Thursday, October 23, 2025
Usiri Chettu Kinda Deepam - ఉసిరి చెట్టు క్రింద దీపారాధన
Monday, October 13, 2025
Sri Chinnamastha Sahasranama Sthothram - శ్రీ ఛిన్నమస్తా సహస్రనామ స్తోత్రం(విశ్వసార తంత్రం)
శ్రీగణేశాయ నమః ।
శ్రీదేవ్యువాచ
దేవదేవ మహాదేవ సర్వశాస్త్రవిదాంవర ।
కృపాం కురు జగన్నాథ కథయస్వ మమ ప్రభో ॥ 01 ॥
ప్రచణ్డచణ్డికా దేవీ సర్వలోకహితైషిణీ ।
తస్యాశ్చ కథితం సర్వం స్తవం చ కవచాదికమ్ ॥ 02 ॥
ఇదానీం ఛిన్నమస్తాయా నామ్నాం సాహస్రకం శుభమ్ ।
త్వం ప్రకాశయ మే దేవ కృపయా భక్తవత్సల ॥ 03 ॥
శ్రీ శివ ఉవాచ ।
శృణు దేవి ప్రవక్ష్యామి చ్చిన్నాయాః సుమనోహరమ్ ।
గోపనీయం ప్రయత్నేన యదీచ్చేదాత్మనో హితమ్ ॥ 04 ॥
న వక్తవ్యం చ కుత్రాపి ప్రాణైః కణ్ఠగతైరపి ।
తచ్చృణుష్వ మహేశాని సర్వం తత్కథయామి తే ॥ 05 ॥
వినా పూజాం వినా ధ్యానం వినా జాప్యేన సిద్ధతి ।
వినా ధ్యానం తథా దేవి వినా భూతాదిశోధనమ్ ॥ 06 ॥
పఠనాదేవ సిద్ధిః స్యాత్సత్యం సత్యం వరాననే ।
పురా కైలాసశిఖరే సర్వదేవసభాలయే ॥ 07 ॥
పరిపప్రచ్చ కథితం తథా శృణు వరాననే ।
ఓం అస్య శ్రీప్రచణ్డచణ్డికాసహస్రనామస్తోత్రస్య భైరవ ఋషిః ।
సమ్రాట్ ఛన్దః, ప్రచణ్డచణ్డికా దేవతా ।
ధర్మార్థకామమోక్షార్థే పాఠే వినియోగః ॥ 08 ॥
ఓం ప్రచణ్డచణ్డికా చణ్డా చణ్డదైత్యవినాశినీ ।
చాముణ్డా చ సచణ్డా చ చపలా చారుదేహినీ ॥ 09 ॥
లలజిహ్వా చలధ్రక్తా చారుచన్ద్రనిభాననా ।
చకోరాక్షీ చణ్డనాదా చ్చలా చ మనోన్మదా ॥ 10 ॥
చేతనా చితిసంస్థా చ చిత్కలా జ్ఞానరూపిణీ ।
మహాభయ్కరీ దేవీ వరదాభయధారిణీ ॥ 11 ॥
భవాఢ్యా భవరూపా చ భవబన్థవిమోచినీ ।
భవానీ భువనేశీ చ భవసంసారతారిణీ ॥ 12 ॥
భవాబ్ధిర్భవమోక్షా చ భవబన్థవిఘాతినీ ।
భాగీరథీ భగస్థా చ భాగ్యభోగప్రదాయినీ ॥ 13 ॥
కమలా కామదా దుర్గా దుర్గబన్థవిమోచినీ ।
దుర్దర్శనా దుర్గరూపా దుర్జేయా దుర్గనాశినీ ॥ 14 ॥
దీనదుఃఖహరా నిత్యా నిత్యశోకవినాశినీ ।
నిత్యానన్దమయా దేవీ నిత్యం కల్యాణకారిణీ ॥ 15 ॥
సర్వార్థసాధనకరీ సర్వసిద్ధిస్వరూపిణీ ।
సర్వక్షోభణశక్తిశ్చ సర్వవిద్రావిణీ పరా ॥ 16 ॥
సర్వర్జనశక్తిశ్చ సర్వోన్మాదస్వరూపిణీ ।
సర్వదా సిద్ధిదాత్రీ చ సిద్ధవిద్యాస్వరూపిణీ ॥ 17 ॥
సకలా నిష్కలా సిద్దా కలాతీతా కలామయీ ।
కులజ్ఞా కులరూపా చ చక్షురానన్దదాయినీ ॥ 18 ॥
కులీనా సామరూపా చ కామరూపా మనోహరా ।
కమలస్థా క్జముఖీ క్జురేశ్వరగామినీ ॥ 19 ॥
కులరూపా కోటరాక్షీ కమలైశ్వర్యదాయినీ ।
కున్తీ కకుద్మినీ కుల్లా కురుకుల్లా కరాలికా ॥ 20 ॥
కామేశ్వరీ కామమాతా కామతాపవిమోచినీ ।
కామరూపా కామసత్వా కామకౌతుకకారిణీ ॥ 21 ॥
కారుణ్యహృదయా క్రీంక్రీంమన్త్రరూపా చ కోటరా ।
కౌమోదకీ కుముదినీ కైవల్యా కులవాసినీ ॥ 22 ॥
కేశవీ కేశవారాధ్యా కేశిదైత్యనిషూదినీ ।
క్లేశహా క్లేశరహితా క్లేశస్ఘవినాశినీ ॥ 23 ॥
కరాలీ చ కరాలాస్యా కరాలాసురనాశినీ ।
కరాలచర్మాసిధరా కరాలకలనాశినీ ॥ 24 ॥
క్కనీ క్కనిరతా కపాలవరధారిణీ ।
ఖడ్గహస్తా త్రినేత్రా చ ఖణ్డముణ్డాసిధారిణీ ॥ 25 ॥
ఖలహా ఖలహన్త్రీ చ క్షరన్తీ ఖగతా సదా ।
గ్గగౌతమపూజ్యా చ గౌరీ గన్ధర్వవాసినీ ॥ 26 ॥
గన్ధర్వా గగణారాధ్యా గణా గన్ధర్వసేవితా ।
గణత్కారగణా దేవీ నిర్గుణా చ గుణాత్మికా ॥ 27 ॥
గుణతా గుణదాత్రీ చ గుణగౌరవదాయినీ ।
గణేశమాతా గమ్బీరా గగణా జ్యోతికారిణీ ॥ 28 ॥
గౌర్గా చ గయా గమ్యా గౌతమస్థానవాసినీ ।
గదాధరప్రియా జ్ఞేయా జ్ఞానగమ్యా గుహేశ్వరీ ॥ 29 ॥
గాయత్రీ చ గుణవతీ గుణాతీతా గుణేశ్వరీ ।
గణేశజననీ దేవీ గణేశవరదాయినీ ॥ 30 ॥
గణాధ్యక్షనుతా నిత్యా గణాధ్యక్షప్రపూజితా ।
గిరీశరమణీ దేవీ గిరీశపరివన్దితా ॥ 31 ॥
గతిదా గతిహా గీతా గౌతమీ గురుసేవితా ।
గురుపూజ్యా గురుయుతా గురుసేవనతత్పరా ॥ 32 ॥
గన్ధద్వారా చ గన్ధాఢ్యా గన్ధాత్మా గన్ధకారిణీ ।
గీర్వాణపతిసమ్పూజ్యా గీర్వాణపతితుష్టిదా ॥ 33 ॥
గీర్వాణాధిశరమణీ గీర్వాణాధిశవన్దితా ।
గీర్వాణాధిశసంసేవ్యా గీర్వాణాధిశహర్షదా ॥ 34 ॥
గానశక్తిర్గానగమ్యా గానశక్తిప్రదాయినీ ।
గానవిద్యా గానసిద్దా గానసన్తుష్టమానసా ॥ 35 ॥
గానాతీతా గానగీతా గానహర్షప్రపూరితా ।
గన్ధర్వపతిసంహృష్టా గన్ధర్వగుణమణ్డితా ॥ 36 ॥
గన్ధర్వగణసంసేవ్యా గన్ధర్వగణమధ్యగా ।
గన్ధర్వగణకుశలా గన్థర్వగణపూజితా ॥ 37 ॥
గన్ధర్వగణనిరతా గన్ధర్వగణభూషితా ।
ఘర్ఘరా ఘోరరూపా చ ఘోరఘుర్ఘురనాదినీ ॥ 38 ॥
ఘర్మబిన్దుసముద్భూతా ఘర్మబిన్దుస్వరూపిణీ ।
ఘణ్టారవా ఘనరవా ఘనరూపా ఘనోదరీ ॥ 39 ॥
ఘోరసత్వా చ ఘనదా ఘణ్టానాదవినోదనీ ।
ఘోరచాణ్డాలినీ ఘోరా ఘోరచణ్డవినాశినీ ॥ 40 ॥
ఘోరదానవదమనీ ఘోరదానవనాశినీ ।
