Tuesday, June 30, 2026

Yamashtakam - యమాష్టకం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - యమాష్టకం

పూర్వకాలంలో సూర్యభగవానుడు పుష్కరక్షేత్రంలో తీవ్రతపస్సుతో బ్రహ్మమానసపుత్రుడైన
ధర్ముణ్ణి ఆరాధించి నిన్ను పుత్రుడుగా పొందాడు. నువ్వు ధర్మరాజువి. సర్వసాక్షివి. సర్వభూత సమవర్తివి, సర్వభూత సంహారకుడవు. అందుకే నిన్ను శమనుడు అంటారు. కాలం చెల్లగానే ప్రతిజీవినీ అంతమొందిస్తూ కృతాంతుడనే పేరు సంపాదించుకున్నావు. పాపాత్ములను దండించి శుద్ధిచెయ్యడానికి దండం ధరించావు. దండధారి వయ్యావు. సర్వవిశ్వాలలోనూ నిరంతరం ప్రాణికోటిని వెన్నంటి సంచరిస్తూ సకలజీవులనూ శాసిస్తున్నావు. ఎవరైనా ఎదైనా తప్పించుకోవచ్చుగానీ నిన్నుమాత్రం తప్పించుకోలేరు. అందుకే కాలుడన్నారు నిన్ను. నువ్వు తపస్వివి. బ్రహ్మనిష్ఠుడివి. సంయమివి. జితేంద్రియుడివి. జీవులకు కర్మఫలాలమ నిష్పాక్షికంగా పంచిపెట్టేవాడివి. నువ్వు స్వాత్మారాముడివి. సర్వజ్ఞుడివి. పుణ్యాత్ములకు మిత్రుడివి. పాపాత్ములకు శత్రువువి. నీకిదే శిరసువంచి నమస్కరిస్తున్నాను. బ్రహ్మ అంశతో పుట్టావు. బ్రహ్మతేజస్సుతో
ప్రకాశిస్తున్నావు. పరబ్రహ్మను నిరంతరం ధ్యానిస్తుంటావు. నువ్వు ఈశుడవు. నీకిదే వందనం - అని
సావిత్రీదేవి స్తుతించి యముడికి శిరసువంచి నమస్కరించింది.

తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా ।
ధర్మం సూర్యస్పూతం ప్రాప ధర్మరాజం నమామ్యహమ్‌

సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః
 ।
అతో యన్నామ శమన ఇతి తం ప్రణమామ్యహమ్‌ ॥

యేవాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరమ్‌ ।
కామానురూపం కాలేన తం కృతాంతం నమామ్యహమ్‌ ॥

బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ది హేతవే

నమామి తం దండధరం యః శాస్తా సర్వజీవినామ్‌


విశ్వం చ కలయత్యేన యస్పర్వేషు చ సంతతమ్‌ ।
అతీవ దుర్శివార్యం చ తం కాలం చ ప్రణమామ్యహమ్‌


తపస్వి బ్రహ్మనిష్ఠో యస్సంయమీ సంజితేంద్రియః
 ।
జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమామ్యహమ్‌ ॥

స్వాత్మారామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్‌ ।
పాపినాం క్లేశదో యస్తం పుణ్యమిత్రం నమామ్యహమ్‌


యజ్జన్మ బ్రహ్మణో
౦శేన జ్వలంతం బ్రహ్మతేజసా
యో ధ్యాయతి పరం బ్రహ్మ తమీశం ప్రణమామ్యహమ్‌ ॥ (31 - 15)

నారదా! ఇది యమాష్టకం. దీన్ని తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే రోజూ పఠించేవారికి
మృత్యుభయం ఉండదు. సమస్త పాపాలూ తొలగిపోతాయి. యముడి అనుగ్రహంతో త్రికరణశుద్ది
ఏర్పడుతుంది - అని చెప్పి నారాయణమహర్షి సావిత్రీ యమసంవాదాన్ని కొనసాగించాడు.

శౌనకాది మహామునులారా! శ్రద్దగా వింటున్నారుగదా! నారాయణమహర్షి నారదుడికి వివరిస్తున్న
సావి
త్య్రుపాఖ్యానంలో అశుభకర్మవిపాకం ఆలకించండి - అని ఒకసారి హెచ్చరించి సూతుడు కొనసాగించాడు.

నారదా ! సావిత్రి చేసిన స్తోత్రానికి యముడు సంబరపడ్డాడు. మాయాబీజసహితంగా
శ్రీదేవీమహామంత్రాన్ని ఉపదేశించి పూజావిధానం తెలియచెప్పాడు. అటుపైని అశుభకర్మవిపాకం
వివరించాడు.

దుష్మర్మఫల నిరూపణ


No comments:

Post a Comment