రేణుక దేవిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పిలుస్తారు. త్రిమూర్తులను సృష్టించి పసిపాపలుగా ఆడించినందున తనని జగదంబ అని పిలుస్తా ఎల్లరకు అమ్మ కనుక ఎల్లమ్మ అని ఊరికి ఎల్లల్లో ఉండటం వలన ఎల్లారమ్మ అని చండాల వాటికలో ఉద్భవించినందున మాతంగి అని లజ్జా గౌరీ అని క్షేమకరీమాత అని కుంకుడు చెట్టు కింద వెలుచుట వలన కుంకుళ్లమ్మ అని ఆటలమ్మ మసూచి వంటి వ్యాధుల నివారణ చేయటం వలన మారెమ్మ అని పోచమ్మ అని ముత్యాలమ్మ అని ఇలా వివిధ పేర్లతో కొనియాడుతారు భక్తులు దక్షిణ భారతదేశంలోనే కాక ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఉత్తరాఖండ్ కాశ్మీరు ప్రాంతంలో అమ్మవారి యొక్క తంత్ర సాధన చాలా ప్రసిద్ధిగాంచినది విదేశాలు అయినటువంటి థాయిలాండ్, మలేషియా సింగపూర్ ఇండోనేషియా మొదలగు ప్రాంతాలలో అమ్మవారి పూజ చాలా వైభవంగా జరుపుకుంటారు ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ దేవేరి త్రికాలజ్ఞాని త్రినేత్రదారుడు బృగు వంశమునందు జన్మించినటువంటి సప్తర్షి జమదగ్ని మహర్షి యొక్క ఇల్లాలు జమదగ్ని మహాముని క్రోధ దేవతల యొక్క ఆశీర్వాదము వలన నేరము చేసిన వారిని తన యొక్క కోపోజ్వాలలో భస్మిపట్లము చేయగల సమర్థులు.
జమదగ్ని జననము
బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులలో ఒకరైనటువంటి భృగు మహర్షి వంశము చాలా ప్రాశస్తం పొందినది అమ్మవారిని సేవించి లక్ష్మీదేవినే తనకు కుమార్తెగా పొందిన మహా ఋషులు భృగు మహర్షి ఆయనకు చ్యవనుడు అనే కుమారుడు జన్మించెను ఆయన పులోమజా అను పతివ్రత వలన ఋచీకుడు అను మహామునికి జన్మనిచ్చింది. ఋచీకుని భార్య సత్యవతి వారికి పుట్టిన సంతానమే జమదగ్ని.
సత్యవతి గాది మహారాజు యొక్క ఏకైక పుత్రిక తమకు ఒక్కగానొక్క సంతానము అయినటువంటి సత్యవతికి వివాహము జరిపించి రాజ్యమునంతటిని సామంతులకు అప్పగించి నిశ్చయించారు సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి ముని వంశస్థుడు సత్శీలత కలిగినటువంటి ఋచీకునికి ఇచ్చి వివాహము జరిపించెను తాను క్షత్రియ కులకాంత అవుట వలన తమకి జన్మించే సంతానము కూడా క్షత్రియ గుణములతో పుడతాడు అది ముని అయిన తన భర్త వంశమునకు కీడు వంటిది అని భావించి ఋచీకునికి తనకు కేవలం సాత్విక గుణములు కలిగిన బిడ్డ కావాలన్న కోరికను విన్నవించెను. అలానే మగసంతానము లేని తన తల్లిదండ్రులకు కూడా క్షత్రియ గుణములు కలిగిన బిడ్డను ప్రసాదించమని అడిగాను. సత్యవతి కోరిక మేరకు అత్తకు భార్యకు సంతానము నివ్వదలిచి యాగము చేసి రెండు కుండలలో పరమాన్నముతో నింపి ఒకటి అత్తగారిని ఇంకొకటి భార్యని భుజించమని అత్తగారికి ఇచ్చి పంపెను. ఆ రెండు కుండలలో