ఘోరకర్మాదిరహితా ఘోరకర్మనిషేవితా ॥ 41 ॥
ఘోరతత్వమయీ దేవీ ఘోరతత్వవిమోచనీ ।
ఘోరకర్మాదిరహితా ఘోరకర్మాదిపూరితా ॥ 42 ॥
ఘోరకర్మాదినిరతా ఘోరకర్మప్రవర్ధినీ ।
ఘోరభూతప్రమథినీ ఘోరవేతాలనాశినీ ॥ 43 ॥
ఘోరదావాగ్నిదమనీ ఘోరశత్రునిషూదినీ ।
ఘోరమన్త్రయుతా చైవ ఘోరమన్త్రప్రపూజితా ॥ 44 ॥
ఘోరమన్త్రమనోభిజ్ఞా ఘోరమన్త్రఫలప్రదా ।
ఘోరమన్త్రనిధిశ్చైవ ఘోరమన్త్రకృతాస్పదా ॥ 45 ॥
ఘోరమన్త్రేశ్వరీ దేవీ ఘోరమన్త్రార్థమానసా ।
ఘోరమన్త్రార్థతత్వజ్ఞా ఘోరమన్త్రార్థపారగా ॥ 46 ॥
ఘోరమన్త్రార్థవిభవా ఘోరమన్త్రార్థబోధినీ ।
ఘోరమన్త్రార్థనిచయా ఘోరమన్త్రార్థజన్మభూః ॥ 47 ॥
ఘోరమన్త్రజపరతా ఘోరమన్త్రజపోద్యతా ।
కారవర్ణానిలయా కారాక్షరమణ్డితా ॥ 48 ॥
కారాపరరూపా కారాక్షరరూపిణీ ।
చిత్రరూపా చిత్రనాడీ చారుకేశీ చయప్రభా ॥ 49 ॥
చ్చలా చ్చలాకారా చారురూపా చ చణ్డికా ।
చతుర్వేదమయీ చణ్డా చణ్డాలగణమణ్డితా ॥ 50 ॥
చాణ్డాలచ్చేదినీ చణ్డతపోనిర్మూలకారిణీ ।
చతుర్భుజా చణ్డరూపా చణ్డముణ్డవినాశినీ ॥ 51 ॥
చన్ద్రికా చన్ద్రకీర్తిశ్చ చన్ద్రకాన్తిస్తథైవ చ ।
చన్ద్రాస్యా చన్ద్రరూపా చ చన్ద్రమౌలిస్వరూపిజీ ॥ 52 ॥
చన్ద్రమౌలిప్రియా చన్ద్రమౌలిసన్తుష్టమానసా ।
చకోరబన్దురమణీ చకోరబన్ధుపూజితా ॥ 53 ॥
చక్రరూపా చక్రమయీ చక్రాకారస్వరూపిణీ ।
చక్రపాణిప్రియా చక్రపాణిప్రీతిదాయినీ ॥ 54 ॥
చక్రపాణిరసాభిజ్ఞా చక్రపాణివరప్రదా ।
చక్రపాణివరోన్మత్తా చక్రపాణిస్వరూపిణీ ॥ 55 ॥
చక్రపాణిశ్వరీ నిత్యం చక్రపాణినమస్కృతా ।
చక్రపాణిసముద్భూతా చక్రపాణిగుణాస్పదా ॥ 56 ॥
చన్ద్రావలీ చన్ద్రవతీ చన్ద్రకోటి సమప్రభా ।
చన్దనార్చితపాదాబ్జా చన్దనాన్వితమస్తకా ॥ 57 ॥
చారుకీర్తిశ్చారునేత్రా చారుచన్ద్రవిభూషణా ।
చారుభూషా చారువేషా చారువేషప్రదాయినీ ॥ 58 ॥
చారుభూషాభూషిత్గా చతుర్వక్త్రవరప్రదా ।
చతుర్వక్త్రసమారాధ్యా చతుర్వక్త్రసమాశ్రితా ॥ 59 ॥
చతుర్వక్త్రచతుర్వాహా చతుర్ధీ చ చతుర్దశీ ।
చిత్రా చర్మణ్వతీ చైత్రీ చన్ద్రభాగా చ చమ్పకా ॥ 60 ॥
చతుర్దశయమాకారా చతుర్దశయమానుగా ।
చతుర్దశయమప్రీతా చతుర్దయమప్రియా ॥ 61 ॥
ఛలస్థా ఛ్ఛిద్రరూపా చ ఛ్ఛద్మదా ఛ్ఛద్మరాజికా ।
ఛిన్నమస్తా తథా ఛ్ఛిన్నా ఛ్ఛిన్నముణ్డవిధారిణీ ॥ 62 ॥
జయదా జయరూపా చ జయన్తీ జయమోహినీ ।
జయా జీవనసంస్థా చ జాలన్ధరనివాసినీ ॥ 63 ॥
జ్వాలాముఖీ జ్వాలదాత్రీ జాజ్వల్యదహనోపమా ।
జగద్వన్ధ్యా జగత్పూజ్యా జగత్త్రాణపరాయణా ॥ 64 ॥
జగతీ జగతాధారా జన్మమృత్యుజరాపహా ।
జననీ జన్మభూమిశ్చజన్మదా జయశాలినీ ॥ 65 ॥
జ్వరరోగహరా జ్వాలా జ్వాలామాలాప్రపూరితా ।
జమ్భారాతీశ్వరీ జమ్భారాతివైభవకారిణీ ॥ 66 ॥
జమ్భారాతిస్తుతా జమ్భారాతిశత్రునిషూదినీ ।
జయదుర్గా జయారాధ్యా జయకాలీ జయేశ్వరీ ॥ 67 ॥
జయతారా జయాతీతా జయశ్కరవల్లభా ।
జయదా జహ్నుతనయా జలధిత్రాసకారిణీ ॥ 68 ॥
జలధివ్యాధిదమనీ జలధిజ్వరనాశినీ ।
జ్గమేశీ జాడ్యహరా జాడ్యస్ఘనివారిణీ ॥ 69 ॥
జాడ్యగ్రస్తజనాతీతా జాడ్యరోగనివారిణీ ।
జన్మదాత్రీ జన్మహర్త్రీ జయఘోషసమన్వితా ॥ 70 ॥
జపయోగసమాయుక్తా జపయోగవినోదినీ ।
జపయోగప్రియా జాప్యా జపాతీతా జయస్వనా ॥ 71 ॥
జాయాభావస్థితా జాయా జాయాభావప్రపూరణీ ।
జపాకుసుమస్కశా జపాకుసుమపూజితా ॥ 72 ॥
జపాకుసుమసమ్ప్రీతా జపాకుసుమమణ్డితా ।
జపాకుసుమవద్భాసా జపాకుసుమరూపిణీ ॥ 73 ॥
జమదగ్నిస్వరూపా చ జానకీ జనకాత్మజా ।
ఝవాతప్రముక్త్గా ఝేరఝ్కరవాసినీ ॥ 74 ॥
ఝ్కరకారిణీ ఝవాతరూపా చ ఝ్కరీ ।
కారాణుస్వరూపా చ టనట్కరనాదినీ ॥ 75 ॥
ట్కరీ టకువాణీ చ ఠకారాక్షరరూపిణీ ।
డిణ్డిమా చ తథా డిమ్భా డిణ్డుడిణ్డిమనాదినీ ॥ 76 ॥
ఢక్కామయీ ఢిలమయీ నృత్యశబ్దా విలాసినీ ।
ఢక్కా ఢక్కేశ్వరీ ఢక్కాశబ్దరూపా తథైవ చ ॥ 77 ॥
ఢక్కానాదప్రియా ఢక్కానాదసన్తుష్టమానసా ।
ణ్కరా ణాక్షరమయీ ణాక్షరాదిస్వరూపిణీ ॥ 78 ॥
త్రిపురా త్రిపురమయీ చైవ త్రిశక్తిస్త్రిగుణాత్మీకా ।
తామసీ చ త్రిలోకేశీ త్రిపురా చ త్రయీశ్వరీ ॥ 79 ॥
త్రివిద్యా చ త్రిరూపా చ త్రినేత్రా చ త్రిరూపిణీ ।
తారిణీ తరలా తారా తారకారిప్రపూజితా ॥ 80 ॥
తారకారిసమారాధ్యా తారకారివరప్రదా ।
తారకారిప్రసూస్తన్వీ తరుణీ తరలప్రభా ॥ 81 ॥
త్రీరూపా చ త్రిపురగా త్రిశూలవరధారిణీ ।
త్రిశూలినీ తన్త్రమయీ తన్త్రశాస్త్రవిశారదా ॥ 82 ॥
తన్త్రరూపా తపోమూర్తిస్తన్త్రమన్త్రస్వరూపిణీ ।
తడిత్తడిల్లతాకారా తత్వజ్ఞానప్రదాయినీ ॥ 83 ॥
తత్వజ్ఞానేశ్వరీ దేవీ తత్వజ్ఞాన ప్రబోధినీ ।
త్రయీమయీ త్రయీసేవ్యా త్య్రక్షరీ త్య్రక్షరేశ్వరీ ॥ 84 ॥
తాపవిధ్వంసినీ తాపస్ఘనిర్మూలకారిణీ ।
త్రాసకర్త్రీ త్రాసహర్త్రీ త్రాసదాత్రీ చ త్రాసహా ॥ 85 ॥
