నారదా! మిగిలిన మనువుల కథలుకూడా చెబుతాను. శ్రద్ధగా ఆలకించు. వీరిని స్మరిస్తే చాలు దేవీభక్తి కుదురుకొంటుంది. వైవస్వతమనువుకి ఆరుగురు కొడుకులున్నారు. కరూషుడు, వృషద్రథుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు. ఆరుగురూ మహాబలశాలులే. కాళిందీ తీరంలో నిరాహారులై తీవ్రంగా తపస్సు చేశారు. కొంతకాలానికి అంతశ్శుద్ది లభించింది. జగత్తు అంతా ఆత్మలోనే కనపడింది. ఈ దర్శనానికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. మరింత నిష్ఠగా తపస్సు కొనసాగించారు. పన్నెండేళ్ళు గడిచాయి. జగదీశ్వరి సాక్షాత్కరించింది. భక్తివినమ్రులై సాగిలి మ్రోక్కారు.
మహేశ్వరి జయేశాని పరమే కరుణాలయే ।
వాగ్భవారాధనప్రీతే వాగ్భవప్రతిపాదితే ॥
క్లీంకారవహే దేవి క్లీంకారప్రీతిదాయిని ।
కామరాజమనోమోదదాయినిశ్వరతోషిణి ॥
మహామాయే మోదపరే మహాసామ్రాజ్యదాయిని ।
విష్ణ్వర్కహరశక్రాదిస్వరూపే భోగవర్దిని ॥
ఆరుగురు రాకుమారులూ ముక్తకంఠంతో ఆ మహేశ్వరిని స్తుతించారు.ప్రనన్నురాలయ్యింది. రాజపుత్రులారా! మీరు మహాత్ములు, తపస్సులు, నిష్కల్మషులు, అంతశ్శుద్ధిని సాధించివవారు. నన్ను ఉపాసించారు. మనస్సుల్లో ఉన్న కోరికలన్నీ అడగండి. నేను ప్రసన్ననయ్యాను. తీరుస్తాను - అంది.
మహాదేవీ! నిష్కంటకరాజ్యాన్ని ఇయ్యి. సత్పుత్రులను ప్రసాదించు. దీర్ఘాయుష్మంతుల్ని చెయ్యి. అవ్యాహతంగా భోగభాగ్యాలు అనుభవించేటట్టు యశస్సూ తేజస్సూ సన్మతీ కలిగేట్టు మా ఆరుగురికీ వరం ప్రసాదించు.
జగన్మాత తథాస్తు అంది. మీరు ఆరుగురూ క్రమంగా ఆరు మన్వంతరాలకు అధిపతులవుతారని అదనంగా వరమిచ్చి ఆశీర్వదించి వెళ్ళింది. అలాగే జరిగింది. ఆరుగురూ మహారాజులై భోగభాగ్యాలు అనుభవించి సత్సంతానాన్ని పొంది జన్మాంతరంలో మనువులయ్యారు. మొదటివాడు దక్షసావర్ణిగా తొమ్మిదవ మనువు అయ్యాడు. రెండవవాడు మెరుసావర్ణిగా పదవ మన్వంతరానికీ, మూడవవాడు సూర్యసావర్ణిగా పదకొండవ మన్వంతరానికీ, నాల్గవవాడు చంద్రసావర్ణిగా పన్నెండవ మన్వంతరానికీ, అయిదవవాడు రుద్రసావర్ణిగా పదమూడవ మన్వంతరానికీ, ఆరవవాడు విష్ణుసావర్ణిగా పధ్నాల్లవ మన్వంతరానికీ అధిపతులయ్యారు.
ఈ పదునల్గురు మనువులూ దేవీపాదచింతకులు. పరమపూజ్యులు. లోకవంద్యులు. మహాప్రతాపశాలులు. భ్రామరీదేవి అనుగ్రహానికి నోచుకున్నవారు.
నారాయణమహర్షి నోటినుంచి బ్రామరీదేవి అనే పదం రావడమేమిటి నారదుడు పట్టుకున్నాడు. మహర్షీ! ఎవరు ఈ భ్రామరీదేవి? అవతారగాథ ఎమిటి? దయచేసి వివరించు. అమృతమైనా మొహం మొత్తుతుందేమోగానీ దేవీకథామృతం ఎంతగ్రోలినా తనివితీరడంలేదు. వినిపించు - అని ప్రార్థించాడు. నారాయణ మహర్షి నారదా అంటూ ప్రారంభించాడు.
భ్రామరీదేవి వృత్తాంతం
జగన్మాత తథాస్తు అంది. మీరు ఆరుగురూ క్రమంగా ఆరు మన్వంతరాలకు అధిపతులవుతారని అదనంగా వరమిచ్చి ఆశీర్వదించి వెళ్ళింది. అలాగే జరిగింది. ఆరుగురూ మహారాజులై భోగభాగ్యాలు అనుభవించి సత్సంతానాన్ని పొంది జన్మాంతరంలో మనువులయ్యారు. మొదటివాడు దక్షసావర్ణిగా తొమ్మిదవ మనువు అయ్యాడు. రెండవవాడు మెరుసావర్ణిగా పదవ మన్వంతరానికీ, మూడవవాడు సూర్యసావర్ణిగా పదకొండవ మన్వంతరానికీ, నాల్గవవాడు చంద్రసావర్ణిగా పన్నెండవ మన్వంతరానికీ, అయిదవవాడు రుద్రసావర్ణిగా పదమూడవ మన్వంతరానికీ, ఆరవవాడు విష్ణుసావర్ణిగా పధ్నాల్లవ మన్వంతరానికీ అధిపతులయ్యారు.
ఈ పదునల్గురు మనువులూ దేవీపాదచింతకులు. పరమపూజ్యులు. లోకవంద్యులు. మహాప్రతాపశాలులు. భ్రామరీదేవి అనుగ్రహానికి నోచుకున్నవారు.
నారాయణమహర్షి నోటినుంచి బ్రామరీదేవి అనే పదం రావడమేమిటి నారదుడు పట్టుకున్నాడు. మహర్షీ! ఎవరు ఈ భ్రామరీదేవి? అవతారగాథ ఎమిటి? దయచేసి వివరించు. అమృతమైనా మొహం మొత్తుతుందేమోగానీ దేవీకథామృతం ఎంతగ్రోలినా తనివితీరడంలేదు. వినిపించు - అని ప్రార్థించాడు. నారాయణ మహర్షి నారదా అంటూ ప్రారంభించాడు.
No comments:
Post a Comment