క్షత్రియకుల సతి అయిన గాది యొక్క భార్యకి క్షత్రియ గుణములు గల బిడ్డను, ముని భార్య అయిన సత్యవతికి సాత్విక గుణములుగల బాలుడు పుట్టవలెను అనే ఉద్దేశంతో రెండు కుండలను విడివిడిగా ఇచ్చిన కానీ అల్లుడు ఋచీకుడు యందు అనుమానం కలిగిన సత్యవతి తల్లి తనకు మంచి బిడ్డ పుట్టవలెను అను ఉద్దేశంతో ఋచీకుడు తన భార్య కుండలో ఏవైనా శక్తులు నింపాడేమో అనుకొని స్వార్థంతో సత్యవతికి ఇచ్చిన కుండా భుజించి తనకు ఇచ్చిన ప్రసాదాన్ని సత్యవతికి ఇచ్చెను. అవి భుజించిన వారి గర్భంలో మారు బిడ్డలు పెరుగుచుండరి. అది గ్రహించిన ఋచీకుడు తన భార్య క్షత్రియ బిడ్డను మోస్తుంది అన్న విషయం తనకి తెలియజేశాను. అంతట భయమొందిన సత్యవతి ఆ బిడ్డను తన కుటుంబ తరువాతి తరమునకు చెందనున్న తన కోడలి గర్భమునకు మార్చమని ఋచీకుడుని అడిగింది. ఋచీకుడు అలాగే చేశాడు. అత్తకు మరియు భార్యకు కూడా సాత్విక గుణములు కలిగిన సంతానము కలిగిరి. గాది తన బిడ్డకు విశ్వామిత్రుడు అని నామకరణము చేసినది. సత్యవతి తన బిడ్డకు జమదగ్ని అను నామకరణం చేసినది అలా సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు, సత్యవతికి జమదగ్ని జన్మించితిరి. ఆ ముని బిడ్డ జమదగ్ని క్రోధ దేవతల ఆశీర్వాదంతో తనకు కోపం కలిగించిన వారిని తన క్రోధాగ్ని జ్వాలలతో భస్మము చేయగల శక్తి పొందెను.
రేణుక జననము
పూర్వం మధ్య భారత దేశము నందు వైగంగా నది తీరాన విదర్భ రాజ్యము విలసిల్లుతుండేది. ఆ రాజ్యము ఇష్వాకు వంశస్తులైనటువంటి ప్రశ్నజిత్తు మహారాజు ఏలుబడిలో ఉండేది రాజ్యం అంతటినీ తన కుటుంబంలా భావించి పాలించే రాజుకి సంతానం లేకపోవడం ఒక తీరని లోటులా మారిపోయింది. తన ఆస్థాన అర్చకుల ఆదేశం మేరకు రాజుగారు పుత్రకామేష్టి యాగం చేయించి అమ్మవారి కృప వలన యాగశికల నుండి తేజవంతమైనటువంటి ఒక పసిపాప కాంతులనీనుతూ ఆవిర్భవించెను. సంతోషించిన రాజు ఆ పాపకు రేణుక అను నామకరణం చేసిరి
రేణుక పుట్టిన తర్వాత తన తల్లి చనిపోవటం వలన రేణుక యొక్క పోషణ భారం ఆస్థాన పరిచారకురాలు అయినటువంటి మాతంగికి అప్పగించారు రాజుగారు. మాతంగి పర్యవేక్షణలో ఆస్థానంలో అందరి ప్రేమ అభిమానాలతో అల్లారుముద్దుగా పెరగసాగింది. క్షత్రియ కాంత అయినందున సమస్త యుద్ధ విద్యలు నేర్చుకొని మహారాగ్నికి ఉండవలసిన అన్ని లక్షణాలను ఇనుమడింప చేసుకొనెను. వేదవేదాంగాలు, ధనుర్విద్య మొదలగు విద్యలను అవపాసన చేసుకొనెను. యుద్ధ విద్యలతో పాటు భగవంతునిపై ఎనలేని భక్తి నమ్మకం తో కొంతకాలం తపస్సు ఆచరించెను. అలా కొన్ని కాలం గడిచిన తరుణంలో అగస్త్య మహాముని కోరిక మేరకు ప్రశ్నజిత్తు రేణుకను భృగుకులా వంశస్తుడైనటువంటి జమదగ్ని మహామునికి ఇచ్చి పరిణయము చేయనిచయించిరి.