తిథీశా తిథిరూపా చ తిథిస్థా తిథిపూజితా ।
తిలోత్తమా చ తిలదా తిలప్రితా తిలేశ్వరీ ॥ 86 ॥
త్రిగుణా త్రిగుణాకారా త్రిపురీ త్రిపురాత్మికా ।
త్రికుటా త్రికుటాకారా త్రికుటాచలమధ్యగా ॥ 87 ॥
త్రిజటా చ త్రినేత్రా చ త్రినేత్రవరసున్దరీ ।
తృతీయా చ త్రివర్షా చ త్రివిధా త్రిమతేశ్వరీ ॥ 88 ॥
త్రికోణస్థా త్రికోణేశీ త్రికోణయన్త్రమధ్యగా ।
త్రిసన్ధ్యా చ త్రిసన్ధ్యార్చ్యా త్రిపదా త్రిపదాస్పదా ॥ 89 ॥
స్థానస్థితా స్థలస్థా చ ధన్యస్థలనివాసినీ ।
థకారాక్షరరూపా చ స్థలరూపా తథైవ చ ॥ 90 ॥
స్థూలహస్తా తథా స్థూలా స్థైర్యరూపప్రకాశినీ ।
దుర్గా దుర్గార్తిహన్త్రీ చ దుర్గబన్థవిమోచినీ ॥ 91 ॥
దేవీ దానవసంహన్త్రీ దనుజ్యేష్ఠనిషూదినీ ।
దారాపత్యప్రదా నిత్యా శ్కరార్థాధారిణీ ॥ 92 ॥
దివ్గ్యా దేవమాతా చ దేవదుష్టవినాశినీ ।
దీనదుఃఖహరా దీనతాపనిర్మూలకారిణీ ॥ 93 ॥
దీనమాతా దీనసేవ్యా దీనదమ్భవినాశినీ ।
దనుజధ్వంసినీ దేవీ దేవకీ దేవవల్లభా ॥ 94 ॥
దానవారిప్రియా దీర్ఘా దానవారిప్రపూజితా ।
దీర్ఘస్వరా దీర్ఘతనుర్దీర్ఘదుర్గతినాశినీ ॥ 95 ॥
దీర్ఘనేత్రా దీర్ఘచక్షుర్దీర్ఘకేశీ దిగమ్బరా ।
దిగమ్బరప్రియా దాన్తా దిగమ్బరస్వరూపిణీ ॥ 96 ॥
దుఃఖహీనా దుఃఖహరా దుఃఖసాగరతారిణీ ।
దుఃఖదారిద్య్రశమనీ దుఃఖదారిద్య్రకారిణీ ॥ 97 ॥
దుఃఖదా దుస్సహా దుష్టఖణ్డనైకస్వరూపిణీ ।
దేవవామా దేవసేవ్యా దేవశక్తిప్రదాయినీ ॥ 98 ॥
దామినీ దామినీప్రీతా దామినీశతసున్దరీ ।
దామినీశతసంసేవ్యా దామినీదామభూషితా ॥ 99 ॥
దేవతాభావసన్తుష్టా దేవతాశతమధ్యగా ।
దయార్దరా చ దయారూపా దయాదానపరాయణా ॥ 100 ॥
దయాశీలా దయాసారా దయాసాగరసంస్థితా ।
దశవిద్యాత్మికా దేవీ దశవిద్యాస్వరూపిణీ ॥ 101 ॥
ధరణీ ధనదా ధాత్రీ ధన్యా ధన్యపరా శివా ।
ధర్మరూపా ధనిష్ఠా చ ధేయా చ ధీరగోచరా ॥ 102 ॥
ధర్మరాజేశ్వరీ ధర్మకర్మరూపా ధనేశ్వరీ ।
ధనుర్విద్యా ధనుర్గమ్యా ధనుర్ధరవరప్రదా ॥ 103 ॥
ధర్మశీలా ధర్మలీలా ధర్మకర్మవివర్జితా ।
ధర్మదా ధర్మనిరతా ధర్మపాఖణ్డఖణ్డినీ ॥ 104 ॥
ధర్మేశీ ధర్మరూపా చ ధర్మరాజవరప్రదా ।
ధర్మిణీ ధర్మగేహస్థా ధర్మాధర్మస్వరూపిణీ ॥ 105 ॥
ధనదా ధనదప్రీతా ధనధాన్యసమృద్ధిదా ।
ధనధాన్యసమృద్ధిస్థా ధనధాన్యవినాశినీ ॥ 106 ॥
ధర్మనిష్ఠా ధర్మధీరా ధర్మమార్గరతా సదా ।
ధర్మబీజకృతస్థానా ధర్మబీజసురక్షిణీ ॥ 107 ॥
ధర్మబీజేశ్వరీ ధర్మబీజరూపా చ ధర్మగా ।
ధర్మబీజసముద్భూతా ధర్మబీజసమాశ్రితా ॥ 108 ॥
ధరాధరపతిప్రాణా ధరాధరపతిస్తుతా ।
ధరాధరేన్ద్రతనుజా ధరాధరేన్ద్రవన్దితా ॥ 109 ॥
ధరాధరేన్ద్రగేహస్థా ధరాధరేన్ద్రపాలినీ ।
ధరాధరేన్ద్రసర్వార్తినాశినీ ధర్మపాలినీ ॥ 110 ॥
నవీనా నిర్మలా నిత్యా నాగరాజప్రపూజితా ।
నాగేశ్వరీ నాగమాతా నాగకన్యా చ నగ్నికా ॥ 111 ॥
నిర్లేపా నిర్వికల్పా చ నిర్లోమా నిరుపద్రవా ।
నిరాహారా నిరాకారా నిర్జనస్వరూపిణీ ॥ 112 ॥
నాగినీ నాగవిభవా నాగరాజపరిస్తుతా ।
నాగరాజగుణజ్ఞా చ నాగరాజసుఖప్రదా ॥ 113 ॥
నాగలోకగతా నిత్యం నాగలోకనివాసినీ ।
నాగలోకేశ్వరీ నాగభాగినీ నాగపూజితా ॥ 114 ॥
నాగమధ్యస్థితా నాగమోహసంక్షోభదాయినీ ।
నృత్యప్రియా నృత్యవతీ నృత్యగీతపరాయణా ॥ 115 ॥
నృత్యేశ్వరీ నర్తకీ చ నృత్యరూపా నిరాశ్రయా ।
నారాయణీ నరేన్ద్రస్థా నరముణ్డాస్థిమాలినీ ॥ 116 ॥
నరమాంసప్రియా నిత్యా నరరక్తప్రియా సదా ।
నరరాజేశ్వరీ నారీరూపా నారీస్వరూపిణీ ॥ 117 ॥
నారీగణార్చితా నారీమధ్యగా నూతనామ్భరా ।
నర్మదా చ నదీరూపా నదీస్గమసంస్థితా ॥ 118 ॥
నర్మదేశ్వరసమ్ప్రీతా నర్మదేశ్వరరూపిణీ ।
పద్మావతీ పద్మముఖీ పద్మక్జిల్కవాసినీ ॥ 119 ॥
పట్టవస్త్రపరీధానా పద్మరాగవిభూషితా ।
పరమా ప్రీతిదా నిత్యం ప్రేతాసననివాసినీ ॥ 120 ॥
పరిపూర్ణరసోన్మత్తా ప్రేమవిహ్వలవల్లభా ।
పవిత్రాసవనిష్పూతా ప్రేయసీ పరమాత్మికా ॥ 121 ॥
ప్రియవ్రతపరా నిత్యం పరమప్రేమదాయినీ ।
పుష్పప్రియా పద్మకోశా పద్మధర్మనివాసినీ ॥ 122 ॥
ఫేత్కారిణీ తన్త్రరూపా ఫేరుఫేరవనాదినీ ।
వంశినీ వంశరూపా చ బగలా వామరూపిణీ ॥ 123 ॥
వ్మాయీ వసుధా ధృష్యా వాగ్భవాఖ్యా వరా నరా।
బుద్దిదా బుద్దిరూపా చ విద్యా వాదస్వరూపిణీ ॥ 124 ॥
బాలా వృద్ధమయీరూపా వాణీ వాక్యనివాసినీ ।
వరుణా వాగ్వతీ వీరా వీరభూషణభూషితా ॥ 125 ॥
వీరభద్రార్చితపదా వీరభద్రప్రసూరపి ।
వేదమార్గరతా వేదమన్త్రరూపా వషట్ ప్రియా ॥ 126 ॥
వీణావాద్యసమాయుక్తా వీణావాద్యపరాయణా ।
వీణారవా తథా వీణాశబ్దరూపా చ వైష్ణవీ ॥ 127 ॥
వైష్ణవాచారనిరతా వైష్ణవాచారతత్పరా ।
విష్ణుసేవ్యా విష్ణుపత్నీ విష్ణురూపా వరాననా ॥ 128 ॥
విశ్వేశ్వరీ విశ్వమాతా విశ్వనిర్మాణకారిణీ ।
