Wednesday, July 22, 2026

Dushmarmafala Niruupana - దుష్మర్మఫల నిరూపణ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దుష్మర్మఫల నిరూపణ

సావిత్రీ ! శుభకర్మలు చేసుకున్నవారు రకరకాల స్వర్గాలకు వెళ్ళి పుణ్యఫలాలను అనుభవిస్తారు.

అవి చెల్లిపోగానే భూలోకంలో సజ్జనులై జన్మిస్తారు. వీరు ఏనాడూ నరకానికి పోరు. అలాగే దుష్కర్మలు చేసినవారు నానావిధ నరకాలకి పోతారు. ఆ నరకాలలో రకరకాల కుండాలు ఉంటాయి. లోతైన కూపాలు. ఏ దుష్కర్మకు ఏ కూపమో, దాన్ని వైశాల్యమూ లోతూ ఎంతో, ఆందులో ఎంతకాలం క్లేశాలు అనుభవించాలో అంతా శాస్త్రప్రమాణంగా నిర్ధారణ అయ్యిఉంది. అవ్వి అతిభయంకర కుండాలు, అమ్మా! ఆ గుంటలు పరమకుత్సితంగా ఉంటాయి. చూడక్కర్లేదు వింటేనే చాలు వొళ్ళు జలదరిస్తుంది.

పెద్దవి ఎనభయ్యారుకి పైగా ఉన్నాయి. చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైన పేర్లు కొన్ని చెబుతాను. ఆలకించు. వహ్నికుండం తప్తకుండం క్షారకుండం విట్కుండం (మలం) మూత్రకుండం శ్లేష్మకుండం గరకుండం దూషికుండం (పుసి) వసాకుండం శుక్రకుండం (10) అసృక్కుండం అశ్రుకుండం గాత్రమలకుండం కర్ణమలకుండం మజ్జాకుండం మాంసకుండం నఖకుండం రోమకుండం కేశకుండం అస్థికుండం (20) తామ్రకుండం లోహకుండం చర్మకుండం తప్తసురాకుండం కంటకకుండం విషకుండం తప్తతైలకుండం కుంతకుండం కృమికుండి (పురుగులు) పూయకుండం (30) సర్పకుండం మశక కుండం దంశకుండం గరళకుండం వజ్రదంష్టాకుండం వృశ్చికకుండం శరకుండం శూలకుండం పరశుకుండం ఖడ్గకుండం (40) గోళకుండం నక్రకుండం కాకకుండం మంథానకుండం బీజకుండం వజ్రకుండం తప్తపాషాణకుండం తీక్ష్ణపాషాణకుండం లాలాకుండం మసీకుండం (50) చూర్ణకుండం
చక్రకుండం వక్రకుండం కూర్మకుండం జ్వాలాకుండం భస్మకుండం దగ్ధకుండం ఇంకా ఇలాగే
తప్తసూచీ - అసిపత్ర - క్షురధారా (60) - సూచీముఖ - గోకాముఖ - నక్రముఖ - గజదంశ - గోముఖ -
కుంభీపాక - కాలసూత్ర - మత్స్యోద - కృమికందుక - పాంసుభోజ్య (70) - పాశవేష్ట - శూలప్రోత -
ప్రకంపన - ఉల్కాముఖ - అంధకూప - వేధన - తాడన - జాలరంధ్ర - దేహచూర్ణ - దేహదళన (80) -
దేహశోషణ - దేహకషణ - శూర్ప - జ్వాలాముఖ - ధూమాంధ - నాగవేష్టనకుండాలున్నాయి. (86)

ఇవ్వే కాదు పాపాత్ముల్ని హింసించడానికి చిన్నవీ పెద్దవీ ఇంకా చాలా కుండాలున్నాయి. కింకరులు జాగరూకులై వీటిని నిరంతరం రక్షిస్తుంటారు. వీరినే యమభటులు అంటారు. వీళ్ళందరూ దండహస్తులు. పాశహస్తులు. మదమత్తులు. అత్యంత భయంకరులు. శక్తిహస్తులు. గదాహస్తులు. అసిహస్తులు. అతిదారుణులు. తమోయుక్తులు. దయాహీనులు. అనివార్యులు. తేజస్వంతులు. శంకారహితులు. రక్తపింగళవేత్రులు. మృత్యువు ఆసన్నమైన పాపాత్ములకుమాత్రమే కనిపిస్తారు. పుణ్యాత్ములకూ యోగీశ్వరులకూ స్వధర్మనిరతులకూ వీరి దర్శనభాగ్యం లభించదు. ఇప్పటికి యమకుండాలగురించి చెప్పడమయ్యింది. ఇక ఏ పాపాత్ముడు ఏ కుండంలో పడతాడో చెబుతాను భయపడకుండా విను.