రేణుక జమదగ్నిల కళ్యాణం (కుండలినీపురం)
జమదగ్ని మహాముని యొక్క గొప్పదనం తెలుసుకోదలిచిన రేణుక తనని పెంచి పెద్ద చేసినటువంటి పరిచారకురాలు మాతంగితో కలిసి జమదగ్ని ఆశ్రమనకు వెలుటకు దక్షిణాన ఉన్న పాండ్య దేశమందలి కుండలిపురమునకు బయలుదేరును అది దట్టమైన అటవీ ప్రాంతం పచ్చని చెట్లు పొదలతో పక్షుల రాగములతో శోభిస్తున్న సుందర ప్రదేశం. ఆ వాతావరణము ప్రకృతి శోభను చూసి అమ్మవారు రేణుక ఎంతో చకితురాలాయెను. ఆశ్రమమునకు చేరుకున్న తరువాత రేణుక, మాతంగి లోపలకి అడుగుపెట్టే సమయానికి కొందరు జమదగ్ని శిష్యులు స్త్రీకి లోపలికి అనుమతి లేదు అని అడ్డుకొనెను. వాళ్లు రేణుకతో వాగ్వివాదమునకు దిగెను. రేణుకా మాత కోపించి తన తపశక్తితో త్రినేత్రాన అగ్ని రగిల్చెను. వనమంతా మంటలు వ్యాపించినవి. ధ్యాన నిమగ్నుడైన జమదగ్ని దీనిని గమనించి వెంటనే తన యొక్క కమండలం నుంచి ఒక నీటి ధారను ఆ మంటలపై వ్యాపింపజేసెను. అంతటా ఆ మంటలు చల్లారిపోగా ఆ నీటి దార మాత్రం ఆగకుండెను. జమదగ్ని ముని ఆ నీటి ప్రవాహానికి కమండలు నది అని నామకరణం చేసెను. అప్పుడు శిష్యులు జమదగ్నిని చేరి అమ్మవారి యొక్క విషయము తెలియజేసెను. రేణుకాదేవి అత్యంత శాంతముతో తాను వచ్చిన వివరములు మునివర్యులకు తెలియజేసెను. జమదగ్ని వెంటనే మీరు రాజపుత్రిక ఋషులను పరిణయ మాడి మీరు ఏం సుఖాన్ని అనుభవిస్తారు. ఆశ్రమ ధర్మాలు అత్యంత కఠినముగా ఉంటాయి అవి మీరు పాటించలేకపోవచ్చు అనెను. వెంటనే రేణుక తాను ఇక్కడే కొన్ని రోజులు ఉండి మునికి పరిచర్యలు చేస్తాను అప్పుడు నిర్ణయించండి అని వేడుకొనెను. అందుకు సమ్మతించిన జమదగ్ని రేణుకను అనుమతించెను.
రేణుక తన యొక్క తపో బలముతో ఆశ్రమ కార్యక్రమాన్ని చక్కగా నెరవేర్చుచు జమదగ్ని మునియొక్క మనస్సు చూరగొనేను. కొంతకాలానికి జమదగ్ని మనసు మారి వివాహమునకు సమ్మతించెను. వారి యొక్క వివాహమునకు ఎందరో ఋషులు,దేవతలు విచేసినారు. వారి వివాహమునకు విచ్చేసిన ఇంద్రుడు వివాహ కానుకగా జమదగ్నికి కామధేనువును బహుమతిగా ఇచ్చెను.
సన్యాశ్రమము నుండి గృహస్థాశ్రమము లోకి అడుగు పెట్టిన జమదగ్ని మహర్షి సతీ సమేతుడై నిత్య కర్మలను అనుష్టానము చేయసాగెను. మాతంగి కూడా రేణుకాదేవి తోనే సహాయకురాలిగా ఆశ్రమము నందే ఉండసాగెను. తన పాతివ్రత్య శక్తితో నదీ తీరానికి వెళ్లి పోడి ఇసుకతో కుండలు చేసి వాటిలో నీటిని నింపి తీసుకువస్తూ ఉండేది.