విశ్వరూపా చ విశ్వేశీ విశ్వసంహారకారిణీ ॥ 129 ॥
భైరవీ భైరవారాధ్యా భూతభైరవసేవితా ।
భైరవేశీ తథా భీమా భైరవేశ్వరతుష్టిదా ॥ 130 ॥
భైరవాధిశరమణీ భైరవాధిశపాలినీ ।
భీమేశ్వరీ భీమమాతా భీమశబ్దపరాయణా ॥ 131 ॥
భీమరూపా చ భీమేశీ భీమా భీమవరప్రదా ।
భీమపూజితపాదాబ్జా భీమభైరవపాలినీ ॥ 132 ॥
భీమాసురధ్వంసకరీ భీమదుష్టవినాశినీ ।
భువనా భువనారాధ్యా భవానీ భూతిదా సదా ॥ 133 ॥
భయదా భయహన్త్రీ చ అభయా భయరూపిణీ ।
భీమనాదా విహ్వలా చ భయభీతివినాశినీ ॥ 134 ॥
మత్తా ప్రమత్తరూపా చ మదోన్మత్తస్వరూపిణీ ।
మాన్యా మనోజ్ఞా మానా చ మ్గలా చ మనోహరా ॥ 135 ॥
మాననీయా మహాపూజ్యా మహామహిషమర్దినీ ।
మహిషాసురహన్త్రీ చ మాత్గ మయవాసినీ ॥ 136 ॥
మాధ్వీ మధుమయీ ముద్రా ముద్రికా మన్త్రరూపిణీ ।
మహావిశ్వేశ్వరీ దూతీ మౌలిచన్ద్రప్రకాశినీ ॥ 137 ॥
యశఃస్వరూపిణీ దేవీ యోగమార్గప్రదాయినీ ।
యోగినీ యోగగమ్యా చ యామ్యేశీ యోగరూపిణీ ॥ 138 ॥
యజ్ఞా చ యోగమయీ జపరూపా జపాత్మికా ।
యుగాఖ్యా చ యుగాన్తా చ యోనిమణ్డలవాసినీ ॥ 139 ॥
అయోనిజా యోగనిద్రా యోగానన్దప్రదాయినీ ।
రమా రతిప్రియా నిత్యం రతిరాగవివర్ధినీ ॥ 140 ॥
రమణీ రాససమ్భూతా రమ్యా రాసప్రియా రసా ।
రణోత్కణ్ఠా రణస్థా చ వరా ర్గప్రదాయినీ ॥ 141 ॥
రేవతీ రణజైత్రీ చ రసోద్భూతా రణోత్సవా ।
లతా లావణ్యరూపా చ లవణాబ్ధిస్వరూపిణీ ॥ 142 ॥
లవ్గకుసుమారాధ్యా లోలజిహ్వా చ లేలిహా ।
వశినీ వనసంస్థా చ వనపుష్పప్రియా వరా ॥ 143 ॥
ప్రాణేశ్వరీ బుద్ధిరూపా బుద్ధిదాత్రీ బుధాత్మికా ।
శమనీ శ్వేతవర్ణా చ శ్కారీ శివభాషిణీ ॥ 144 ॥
శ్యామ్యరూపా శక్తిరూపా శక్తిబిన్దునివాసినీ ।
సర్వేశ్వరీ సర్వదాత్రీ సర్వమాతా చ శర్వరీ ॥ 145 ॥
శామ్భవీ సిద్ధిదా సిద్ధా సుషుమ్నా సురభాసినీ ।
సహస్రదలమధ్యస్థా సహస్రదలవర్తినీ ॥ 146 ॥
హరప్రియా హరధ్యేయా హూంకారబీజరూపిణీ ।
ల్కశ్వరీ చ తరలా లోమమాంసప్రపూజితా ॥ 147 ॥
క్షేమ్యా క్షేమకరీ క్షామా క్షీరబిన్దుస్వరూపిణీ ।
క్షిప్తచిత్తప్రదా నిత్యం క్షౌమవస్త్రవిలాసినీ ॥ 148 ॥
ఛిన్నా చ చ్చిన్నరూపా చ క్షుధా క్షౌత్కారరూపిణీ ।
సర్వవర్ణమయీ దేవీ సర్వసమ్పత్ప్రదాయినీ ॥ 149 ॥
సర్వసమ్పత్ప్రదాత్రీ చ సమ్పదాపద్విభూషితా ।
సత్త్వరూపా చ సర్వార్థా సర్వదేవప్రపూజితా ॥ 150 ॥
సర్వేశ్వరీ సర్వమాతా సర్వజ్ఞా సురసృత్మికా ।
సిన్ధుర్మన్దాకినీ గ్గ నదీసాగరరూపిణీ ॥ 151 ॥
సుకేశీ ముక్తకేశీ చ డాకినీ వరవర్ణినీ ।
జ్ఞానదా జ్ఞానగగనా సోమమణ్డలవాసినీ ॥ 152 ॥
ఆకాశనిలయా నిత్యా పరమాకాశరూపిణీ ।
అన్నపూర్ణా మహానిత్యా మహాదేవరసోద్భవా ॥ 153 ॥
మ్గలా కాలికా చణ్డా చణ్డనాదాతిఖీషణా ।
చణ్డాసురస్య మథినీ చాముణ్డా చపలాత్న్మికా ॥ 154 ॥
చణ్డీ చామరకేశీ చ చలత్కుణ్డలధారిణీ ।
ముణ్డమాలాధరా నిత్యా ఖణ్డముణ్డవిలాసినీ ॥ 155 ॥
ఖడ్గహస్తా ముణ్డహస్తా వరహస్తా వరప్రదా ।
అసిచర్మధరా నిత్యా పాశ్కాశధరా పరా ॥ 156 ॥
శూలహస్తా శివహస్తా ఘణ్టానాదవిలాసినీ ।
ధనుర్బాణధరాஉஉదిత్యా నాగహస్తా నగాత్మజా ॥ 157 ॥
మహిషాసురహన్త్రీ చ రక్తబీజవినాశినీ ।
రక్తరూపా రక్తగా చ రక్తహస్తా భయప్రదా ॥ 158 ॥
అసితా చ ధర్మధరా పాశ్కాశధరా పరా ।
ధనుర్భాణధరా నిత్యా ధూమ్రలోచననాశినీ ॥ 159 ॥
పరస్థా దేవతామూర్తిః శర్వాణీ శారదా పరా ।
నానావర్ణవిభూష్గా నానారాగసమాపినీ ॥ 160 ॥
పశువస్త్రపరీధానా పుష్పాయుధధరా పరా ।
ముక్తర్జతమాలాఢ్యా ముక్తాహారవిలాసినీ ॥ 160 ॥
స్వర్ణకుణ్డలభూషా చ స్వర్ణసింహాసనస్థితా ।
సున్దర్గా సువర్ణాభా శామ్భవీ శకటాత్మికా ॥ 162 ॥
సర్వలోకేశవిద్యా చ మోహసమ్మోహకారిణీ ।
శ్రేయసీ సృష్టిరూపా చ చ్ఛిన్నచ్ఛద్మమయీ చ్ఛలా ॥ 163 ॥
ఛిన్నముణ్డధరా నిత్యా నిత్యానన్దవిధాయినీ ।
నన్దా పూర్ణా చ రిక్తా చ తిథయః పూర్ణషోడశీ ॥ 164 ॥
కుహూః స్కన్త్రిరూపా చ ప్చపర్వవిలాసినీ ।
ప్చబాణధరా నిత్యా ప్చమప్రీతిదా పరా ॥ 165 ॥
ప్చపత్రాభిలాషా చ ప్చమృతవిలాసినీ ।
ప్చలీ ప్చమీ దేవీ ప్చరక్తప్రసారిణీ ॥ 166 ॥
ప్చబాణధరా నిత్యా నిత్యదాత్రీ దయాపరా ।
పలలాదిప్రియా నిత్యాపశుగమ్యా పరేశితా ॥ 167 ॥
పరా పరరహస్యా చ పరమప్రేమవిహ్వలా ।
కులినా కేశిమార్గస్థా కులమార్గప్రకాశినీ ॥ 168 ॥
కులాకులస్వరూపా చ కులార్ణవమయీ కులా ।
రుక్మా చ కాలరూపా చ కాలకమ్బనకారిణీ ॥ 169 ॥
విలాసరూపిణీ భద్రా కులాకులనమస్కృతా ।
కుబేరవిత్తధాత్రీ చ కుమారజననీ పరా ॥ 170 ॥
కుమారీరూపసంస్థా చ కుమారీపూజనామ్భికా ।
కుర్గనయనా దేవీ దినేశాస్యా పరాజితా ॥ 171 ॥
కుణ్డలీకదలీ సేనా కుమార్గరహితా వరా ।
అనతరూపాஉనన్తస్థా ఆనన్దసిన్ధువాసినీ ॥ 172 ॥
ఇలాస్వరూపిణీ దేవీ ఇఈభేదభయ్కరీ ।