సాధ్వీలలామా ! హరిసేవారతుడూ అంతశ్శుద్దీ బహిశ్శుద్దీ ఉన్నవాడూ యోగసిద్ధుడూ
వ్రతాచరణతత్పరుడూ తపశ్శీలి బ్రహ్మచారీ - వీరు నరకం దరిదాపులకుకూడా వెళ్ళరు. ఇక మిగతావారి సంగతి చెబుతాను. బలగర్వంతో బంధువుల్ని కటువాక్కులతో హించించేవాడు ఆగ్నికుండంలో పడతాడు. తన శరీరంమీద ఎన్ని వెండ్రుకలున్నాయో అన్నేళ్ళు అందులో మాడతాడు. అటుపైని మూడు పశుజన్మలు ఎత్తుతాడు. ఆకలి దప్పులతో గుమ్మమెక్కిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టకుండా పంపించిన మూఢుడు తప్తతుండకుండంలో పడతాడు. రోమప్రమాణాబ్దాలపాటు అందులో నరకయాతన అనుభవిస్తాడు. అటుపైని ఏడు జన్మలవరకూ వాడిది పక్షిబతుకే. రవివారంనాడుగానీ సంక్రాంతిరోజునగానీ అమావాస్యనాడుగానీ శ్రాద్ధసమయంలోగానీ వస్త్రాలకు క్షారసంయోగం చేస్తే (మురికి వదల్చడానికి సబ్బుసోడాలు పెట్టడం) క్షారకుండంలో పడి దారాలన్ని సంవత్సరాలపాటు దుఃఖాలు అనుభవించి మరుసటి ఏడు జన్మల్లోనూ రజకుడవుతాడు. వేద శాస్త్ర పురాణనింద చేసినా త్రిమూర్తుల్ని నిందించినా గౌరీవాణీలక్ష్ములను తూలనాడినా దేవీదూషణ చేసినా ఆ పాపాత్ముడు నిరయానికి వెళ్ళి ఎనభయ్యారింటిలోనూ అత్యంత భయానకమైన కుండంలో పడతాడు. అంతకన్నా దుఃఖప్రదమైన కుండం ఏ నరకంలోనూ ఉండదు. అనేక కల్పాలదాకా అందులో మగ్గి మగ్గి అటుపైని సర్పజాతిలో పుడతాడు. దేవతాదూషణలకు ఏవేవో ప్రాయశ్చిత్తాలున్నాయిగానీ దేవీనిందకు మాత్రం ఏ ప్రాయశ్చిత్తమూ లేదు. దేవీనిందాపరాధస్య ప్రాయశ్చిత్తం న విద్యతే.

స్వదత్తంగానీ పరదత్తంగానీ విప్రుడి సొత్తును ఆపహరించినవాడు అరవైవేల సంవత్సరాలు విట్కుండంలో పడి ఉంటాడు. అన్ని ఏళ్ళూ విడ్భోజనమే చేస్తాడు. అటుపైని విట్‌కృమిగా జన్మిస్తాడు. ఇతరుల చెరువులో తాను చెరువు తవ్విస్తే మూత్రకుండనివాసం ఫలం. రేణువులన్ని సంవత్సరాలు అదే తాగుతూ అదే తింటూ పడిఉంటాడు. పునర్జన్మలో నిండా నూరేళ్ళు వృషభమై భారతభూమిలో ఎవరికో ఒకరికి చాకిరీ చేస్తాడు. ఎవరికీ పెట్టకుండా మృష్టాన్నాన్ని ఒక్కడే తిన్నవాడు శ్లేష్మకూపంలో పడి కొట్టుకుంటాడు. నూరేళ్ళు అదే తింటూ అందులోనే పడి చస్తాడు. అటుపైని శ్లేష్మమలమూత్రాలు తినే కాకిగా జన్మించి నూరేళ్ళు బదికి పాపం వదిలించుకుని శుచి అవుతాడు.

