Monday, April 27, 2026

Dushkarmalu Narakayatanalu - దుష్కర్మలు - నరకయాతనలు

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - దుష్కర్మలు - నరకయాతనలు

నారదు డిట్లనెను: ఓ సనాతనమునీ! ఏయే కర్మభేదములు నరకయాతనలు గల్గించునో యాయా కర్మభేదము లెన్ని విధములో నాకు తెలుపుము.

శ్రీనారాయణుడిట్లనెను: ఏ దుష్ఠుడు పరుల భార్యను-ధనమును-సంతతిని హరించునో యా దుష్టుడు యమదూతల బారి జిక్కును. వాడతి భీకరమైన యముని కాలపాశములచే బద్దుడై యాతనలు గల్గించు తామిస్రనరకమున త్రోయబడును. అచ్చడ యమభటులు పాశములు చేతబూని వానిని పట్టి కొట్టి తిట్టి భయపెట్టి పలు ఇక్కట్టులు పెట్టుదురు. 

బ్రహ్మపుత్రా! అపుడా నారకుడు వివశుడై మూర్చిను. ఒక విటుడింకొక పురుషుని మోసగించి వాడింటలేని తఱి వాని పెండ్లమును ధనాదులను విడువ కనుభవించును. అట్టివాడు యమకింకరులచేత నంధ తామిస్రమను నరకాంధ్యమున నెట్టబడును. అటవాడు ఘోర యమ యాతనలు పడును. వాడు మతి-చూపులు చెడిన వాడై మొదలంట నఱుకబడిన చెట్టువలె గూలును. 

అందువలన దాని నంధతామిస్రమని పెద్దలందురు. ''నేను'' ''ఇది నాది'' యును నహంకృతితో నొకడు ప్రాణులకు ద్రోహము తలపెట్టును. అతడు ప్రతిదినమును కార్యమగ్నుడై స్వార్దముతో తన కుటుంబమును మాత్రమే పోషించుకొనును. అట్టివాడు తన వన్నియు నిచ్చటనే వదలిపెట్టి తన కర్మఫలము పొందును. అతడెల్లరకును భితి గొల్పునటి రౌరవనరకము గూలును. 

ఈ లోకమునంగొకడు ప్రాణుల నెల్ల హింసించును. అట్టి హింసకునిచే హింస బొందినవారు నరకములో రురులైవానిని బాధపెట్టుదురు. అందువలన రౌరవమను నరకము పేరేర్పడెనని పండితులు వచింతురు. ఈ రురువనుజంతువు కర్పముకన్న మిక్కిలి క్రూరమైనది. అందుచే నగి మహారౌరవమని పెద్దలచే పేర్కొనబడినది. ఇతరులను బాధించి పీడించువాడీ రౌరవమునపడును. అందువాడు మాంసము తిను రురు జంతువుల చేత తినబడును.

అతిక్రూరముగ కోపముతో పశుపక్షులను బంధించు మూడుని యమదూతలు పట్టి కట్ట కొట్టుదురు. నారదా! వాడుతాను హింసించిన పశు-పక్షుల కెని రోమములు గలవో యన్ని వేలేండ్లు కుంభీపాకనరకమం దుండును. వాని పై సలసలమను వేడినూనెపోయుదురు. 

తనతల్లిదండ్రులకును విప్రులకునుబ్రాహ్మణులకును ద్రోహముబూనువాడు''కాలసూత్ర'' నరకమున పడవేయబడి సూర్యాగ్నుల మంటలచే తపింపచేయబడును. వాని శరీరములోన బైట నాకలి-దప్పుల పెనుమంటలు చెలరేగను. వాడా నరకమందే తిరుగును కూర్చుండును పరుగెత్తును విదురించును. 