ఇడా చ ప్గిలా నాడీ ఇకారాక్షరరూపిణీ ॥ 173 ॥
ఉమా చోత్పత్తిరూపా చ ఉచ్చభావవినాశినీ ।
ఋగ్వేదా చ నిరారాధ్యా యజుర్వేదప్రపూజితా ॥ 174 ॥
సామవేదేన స్గతా అథర్వవేదభాషిణీ ।
ఋకారరూపిణీ ఋక్షా నిరక్షరస్వరూపిణీ ॥ 175 ॥
అహిదుర్గాసమాచారా ఇకారార్ణస్వరూపిణీ ।
ఓంకారా ప్రణవస్థా చ ఓంకారాదిస్వరూపిణీ ॥ 176 ॥
అనులోమవిలోమస్థా థకారవర్ణసమ్భవా ।
ప్చశద్వర్ణబీజాఢ్యా ప్చశన్ముణ్డమాలికా ॥ 177 ॥
ప్రత్యేకా దశసంఖ్యా చ షోడశీ చ్చిన్నమస్తకా ।
షడ్గయువతీపూజ్యా షడ్గరూపవర్జితా ॥ 178 ॥
షడ్వక్త్రసంశ్రితా నిత్యా విశ్వేశీ ఖడ్గదాలయా ।
మాలామన్త్రమయీ మన్త్రజపమాతా మదాలసా ॥ 179 ॥
సర్వవిశ్వేశ్వరీ శక్తిః సర్వానన్దప్రదాయినీ ।
ఇతి శ్రీచ్చిన్నమస్తాయా నామసహస్రముత్తమమ్ ॥ 180 ॥
పూజాక్రమేణ కథితం సాధకానాం సుఖావహమ్ ।
గోపనీయం గోపనీయం గోపనీయం న సంశయః ॥ 181 ॥
అర్థరాత్రే ముక్తకేశో భక్తియుక్తో భవేన్నరః ।
జపిత్వా పూజయిత్వా చ పఠేన్నామసహస్రకమ్ ॥ 182 ॥
విద్యాసిద్ధిర్భవేత్తస్య షణ్మాసాభ్యాసయోగతః ।
యేన కేన ప్రకారేణ దేవీభక్తిపరో భవేత్ ॥ 183 ॥
అభిలాన్త్సమ్భయేల్లోకాంరాజ్ఞోஉపి మోహయేత్సదా ।
ఆకర్షయేద్దేవశక్తిం మారయేద్దేవి విద్విషమ్ ॥ 184 ॥
శత్రవో దాసతాం యాన్తి యాన్తి పాపాని సంక్షయమ్ ।
మృత్యుశ్చ క్షయతాం యాతి పఠనాద్భాషణాత్ప్రియే ॥ 185 ॥
ప్రశస్తాయాః ప్రసాదేన కిం న సిద్ద్యతి భూతలే ।
ఇదం రహస్యం పరమం పరం స్వస్త్యయనం మహత్ ॥ 186 ॥
ధృత్వా బాహౌ మహాసిద్ధిః ప్రాప్యతే నాత్ర సంశయః ।
అనయా సదృశీ విద్యా విద్యతే న మహేశ్వరి ॥ 187 ॥
వారమేకం తు యోஉధీతే సర్వసిద్ధీశ్వరో భవేత్ ।
కులవారే కులాష్టమ్యాం కుహూస్కన్త్రిపర్వసు ॥ 188 ॥
యశ్చేమం పఠతే విద్యాం తస్య సమ్యక్ఫలం శృణు ।
అష్టోత్తరశతం జప్త్వా పఠేన్నామసహస్రకమ్ ॥ 189 ॥
భక్త్యా స్తుత్వా మహాదేవి సర్వపాపాత్ప్రముచ్యతే ।
సర్వపా పైర్వినిర్ముక్తః సర్వసిద్ధీశ్వరో భవేత్ ॥ 190 ॥
అష్టమ్యాం వా నిశీథే చ చతుష్పథగతో నరః ।
మాషభక్తబలిం దత్వా పఠేన్నామసహస్రకమ్ ॥ 191 ॥
సుదర్శవామవేద్యాం తు మాసత్రయవిధానతః ।
దుర్జయః కామరూపశ్చ మహాబలపరాక్రమః ॥ 192 ॥
కుమారీపూజనం నామ మన్త్రమాత్రం పఠేన్నరః ।
ఏతన్మన్త్రస్య పఠనాత్సర్వసిద్ధీశ్వరో భవేత్ ॥ 193 ॥
ఇతి తే కథితం దేవి సర్వసిద్ధిపరం నరః ।
జప్త్వా స్తుత్వా మహాదేవీం సర్వపాపైః ప్రముచ్యతే ॥ 194 ॥
న ప్రకాశ్యమిదం దేవి సర్వదేవనమస్కృతమ్ ।
ఇదం రహస్యం పరమం గోప్తవ్యం పశుస్కటే ॥ 195 ॥
ఇతి సకలవిభూతేరేతుభూతం ప్రశస్తం పఠతి ।
య ఇహ మర్త్యాశ్ఛిన్నమస్తాస్తవం చ ॥ 196 ॥
ధనద ఇవ ధనాఢ్యో మాననీయో నృపాణాం స భవతి ।
చ జనానామాశ్రయః సిద్ధివేత్తా ॥ 197 ॥
॥ ఇతి శ్రీ విశ్వసారతన్త్రే శివపార్వతీ సంవాదే
శ్రీ చ్చిన్నమస్తాసహస్రనామస్తోత్రం సంపూర్ణం ॥
Friday, October 10, 2025
Srivatsa - శ్రీవత్స
భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్లవానుడు. అప్లవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు.
Parasu Ramudu - పరశురాముడు
కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు.
కార్తవీర్యార్జునితో వైరం
హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్ధంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.పరశురాముడు మహా పరాక్రమవంతుడు.
రామాయణంలో పరశురాముడు
సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ పట్టించుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టై మని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది
మహాభారతంలో పరశురాముడు
మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధించాడు. తరువాత అంబను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మ బ్రహ్మచర్య వ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది.
ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు.
స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడింది. అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు.
పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు. ఈ అంశాలు స్కాంద పురాణంలో వివరించబడింది.
ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు.
పరశురాముడు చిరంజీవి. కల్క్యవతారమునకు విద్యలుపదేశిస్తాడనీ, తరువాతి మన్వంతరములో సప్తర్షులలో ఒకడవుతాడనీ కథ.
పరశురాముడు పూర్ణావతారము కాదనీ, అవశేషావతారమనీ అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలూ, మందిరాలూ చాలా తక్కువ.
భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ భూమిలో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.
కేరళలో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉంది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.
Sagarudu - సగరుడు
భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆ పై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.
Aurva Maharshi - ఔర్వ మహర్షి
ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు 'కందని' (కందశి) అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ. ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. దుర్వాసుడు తన భార్యయగు కందనితో సమస్త భోగములు అనుభవింపసాగాడు. తనే కోపి. తనకన్న తన భార్య మరీ కోపి. కలహప్రియ. కటుభాషిణి కావడంతో ఆమె బాధ భరించలేక ఆ మహర్షి ఆమెను భస్మం చేశాడు.ఆ విషయం మామ యగు ఔర్వ మహర్షికి తెలియగా వచ్చి అల్లుని నిందించి అవమానాల పాలగుదవని శపించాడు.
ఆయోధ్యను భాషుడను రాజుపాలించుచుండెను. హైహయులు దండెత్తి భాషుని రాజ్యమాక్రమించుకొన్నారు.అంత భాషుడు నిండు గర్భినియగు పట్టమహిషితో కులగురువగు ఔర్వుని ఆశ్రమమును పోయాడు.
సగరుడు చాలాకాలం రాజ్యం చేసి చివరకు ఔర్వుని చేరి తత్త్వముపదేసించమని అర్థించాడు. అంత ఆ మహర్షి అనేక విషయాలు తెలిపాడు. ఔర్వునికి తెలియని విషయాలు లేవు. అతడు మేధావి అస్ఖలిత బ్రహ్మచారి, తపోనిధి, ఉపకారి. అటువంటి మహర్షి చరిత్ర నిజంగా చాలా గొప్పది.
Chyavana Maharshi - చ్యవన మహర్షి
Druvudu - ధ్రువుడు
ధ్రువుడి వంశ చరిత్ర
స్వాయంభువ మనువుకి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యల వలన ధ్రువుడు (సునీతి) ఉత్తముడు (సురుచి) అనే ఇద్దరు కుమారులు కలిగారు. కాలప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి చూసి వెర్రి నవ్వు నవ్వి నీకు తండ్రి తొడ పై ఎక్కే అధృష్టం లేదు, అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది. నీకా అధృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెబుతుంది.
ధ్రువుడికి నారదుడు నారాయణ మంత్రొపదేశం
అప్పుడు మార్గమధ్యములో నారదుడు కనిపించి ఎక్కడికి వెళ్ళుతున్నావు అని అడుగగా ధ్రువుడు అప్పటి వరకు జరిగిన వృత్తాంతం తన సవతి తల్లి చేత పొందిన అవమానం చెబుతాడు. నారదుడు ధ్రువుడిని ఓదార్చి రాజధాని నగరం పంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ధ్రువుడి పట్టుదలకు మెచ్చి యమునా నది తీరములో ఉన్న మధువనంలో ధర్భాసీనుడవై ప్రాణాయామ నిష్ఠతో శ్రీ మహావిష్ణువును ఆరాధించమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రము ఉపదేశిస్తాడు.
శ్రీమహా విష్ణువు దర్శనం
నారాయణుడు ధ్రువుడికి శంఖ చక్రాలతో ప్రత్యక్షమై ధ్రువుడి శిరస్సు నిమిరగా ధ్రువుడు 12 శ్లోకాలతో నారాయణుడిని స్తుతిస్తాడు. దానికి నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో సప్తఋషులు, నిఖిల తారాగణాలు, సూర్యచంద్రులు నిరంతరం ప్రదక్షిణం చేసే ధ్రువక్షితి అనే స్థానం కలిపిస్తున్నానని చెప్పి, ఆ ధ్రువక్షితికి చేరే ముందు కొన్ని రోజులు రాజ్యపరిపాలన చేయమంటాడు.
యక్షులతో యుద్ధం
ఒకరోజు తన సోదరుడైన ఉత్తముడు అరణ్యానికి వేటకు వెళ్ళి ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఆ వార్త విన్న సురుచి అగ్నిలో ప్రవేశించి ప్రాణ త్యాగం చేసింది. ఈ రెండు విషయాలు మనస్థాపం కలిగించి ధ్రువుడు హిమయత్పర్వతం లోయలో ఉన్న అలకపురిలో ఉన్న యక్షుల మీద యుద్ధం ప్రకటించాడు. కొద్ది సేపటి తరువాత యుక్షులు మాయ యుద్ధం చేయట మొదలుపెట్టారు. వారితొ మాయాయుద్ధం చేసే దారి తోచక ఆలోచిస్తుంటే మునులు ప్రత్యక్షమై నిఖిపలోకాలకు మూల కారకుడైన నారాయణుడిని స్మరించమని చెబుతారు. నారాయణుడిని స్మరించి నారాయాణాస్త్రం సంధించగా యక్షుల శక్తి సన్న గిల్లి వారి కాళు చేతులు మొండలు విరిగి క్రింద పడి పోయాయి.
ధ్రువుడు ధ్రువ నక్షత్ర ముక్తి
ధ్రువుడు రాజధాని చేరి భూరి దానాలతో యజ్ఞాలు సాగించి కొంత కాలం పరిపాలన చేశాడు. తరువాత రాజ్యాన్ని తన కూమారుడికి అప్పగించి, తపస్సు చేసుకోవడానికి బదరికావనములో పద్మాసీనుడై శ్రీ మహావిష్ణువు స్మరిస్తూ కాలం వెల్లబుచ్చుతుండగా ఒకరోజు నందసునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్యవిమానం మీద ధ్రువుడిని తీసుకొని వెళ్ళడానికి వస్తారు. ధ్రువుడా దివ్యవిమానం ఎక్క లేకపోతుండగా యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమని చెబుతాడు. అలా వెళ్ళుతుండగా ధ్రువుడు నారాయణ సేవకులతో తన తల్లిని చూడవలెనని కోరిక ఉన్నదని తెలుపగా వారి ముందు ఉన్న విమానం పైనున్న సునీతిని చూపించగా ధ్రువుడు ఆనందిస్తాడు.నేటికి మనకు కనిపించే ధ్రువనక్షత్రము ధ్రువుడి నారాయణ భక్తి సామ్రాజ్యపాలన ఫలంగా లభించనదే అని చెబుతారు.
Uttarashada Nakshatra - ఉత్తరాషాఢ నక్షత్రం
నక్షత్రం - ఉత్తరాషాఢ
అధిపతి - రవి
గణము - మానవ
జాతి - పురుష
జంతువు - ముంగిస
చెట్టు - పనస
నాడి - అంత్య
అధిదేవత- విశ్వేదేవతలు
రాశి - 1 పాదం ధనస్సు
ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో తక్కువగా ఉన్నాసరే పెరిగేకొద్ది ఎదుగుతూ ఉన్నత స్థితికి చేరుతారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరికెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువగా మాట్లాడెదరు, అణకువ కలిగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుంటారు. క్రొత్త స్నేహములు చేయుటలో ముందుంటారు. కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకానొకప్పుడు వీరు నేరప్రవృత్తి అయిన నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి. ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి, బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. గోప్యత పాటిస్తారు. పై చదువులు వీరికి కలసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. తోటి వారికి కూడా సహాయం చేస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మించిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. మీరు గౌరవప్రదమైన ప్రవర్తన, ఆధ్యాత్మిక అంతర్దృష్టి, నీతి బలం, నిజాయితీ కలవారు. తరచూ 'బ్రహ్మాంశ' (దైవసారం)తో పుట్టినవారిగా చెబుతారు, సహజంగా మంచి, సున్నితమైన ప్రవర్తన చూపిస్తారు, ఇది మీకు గౌరవం, ఆరాధన తెస్తుంది. దేవాలయాకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, ధన సహాయాన్ని చేస్తారు. కానీ, అప్పు ఇవ్వరు. ఆర్థికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పరులు.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల నక్షత్రపు ఫలములు
నక్షత్రపు పేరు నక్షత్రములు ఫలం
పుట్టిన నక్షత్రము కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ ఒంటికి శ్రమ
సంపత్తు నక్షత్రము రోహిణి, హస్త, శ్రవణం డబ్బుల లాభం
ముంపు తెచ్చు మృగశిర, చిత్త, ధనిష్ఠ పనికి చేటు
నక్షత్రము
సంపత్తు నక్షత్రములు ఆరుద్ర, స్వాతి, శతభిష బాగు
వేఱైన నక్షత్రములు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ప్రయత్నము పాడు అగుట
సాధన నక్షత్రములు పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర పని నెఱవేరుట, మంచిది
నైత్య నక్షత్రములు ఆశ్లేష, జ్యేష్ట, రేవతి బంధనం
వీరితో బాగా పడిన అశ్విని, మఖ, మూల హాయి
మిక్కిలి బాగా పడిన భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ హాయి, కలిసి వచ్చును
Thursday, October 9, 2025
Sukra - శుక్రుడు
జాతి -బ్రాహ్మణ
వర్ణము - తెలుపు, మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక.