తల్లిని తండ్రిని గురువును భార్యను సంతానాన్నీ పోషించకుండా అనాధలుగా వదిలేసినవాడు గరకుండంలో నూరేళ్ళు అదేతింటూ దుఃఖిస్తాడు. అటుపైన భూతజన్మఎత్తి మరో నూరేళ్ళు గడిపి పాప విశుద్ధుడవుతాడు. ఇంటికి వస్తున్న అతిథిని చూసి ఏవగించుకుంటూ కన్నులు చిట్లించుకున్నవాడు విడిచి పెట్టె తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు సరిగదా వాడు నరకానికి పోతాడు. ఇంకా బ్రహ్మహత్యాది మహాపాతకాలు ఎవడు ఏది చేసినా దూషికాకుండంలో నూరేళ్ళు హింసలపాలై అటుపైని భూతజాతిలో జన్మించి మరో నూరేళ్ళు శోకించి కడపటికి పాపంనుంచి శుచి అవుతాడు. ఎరికైనాగాని ద్రవ్యం దానంగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీనుకున్నవాడు వసాకుండంలో శతాబ్దంపాటు అదే తింటూ కుళ్ళిపోతాడు. అటుపైని కృకలాసంగా (తొండ) ఎడుజన్మలెత్తుతాడు. తరవాత ఆతిరౌద్రుడూ ఆతి దరిద్రుడుగా ఆల్పాయుష్కుడై బతుకుతాడు. స్త్రీని పురుషుడుగానీ పురుషుణ్ణి స్త్రీగానీ శుక్లపానం చేయిస్తే శుక్లకుండపతనమే ఫలం, నూరేళ్ళ తరవాత ఏడు వ్యాఘ్రజన్మలు ఎత్తుతారు. అప్పటికి పాపశుద్ధిపాంది మానవులుగా పుడతారు.

శ్రీకృష్ణుడిమీద పాటలుకట్టి తన్మయత్వంతో పాడుకుంటున్నవాణ్ణీ చూసి కళ్ళలొ నీళ్ళు తిరిగేలాగా పరిహసించిన పాపాత్ముడు అశ్రుకుండనరకంలో శతసంవత్సరాలు పడిఉంటాడు. మరుజన్మలో చండాలవంశాన పుడతాడు. మిత్రద్రోహి గాత్రమలకూపంలో నూరేళ్ళు శిక్ష అనుభవించి అటుపైని గాడిదగా మూడు జన్మలెత్తి పాపశుద్ధి పొందుతాడు. చెవిటివారిని నిందించిన కఠినాత్ముడు కర్ణవిట్‌ కూపంలో (గులుగు) పడి అదే తింటూ నూరేళ్ళు రోదిస్తాడు. బధిరుడూ దరిద్రుడుగా ఏడు జన్మలెత్తుతాడు. మరో ఏడు జన్మలకూ అంగవిహీనుడై ఆపైని శుచి అవుతాడు. లోభంతోగానీ స్వలాభంకోసంగానీ జీవహింస చేసినవాడు మజ్జాకూపంలో లక్షసంవత్సరాలు మగ్గుతాడు. ఆపైని ఏడుజన్మలు శశకంగా, ఏడు జన్మలు మీనంగా పుడతాడు. మూడు జన్మలు వరాహంగా ఏడుజన్మలు కోడిగా ఏడుజన్మలు లేడిగా ఎత్తి ఎత్తి కడకు పాతకశుద్ధి పొందుతాడు. కూతురిని పెంచి పెద్దచేసి ధనలోభంతో అమ్ముకునేవాడు మాంసకుండంలో కన్యారోమాలన్ని ఏళ్ళు పడిఉంటాడు. యమభటులు నిత్యమూ దండతాడనం చేన్తుంటారు. మాంసభారాన్ని నెత్తిమీద పెట్టి మోయిస్తారు. అందులోంచి కారే రక్తాన్ని నాకిస్తారు. అటుపైని అరవైవేల సంవత్సరాలు కన్యావిట్‌క్రిమిగా జన్మలెత్తుతాడు. ఆపైని వ్యాధుడుగా (బోయ) ఏడు జన్మలెత్తుతాడు. వరాహంగా మూడుజన్మలు కోడిగా ఏడుజన్మలు కప్పగా జలగగా కాకిగా ఏడేసి జన్మలూ ఎత్తి శుద్దుడవుతాడు.