దేవఋషీ! ఎవుడు తన వైదికమార్గమును వదలి పాషండమతమును నిరాటంకముగ చేపట్టునో యమభటులు వానిని నరకమున ద్రోతురు. అది అసిపత్రవన మనునరకము. అందు వానిని కొరడాలతో కొట్టుదురు. వాడందు కత్తికి రెండు వైపుల పదునున్న '' యసిపత్ర'' ములచేత చీల్చబడుచు నిటునటు పరుగులు దీయును. అట్లు తన యంగము లన్నియును ఛేదింపబడుచుండగా నయ్యోఏ చచ్చితి! చచ్చితి! ననివాడు మహావేదనపడి మూర్చిల్లి యడుగడుగునకు క్రింద పడిపోవును. అల్పబుద్దిగలవాడు తన ధర్మానుసారముగ పాషండమతఫల మనుభవించును. 

ఒక రాజుగాని రాజపురుషుడుగాని యధర్మముగ నితరులను దండించును. అతడు బ్రాహ్మణులను దండించినచో పాప ఫలముద సూకర ముఖ మనబడు నరకమున యమభటులసచేత త్రోయబడును. అతడచట విసరు తాతిలోని పిండివలె నుగ్గునుగ్గయిన యవయువముల బాధతో నార్తితో కేకలు పెట్టుచు మూర్చిల్లును. 

అతడటుల భాధింపబడి పెక్కురీతుల వేదనలు పొందును. ఎవడితరుల బాధ గుర్తింపలేడో యెవడు నీచకర్మ చేయునో-ఏవా డీశ్వర కల్పితములగు నల్లులు మున్నగు వాని కూడా భాధించునో యా ద్రోహమునకు వా డం ద కూపనరకముందు గూలును.

అతడచట పశు-మృగ-పక్షులచేత పాములచే - తేళ్లచే దోమలచే నల్లులచే పీడింపబడును. అతడా పెంజీకట దోమలు దందశూకములు మున్నగువాని చేత భాదింపబడును. ఇట్టి దురవస్ధ నీచ తనువుగల జంతువు కిచటనే కల్గును. 

ఎవ్వడు తన యన్నమును ధనమును మన్త్రవిహితములైన పంచయజ్ఞములతో దేవతల దేయక కాకివలె తాలొక్కడే యనుభవించునో ఆ పాపి కృమిభోజనమను నరకమునందు క్రూర యమభటులచేత గూల్చబడును. వాడచ్చోట లక్ష యోజనముల వైశాల్యముగల కృమికుండమున బడి తానొక పురుగై యందలి పురుగులచే తినబడును. 

అతిధులకు పెట్టక తానే కుడి చినవాడు నిదే నరకమున గూలును. ఎవ్వడు బంగారముగాని రత్నము గాని దొంగలించునో ఆ వస్తువులు బ్రాహ్ణునివిగాని యితరులవిగాని వచ్చును. నారదా! అట్టిదొంగను యమకింకరులు బాధింతురు. అట్టి దొంగ నచట భగభగమను నయః పిండముల వంటి రోకళ్లతో కసబిస ద్రోక్కుదురు. 

ఎవ్వడైన మదమెక్కి పొందరాని యువతిని తగుల్కొనునో యే రేగిన మదవతియైన తనకు తగనివానితో రుసరుసలాడుచు తమకము దీర్చుకొనునో వారిర్వురిని యమభటులు వాడి కొరడాలతో గొట్టుదురు. మఱి భగ్గున మండు నినుప యువతినిచేసి యాయువకునితోదానిని కౌగిలింపింతురు. 

అ మదవతిని గూడ యినుప యువకునితో కౌగిలింపచేతురు. ఒక్కొక్క పాపాత్ముడు పెక్కురు స్త్రీలను గూడును. యమభటులు వాని నినుము వంటి వజ్రకంటకములు గలశాల్మలీనరకమున పడవేసి బాధింతురు. తమ క్షాత్రము విడనాడి పాఖండమచము పట్టిన రాడపురుషులను స్వధర్మము విడనాడిన నరులు చ్చి దుఃఖము లందుదురు. నారాదా! అట్టి పాపులు మర్యాదలు లేనివారు. వారు పాపదుర్గములప్రక్కనేయున్న యగడ్తల నదులనుబోలు లోతైన వైతరణీతప్తజలములం దుక్కిరిబిక్కిరియగుచుందురు.