ఇతర నామాలు కావ్యుడు, సితుడు, భృగుసుతుడు, దానవాచార్యుడు, ఉశనుడు
శుభ గ్రహాల కలయిక: శుభ గ్రహాలైన గురువు (బృహస్పతి), బుధుడు వంటి గ్రహాలు శుక్రుడితో కలిసి పంచమ స్థానంలో (ఫైన్త్ హౌస్) ఉన్నప్పుడు అది మంచి యోగంగా పరిగణిస్తారు.
శుక్రుడు జాతకంలో బలహీనంగా లేదా అశుభ స్థానాల్లో ఉంటే
ఆర్థిక సమస్యలు, సంబంధాలలో ఇబ్బందులు, మరియు సౌభాగ్యం
లేకపోవడం వంటివి తలెత్తుతాయి. ఈ దోష నివారణకు పరిహారాలు పాటించవలసి ఉంటుంది.
శ్రీకృష్ణుడు కుచేలుడికి అనుగ్రహించిన అపార ధన సంపత్తిని ఉశనుడు అపహరించబూనడంతో ఈశ్వరుడు ఆగ్రహించి శుక్రుడిని సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఉశనుడు తన తపశ్శక్తితో ఈశ్వరుడి ఉదరంలో ప్రవేశించి అతడిని స్తుతించసాగాడు. బోళాశంకరుడైన ఈశ్వరుడు ఉశనుడికి అభయం ఇచ్చి, శుక్ర శోణిత రూపంలో బయటకు పంపాడు. అప్పటి నుండి అతడికి శుక్రుడన్న పేరు సార్థకమయింది. చైత్ర శుద్ధ ఏకాదశి నాడు మఖ నక్షత్రంలో మన్మధ సంవత్సరంలో ఉశనుడు శుక్రుడిగా అవతరించాడు. శివుడు అతడి స్తుతికి మెచ్చి ధన్వీర్యాలకు అధిపతిగానూ, రాక్షసులకు గురువుగానూ చేసి గ్రహమండలంలో స్థానం కల్పించాడు. అసురుల గురువైన శుక్రుడు వారి అభ్యున్నతి కొరకు ఘోర తపస్సు చేసాడు. ఈశ్వరుడిని మెప్పించి మృతసంజీవనీ విద్యను సాధించాడు. శుక్రుడు సంపదలకు, మంత్రాలకు, రసాలకు, ఔషధులకు అధిపతి. అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన శుక్రుడు తన సంపదలను దానవ శిష్యులకు అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. వర్షాలపై ఆధిపత్యం వహిస్తూ అతివృష్టి, అనావృష్టికి కారకుడౌతాడు. వర్షాలను నిరోధించే వారిని శాంతింపచేస్తాడు.
శుక్రుడు శారీరక సుఖము, భార్య, యౌవనం, సౌందర్యం, రాజసము, వినోదము, స్త్రీలు, ఐశ్వర్యం, జలవిహారం, ఆభరణములు, సౌందర్య సాధనములు, చతుష్షష్టి కళలు, వీర్యము, మన్మధుడు, సుగంధద్రవ్యములు, గౌరి, లక్ష్మి ఆలయములు, క్రీడా ప్రదేశములు, పాలు, పాల కేంద్రాలు, పాలకు సంబంధించిన వస్తు విక్రయము, వస్త్రములు దానికి సంబంధించిన వృత్తులు, అలంకార సామాగ్రి, పరిమళ ద్రవ్యములు వాటికి సంబంధించిన వృత్తులు, పానీయములు, పండ్లరసాలు వాటికి సంబంధించిన సంస్థలు, పెట్రోలు వాహనములు, నౌకలు, సముద్ర యానం, రస సంబంధం ఉన్న నిమ్మ, నారింజ, కమలా, బత్తాయి మొదలైన పండ్లు, నేత్ర, సుఖ, చర్మ, కంఠముకు సంబంధించిన రోగములు, దర్జీ, కళాసంబంధ వృత్తులు, సౌందర్య సంబంధిత వృత్తులు, స్నేహితులు, బహుమతులు, హనీమూన్, ప్రేమ, విందులు విలాస విహారాదులు, పూలు, అలంకరణ సామాగ్రి, లౌక్యము, లాభము, ఒప్పందము, ఆకర్షణ మొదలైన వాటికి కారకుడు.
వ్యాధులు- గర్భాశయ, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాధులు మొదలైన వాటికి కారకుడు.
కుజుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలైనవి కలుగుతాయి.
బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం,
శనితో కలిసిన సుఖ వ్యాధులు,
రాహువుతో కలిసిన గర్భ సంబంధిత వ్యాధులు,
కేతువుతో కలిసిన సంతాన లేమి.
ద్వాదశ స్థానాలలో శుక్రుడు
1. శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందరశరీరం కలిగిన వాడు, సుఖజీవి, చిరంజీవి ఔతడు.
2. శుక్రుడు ద్వితీయస్థానమున ఉన్న బహువిధములుగా సంపదలు కలవాడు, కవి ఔతాడు.
3. తృతీయముస్థానమున శుకృడు ఉన్న జాతకుడు భార్యాహీనుడు, కష్టవంతుడు, బీదవాడు, దుఃఖవంతుడు, అపకీత్రి కలవాడు ఔతాడు.
4. చతుర్ధస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు వాహనములు కలవాడు, మంచిగృహం కలవాడు, నగలు, వస్త్రములు, సుగంధద్రవ్యములు కలవాడు ఔతాడు.
5. పంచమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు అపారధనవంతుడు, ఇతరులను రక్షించు వాడు, బహుమేధావి, పుత్రులు కలవాడు ఔతాడు, భార్య వల్ల లాభం, సుఖ సంసార జీవితంలో లాభం
6. షష్టమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు శతృవులు లేని వాడు, ధనమును లేని వాడు, యువతుల చేత వంచింపబడిన వాడు, విచారగ్రస్తుడు ఔతాడు.
7. సప్తమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు మంచి కళత్రం ఉన్న వాడు, పరస్త్రీ ఆసక్తుడు, కళత్రం లేని వాడు, ధనవంతుడు ఔతాడు.
8. అష్టమ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడు, రాజు ఔతాడు.
9. నవమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు భార్యాబిడ్డలు, సంతానం, ఆప్తులు కలిగి రాజాశ్రయం కలిగి అభివృద్ధి చెందుతూ ఉంటాడు.
10. దశమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగినవాడు, మిత్రులు కలిగిన వాడు, ప్రభువు ఔతాడు.
11. ఏకాదశ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడు, బహు సుఖవంతుడు ఔతాడు.
12. ద్వాదశము స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతుడు, ధనవంతుడూ ఔతాడు.
Monday, October 6, 2025
Karthaveeryarjunudu - కార్తవీర్యార్జునుడు
యదువు పెద్దకుమారుడు సహస్రజిత్, చిన్నకుమారుడు క్రోష్టుడు. బలరామకృష్ణులు, యాదవులందరూ ఈక్రోష్టుడి వంశంవారే. సహస్రజిత్ కొడుకు శతాజిత్, అతని కొడుకు హెహయుడు. ఇతని వలనే హైహయవంశం ఏర్పడింది. హైహయవంశంలో మహిష్మవంతుడు, కృతవీర్యుడు, కార్తావీర్యార్జునుడు గొప్ప చివరి రాజులు. పరశురాముడు కార్తావీర్యార్జునుడిని అతని కుమారులను సంహరించడం వలన హైహయవంశం అంతమైంది.
హైహయ వంశీయుడైన కృతవీర్యుడు వింధ్య పర్వత ప్రాంతంలో ఉన్న అరూప దేశాన్ని మహిష్మతిపురంను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజు కుమారుడే కార్తవీర్యార్జునుడు. పుట్టుకతోనే శాపవశాన చేతులు లేకుండా పుట్టాడు వీరి గురువు గర్గమహర్షి.
కొంత కాలానికి కృతవీర్యుడు వయసు పైబడి వార్డక్యంతో మరణించాడు. ప్రజలు కార్తవీర్యార్జునుడిని రాజై రాజ్యాన్ని పరిపాలించమని కోరారు.