వ్రతాలూ ఉపవాసాలూ శ్రాద్ధకర్మలూ జరిపేరోజుల్లో క్షురకర్మచేయించుకున్నవాడు నఖాదికుండాలలో ఆయా వ్రతాధిదేవతల ఆయుష్కాల పర్యంతం పడి ఉండి యమకింకరుల దండతాడనాలు అనుభవిస్తాడు. కేశదూషితంగా పార్థివలింగం తయారుచేసి ఆర్చించినవాడు రేణువులన్ని సంవత్సరాలు కేశకుండంలో తల్లడిల్లి తరువాత యవనజాతిలో పుడతాడు. హరుడికోపం తేలిగ్గా చల్లారదు. శతాబ్దం తరవాత రాక్షసజన్మఎత్తిస్తాడు. పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన వెండ్రుకలన్ని యేళ్ళు అస్థికుండంలో శిక్ష అనుభవిస్తాడు. ఆపైని కుత్సితుడుగా కుంటివాడుగా (కుఖంజః) ఏడు జన్మలెత్తుతాడు. మహా దారిద్య్రం అనుభవించి శుద్ది పాందుతాడు.

గర్భిణిగా ఉన్న భార్యను కలిసినవాడు తామ్రకుండంలో నూరేళ్ళు దుఃఖాలు అనుభవిస్తాడు, అవీర (మగడూ బిడ్డలూ లేనిది) కానీ ఋతుస్నాత కానీ వండి పెట్టిన భోజనం తిన్న శ్రోత్రియుడు తప్తలోహకుండంలో శతాబ్దంపాటు ఇడుములు పడతాడు. ఏడుజన్మలు కాకిగా ఏడుజన్మలు చాకిగా (రజక) గడిపి మహావ్రణపీడుతుడై దరిద్రుడై అటు పైని పాపశుద్ధి పాందుతాడు. చర్మంతో చేసిన తొడుగులు తగిలించుకున్న చేతులతో దేవద్రవ్యాలను స్పృశించినవాడు శతవర్షాలపాటు చర్మకుండంలో శిక్షలు అనుభవిస్తాడు. భుజించరానివి భుజించిన నైష్ఠికుడు తప్తసురాకూపంలో శతాబ్దీకాలపర్యంతం పడి ఉండి ఆపైని ఏడుక్షుద్ర జన్మలు ఎత్తుతాడు. అటు పైని శుద్ది పొందుతాడు. ప్రభువును కొట్టినవాడికీ కటువుగా మాట్లాడినవాడికీ కంటకకూపనివాసమే శిక్ష. దెబ్బకు నాలుగు దెబ్బలుగా యమకింకరులు దండిస్తారు. ఆపైని గుర్రంగా ఏడు జన్మలెత్తి శుచి అవుతాడు. విషం పెట్టి జీవహింస చేసిన పాతకి విషకూపంలో వెయ్యేళ్ళు పొర్లుతాడు, అటుపైని మహావ్రణపీడితుడుగా రాజద్రోహిగా నూరుజన్మలు ఎత్తుతాడు. మరో ఏడు జన్మలు కుష్ఠురోగం అనుభవించి శుద్దుడవుతాడు.

ఆవునుగానీ ఎద్దునుగాని కర్రతో బాదిన వాడూ లేక బాదించినవాడూ తప్త తైలకుండంలో నాలుగు యుగాలపాటు మలమలావేగుతాడు. అటు పైని దాని శరీరంమీద ఉన్న వెండ్రుకలన్ని సంవత్సరాలపాటు భారతభూమిలో వృషభజన్మలు ఎత్తి ఎత్తి కడకు శుద్ది పాందుతాడు. కుంతం అనే ఆయుధంతోగాని వహ్నిలోహంతోగాని జీవహింస చేసిన పాపాత్ములు కుంతకుండంలో అయుతవత్సరాలు నివసిస్తారు. అటుపైని వ్యాధిపీడితుడుగా ఒక జన్మగడిపి పాపం నుంచి శుద్ధిపాందుతాడు.