రేణుక జమదగ్నుల గృహస్థాశ్రమం జమదగ్నికి సూర్యుని శాపం
వివాహ అనంతరము రేణుక జమదగ్ని మహర్షి యొక్క నిత్య కర్మలలో సహకరిస్తూ ఉండేది. ఒకరోజు జమదగ్నిముని రేణుకా సమేతుడై కమండలు నది తీరాన పయనిస్తుండెను. రేణుక యందు కామ వంచ కలిగిన జమదగ్ని రేణుకను త్వరత్వరగా నడిపించ సాగెను. అప్పుడు రేణుక ఎండవేడికి ఇసుక తినెల్లో నడవలేక నిలుచుండి పోయాను. కారణం తెలుసుకున్న జగదగ్ని సూర్యునిపై కన్నెరజేసెను. వెంటనే సూర్యుని తలుచుకొని నీ యొక్క తీక్షణ వెలుగు రేఖలు కృషించిపోవును గాక అని శపించెను. అప్పుడు సూర్యుడు కోపోద్రిక్తుడు అయి సూర్యుని ఎదుట రతి జరపరాదు అన్న నియమమును మరిచిన నీవు పాలించు రాజు చేతిలో ఘోరమరణం పొందుగాక అని శపించెను. అప్పుడు నారదుడు వచ్చి మహర్షి శాపం సూర్యునికి గ్రహణం రూపంలో సూర్యుని శాపం మహర్షికి ఉత్తమ గతులు కలిగించినట్లుగా ఒక ఉపశమనము చేశాను. శాంతించిన సూర్యుడు తన వేడిని తట్టుకొనుటకు కాళ్ళకి పాదుకలు తలకి ఛత్రము జమదగ్ని రేణుకలకు కానుకగా ఇచ్చి అంతర్దానమయ్యేను.
రేణుక తన యొక్క రాజమందిరపు భోగాలన్నీ విడిచి కేవలం పతిభక్తితో నార చీరలు రుద్రాక్ష మాలలు ధరించి సాధువుల జీవితాన్ని గడుపుతూ ఉండేది ఈ అవతారంలో ఉన్న రేణుకాదేవిని శబరి రేణుక అని తంత్రమందు అభివర్ణిస్తారు అమ్మవారి యొక్క పంచాక్షర మంత్రము యొక్క ఉపాసన అత్యంత ఫలదాయకము మరియు మోక్షదాయకం. అయితే కఠిన నిష్టలతో పాతివ్రత్యం వలన రేణుక ప్రతిరోజు కమండలుని నదీతీరానికి వెళ్లి పొడి ఇసుకతో కుండలు తయారు చేసి వాటిలో నింపి నీటిని నింపి ఆదిశేషుడిని తలచుట్టగా పెట్టుకుని దానిపై ఈ కుండను ఆశ్రమం వద్దకు మోసుకు వెళ్ళేది. ఒక కథనం ప్రకారం ఇసుక వేణువులన్నీ తన తపశక్తితో కుండగా మార్చడం వలన ఈవిడకీ రేణుక అని నామం ఏర్పడింది అని ప్రస్ఫుటించబడును.
పరశురాముని అవతార రహస్యం:
పరశురాముడు జమదగ్ని రేణుకల నాలుగవ సంతానం సత్యవతి కోరిక మేరకు క్షత్రియ గుణములు కలిగిన బిడ్డ తన తరువాతికి మార్చబడిన కోరిక ఇలా రేణుక గర్భమున పరుశురాముని రూపంలో వ్యక్తమైంది. అయితే పరశురాముడు అలా జన్మించుటకు వెనుక ఒక అవతార రహస్యము ఉన్నది పూర్వము పాలసముద్రమున పవళిస్తున్న లక్ష్మీ సమేతుడైన నారాయణుడి వద్దకు నారద ముని వచ్చును. నారాయుని యొక్క తరువాతి అవతారం గురించి తెలుసుకోవాలని ఉత్సుకత కలిగిన వాడై నారాయణుడిని శతధా పొగుడుచున్నారు. అది విన్న సుదర్శన చక్రం కోపంతో నేను లేనిదే విష్ణుమూర్తి అంతటి కార్యములు చేయగలడా అది కేవలం నా గొప్పతనమే అని అహంకారము వెళ్ళబుచ్చెను. అది విన్న శ్రీహరి ఫక్కున నవ్వి నాయనా సుదర్శన నీవు అవివేకంతో మాట్లాడుచున్నావు అది ఎంత పరమేశ్వరుని లీల నా శక్తిని ప్రయోగించుటకు నీవు ఒక సాధనము వంటివాడివి అంతియే అని అనెను. అప్పుడు సుదర్శనుడు కోపముతో అయితే నీ యొక్క తరువాతి అవతారంలో నా సహాయము లేకుండా మీ కార్యముని నిర్వహింపుడు అని అనెను. సరే నేను రానున్న కృతయుగములో భృగు వంశమునందు భార్గవరామునిగా జన్మించి అదే సమయంలో కార్తవీర్యార్జునుడిగా జన్మించిన నిన్ను ఓడించి శత్రుసంహారము చేసెద అని అనెను. ఆ ఆజ్ఞ వల్లే విష్ణుమూర్తి తన దశావతారాలలో ఆరవధి అయిన పరుశురామునిగా జన్మించెను.