నారదా| అందు పెక్కు జలజంతువులు వానిని తినుచున్నను ప్రాణములు వాని శరీరమును వదలిపెట్టవు. వాడిటునటు తిరుగుచుండును. పాపులు తామ చేసికొన్న పాపాలు పండుట వలన మలమూతమ్రలు నెత్రుమాంసములు గోళ్ళ వెండ్రుకలు నెముకలు మేదస్సు మజ్జలతో నిండిన నదిలో వారు మునుగుదురు. 

వృషలీపతులు భ్రష్టాచారులు సిగ్గుమాలినవారును సదాచరనియమములు పాటించని పశువర్తనులునునల మూత్రములు శ్లేష్మరక్తములును శ్లేష్మమలములు నిండిన నదిలోగూలుదురు. ఆ దురాగ్రహులగుయమసేవకు లాపురుల నోళ్లలో మలమూత్రమును నెట్టుదురు.ఏద్విజాతుల వారు గాడిద కుక్క మున్నగు జంతువులను పెంచుదురో-వేటతమకమున మృగములను వేటాడుదురో-ఆ దుర్మార్గులు చచ్చిన మీదట యమభటులువాడిములుకులకుగురి యగుదురు. 

ఏనరాధముల-డాంబికులనుగువారు దంభయాగముతో పశువులను హింసింతురో వారు చచ్చిన పిమ్మటయమ భటులచేత''విశసన'' నరకమున గూల్చబడుదురు. అచట యమభటులు వారిని బెట్టిదంపు కొరడాలతో గొట్టుదురు. ఏ ద్విజు డగ్గలమైన మేహాతిరేక మాపుకోలేక తనసజాతి స్త్రినోటితో రేతస్సు త్రాగించునో ఆమూఢుని భటులు రేతః కుండమున పవడేసి వానిచే రేతస్సు త్రాపుదురు. 

దొంగలు నిప్పంటించు వారు విషము పెట్టువారు గ్రామాలను వర్తకులనుగంపులను దోచువారుఅగు రాజులను రాజులను రాజపురుషులను వీరందఱిని చచ్చిన యమదూతలు ''శ్వానకదన'' మను నరకమున గూల్తురు. ఆ నరకము నందేడు వందల ఇరువదికి పైగా చితవిచిత్రములగు విచిత్రములగు కుక్కలు గబగబ ప్రాణులను పీకి పాకము పట్టను. 

మునీశా| ఈ సారమేయాదన నరకమతి దారుణమైనది సుమా| ఇక మీదట ''అవీచి'' మున్నగు నరకములను గూర్చి వివరుంతును.

శ్రీనారాయణ డిట్లనెను: ఓ దేవమునీ! ఏ పాపులు లేచినది మొదలబద్దము లాడుదురో డబ్బిచ్చి పుచ్చుకొనుటలో నసత్యము లాడుదురో వారు చచ్చిన పిదప దారుణమైన''యవీచి'' నరకమున పడుదురు. అచట వారిని యమ దూతలు నూఱు యోజనముల యెత్తైన పర్వతము నుండి క్రిందకి పడవైతురు. వారాకాశము నుండి క్రింద పడునపుడలలు లేని నేలపై నీటి కెరటాలున్నట్లు దోచును. 

నారదా! అందులకే దానిని''అవీచి'' యందురు. అందు పడినవారు చిత్తు చిత్తుగ క్షీణించినను చావరు. మఱల క్రొత్త తనువులు దాల్తురు. బ్రహ్మపుత్రా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో నెవడైనను సోమపానము చేసి పిదప సురాపానము చేయునో అతడును నరకమున గూలును. యమ భటులతనికి వేడి లోహద్రవము త్రాపుదురు. ఆ ద్రవ మెల్లప్పుడు నిప్పు మంటలతో సలసల క్రాగును. 