ద్విజుడైపుట్టి లోభంతో మాంసభక్షణ చేసినవాడూ హరికి నివేదన చెయ్యకుండా పదార్థాలను భుజించినవాడూ కృమికుండంలో స్వరోమ సమవత్సరాలు శిక్ష అనుభవించి మరు జన్మలో మ్లేచ్చుడవుతాడు. బ్రాహ్మణుడైపుట్టి చేయరాని పనులు చేస్తే పూయకుండనరకంలో యమదండన అనుభవిస్తాడు. అటుపైని శూద్రుడుగా ఏడు జన్మలు ఎత్తుతాడు. మహారోగి దరిద్రుడూ బధిరుడూ అవుతాడు.

కృష్ణపాదపద్మ చిహ్నాలను పడగమీద ధరించిన జాతిపామును సంహరించిన పాపాత్ముడు స్వరోమసమవత్సరాలు సర్పకుండంలో కుందుతాడు. సర్పభక్షితుడూ యమకింకర తాడితుడూ అవుతాడు. అటుపైని సర్పజన్మ ఎత్తుతాడు. ఆ తరవాత అల్పాయుష్కమానవుడై దద్రురోగపీడ అనుభవిస్తాడు. సర్పదష్టుడై మరణిస్తాడు. అప్పటికి పాపశుద్ధి అవుతుంది.

అల్పప్రాణుల్ని పట్టుకుని హింసిస్తూ వినోదించేవారు దంశకూపంలోనూ మశీకూపంలోనూ శిక్షింపబడతారు. నిరాహారులై హాహాకారాలు చేస్తూ దంశబాధలు అనుభవిస్తారు. కాళ్ళూచేతులూ కట్టేసి యమకింకరులు దండతాడనం చేస్తారు. అటుపైని క్షుద్రజంతువులై పుడతారు. ఆపైన అంగవికల మానవజన్మ ఎత్తి పాపప్రక్షాళన పొందుతారు.

తేనెటీగలను చంపి అవి దాచుకున్న తేనెను భుజించేవాడు గరళకుండంలో గరళభక్షితుడవుతాడు. ఆపైని మక్షికాజాతిలో జన్మించి పాపకర్మ విముక్తి పొందుతాడు. నిరపరాధిని దండించినా బ్రాహ్మణుడిని హింసించినా ఆ పాపానికి ఫలం వజ్రదంష్ట్రాకూపనివాసం. యమకింకరుల దెబ్బలకు హాహాకారాలు చేస్తూ రోదిస్తూ రోమసంఖ్యాసమసంవత్సరాలు గడిపి, పందిగా ఏడు జన్మలు కాకిగా మూడు జన్మలూ ఎత్తి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. ధనసంపాదనకోసం అమాయక ప్రజలను పీడించినవాడు వృశ్చికాకూపంలో పడతాడు. వృశ్చికంగా ఏడు జన్మలు ఎత్తుతాడు. అటుపైన అంగహీనుడై వ్యాధిపీడితుడై పాపశుద్ధి పాందుతాడు.

విప్రుడు శస్త్రజీవి అయినా సంధ్యావందన హరిభక్తి విహీనుడైనా స్వరోమాబ్దంగా అతడు శరకూపాదులో ఘోరశిక్షలు అనుభవిస్తాడు. కారాగారంలో బంధించి ప్రజలను ప్రమత్తుడై హింసించేవాడు గోళకుండ నరకానికి పోతాడు. అది సలసలకాగే నీటితో కుతకుతలాడే బురదతో భయంకరంగా ఉంటుండి వాడికోరలతో పెద్దపెద్ద పురుగులు ఎగురుతూ ఉంటాయి. అవి కుడుతూంటే ఆ కుండంలో ఉడుకుతాడు. హింసించిన ప్రజల శరీరాలమీద ఉన్న వెండ్రుకలన్ని సంవత్సరాలు ఈ శిక్ష అనుభవిస్తాడు. అటుపైని ప్రజలకు సేవకుడుగా జన్మించి పాపప్రక్షాళన చేసుకుంటాడు.

