అటుపైని గురువుగారు శిష్యుణ్ణి ఆగ్నికుండం దగ్గరకి పిలవాలి. అప్పటికే శిష్యుడు స్నానం చేసి సంధ్యవార్చి వస్త్రద్వయం ధరించి బంగారు ఆభరణం దాల్చి కొత్త కమండలువు చేతబట్టి సిద్ధంగా ఉండాలి. గురుసన్నిధికి వచ్చి నమస్కరించాలి. సభాసదులకూ కులదేవతకూ నమస్కరించాలి. పీటమీద కూర్చోవాలి.
అప్పుడు అతణ్ణి గురువుగారు కృపాదృష్టులతో చూడాలి. తన చైతన్యం అతని శరీరంలోకి ప్రవేశించినట్లు భావించాలి. హోమం చెయ్యడంవల్ల లభించిన దివ్యదృష్టితో అధ్వసంశోధన చెయ్యాలి. ఇతడు శుద్ధాత్ముడవుతాడా కాడా? దేవతానుగ్రహానికి యోగ్యుడా కాదా? పరిశీలించాలి.
శిష్యుడి శరీరంలో షడధ్వ పరిశీలన చెయ్యాలి. పాదాలలో కళాధ్వాన్నీ సంధిబంధాల్లో తత్త్వాధ్వాన్నీ నాభిలో భువనాధ్వాన్నీ హృదయంలో వర్ణాధ్వాన్నీ ఫాలభాగంలో పదాధ్వాన్నీ మూర్ధంలో మంత్రాధ్వాన్నీ విశోధించాలి.
ఒక్కొక్క అధ్వాన్ని పరిశోధిస్తున్నప్పుడు శిష్యుణ్ణి దర్భకూర్చతో తాకుతూ, శోధయామ్యముమధ్వానం స్వాహా అంటూ - నేతితో తడిపిన తిలలు తారాఢ్యంగా ఎనిమిదేసిసార్లు హోమం చెయ్యాలి. ఇలా ఆరింటికీ చేశాక ఆ షడధ్వాలూ బ్రహ్మలో లీనమైనట్టు భావించాలి.
ఒక్కొక్క అధ్వాన్ని పరిశోధిస్తున్నప్పుడు శిష్యుణ్ణి దర్భకూర్చతో తాకుతూ, శోధయామ్యముమధ్వానం స్వాహా అంటూ - నేతితో తడిపిన తిలలు తారాఢ్యంగా ఎనిమిదేసిసార్లు హోమం చెయ్యాలి. ఇలా ఆరింటికీ చేశాక ఆ షడధ్వాలూ బ్రహ్మలో లీనమైనట్టు భావించాలి.
మళ్ళీ వాటిని సృష్టిమార్గాన పునరుత్పాదన చెయ్యాలి. అప్పుడు మళ్ళీ తన చైతన్యాన్ని శిష్యుడిలో లీనం చెయ్యాలి. పూర్ణాహుతి ఇచ్చి మంత్రాధిష్ఠాన దేవతను కలశంలోకి ఆవాహన చెయ్యాలి. మళ్ళీ వ్యాహృతులతో హోమం చేసి అగ్నికి ఆంగాహుతులిచ్చి అగ్నిని ఆత్మయందు విసర్జించాలి.
శిష్యుడి కళ్ళకు గుడ్డకట్టాలి. నేత్రమంత్రం జపిస్తూ ఆగ్నికుండంనుంచి శిష్యుణ్ణి మండలంలోకి తీసుకువెళ్ళాలి. ముఖ్యదేవికి అతడి చేతులతో పుష్పాంజలి సమర్పింపజెయ్యాలి. కళ్ళకు కట్టిన గుడ్డ విప్పాలి. దర్భాసనం మీద కూర్చోబెట్టాలి. కల్పోక్తవిధంగా శిష్యదేహంలో భూతశుద్ది చెయ్యాలి. న్యాసాలు జరపాలి.
శిష్యుడి కళ్ళకు గుడ్డకట్టాలి. నేత్రమంత్రం జపిస్తూ ఆగ్నికుండంనుంచి శిష్యుణ్ణి మండలంలోకి తీసుకువెళ్ళాలి. ముఖ్యదేవికి అతడి చేతులతో పుష్పాంజలి సమర్పింపజెయ్యాలి. కళ్ళకు కట్టిన గుడ్డ విప్పాలి. దర్భాసనం మీద కూర్చోబెట్టాలి. కల్పోక్తవిధంగా శిష్యదేహంలో భూతశుద్ది చెయ్యాలి. న్యాసాలు జరపాలి.
అప్పుడు వేరొక మండలంలో కూర్చోబెట్టాలి. కుంభంలో ఉన్న చిగురాకుల్ని శిష్యుడి శిరస్సున ఉంచి మాతృకను జపించాలి. దేవతాత్మకాలైన ఆ కుంభోదకాలతో స్నానం చేయించాలి. వెంటనే రక్షార్థంగా వర్ధనీజలం చిలకరించాలి. అప్పుడు శిష్యుడు లేచి బట్టలు మార్చుకోవాలి.
