కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన 123 అడుగుల భారీ శివ విగ్రహానికి మరియు 20 అంతస్తుల (237 అడుగులు) రాజగోపురానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ సముదాయం కందుక కొండపై ఉంది, ఇక్కడ సముద్రపు అలల హోరు మధ్య శివ దర్శనం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
శివయ్యకు ప్రత్యెక్కించిన ఈ దేవాలయం పేరు మురుడేశ్వర్. మురుడేశ్వర్ అనేది శివయ్య పేరు.
ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం అని పండితులు చెబుతున్నారు.ఈ శివుని విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.
ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.
శివయ్యకు ప్రత్యెక్కించిన ఈ దేవాలయం పేరు మురుడేశ్వర్. మురుడేశ్వర్ అనేది శివయ్య పేరు.
ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం అని పండితులు చెబుతున్నారు.ఈ శివుని విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.
ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.
పురాణ కథనం:
మురుడేశ్వర పట్టణ ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది. రావణాసురుడు, శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.
ఈ విషయం తెలుపుకొన్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు.అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి బ్రాహ్మణ వేషం లో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.
ఈ విషయం తెలుపుకొన్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు.అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి బ్రాహ్మణ వేషం లో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.
రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు.రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపటి నెత్తిమీద మొట్టుతాడు, గణపటి నెత్తికి గుంట పడుతుంది.వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం.
విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు.ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కి.మి. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగం పై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కి.మి దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.
చరిత్ర:
ఆత్మలింగం: త్రేతాయుగంలో రావణాసురుడు శివుని కోసం తపస్సు చేసి సాధించిన ఆత్మలింగం ఈ ప్రదేశంతో ముడిపడి ఉంది.
భారీ శివ విగ్రహం: కొండపై భాగంలో ఉన్న ఈ 123 అడుగుల శివుని విగ్రహం సూర్యకాంతిలో మెరుస్తూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
రాజగోపురం: ఆలయం వద్ద నిర్మించిన 237 అడుగుల రాజగోపురానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. దీని పైభాగానికి వెళ్లి చూస్తే అరేబియా సముద్రం మరియు మురుడేశ్వర్ పరిసరాల సుందర దృశ్యాలు కనిపిస్తాయి.
ఇతర విశేషాలు:
మురుడేశ్వర దేవాలయం: ఈ దేవాలయం కందుక పర్వతం మీద ఉంది.మూడు వైపుల అరేబియా సముద్రం ఆవరించి ఉంది.ఈ దేవాలయ గాలి గోపురం 20 అంతస్తులు ఉంది. దేవాలయానికి వెళ్ళే మార్గంలో రెండు నిజమైన ఏనుగులు ఉన్నాయి.
మురుడేశ్వర కోట: ఈ కోట మురుడేశ్వర దేవాలయం వెనుక భాగంలో ఉంది. ఈ కోటని మన హిందూ రాజులు పునరుద్ధరించాడు.
శివుని విగ్రహం: ఆలయ సముదాయంలో నున్న ఈ శివుని విగ్రహం చాలా దూరం నుండి కనిపిస్తుంది. ఆధారాల ప్రకారం ఈ విగ్రహం ప్రపంచం లోనే అతి పెద్ద శివుని విగ్రహం.
123 అడుగుల (37 మీటర్ల) ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి 2 ఏండ్లు పట్టింది. శివమొగ్గకు చెందిన కాశీనాథ్, ఆయన కుమారుడు శ్రీధర్, ఇతర శిల్పులు కలిసి కోటి రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని చెక్కించారు. ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమనగా సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుంది.
ఈ మురుడేశ్వర్ దేవాలయం బెంగళూరుకి 497 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఈ దేవాలయం భక్తి జ్ఞాన కేంద్రంగా వెలిసింది.
ఈ దేవాలయంలోనీ 123 అడుగులు ఎత్తైన మహా శివుడిని దర్శించుకోవడం ఆధ్యాత్మికం అని భక్తులు చెబుతూ ఉంటారు.అంతే కాకుండా ఈ దేవాలయానికి మూడు వైపులా సముద్రం ఉంటుంది.అంతే కాకుండా ఇక్కడ సూర్యాస్తమయం, బీచ్, కొల్లూరు టెంపుల్ తప్పక చూడదగిన ప్రదేశాలు అని స్థానికులు చెబుతున్నారు.
రోడ్డు మార్గం:
హొన్నావర్-భట్కల్ మధ్య నున్న జాతీయ రహదారి-17 మీద మురుదేశ్వర అని ఒక తోరణం స్వాగతం పలుకుతుంది. తోరణం నుండి ఒక కి.మీ. దూరం తూర్పు వైపు వెడితే మురుదేశ్వర పట్టణం వస్తుంది. బెంగళూరు నుండి జాతీయ రహదారి-206 ద్వారా హొన్నావర్ చేరుకొని అక్కడ నుండి జాతీయ రహదారి -17 తీసుకొంటే మురుదేశ్వర వస్తుంది.బెంగళూరు నుండి 455 కి.మీ. దూరంలో మురుదెశ్వర వస్తుంది.మంగళూరు నుండి 180 కి.మీ. దూరంలో ఉంది.
రైలు మార్గం:
మురుడేశ్వర రైలు స్టేషను కొంకణ్ రైల్వే లైను మీద ఉంది. ఈ రైలు స్టేషనులో ముఖ్యంగా ప్యాసింజర్ బండ్లు మాత్రమే ఆగుతాయి. మంగళూరు నుండి మార్మగోవా వరకు నడిచే ప్యాసింజర్ రైలు ఇక్కడ నిలుస్తుంది. బెంగళూరు నుండి మురుదేశ్వరకు సరాసరి రైలు సౌకర్యం లేదు. భట్కల్ వరకు రైలు మీద వచ్చి అక్కడ నుండి కొంకణ్ రైల్వే లైను మీద మురుదేశ్వర చేరుకోవచ్చు.
విమాన మార్గం:
మురుడేశ్వరకి దగ్గర లోని విమానాశ్రయం మంగళూరు 165 కి.మీ. దూరంలో ఉంది. హుబ్లీ, పనాజీ విమానాశ్రయాలు దగ్గరలో ఉన్న వేరే విమానాశ్రయాలు.
No comments:
Post a Comment