చెరువుల్లోనుంచి గాలికోసం ఒడ్డుకువచ్చిన మొసళ్ళనూ తాబేళ్ళనూ పట్టి హింసించేవాడు నక్రకంటక సమానాబ్దంగా నక్రకుండ మహానరకంలో హింసలు అనుభవిస్తాడు. అటుపైని తాను హింసించిన జంతువుల జాతిలో జన్మిస్తాడు.

పుణ్యక్షేత్రాలలోగానీ తీర్థస్నాననమయాలలోగానీ పరస్త్రీల గోప్యాంగాలను కాముకదృష్టితో చూసినవాడు కాకతుండకూపంలో పడి తన వెండ్రుకలన్ని సంవత్సరాలు హింసపడతాడు. కాకులు వాడీ కళ్ళు పీక్కుతింటాయి. అంధుడుగా మూడుజన్మలెత్తుతాడు. బంగారాన్ని దొంగిలించినవారు మంధానకూపంలో మథింపబడతారు. యమకింకరులు కళ్ళకు గంతలుకట్టి చావబాదుతారు. తన మలమూత్రాలను తానే తింటూ స్వరోమాబ్దకాలం గడిపి అటుపైని మూడుజన్మలూ అంధుడవుతాడు. ఏడు జన్మలు మహాదారిద్య్రం అనుభవించి స్వర్ణకారుడుగానో స్వర్ణవ్యాపారిగానో జన్మించి బంగారానికి సేవకుడవుతాడు. తామచౌర్యం లోహచౌర్యం చేసినవారు ఇలాగే బీజకుండంలో శిక్ష అనుభవిస్తారు. దేవతావిగ్రహాలను దొంగిలించినా దేవద్రవ్యాన్ని అపహరించినా స్వరోమాబ్దంగా వజ్రకుండ నరకంలో వజ్రాఘాతాలు తింటూ హాహాకారాలు చేస్తూ నిరాహారులై కింకరతాడితులై కడపటికి పాపకర్మ విముక్తులవుతారు. వెండినీ గోవులనూ వస్త్రాలనూ దొంగిలించేవారు తప్తపాషాణకుండంలో శిక్షింపబడతారు. మూడు జన్మలు బొల్లిరోగంతో పీడింపబడతారు. అటుపైని శ్వేతపక్షిగా జన్మిస్తారు. కాంస్యపాత్రలను ఆపహరించినవాడు తీక్ష్ణపాషాణ నరకంలో హింసలు అనుభవించి గుర్రంగా ఏడు జన్మలు ఎత్తి ఆపైని పాదరోగపీడితుడై పాతకవిముక్తి పాందుతాడు.

