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, చేస్తే ఏమవుతుంది.

గురుమూఢమి:
నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమికూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమీ మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. గ్రహాలకు రాజు సూర్యుడు. అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం వస్తుంటాయి.

ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతుంటాయి. అందుకే దీనికి మూఢం అనే పేరు పెట్టి శుభ కార్యాలకు దూరంగా ఉండమని పండితులు చెబుతుంటారు. ఈ మూఢం అనేది ఆ గ్రహం సూర్యునికి ఎంత దగ్గరలో ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే శుభ గ్రహాలైన గురువు నకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది.

ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే గురువు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఏర్పడే దానిని గురు మూఢం అని అంటారు. సూర్యునికి దగ్గరగా గురు, శుక్రులు వచ్చినప్పుడు, గురు శుక్రుల శక్తులు తగ్గి బలహీనమైపోతాయి, నీరసపడతాయి, వాటి శక్తి సన్నగిల్లుతుంది.

గురు, శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఏ శుభ కార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు.

మూఢంలో చేయకూడనివి:
శుభగ్రహాలు బలహీనంగా ఉంటాయి కాబట్టే మూఢాల్లో వివాహాది శుభకార్యాలు జరుపకూడదు.

లగ్నపత్రిక రాసుకోకూడదు, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు.

పుట్టు వెంట్రుకలు తీయించరాదు.

గృహ శంకుస్థాపనలు చేయరాదు.

ఇల్లు మారకూడదు.

మూఢంలో దోషం లేనివి:

అన్న ప్రాసన చేసుకోవచ్చు.

ప్రయాణాలు చేయవచ్చు.

ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు.

భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు.

నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లొచ్చు.

నూతన వాహనాలు కొనుగోలు చేయొచ్చు, నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చు.

మూఢాల కాలంలో శుభ కార్యాలు చేస్తే:
మహర్షులు, జ్యోతిష్య పండితులు చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావొచ్చు. కష్టం కలుగవచ్చు, నష్టం వాటిల్లవచ్చు.

అయితే కొన్ని ఆ సమయంలోనే తప్పనిసరిగా చేయాల్సిన పనులను మూఢంలో ముడిపెట్టడం మంచిది కాదంటారు. ఇంకా చెప్పాలంటే ఎలాంటి పట్టింపు లేనివారు నిరభ్యంతరంగా ఏ పనైనా చేసుకోవచ్చు..దీన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.


ప్రస్తుత సంవత్సరం గురు మూఢమి జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఏర్పడుతోంది. ఈ సమయంలో గురు జపం, దానాలు చేయడం మంచిది.

Parikshinmaharaju Shukayogindru Nadigedu Prashna - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -  పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న “అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన ద...