రేణుకకు జమదగ్ని శాపం మరియు రేణుక చిన్నమస్తగా(ప్రచండ చండిక) మారుట:
మహర్షి జమదగ్ని ఋషివర్యులు అందరి సమక్షంలో గృహస్థాశ్రమ ధర్మాలను త్యజించి వాన ప్రస్తాశ్రమం తీసుకునెను. అప్పుడు వాళ్లు కుండలినీపురం వదిలి ప్రస్తుత వైశాఖవనంగా చెప్పబడే నల్లమల అడవులలో ఉన్న అలంపూర్ సంస్థానానికి చేరుకున్నారు. అక్కడ తమ ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే కొలువై ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామిని శక్తిమాత అలంపూర్ యోగినీ దేవతలకు అధినేత్రి అయినటువంటి జోగులాంబని సేవిస్తూ నిత్య కర్మలను అనుష్టించేవారు. ఒకానొక రోజు రేణుక ఎప్పటి వలె నీరు తెచ్చుకొనుటకు తుంగభద్రా నది తీరానికి వెళ్ళెను అక్కడ నీటిలో గంధర్వలోకంలో తమ చెలికత్తెలతో శృంగార కేళీ జరుగుతున్న చిత్రరథుడు అను గంధర్వుడి నీడ కనిపించెను. ఆ కామకేళిని చూసి మనస్సు చెల్లించిన రేణుక ఒకసారె తేరుకొని పొడి ఇసుకతో కుండను చేయుటకు ప్రయత్నించెను. కానీ ఇసుక నిలువటలేదు. వెంట వచ్చిన సర్పము చేతికి అందక మాయమయ్యాను. తాను పాతివ్రత్యముని మరిచి వానప్రస్థాశ్రమంలో ఉండగా ఇటువంటి ఆలోచన చేసి ఘోర పాపము చేసితిని అని భావించి ఒట్టి చేతులతో ఆశ్రమానికి చేరుకొనెను. అది అంతయు జ్ఞానదృష్టితో తెలుసుకొని జమదగ్ని కోపోద్రిక్తుడై రేణుకకు వెంటనే ఆశ్రమ బహిష్కరణ విధించెను. అంతియేకాక భయంకరమైన చర్మవ్యాధితో బాధపడుతూ పంచభూతాల నిరాదరణకు లోనుకమ్ము అని శపించెను. దిక్కుతోచని రేణుక తన సేవకురాలు మాతంగితో అడవులబాట పట్టెను. మాతంగి రేణుకకు సేవలు చేస్తూ కాలము గడుపుతుండగా ఒకనాడు దారిలో ఏకనాథ్, జోగినాథ్ అని ఇద్దరు సాధుపుంగవులు రేణుకని గుర్తించి ఆమె ఈ స్థితికి కారణం తెలుసుకొని బాధపడెను. రేణుకను రక్షించి దలచిన వారు రేణుకకు ఒక పాతివ్రత్య వ్రతమును బోధించెను.