గతిలేక వాళ్ళు అమ్ముకుని జీవించే పుంశ్చలిని దోచుకునేవాడు స్వరోమాబ్దంగా లాలకుండంలో మునుగుతాడు. అటుపైని కంటిరోగంతోనూ శూలరోగంతోనూ పీడింపబడతాడు. ఎప్పటికో పాపవిశుద్ది పాందుతాడు. మసీజీవనం సాగించే విప్రుడు మసీకుండనరకంలో దుఃఖిస్తాడు. అటుపైని నల్లని పశువుగా మూడుజన్మలు ఎత్తుతాడు. మూడు జన్మలు నల్లగొర్రె అవుతాడు. ఆపైని తాడిచెట్టుగా పుడతాడు, కడపటికి విశుద్ధుడవుతాడు. ధాన్యాది సస్యాలనూ తాంబూలాన్నీ ఆసన తల్పాలను అపహరించేవాళ్ళు చూర్ణకుండ నరకకూపంలో యమబాధలు అనుభవిస్తారు. మేషజాతిలోనూ కుక్కుటజాతిలోనూ మూడేసి జన్మలు ఎత్తుతారు. ఆ పైని వానరజన్మ కాసవ్యాధిపిడ. దారిద్య్రం. అల్పాయుర్దాయం. వంశహాని. చివరికి పాపవిశుద్ధి. విప్రుల సొమ్ము హరించి (గానుగ) చక్రం చేయించుకున్నవాడు చక్రకుండనరకంలో శతాబ్దకాలం హింసలు అనుభవిస్తాడు. అటు పైని తైలకారుడుగా మూడు జన్మలు ఎత్తుతాడు. వ్యాధిపీడితుడూ వంశహీనుడూ అయ్యి పాపవిమోచనం పొందుతాడు. విప్రుల గో ధనాల విషయంలో వంకరగా వ్యవహరిస్తే వక్రకుండ నరకానికి పోతారు. ఆపైని వంకరటింకర అవయవాలతో పుడతారు. ఇలా ఏడు జన్మలయ్యాక గ్రద్దగా పందిగా పిల్లిగా నెమలిగా మూడు జన్మలు ఎత్తుతారు. అప్పటికి గానీ పాపభారం తరగదు. బ్రాహ్మణుడై పుట్టి కూర్మమాంసం తింటే కూర్మకుండంలో శతాబ్దంపాటు కూర్మాలతో భక్షింపబడతాడు. మూడు కూర్మజన్మలెత్తుతాడు. పందిగా బిడాలంగా నెమలిగా మూడేసి జన్మలు ఎత్తి క్రమంగా పాపపంకిలం వదిలించుకుంటాడు. నెయ్యిగానీ నూనెగానీ అపహరించినవాళ్ళు జ్వాలాకుండంలోనూ భస్మకుండంలోనూ నరకయాతన అనుభవిస్తారు. మత్స్యమూషక జన్మలు ఏడేసి ఎత్తి పాపభారం తొలగించుకుంటారు. సుగంధ ద్రవ్యాపహర్తలు దగ్ధకుండనరకంలో దివారాత్రాలు దగ్ధులవుతారు. అటుపైని దుర్గంధికులుగా ఏడు జన్మలెత్తుతారు. మృగనాభిగా(కస్తూరి) మూడు జన్మలు తప్పవు. ఏడు మంథాన జన్మలూ తప్పవు. అప్పటికి పాపఫలానుభవం పూర్తి అవుతుంది. బలప్రయోగంతోగానీ మోసం చేసిగానీ ఇతరుల పిత్రార్జితభూమిని కాజేసినవాళ్ళు తప్తసూచీకూపంలో పడిదగ్ధులవుతారు. ఏడు మన్వంతరాలు ఈ నరకం అనుభవించి అరవైవేల సంవత్సరాలు కృమికీటకమై తిరిగి స్వజాతిలో జన్మిస్తారు. పాపకర్మల ఫలంగా నరకయాతనలు అనుభవించి పరిశుద్ధులై స్వీయజాతిలో జన్మించాక శుభకర్మలు ఆచరించాలి. శుభఫలాలు దక్కుతాయి. మళ్ళీ పాపాలే చేస్తే ఇలాగే నరకయాతనలు తప్పవు.