ఏ నరాధముడు తనకు గౌరవ పాత్రుడైనవానిని గౌరవింపడో తన కంటె విద్య-జన్మ-తపస్సు-వర్ణము-ఆశ్రమము- ఆచారము లందు శ్రేష్టుడైన వాని నెవడు గౌరవింపడో వారు క్షారకర్దమ నరకమందు యమభటులచేత పడవేయబడును. వాడచట తల క్రిందుగనుండి ఘోరయాతనల ననుభవించును. మునిపుంగవా! ఏ నరుడు గాని నారి గాని నరమేధముతో నేదేని దేవతను గొల్చునో నరపశువు మాంసము తినునో- ఆ చనిపోయిన నర పశువులు తిరిగి యమ లోకము నందు తన్ను చంపి తిన్న వానిని వాడి కత్తితో కోసి తినును. వాని నెత్తురు క్రోలి పెక్కు రీతుల నటించును పాడును. భూమిపై మాంసము తినువారు ప్రవర్తించు రీతిగ యమలోకమందును ప్రవర్తించును. 

నారదా! ఏ నేరములు చేయక మోసములు చేయక వనము లందు గాన గ్రామము లందు గాని సాధు జీవనము గడుపు పుణ్యాత్ముల నెవరు మోసగింతురో ఎవరా సాధులును శూల-కంటక-సూత్రములచే బాధించి వినో దింతురోవారు చచ్చి యమభటులచేత శూల పాత నరకమ మందు పడవేయబడుదురు. వారచ్చట వాడి శూలముల చేత గ్రుచ్చబడుదురు.అఱ్ఱాట క తీరని దప్పిచే వారు పీడితులగుదురు. వాడి ముక్కు కొనలు గల కొంగలు కంకములు మున్నగు పక్షుల చేత చీల్చబడుదురు. 

ఆ పాపులు తమ చేసిన పాపములు తలపోసికొందురు. మఱికొందఱు పాపులు తీవ్ర ప్రవర్తనతో నితరుల నుద్రేక పఱతురు. కొందఱితరులను భయపెట్టుదురు. అట్టివారలు దంద శూకమను నరకమున గూలుదురు. అందు పెక్కు దందశూకము లుండును. వానికైదు గాని యేడు గాని ముఖములుండును. పాము కన్నములోని యెలుకను పట్టి మ్రింగును. అట్లే కొందఱు దుష్ఠులు కటికి చీకటి బావులలో గాని గాదెలలో గాని గుహలలోగాని ప్రాణులను బంధింతురు. అట్టి పాపులను యమ కింకరులు బాధలు పెట్టుదురు. దట్టమైన పొగ మంటలు విషపు మంటలు నిండిన చోట్ల యమ భటులట్టి పాపుల నుక్కిరి బిక్కిరి యగునట్టు లడ్డగింతురు.

నారదా! పాపాత్ములు నరకాలకు పోయినట్టే ధర్మాతులు సుఖప్రదాలయిన లోకాలకు వెడతారు. మహామునీ! సారాంశంగా ఒక్కమాట చెబుతాను, ఆలకించు. దేవీపూజనం దేవి ఆరాధనం - ఇదొక్కటే అందరికీ సర్వపాప పరిహారకమైన ఉత్తమోత్తమ ధర్మం. దీనిని అనుష్టించిన ప్రాణికి మరింక చింతలేదు. నరకం దరిదాపులకైనా పోవలసిన అవసరం ఉండదు. సంసార సాగరంనుంచి ఉద్ధరించగలిగినది శ్రీమన్మహదేవి మాత్రమే.

నారాయణ మహర్షీ సారాంశం గ్రహించాను. ఇంతకీ నువ్వన్న దేవ్యారాధన రూపమైన ఆ ధర్మం ఎటువంటిది? ఎలా ఆరాధిస్తే ప్రసన్నురాలు అవుతుంది? ఆరాధన విధానం ఎమిటి? లోగడ ఎవరు ఎపుడు ఎలా ఆరాధించి తరించారు? ఏయే కష్టాలను అతిగమించారు?, విశేషాలు తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.



శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment