నారదా! వేదాలూ వేదాంగాలూ వల్లించినా ఆచారహీనుడైతే అతడిని అవి ఏవీ కాపాడవు. మృత్యుకాలంలో వదిలేస్తాయి. రెక్కలు వచ్చిన పక్షులు గూడును విడిచినట్లు వెళ్ళిపోతాయి. కనక ఎంతటి పండితుడైనా సరే బ్రాహ్మాముహూర్తంలో(రాత్రి చివరిజాములో) లేవాలి. వేదాధ్యయనం చెయ్యాలి. కొంతసేపు ఇష్టదేవతను ధ్యానించాలి. యోగి అయినట్టయితే ప్రాణాయామాదికం నిర్వహించాలి. జీవుబ్రహ్మైకతను సాధించాలి. ఆ క్షణంలోనే జీవన్ముక్తుడవుతాడు.
రాత్రివేళలో చివరి యాభై అయిదు ఘటికలు ఉషఃకాలం. యాభై ఏడు ఘటికలు అరుణోదయం. యాభై ఎనిమిది ఘటికలు ప్రాతఃకాలం, అటుపైని ఆరవై ఘటికలకు సూర్యోదయం. (సూర్యోదయం నుంచి సూర్యోదయానికి అరవై ఘటికలు). ప్రాతఃకాలంలో బ్రాహ్మణుడు కాలకృత్యాలు తీర్చుకోవాలి. అందుకోసం నైఋతిదిశగా అమ్మువేటు దూరం వెళ్ళాలి. (బాణం వేసినంత దూరం). బ్రహ్మచారి అయితే ఆ సమయంలో యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి. గృహస్థుగానీ వానప్రస్థుడుగానీ అయితే నివీతంగా వెనక్కి వేసుకోవాలి. (వీపుమీద దండలా వేలాడేసుకోవాలి). నేలమీద గడ్డిపరకలు ఒత్తుగా కప్పి నెత్తిమీద అంగవస్త్రం వేసుకుని మౌనం పాటిస్తూ ఉమ్ములు వెయ్యకుండా శ్వాసను నియంత్రించి (ముక్కకుండా) మల మూత్ర విసర్జన చెయ్యాలి. దున్నిననేలమీదగానీ నీళ్ళల్లోగానీ చితిలోగానీ పర్వతాలమీదగానీ పాడుపడిన గుడులలోగానీ పుట్టల మీదగానీ పచ్చికబయళ్ళలోగానీ ఈ విసర్జనలు చెయ్యకూడదు. అలాగే ప్రాణులమిదా గుంటలలోనూ నడదారులలోనూ చెయ్యరాదు. నిలబడి విసర్జించకూడదు.
నారదా! సంధ్యావందన సమయాల్లోనూ భోజన సమయంలోనూ పళ్ళుతోముకుంటున్నప్పుడూ పితృకార్యం చేస్తున్నప్పుడూ దైవకార్యం చేస్తున్నప్పూడూ మలమూత్ర విసర్జనల్లోనూ సంభోగసమయంలోనూ గరుసన్నిధిలోనూ యజ్ఞయాగాదుల్లోనూ దానాలు చేస్తున్నవేళల్లోనూ బ్రాహ్మణుడు మాట్లాడకూడదు. మౌనంగా ఆ పనుల్ని నిర్వహించాలి.
బహిర్భూమికి కూర్చోబోయేముందు - దేవతలారా! ఋషులారా! పిశాచోరగరాక్షసులారా! కంటికి కనిపించని ప్రాణులారా! ఇక్కడనుంచి తొలగిపాండి. నేను మలమూత్రవిసర్జన చేస్తున్నాను - అని ప్రకటించాలి. తొలగిపామ్మని ప్రార్థించాలి.
వాయువు అగ్ని విప్రుడు సూర్యుడు జలాశయం గోవులు - వీటిని చూస్తూగానీ వీటి ఎదుటగానీ విసర్జన చెయ్యకూడదు. పగటి వేళలో అయితే ఉత్తరముఖంగానూ రాత్రివేళలో అయితే దక్షిణముఖంగానూ కూర్చుని విసర్జించాలి. విసర్జించాక వాటిమీద మట్టిగానీ ఎండుటాకులుగానీ గడ్డీగాదమూగానీ కప్పాలి. మూత్రం చుక్కలు దారిపాడుగునా పడకుండా తగిన జాగ్రత్త తీసుకుని (ఎత్తిపట్టుకొని) నీళ్ళ దగ్గరకు వెళ్ళాలి. చెంబుతో నీళ్ళు ముంచి తీసుకుని వేరేచోటుకి వెళ్ళి కడుక్కోవాలి. మట్టిరాసుకుని కడుక్కోవాలి. గట్టున ఉండే శ్వేత - రక్త - కృష్ణ - పీతవర్ణ మృత్తికలు పనికివస్తాయి. బ్రాహ్మణుడు తెల్లమట్టినే ఉపయోగించాలి. మిగతా వారికి ఏదైనా ఫరవాలేదు. తెల్లమన్ను దొరకనప్పుడు దొరికిన మట్టినే బ్రాహ్మణుడూ ఉపయోగించాలి. మట్టితో రుద్దుకోనిదే శుద్దికాదు. అయితే నీళ్ళల్లోనుంచిగానీ గుడినుంచిగావీ పుట్టనుంచి గానీ ఎలకల కలుగుల్నించిగానీ శౌచవిధికోసం మట్టిని తియ్యరాదు. ఒకరు ఉపయోగించగా మిగిలిన మట్టి సుతరామూ పనికిరాదు.
మూత్ర విసర్జనకన్నా రెండురెట్టు మలవిసర్జనకూ, మూడురెట్లు మైథునానికీ మృత్తికా శౌచం చేసుకోవాలి. లింగానికి ఒకటీ చేతికి మూడూ కాళ్ళు రెండింటికీ రెండూ మట్టిముద్దలు పులుముకోవాలి. ఇది మూత్రశౌచం. మలవిసర్జన శౌచానికి రెట్టింపు. లింగదేశంలో రెండూ గుదప్రదేశంలో అయిదూ చేతికి పదీ కాళ్ళు రెండింటికీ కలిపి ఏడూ మట్టిముద్దలు అవసరమవుతాయి. ముందుగా ఎడమపాదానికీ తరవాత కుడిపాదానికీ మృత్తికను పులుముకోవాలి. శౌచక్రమం ఇది. గృహస్థులకన్నా రెట్టింపు బ్రహ్మచారులకూ మూడురెట్లు వానప్రస్థులకూ నాలుగురెట్లు యతీశ్వరులకూ ఈ శౌచం అధికంగా అవసరం. ఒక్కొక్క మట్టిముద్దా కనీసం రాచ ఉసిరికాయంత ఉండాలి. ఎప్పటికప్పుడు ఒక్కొక్క ముద్దగానే తీసుకోవాలి. (ఒకేసారి పెద్దమట్టిముద్దను తీసేసుకుని చిన్నఉండలు చేసి పులుముకోకూడదని)
పగటిపూట అయితే ఇంత శౌచమూ చేసుకోవాలి. రాత్రిపూట ఇందులో సగం, ఆతురుడైతే ఇంతకన్నా సగం, మార్గమధ్యంలో అయితే అంతకన్నా సగమూ శౌచం పాటిస్తే సరిపోతుంది. అశక్తులూ బాలబాలికల విషయంలో మరింత మినహాయింపు ఉంది. మలమూత్రాల దుర్వాసన తొలగిపోయేట్టుగా మట్టి పులుముకుని ప్రక్షాళన చేసుకుంటే చాలు. ఇది అన్ని వర్గాలవారికీ వర్తించే శౌచవిధి అని మనువు చెప్పాడు.
శౌచక్రియ ఎప్పుడూ ఎడమచేతితోనే చెయ్యాలి. కుడిచెయ్యిని ఉపయోగించకూడదు. శరీరంలో బొడ్డుకి క్రిందిభాగాన శుద్దిచెయ్యవలసివచ్చినప్పుడు ఎడమచెేతినీ, బొడ్డుకి పై భాగాన్నయితే కుడిచేతిని ఉపయోగించాలని నియమం.
మలమూత్ర విసర్జన చేసే చోటుకి జలపూర్ణపాత్రను తీసుకువెళ్ళకూడదు. తెలియక అలా తీసుకువెడితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కేవలం నీళ్ళుతాగి మూడురాత్రులు పస్తులుండి తరువాత జపం చెయ్యాలి. ఆలాగని శౌచకర్మకు ఆలస్యం చెయ్యకూడదు. దేశం కాలం ద్రవ్యం శక్తి ఉపపత్తి - వీటిని చూసుకుంటూ శౌచం జరుపుకోవాలి.
