Friday, September 4, 2026

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను అని నిశ్చయించినాడు. మధురా నగరాన్ని యాదవ వంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు.

శ్రీ కృష్ణుని గూర్చి అయన గొప్పతనం గూర్చి మహాభారతం, భాగవత పురాణంలో చాలా చక్కగా వ్యాసమునీంద్రులు వివరించారు. 

శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవుల ఎనిమిదవ(అష్టమ) కుమారుడు . అతని జనన సమయంలో, హింస విపరీతంగా ఉండేది,

వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేసారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి సాగనంపుతుంటే ఆకాశవాణి – దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, మరియు తన తండ్రి ఉగ్రసేన మహారాజును మధురలోని చెరసాలలో బంధిస్తాడు.

ఆ కారాగారంలోనే శ్రీ కృష్ణుడు  జన్మించాడు, వారికి పుట్టిన మొదటి ఆరుగురు నవజాత శిశువులను పుట్టిన కొద్దిసేపటికే కంసుడు సంహరించాడు.

దేవకీ ఏడవ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆ గర్భాన్ని రోహిణి గర్భంలోకి  మారుస్తాడు. తదుపరి రోహిణి గర్భంలో బలరాముడు జన్మిస్తాడు. తరువాత దేవకీ ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది.

శ్రావణ శుద్ధ అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. దేవకి గదికి కాపలాగా ఉన్న కావలివారు విష్ణుమాయతో నిద్రపోవడంతో, వాసుదేవుడు కృష్ణుడిని తీసుకొని ఒక బుట్టలో పెట్టుకొని బయలుదేరుతాడు.విష్ణుమాయతో ఆ కారాగారం తలుపులు కూడా తెరుచుకున్నాయి.

తదుపరి వసుదేవుడు కృష్ణుడిని యమునా నది దాటించి నిద్రిస్తున్న యశోద పురిటిలో శ్రీకృష్ణుని ఉంచి ఆమెకు పుట్టిన స్త్రీ శిశువును తీసుకొని వస్తాడు. ఆమెయే యోగమాయ.

అక్కడి శిశువును తిరిగి చెరసాలకు తీసుకువస్తాడు. ఆ శిశువు యోగమాయగా అవతరించి కంసుడిని హెచ్చరిస్తుంది.

కృష్ణుని బాల్యమంతా, అతని సోదరుడైన బలరాముడుతో కలిసి నందవ్రజం, బృందావనం లో గడిచింది. అక్కడకి వచ్చిన పూతన లాంటి రాక్షసులను సంహరించి అక్కడి గోపగోపికలకు మరియు నందయశోదలకు ఆనందం కలిగిస్తాడు.

తదుపరి  మధురకి వచ్చి కంసుని మరియు అతని సహచర రాక్షసులను వధించి భూమికి కొంత భారం తగిస్తాడు.

తదుపరి కాలంలో మహాభారత యుద్ధంలో పాండవులతో కలిసి కొరవ మరియు దుష్ట రాజులను సంహరించి భూమికి భారం తగిస్తాడు 

శ్రీకృష్ణుని చిన్నతనంలో వెన్న దొంగిలించడం, దూడలను వెంబడించడం, గోశాలలో ఆడటం మరియు కుస్తీ పోటీలలో పాల్గొనడం వంటి కార్యక్రమాలలో బలరాముడుతో కలిసి పాల్గొనేవాడు.

కృష్ణాష్టమి రోజున చేయవలసిన పనులు
ఈ రోజు భక్తులు పవిత్ర స్నానం చేసి పూజ అయ్యే వరకు ఉపవాసం ఆచరించాలి. పగలంతా ఉపవాస దీక్ష అనంతరం సాయంత్రం శ్రీకృష్ణుడికి పూజలు చేయాలి.

నైవేద్యంగా పండ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ సమర్పించాలి. కొబ్బరితో చేసిన పంచకజ్జాయం ప్రసాదం గా కొన్ని ప్రాంతాలలో సమర్పిస్తారు.

సాయంత్రం ఉట్టి కట్టి సంతోషంగా జరుపుకోవాలి. లేని వారికి దానం చేయడం శ్రేష్టం. శ్రీకృష్ణ జయంతి వ్రతం చేయాలి.

శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో పెట్టి పాటలు పాడుతూ నిద్రపుచ్చాలి.

ఈ జన్మాష్టమినాడు ప్రజలు ఉపవాసాలు ఉంటూ, కృష్ణునిపై ప్రేమను కీర్తిస్తూ భక్తి గీతాలు పాడుతూ, రాత్రంతా జాగరణ చేస్తూ జరుపుకుంటారు.

No comments:

Post a Comment

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...