భస్మావలేపనం చేసుకోవాలి. గురుసన్నిధికి రావాలి. అప్పుడు దయామయుడై గురువుగారు తన హృదయంనుంచి మహాదేవి నిర్గమించి శిష్యుడి హృదయంలో ప్రవేశించినట్టు భావించాలి. ఆ ఉభయదేవీ మూర్తులకూ ఐక్యాన్ని భావిస్తూ గంధపుష్పాదులతో పూజచెయ్యాలి. తన కుడిచేతిని శిష్యుడి శిరన్పుపై ఉంచి కుడిచెవిలో - మహాదేవీ మహామంత్రాన్ని ముమ్మారు ఉపదేశించాలి.
వెంటనే ఆరంభించి శిష్యుడు ఆ మంత్రాన్ని నూటయెనిమిదిసార్లు జపించాలి. దేవతారూపుడైన గురువుగారికి సాష్టాంగనమప్కారం చెయ్యాలి. తన సర్వస్వమూ సమర్పించాలి. యావజ్జీవితమూ అనన్యబుద్ధిగా మెలగాలి. ఋత్విక్కులకు దక్షిణలిచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి.
సువాసినులకూ కుమారీమణులకూ వటువులకూ దీన అనాథ దరిద్రులకూ లోభించకుండా బట్టలూ భోజనాలూ పెట్టాలి. ధనసువర్ణాదులుకూడా యథాశక్తిగా ఇవ్వవచ్చు. తన కృతార్థతను గుర్తించి ఆ మహామంత్రాన్ని నిత్యమూ ఉపాసించాలి.
నారదా! ఉత్తమోత్తమమైన దీక్షావిధి సవిస్తరంగా నీకు తెలియజేశాను. ఇదంతా బాగా భావన చేసి దేవిపాదపద్మాలను సమాశ్రయించు. ఇంతకన్నా బ్రాహ్మణుడికి ఉత్తమ ధర్మంలేదు. వేదమార్గానుయాయులు వారివారి గుహ్యోక్త పద్ధతుల్లో మంత్రోపదేశాలు చెయ్యవచ్చు, పొందవచ్చు.
నారదా! ఉత్తమోత్తమమైన దీక్షావిధి సవిస్తరంగా నీకు తెలియజేశాను. ఇదంతా బాగా భావన చేసి దేవిపాదపద్మాలను సమాశ్రయించు. ఇంతకన్నా బ్రాహ్మణుడికి ఉత్తమ ధర్మంలేదు. వేదమార్గానుయాయులు వారివారి గుహ్యోక్త పద్ధతుల్లో మంత్రోపదేశాలు చెయ్యవచ్చు, పొందవచ్చు.
ఇప్పుడు నేను చెప్పింది సనాతనమైన తాంత్రికరీతి. గురువులు చెప్పిన మార్గంలో ప్రయాణించడమే ఎప్పటికీ శ్రేయస్కరం. నువ్వు అడిగావు నేను చెప్పాను. పరాంబికను సేవించు. త్రికరణశుద్ధిగా ఉపాసించు. నిత్యమూ నేను అలా ఆరాధించి ఇలా పరనిర్వృతిని (అత్యంత మనశ్శాంతి) పొందుతున్నాను - అని నారాయణమహర్షి సంభాషణ ముగించాడు.
కన్నులు మూసుకుని దేవీపాదపద్మాలను ధ్యానిస్తూ సమాధిలో మునిగిపోయాడు. నారదుడు వినయవినమితగాత్రుడై ఆ మునిశిఖామణికి ఆ జ్ఞానస్వరూపునికి ఆ కృపాజలనిధికి ఆ అమృతాంతరంగునికి ఆ శిష్యవత్సలునికి ఆ నిష్ఠానిధికి సాష్టాంగనమస్కారం చేసి, దేవీ దర్శనలాలసుడై వెంటనే తపస్సుకి వెళ్ళిపోయాడు.
శౌనకాది మహామునులారా! నారదనారాయణ సంవాద రూపంగా ఈ విశేషాలన్నీ మా గురువుగారు వ్యాసభగవానుడు జనమేజయమహారాజుకు ఉపదేశించారు. వాటినే యథాతథంగా మీకు నేను చెబుతున్నాను. ఇంతకుమించి ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదు - అన్నాడు సూతమహర్షి.
సూతమహర్షి! వినయశీలివి కనక నువ్విలాగే అంటావు. ఎన్నెన్ని విశేషాలు చెప్పావు! ఎంతెంత సందేహాలు తీర్చావు! నీ జ్ఞానం నీ పరిజ్ఞానం అమోఘం. అనన్యం. ఇంతా విన్నాక జనమేజయు డేమన్నాడు? వ్యాసుడు ఇంకా ఏమి చెప్పాడు? అది కూడా తెలియజెయ్యి. వినాలని మాకందరికీ కుతూహలంగా ఉంది - అన్నారు శౌనకాది మహామునులు. సూతుడిప్పుడింక వ్యాసజనమేజయ సంభాషణగా కథను కొనసాగించాడు.