సావిత్రీ ! ధనలోభంతో ఎదుటివాడి శిరస్సును కత్తితో నరికిన హంతకుడు అసిపత్రనరకంలో యాతనపడతాడు. పధ్నాలుగుమంది ఇంద్రులు మారేటంతకాలం అందులో కత్తికోత అనుభవిస్తాడు. బ్రాహ్మణుడిని చంపినవాడు శతమన్వంతరాలు అదే నరకంలో శిక్షింపబడతాడు. అటు పైని శతసూకరజన్మలూ సప్తకుక్కుట జన్మలూ సప్తసృగాల జన్మలూ సప్తవ్యాఘ్రజన్మలూ మూడు వృకజన్మలూ సప్తమండూక జన్మలూ ఎత్తుతాడు. అటుపైని ఒక మహిష జన్మఎత్తి పాపవిముక్తి పొందుతాడు. పల్లెలూ పట్టణాలూ తగులబెట్టేవారు క్షురధారానరకకూపంలో మూడు యుగాలపాటు యమబాధలు పడతారు. తరవాత ప్రేతాకారంలో మరిన్ని సంవత్సరాలు తిరుగుతారు. ఆపైని ఏడు జన్మలు మలభక్షకులై ఏడు జన్మలు కపోతాలై ఏడు జన్మలు శూలవ్యాధిపీడితులై ఏడు జన్మలు కుష్ఠువ్యాధి అనుభవించి శుద్ధిపాందుతారు, పరనిందాపరుడూ పరదోష ప్రచారకుడూ దేవ బ్రాహ్మణ నిందకుడూ సూచీముఖ నరకంలో యుగత్రయకాలం వేదనలు అనుభవిస్తారు. వృశ్చిక వజ్రకీట భస్మకీటజన్మలు ఏడేసి ఎత్తి మానవుడై మహావ్యాధి పీడితుడై మరణించి శుద్ధిపాందుతాడు, గోడలకు కన్నంవేసి తలుపులు బద్దలు చేసి ఇళ్ళల్లో చొరబడి వస్తువుల్ని దొంగిలించేవారు గోకాముఖనరకంలో మూడుయుగాలు యమకింకర బాధలు అనుభవిస్తారు. గిత్తలూ గొర్రెపాటేళ్ళూ మేకపోతులూ కొమ్ములతో కుమ్ముతోంటే గిట్టలతో మట్టగిస్తోంటే హాహాకారాలు చేస్తారు. ఆపైని వ్యాధిగ్రస్తమైన ఎద్దుగా ఏడుజన్మలూ మేషజాతిలో మూడుజన్మలూ ఛాగజాతిలో మూడు జన్మలూ ఎత్తి మానవుడుగా దారిద్య్రం నిత్యరోగం భార్యావియోగం బంధువియోగం అన్నీ అనుభవించి పాపకర్మ విముక్తుడవుతాడు. ఏ రకమైన ద్రవ్యాన్ని ఎవరినుంచి కాజేసినా చోరుడు నక్రముఖ కుండంలో నలిగిపోవలసిందే. మూడు శతాబ్దాలపాటు యమభటుల దండతాడనలు తినవలసిందే. ఆపైని రోగిష్ఠి ఎద్దుగా ఏడు జన్మలు దుఃఖించి మానవుడై మహారోగిగా అందరితోనూ ఏవగింపబడి కడపటికి పరిశుద్ధి పొందుతాడు. ఏనుగుల్నీ గుర్రాల్నీ పశువుల్ని చంపినవాడు గజదంశకూపంలో మూడుయుగాలపాటు యాతనలు అనుభవిస్తాడు. నాగదంతాలతో యమకింకరులు కుళ్ళబొడుస్తుంటే కుయ్యోం మొర్రోమని పెడబొబ్బలు పెడతాడు. అటుపైని ఆయా జంతువులుగా మూడేసి జన్మలు ఎత్తుతాడు. నరుడై శుచి అవుతాడు.

దప్పికతో వచ్చి నీళ్ళు తాగుతున్న గోవును తరిమివేసిన మానవుడు గోముఖనరకంలోపడి పురుగులతో కాగుతున్న నీళ్ళల్లో మగ్గుతాడు. మన్వంతరకాలం ఈ శిక్ష అనుభవిస్తాడు. నరజన్మ ఎత్తి మహారోగపీడతో మరణించి పాపప్రక్షాళన పొందుతాడు, గోహత్య బ్రాహ్మణహత్య స్త్రీహత్య భిక్షుహత్య భృణహత్య(గర్భస్రావం) చేసినవారూ పొందుకోరరాని స్త్రీని పొందినవారూ కుంభీపాకనరకంలో చతుర్దశేంద్రసమకాలం హింసలు ఆనుభవిస్తారు. యమదూతలు నలిపేస్తారు. నిప్పుల్లో తోస్తారు. ఇనపముళ్ళ పొదల్లోకి విసురుతారు. కాగుతున్న నూనెలో ముంచుతారు. సలసలలాడుతున్న తామ్ర లోహద్రవంలో వేపుతారు. ఇన్నీ అనుభవించి నూరు గ్రద్దజన్మలూ నూరు పందిజన్మలూ ఏడు కాకిజన్మలూ ఏడు సర్పజన్మలూ ఎత్తి అరవైవేల సంవత్సరాలపాటు విట్‌కృమిగా జీవించి ఆపైని ఎద్దుగా ఏడుజన్మలు ఎత్తి మనిషైపుట్టి దరిద్రుడై కుష్ఠురోగపీడితుడై అప్పటికి పాపభారం తొలగించుకుంటాడు.

బ్రహ్మహత్యాసమానాలు


No comments:

Post a Comment

Remedies for Jupiter-related afflictions - గురుగ్రహ దోష నివారణ

గురుగ్రహ దోష నివారణ నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్...