మహర్షి జమదగ్ని ఋషివర్యులు అందరి సమక్షంలో గృహస్థాశ్రమ ధర్మాలను త్యజించి వాన ప్రస్తాశ్రమం తీసుకునెను. అప్పుడు వాళ్లు కుండలినీపురం వదిలి ప్రస్తుత వైశాఖవనంగా చెప్పబడే నల్లమల అడవులలో ఉన్న అలంపూర్ సంస్థానానికి చేరుకున్నారు. అక్కడ తమ ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే కొలువై ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామిని శక్తిమాత అలంపూర్ యోగినీ దేవతలకు అధినేత్రి అయినటువంటి జోగులాంబని సేవిస్తూ నిత్య కర్మలను అనుష్టించేవారు. ఒకానొక రోజు రేణుక ఎప్పటి వలె నీరు తెచ్చుకొనుటకు తుంగభద్రా నది తీరానికి వెళ్ళెను అక్కడ నీటిలో గంధర్వలోకంలో తమ చెలికత్తెలతో శృంగార కేళీ జరుగుతున్న చిత్రరథుడు అను గంధర్వుడి నీడ కనిపించెను. ఆ కామకేళిని చూసి మనస్సు చెల్లించిన రేణుక ఒకసారె తేరుకొని పొడి ఇసుకతో కుండను చేయుటకు ప్రయత్నించెను. కానీ ఇసుక నిలువటలేదు. వెంట వచ్చిన సర్పము చేతికి అందక మాయమయ్యాను. తాను పాతివ్రత్యముని మరిచి వానప్రస్థాశ్రమంలో ఉండగా ఇటువంటి ఆలోచన చేసి ఘోర పాపము చేసితిని అని భావించి ఒట్టి చేతులతో ఆశ్రమానికి చేరుకొనెను. అది అంతయు జ్ఞానదృష్టితో తెలుసుకొని జమదగ్ని కోపోద్రిక్తుడై రేణుకకు వెంటనే ఆశ్రమ బహిష్కరణ విధించెను. అంతియేకాక భయంకరమైన చర్మవ్యాధితో బాధపడుతూ పంచభూతాల నిరాదరణకు లోనుకమ్ము అని శపించెను. దిక్కుతోచని రేణుక తన సేవకురాలు మాతంగితో అడవులబాట పట్టెను. మాతంగి రేణుకకు సేవలు చేస్తూ కాలము గడుపుతుండగా ఒకనాడు దారిలో ఏకనాథ్, జోగినాథ్ అని ఇద్దరు సాధుపుంగవులు రేణుకని గుర్తించి ఆమె ఈ స్థితికి కారణం తెలుసుకొని బాధపడెను. రేణుకను రక్షించి దలచిన వారు రేణుకకు ఒక పాతివ్రత్య వ్రతమును బోధించెను.
"అమ్మా రేణుక నీ దుర్భరస్థితి నుండి కేవలం పరమశివుడు మాత్రమే రక్షించగలడు వెంటనే మేము చెప్పినట్లుగా చేయుము నీవు ఐదు గ్రామములలో సమస్త వర్ణాల వారి నుండి బిక్షపొందు, వచ్చిన దానితో అగ్ని లేకుండా పరమాన్నము వండి ఆ శివునికి నివేదించి తపస్సులో నిమగ్నమవ్వు అనెను".
మునుల మాట విన్న రేణుక వెంటనే అలా ధాన్యమును బిక్షగా పొంది ఏడుకుండలలో ధాన్యము, నీరు నింపి తన కటి భాగముపై నిలిపి సూర్యుని వేడితో అన్నము వండెను. ఏడు బోనాలు ఎత్తుకొని పరమశివుడు గంగాసమేతుడిగా ఉన్న ప్రదేశానికి వెళ్లి పరమాన్నము నివేదించి తపస్సులో నిమగ్నమాయెను. అమ్మవారు అలా కొంత కాలం ఆచరించగా తన చుట్టూ చెదలు పుట్టలు పెట్టి అమ్మవారిని కప్పేసేను. తన తపోనిష్ఠకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై రేణుకను శాప విముక్తురాలు చేసెను. అలా చేశాక రేణుకకు హెచ్చరికగా ఇలా అనెను అమ్మా రేణుక ఇప్పుడు నీవు ఆశ్రమముకి వెళ్ళు అక్కడ నీవు ఒక కఠిన పరీక్ష ఎదురు అవుతుంది ధైర్యంగా ఎదుర్కొని ఆహ్వానించి తర్వాత నువ్వు ఉత్తమ గతులు పొందుతావు అని వరం ఇచ్చి అదృశ్యమయ్యాను.
రేణుక మిక్కిలి సంతోషముతో మాతంగిని తోడుకొని ఆశ్రమముకి వెళ్ళెను సమస్తము తన దివ్య దృష్టితో తెలుసుకున్న మహర్షి తన కూతురు జాడ తెలుపమని రేణుకా దేవి తండ్రి జమదగ్ని ని
నిలదీస్తున్నసమయంలో వచ్చిన శాప విముక్తురాలైన రేణుకా ఎల్లమ్మ ను చూసి , జమదగ్ని కోపంతో
ఆశ్రమ ప్రవేశం లేదని చెప్పినా మళ్ళీ ఎందుకు వచ్చావని అంటున్నా, అతని మాట
వినకుండా నా భర్త పాదాల దగ్గరే నేను ఉంటాను అని పట్టు బట్టిన రేణుకా ఎల్లమ్మ ను
భస్మం చేయ తీర్థ జలం ప్రయోగించబోతుంటే, మీ చేతుల్లో భస్మం కావడం నాకు వరమే అని
నిలుచున్న ఎల్లమ్మని చూసి, నీకు ఈ పవిత్ర జలాన్ని తాకే అర్హత కూడా లేదు అని కుమారులను
పిలిచి , భర్త ఆజ్ఞ మీరిన భార్య మీ తల్లి. శిరచ్ఛేదం చేయమని
కొడుకులను ఆజ్ఞాపించినాడు.
రేణుకా దేవి, రేణుకా ఎల్లమ్మగా మారుట
పితృవాక్య పాలన చేసిన పరుశురాముని చూసి మహర్షి తల్లిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న పరుశురామును చూసి మూడు కోరికలు కోరుకోమనెను. అంతట సంతోషించిన పరశురాముడు తన తల్లిని బ్రతికించమని వేడుకొను జమదగ్ని కుమారునికి కొంత పుణ్య జలముని తన కమండలం నుండి తీసి పరుశురామునికి ఇచ్చి తలాముండెం జోడించి వాటిపై చల్లమని ఆదేశించిన పరశురాముడు కంగారులో మాతంగి తల రేణుకకు రేణుక తల మాతంగి జోడించి నీరు చల్లుతాడు. ఇద్దరు స్త్రీలు తమ యొక్క మారిన దేహములతో పైకి లేస్తారు అది చూసి చికిత్యుడైన పరుశురాముడు వాళ్ళని మారిన అమ్మలు మారెమ్మగా పిలుస్తాడు అలా మారెమ్మ యొక్క ఆవిర్భావం జరిగింది ఆ మారమ్మయే తమిళనాడులో మారీ అమ్మన్ గా ప్రసిద్ధి చెందినది.
పితృవాక్య పాలన చేసిన పరుశురాముని చూసి మహర్షి తల్లిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న పరుశురామును చూసి మూడు కోరికలు కోరుకోమనెను. అంతట సంతోషించిన పరశురాముడు తన తల్లిని బ్రతికించమని వేడుకొను జమదగ్ని కుమారునికి కొంత పుణ్య జలముని తన కమండలం నుండి తీసి పరుశురామునికి ఇచ్చి తలాముండెం జోడించి వాటిపై చల్లమని ఆదేశించిన పరశురాముడు కంగారులో మాతంగి తల రేణుకకు రేణుక తల మాతంగి జోడించి నీరు చల్లుతాడు. ఇద్దరు స్త్రీలు తమ యొక్క మారిన దేహములతో పైకి లేస్తారు అది చూసి చికిత్యుడైన పరుశురాముడు వాళ్ళని మారిన అమ్మలు మారెమ్మగా పిలుస్తాడు అలా మారెమ్మ యొక్క ఆవిర్భావం జరిగింది ఆ మారమ్మయే తమిళనాడులో మారీ అమ్మన్ గా ప్రసిద్ధి చెందినది.
అయితే మహర్షి ఈ గతాన్ని మర్చిపోవటకు తన నివాసముని హిమాలయములకు మార్చుటకు పయనం అయ్యెను. అయితే అప్పటికే వృద్ధాప్యంలోకి చేరుకున్న మాతంగి శరీరం మిగులు ప్రయాణానికి సహకరించకపోవడంతో తాను అక్కడికి రాలేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను. అప్పుడు మహర్షి రేణుకా శిరస్సు కలిగిన మాతంగిని పరలోక సాయం చేస్తూ నీ మహిమ వలన ఇక్కడి ప్రజలను కాపాడుచూ ఇక్కడే వుండు అని చెప్పిను. రేణుక శిరస్సు కలిగిన నీవు ఎల్లరకు అమ్మవై రేణుక ఎల్లమ్మగా మారి పూజలు అందుకొనుము అని పలికెను. అప్పుడు ఆ మారిన మాతంగి వనములకు పయనమయెను. ఆవిడను ప్రజలు తోట మారెమ్మ దండు మారెమ్మగా రేణుక ఎల్లమ్మగా అభివర్ణిస్తారు.
No comments:
Post a Comment