హే భగవన్! వ్యాస! సర్వధర్మజ్ఞా! సర్వశాస్త్ర విదాంవరా! ద్విజులందరూ శక్తిని ఆరాధించాలనే కదా వేదం చెప్పింది. సంధ్యాకాలాల్లో నేమిటి ఇతర సమయాల్లో నేమిటి జగన్మాతనే నిత్యమూ ఉపాసించాలి. మరి ఆలాంటప్పుడు కొందరు ద్విజులు దేవీ వరివస్యను(సేవ) విడిచిపెట్టి ఇతరదేవతలను ఆరాధిస్తున్నారెందుకని?
శౌనకాది మహామునులారా! నారదనారాయణ సంవాద రూపంగా ఈ విశేషాలన్నీ మా గురువుగారు వ్యాసభగవానుడు జనమేజయమహారాజుకు ఉపదేశించారు. వాటినే యథాతథంగా మీకు నేను చెబుతున్నాను. ఇంతకుమించి ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదు - అన్నాడు సూతమహర్షి.
సూతమహర్షి! వినయశీలివి కనక నువ్విలాగే అంటావు. ఎన్నెన్ని విశేషాలు చెప్పావు! ఎంతెంత సందేహాలు తీర్చావు! నీ జ్ఞానం నీ పరిజ్ఞానం అమోఘం. అనన్యం. ఇంతా విన్నాక జనమేజయు డేమన్నాడు? వ్యాసుడు ఇంకా ఏమి చెప్పాడు? అది కూడా తెలియజెయ్యి. వినాలని మాకందరికీ కుతూహలంగా ఉంది - అన్నారు శౌనకాది మహామునులు. సూతుడిప్పుడింక వ్యాసజనమేజయ సంభాషణగా కథను కొనసాగించాడు.
హే భగవన్! వ్యాస! సర్వధర్మజ్ఞా! సర్వశాస్త్ర విదాంవరా! ద్విజులందరూ శక్తిని ఆరాధించాలనే కదా వేదం చెప్పింది. సంధ్యాకాలాల్లో నేమిటి ఇతర సమయాల్లో నేమిటి జగన్మాతనే నిత్యమూ ఉపాసించాలి. మరి ఆలాంటప్పుడు కొందరు ద్విజులు దేవీ వరివస్యను(సేవ) విడిచిపెట్టి ఇతరదేవతలను ఆరాధిస్తున్నారెందుకని?
కొందరు వైష్ణవులు కొందరు గాణపత్యులు కొందరు కాపాలికులు కొందరు బౌద్దులు కొందరు దిగంబరులు - ఇలా రకరకాలవారు కనిపిస్తున్నారు. వేదవాక్కుపట్ల వీరికి శ్రద్ధలేనట్టేనా? ఈ సందేహం నువ్వే తీర్చాలి. బుద్ధిమంతులూ పండితులూ నానాతర్కవిచక్షణులూ అయ్యుండీ వేదాలపట్ల శ్రద్ధలేకపోతే ఎలాగ? స్వీయశుభపరంపరను ఎంతటి బుద్ధిహీనుడైనా కోరి భంగపరచుకోడే.
అటువంటిది వీరంతా దేవీసేవను విడిచి పెట్టేశారంటే కారణమేమిటో ఊహించలేకపోతున్నాను. దయచేసి ఈ సందేహం తెముల్చు. ఆలాగే నీ ప్రసంగంలో మణిద్విపమహిమను గురించి వాచవిగా చెప్పావు. దేవీ నివాసమన్నావు. దాన్ని సవిస్తరంగా కన్నులకు కట్టించు. నేను భక్తుణ్ణి. శ్రద్దగా వింటున్నవాణ్ణి. నాలాంటివారికి గురువులు ప్రసన్నులై గుహ్యాతి గుహ్యాలను సైతం ప్రకటం చేస్తారుగదా! (ప్రసన్నాస్తు వదంత్యేవ గురవో గుహ్యమప్యుత 8 - 8)
జనమేజయమహారాజా! అడగవలసింది అడగవలసిన సమయంలో అడిగావు. బుద్ధిమంతుడవు. వేదాలపట్ల శ్రద్ధ కలవాడవు. కనక నీకు దాచకుండా అన్నీ చెప్పవలసిందే. నీ సందేహాలు తీరుస్తాను. విను.
ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం
జనమేజయమహారాజా! అడగవలసింది అడగవలసిన సమయంలో అడిగావు. బుద్ధిమంతుడవు. వేదాలపట్ల శ్రద్ధ కలవాడవు. కనక నీకు దాచకుండా అన్నీ చెప్పవలసిందే. నీ సందేహాలు తీరుస్తాను. విను.
No comments:
Post a Comment