గౌతముడి శాపానికి గురియైన ఆ విప్రులందరికీ వేదాలు మరుగునపడ్డాయి. సంధ్యవారుద్దామంటే అక్షరం పెగలడంలేదు. గాయత్రీమంత్రం గుర్తుకి రావడంలేదు. ఆశ్చర్యమనిపించింది. మళ్ళీ ఆందరూ గుమికూడారు. గౌతముడి శాపం పనిచేస్తోందని గుర్తించారు.
చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపం చెందారు. పరుగుపరుగున వచ్చి మహర్షి కాళ్ళమీద పడ్డారు. సిగ్గుతో తలలు దించుకుని నిలబడ్డారు. వెక్కి వెక్కి విలపించారు. ఏమి మాట్లాడడానికీ ముఖం చెల్లక క్షమించు క్షమించు క్షమించు అంటూ లెంపలు వేసుకున్నారు.
చుట్టూ చేరారు. మాటిమాటికీ ఇదేమాట. మరొక మాటలేదు. కరుణాపూర్ణ హృదయుడు మునీశ్వరుడు మెల్లగా పెదవి కదిపాడు.
విప్రులారా! నా శాపానికి తిరుగులేదు. కృష్ణావతారపర్యంతం మీ అందరి ఉనికీ మనికీ కుంభీపాకనరకం లోనే. అటు పైని కలియుగం వస్తుంది అప్పుడు ఆ నరకంనుంచి బయటపడి భూలోకంలో బ్రాహ్మణులుగా జన్మిస్తారు. వేదమార్గవిముఖులై పతితులవుతారు. ఇది తప్పదు.
విప్రులారా! నా శాపానికి తిరుగులేదు. కృష్ణావతారపర్యంతం మీ అందరి ఉనికీ మనికీ కుంభీపాకనరకం లోనే. అటు పైని కలియుగం వస్తుంది అప్పుడు ఆ నరకంనుంచి బయటపడి భూలోకంలో బ్రాహ్మణులుగా జన్మిస్తారు. వేదమార్గవిముఖులై పతితులవుతారు. ఇది తప్పదు.
నిజంగా తప్పించుకోవాలనే కోరిక మీకు ఉంటే ఆ జన్మలోనైనా గాయత్రీపాదపద్మాలను భక్తితో సేవించండి. వెళ్ళిరండి - అని నిష్కర్షగా చెప్పి సాగనంపాడు. ఇదంతా ఒక ప్రారబ్ధంగా భావించి మనశ్శాంతితో మౌనంగా తపస్సు చేసుకున్నాడు.
జనమేజయా! గౌతముడి శాపం కారణంగా ఆ విప్రులందరూ ద్వాపరాంతం వరకూ కుంభీపాకనరకం అనుభవించారు. కలియుగం ప్రారంభంకాగానే ఆ నరకంనుంచి బయటపడి భూలోకంలో జన్మించారు. ఆ విప్రులూ వారి సంతతి వారే ఇప్పటికీ సంధ్యాత్రయ విహీనులై గాయత్రీవివర్జితులై వేదవిదూరులై పాషండమతాలను అనుసరిస్తున్నారు.
జనమేజయా! గౌతముడి శాపం కారణంగా ఆ విప్రులందరూ ద్వాపరాంతం వరకూ కుంభీపాకనరకం అనుభవించారు. కలియుగం ప్రారంభంకాగానే ఆ నరకంనుంచి బయటపడి భూలోకంలో జన్మించారు. ఆ విప్రులూ వారి సంతతి వారే ఇప్పటికీ సంధ్యాత్రయ విహీనులై గాయత్రీవివర్జితులై వేదవిదూరులై పాషండమతాలను అనుసరిస్తున్నారు.
అగ్నిహోత్రాది సత్కర్మలనూ స్వాహా స్వధాదులనూ విముఖులై నిరసిస్తున్నారు. అవ్యక్త మూలప్రకృతి గురించి వారికి ఏమి తెలియదు. కొందరు తప్తముద్రాంకితులై కొందరు కామాచారులై కొందరు కాపాలికులై కొందరు కౌలికులై(వామాచారులు) బౌద్దజైనాది ఆవైదికమతానుయాయులై దురాచార ప్రవర్తకులు అవుతున్నారు.
ఉద్దండపండితులే అయినప్పటికీ ఉండవలసిన బుద్ధిమాత్రం ఉండటంలేదు. పరకాంతాలంపటులై సకల దుశ్చేష్టాపరాయణులై భ్రష్టుపడుతున్నారు. మళ్ళీ మళ్ళీ కుంభీపాకానికే వెదుక్కుతూ వెడుతున్నారు.
అందుచేత, ఓ రాజా! పరమేశ్వరిని సర్వాత్మనా సేవించాలి. హరి - హరాదుల ఉపాసనలు నిత్యాలు కావు. శక్తి ఉపాసన ఒక్కటే నిత్యోపాసన. ఇది చెయ్యనివారికి అధఃపతనం తప్పదు.
ఇక అత్యంత సుందరమూ మహాదేవికి స్థిరనివాసమూ హరిహర హిరణ్యగర్భాదులకుకూడా అత్యంత దుర్లభమూ - మణిద్వీపవర్దన వినిపిస్తాను. శ్రద్దగా విను. భవారణి భువనేశ్వరిని హృదయంలో నిలుపుకుని మరీ ఆలకించు - అని ఆరంభించాడు వ్యాసుడు.
అందుచేత, ఓ రాజా! పరమేశ్వరిని సర్వాత్మనా సేవించాలి. హరి - హరాదుల ఉపాసనలు నిత్యాలు కావు. శక్తి ఉపాసన ఒక్కటే నిత్యోపాసన. ఇది చెయ్యనివారికి అధఃపతనం తప్పదు.
ఇక అత్యంత సుందరమూ మహాదేవికి స్థిరనివాసమూ హరిహర హిరణ్యగర్భాదులకుకూడా అత్యంత దుర్లభమూ - మణిద్వీపవర్దన వినిపిస్తాను. శ్రద్దగా విను. భవారణి భువనేశ్వరిని హృదయంలో నిలుపుకుని మరీ ఆలకించు - అని ఆరంభించాడు వ్యాసుడు.