మలవిసర్జనకు పన్నెండుసార్లూ మూత్రవిసర్జనకు నాలుగుసార్లూ తగ్గకుండా నీటిని గండూషించాలి. పుక్కిలించిన నీటిని తలవంచి ఎడమవైపుకి ఉమియాలి. అటుపైని ఆచమించి శ్రద్దగా దంతధావనం చేసుకోవాలి. ముళ్ళుండి పాలుగారే చెట్టునుంచి పన్నెండు అంగుళాలు పొడుగుండేట్టు చూసి పుల్లను విరుచుకోవాలి. చిటికెన వేలంత లావుండాలి. ఒక కొసని కుచ్చులాగా నలగగొట్టిగానీ నమిలిగానీ పళ్ళు శుభ్రంగా తోముకోవాలి. కడిమి - బర్రింక - మామిడి - మేడి - బొద్దుగ - వేప - రేగు పుల్లలు ప్రశస్తం. పుల్లను విరుచుకునేటప్పుడు చెట్టును అన్నాద్యాయ మంత్రంతో ఇలా ప్రార్థించాలి - నా అదృష్ట విశేషంవల్ల ఓషధీపతి చంద్రుడు వచ్చాడు. నా ముఖం కడుగుతున్నాడు. ఓ వనస్పతీ! ఆయుర్దాయం బలం యశస్సు వర్చస్సు సంతానం పశుసంపద ధనసంపద బ్రహ్మజ్ఞానం మేధాశక్తి నాకు కలిగించు.
అన్నాద్యాయ వ్యూహధ్వంసే సోమో రాజాయమాగమత్ ।
స మే ముఖం ప్రక్షాళ్యతే యశపా చ భగేవ చ ॥
ఆయుర్బలం యశో వర్చః ప్రజాః పశువసూని చ ।
బ్రహ్మప్రజ్ఞాం చ మేధాం చ త్వం నో దేహి వనస్పతే ॥
దంతకాష్ఠం దొరకనప్పుడుగానీ, దంతధావనం చేసుకోరాని రోజుల్లోగానీ నీటిని పన్నెండుసార్లు గండూషించాలి. బాగా పుక్కిలించి ఉమియాలి. పాడ్యమి అమావాస్య (దర్శ) షష్ఠి నవమి ఏకాదశి రవి వారాల్లో దంతాలకు పుల్ల తగిలించకూడదు. ఏడుతరాలు నశిస్తాయి.
దంతధావనమయ్యాక నోరు పుక్కిలించి కాళ్ళు కడుక్కుని పరిశుభ్రజలాన్ని ముమ్మారు ఆచమించాలి. తడి బొటనవేలూ చూపుడువేళ్ళతో రెండుసార్లు నాసికాపుటాలను తుడుచుకోవాలి. అంగుష్ఠానామికలతో కళ్ళూ చెవులూ తుడుచుకోవాలి. అంగుష్ఠకనిష్ఠికలతో బొడ్డు తుడుచుకోవాలి. తడి అరచేతితో గుండెమీదా తడివేళ్ళతో శిరస్సుమీదా మార్జనం చేసుకోవాలి.
అన్నాద్యాయ వ్యూహధ్వంసే సోమో రాజాయమాగమత్ ।
స మే ముఖం ప్రక్షాళ్యతే యశపా చ భగేవ చ ॥
ఆయుర్బలం యశో వర్చః ప్రజాః పశువసూని చ ।
బ్రహ్మప్రజ్ఞాం చ మేధాం చ త్వం నో దేహి వనస్పతే ॥
దంతకాష్ఠం దొరకనప్పుడుగానీ, దంతధావనం చేసుకోరాని రోజుల్లోగానీ నీటిని పన్నెండుసార్లు గండూషించాలి. బాగా పుక్కిలించి ఉమియాలి. పాడ్యమి అమావాస్య (దర్శ) షష్ఠి నవమి ఏకాదశి రవి వారాల్లో దంతాలకు పుల్ల తగిలించకూడదు. ఏడుతరాలు నశిస్తాయి.
దంతధావనమయ్యాక నోరు పుక్కిలించి కాళ్ళు కడుక్కుని పరిశుభ్రజలాన్ని ముమ్మారు ఆచమించాలి. తడి బొటనవేలూ చూపుడువేళ్ళతో రెండుసార్లు నాసికాపుటాలను తుడుచుకోవాలి. అంగుష్ఠానామికలతో కళ్ళూ చెవులూ తుడుచుకోవాలి. అంగుష్ఠకనిష్ఠికలతో బొడ్డు తుడుచుకోవాలి. తడి అరచేతితో గుండెమీదా తడివేళ్ళతో శిరస్సుమీదా మార్జనం చేసుకోవాలి.
No comments:
Post a Comment