Wednesday, August 5, 2026

Prajapatyam - ప్రాజాపత్యం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - ప్రాజాపత్యం

వేదాధ్యయనానికి ముందు ప్రాజాపత్యం చెయ్యాలి, గుండు కొట్టించుకుని మీసాలు తీయించుకుని గోళ్ళు తొలగించుకుని శుచి అవ్వాలి. ఒక పగలూ రేయీ మౌనంగా ఉండాలి. వ్యాహృతులు జపించాలి, ఆపోహిష్ఠాది మంత్రాలతో సంప్రోక్షించుకోవాలి. ఆద్యంతాలలో పునంతీ, స్వస్తిమతీ, పావమానేత్యాది మంత్రాలతో ఆయావిధులు నిర్వర్తించాలి.

సహస్రగాయత్రి చెయ్యాలి. కనీనం నూరు - లేదా వంద చెయ్యాలి. తర్పణలు విడిచి పెట్టాలి. అసంభాష్యులతో భాషించకూడధు. సత్యవాఙ్నియమం పాటించాలి. ప్రాజాపత్య సాంతపన పరాక చాంద్రాయణాదులకు ఈ నియమాలు సమానం. 

ఇలా చేస్తే పంచమహాపాతక విముక్తి కలుగుతుంది. మూడు చాంద్రాయణాలతో బ్రహ్మలోకం లభిస్తుంది. ఎనిమిదింటితో దేవతాసాక్షాత్కారం. పదింటితో సర్వచ్చందఃపరిజ్ఞానం,ర్వకామ సమువలబ్ధి.

మూడునాళ్ళు ప్రాతఃకాలంలోనూ మూడునాళ్ళు సాయంకాలంలోనూ అయాచితాన్నం తింటూ మరిమూడునాళ్ళు ఉపోష్యం ఉండి ప్రాజాపత్యం చెయ్యాలి. గోమూత్రం గోమయం గోక్షీరం గోదధి ఆవునెయ్యి వీటితో ఉపవాసం ఉండి ఏకరాత్రం గడిపితే అది సాంతపనం.

రోజుకి ఒక్కముద్దమాత్రమే తింటూ మూడునాళ్ళు ఉపవాసం చేస్తే అది మహాసాంతపనం. జలక్షీర ఘృతానిలాలను ప్రతిమూడునాళ్ళకూ ఒక్కసారి గ్రహిస్తూ జలాహారిగా ద్వాదశాహాలు ఉపవాసం చేస్తే అది పరాకవ్రతం. 

శుక్షపక్షంలో రోజుకి ఒకముద్ద చొప్పున పెంచుకొంటూ వెళ్ళి కృష్ణపక్షంలో (అలా తగ్గించుకుంటూ వచ్చి) ఒక్కొక్కటీ తింటూ అమావాస్యనాడు అస్సలు ఏమీ తినకండా ఉపోష్యం ఉంటే అది చాంద్రాయణవ్రతం.

ప్రాతఃకాలాన ఆహ్నికక్రియలు నిర్వర్తించి నాలుగుముద్దలూ, సాయంకాలాన విధులు నిర్వర్తించి సూర్యాస్తమయం అయ్యాక నాలుగు ముద్దలూ తింటూ నెలగడపడం శిశుచాంద్రాయణ వ్రతం. మధ్యాహ్నంపూట ఎనిమిదేసి హవిష్యపిండాలను తిని ఉపవాసాలుండటం యతిచాంద్రాయణం. 

ఈ వ్రతాలు ఒక్కొక్కటీ సప్తరాత్రకాల వ్యవధిలో త్వక్‌ - అసృక్‌ - పిశిత - అస్థి - మేదో - మజ్జా - వసాభాగాలను శుద్ధి చేస్తాయి. ఇలా శరీరాన్నీ ఆత్మనూ శుద్ధి పరచుకుని పురశ్చరణ స్వాధ్యాయాది కర్మలు ఆరంభించాలి. నియతాత్ముడై ఆచరించాలి. అప్పుడు ఇష్టకామ్యాలు అన్నీ సిద్ధిస్తాయి. 

నారదా! శ్రుతిసారమైన పురశ్చర్యావిధానం సవిస్తరంగా నీకు తెలియజేశాను. ఇది అత్యంత గోప్యంసుమా!

నారాయణమహర్షి! పురశ్చర్యావిధానం తెలిసింది. దానితోపాటు ప్రాజాపత్యాదివ్రతాలూ తెలిసాయి. మరి శాంతిప్రయోగాలుకూడా తెలియజేస్తే ధన్యుణ్ణి అవుతాను - అన్నాడు నారదుడు. సరే అని నారాయణుడు ఆరంభించాడు.

శాంతి హోమాలు




No comments:

Post a Comment