"నేను వికలాంగుడిని. రాజ్యాన్ని ఎలా పాలించగలను. నాకు రాజ్యం వలదు. రాజ భోగములు వలదు" అని వైరాగ్య భావనతో ప్రజల కోరికను తిరస్కరించాడు కార్తవీర్యార్జునుడు.
గురువు గర్గమహర్షి " కార్తవీర్యార్జునా! నీకు ఈ అవిటితనం పోవాలంటే దత్తాత్రేయుడిని ఆశ్రయించి ఆయన కృపను, కరుణను పొందితే ఆ మహాత్ముడి కటాక్షం వలన నీకు వికలాంగత్వం పోయి తేజోవంతమైన మహావీరుడవుతావు. అయితే ఆయన అనుగ్రహం అంత సులువు కాదు. ఆయన చూడడానికి అసహ్యంగా కనబడుతాడు. కుక్కలతో ఆడుకుంటూ ఒకసారి, మధువు సేవిస్తూ ఒకసారి, బంగి తాగుతూ ఒకసారి, స్త్రీలతో కలిసి చిందులేస్తూ ఒకసారి కనిపిస్తాడు. అవేవి పట్టించుకోకుండా ఆయనను సేవిస్తే కరుణించి వరాలు వొసగి అనుగ్రహిస్తాడు. " అని తెలిపి దత్తాత్రేయుడి సన్నిధికి కార్తవీర్యార్జునుడిని పంపుతాడు.
గురువు మాట తలదాల్చి శ్రద్ధాభక్తులను హృదయంలో నిలుపుకొని దత్తాత్రేయుడి ఆశ్రమానికి బయలుదేరుతాడు కార్తవీర్యార్జునుడు. దత్తాత్రేయుడు ఎన్ని వన్నెలు చిన్నెలు చూపిన, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆయన చరణాలు పట్టుకొని ఇడువకుండా ఎన్నో సంవత్సరాలు సేవ చేశాడు కార్తవీర్యార్జునుడు. ఎట్టకేలకు కార్తవీర్యార్జునుడి అకుంఠిత దీక్షకు, అమేయ భక్తి ప్రపత్తులకు అనుగ్రహించి, నిజరూపం దాల్చి వరములు కోరుకోమన్నాడు దత్తాత్రేయుడు.
కార్తవీర్యార్జునుడు " స్వామి! దయామయా! కరుణాసాగరా! ఇన్నాళ్లకు నాపై కృప కల్గిందా దేవా!
పరందామా! నాకు నాలుగు వరములు అనుగ్రహించండి పరమాత్మా!" అంటూ అనేక విధాలుగా వేడుకున్నాడు.
"కోరుకో! కార్తవీర్యార్జునా! నీకు వరములను ప్రసాదిస్తాను" అని అభయం ఇచ్చాడు దత్తాత్రేయుడు.
"1. నాకు వెయ్యి చేతులు కావలెను. యుద్ధభూమిలో నేను వెయ్యి చేతులతో కనిపించవలెను. వెయ్యి చేతులతో ఆయుధాలు ప్రయోగించ గలగవలెను. ఇంట్లో మామూలుగా కనిపించవలెను
2. ఈ భూమండలాంతటినీ జయించి సామర్థ్యంతో పాలించవలెను
3. నేను చెడుగా ప్రవర్తించినప్పుడు మునులు మహర్షులు నన్ను మంచి మార్గంలో పెట్టవలెను.
4. నేను యుద్ధభూమిలో యుద్ధం చేస్తూ నా కంటే గొప్ప వీరుని చేతిలో మరణించవలెను. ఈ వరములను దయతో ప్రసాదించండి ప్రభు!" కోరుకున్నాడు కార్తవీర్యార్జునుడు.
"తదాస్తు! నీవు కోరుకున్న వరములన్నీ ప్రసాదిస్తున్నాను. ఉత్తమ పరిపాలకుడవై ప్రజలను ఏలి ప్రసిద్ధి గాంచు కార్తావీర్యార్జునా!" దీవించి దత్తాత్రేయుడు వరములను వొసగినాడు. తక్షణం కార్తావీర్యార్జునుడికి సహస్ర బాహువులు, దివ్య తేజస్సు, అద్భుత లావణ్య రూపం, సకలాయుధ సహితంగా స్వర్ణరథం సిద్ధించింది.
అంతట దత్తాత్రేయుడికి సాష్టాంగ నమస్కారం చేసి, అనేక స్తోత్రంలతో కీర్తించి, సెలవు గైకొని తన రాజ్యంనకు పోయాడు కార్తావీర్యార్జునుడు. రాజ్యాభిషేక్తుడై, అశ్వమేధ యాగం చేసి, వరబలంతో భూమండలాంతటినీ జయించి, సమస్త జీవులపై అదుపు అధికారం సాధించి ధర్మధీక్షతో, న్యాయ బద్దంగా పాలించసాగాడు కార్తావీర్యార్జునుడు.
కార్తావీర్యార్జునుడు ఒకసారి తన దేవేరులతో కలిసి నర్మదా నదిలో క్రీడిస్తూ, నర్మదా నది ప్రవాహానికి తన సహస్ర బాహువులను అడ్డుగా పెట్టి నదీ గమనాన్ని నిలువరించాడు. నదీ ప్రక్కగా ప్రవహిచి సమీపములో ఉన్న రావణుని సైనిక శిబిరాల మీదుగా ప్రవహించింది. రావణుడు కోపించి కార్తావీర్యార్జునుడిపైకి యుద్ధానికి దండెత్తి వచ్చాడు. కార్తావీర్యార్జునుడు రావణుడిని యుద్దంలో ఓడించి చెరశాలలో బంధించాడు. రావణుడి తాత పులస్త్యుడు కార్తావీర్యార్జునుడి దగ్గరికి వచ్చి రావణుడిని విడిచి పెట్టుమని కోరగా రావణుడిని బంధవిముక్తుని చేసి సగౌరవంగా సాగనంపాడు.
కార్తావీర్యార్జునుడి పాలనను కిన్నెర కింపురుష గంధర్వులు ప్రశంసించారు. సకల లోకాలలో కీర్తించ బడినాడు. దానితో అతని లోనికి గర్వం అహంకారం అహంభావం ప్రవేశించి విర్రవీగాడు. వరబలంతో బలగర్వంతో దేవలోకాలను జయించాడు. ఇంద్రుడిని కూడ పీడించాడు కార్తావీర్యార్జునుడు.
ఒకనాడు అగ్ని దేవుడు కార్తావీర్యార్జునుడి దగ్గరకు వచ్చి "రాజా! నాకు ఆకలిగా ఉంది. ఆహారం కావాలి. నీవు రక్షణగా నిలబడితే ఈ గిరినగరారణ్యాన్ని స్వాహా చేసి నా ఆకలి తీర్చుకుంటాను" అర్థిస్తూ అడిగాడు.
మదోన్మత్తుడై ఉన్న కార్తావీర్యార్జునుడు " ఈ గిరినగరారణ్యాన్ని స్వాహా చేసి నీ ఆకలి తీర్చుకో అగ్నిబట్టారకా! " అంటూ అనుమతినిచ్చి అండగా నిలిచాడు కార్తావీర్యార్జునుడు.
అగ్ని గిరినగరారణ్యాన్ని యథేచ్ఛగా స్వాహా చేస్తూ అడవిలోని పల్లెలను, ఆశ్రమాలను కూడా కాల్చివేశాడు. ఆ అరణ్యంలోనే ఉన్న వశిష్టుని ఆశ్రమాన్ని కూడా దహనం చేశాడు. దానితో వశిష్టుడు కోపించి రక్షణగా నిలిచిన రాజును "కార్తావీర్యార్జునా! దురాంకారముతో, బలమదంతో చెలరేగిపోతున్నావు! నీ అంతం సమీపించింది. నిన్ను ఒక ముని కుమారుడు నీ సహస్ర బాహువులను తెగ నరికి నీ మస్తకాన్ని త్రుంచుతాడు" అని శపించాడు వశిష్ట మహర్షి. కార్తావీర్యార్జునుడు బలమదంతో శాపాన్ని లెక్క చేయలేదు
దేవతలందరూ వైకుంఠం చేరి కార్తావీర్యార్జునుడి ఆగడాలు శృతి మించి, మితిమీరాయని, అతని పీడ నుండి తమను రక్షించమని శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. వారికి అభయం ఇస్తూ
" కార్తావీర్యార్జునుడిని సంహరించే సమయం ఆసన్నమైంది. నేను పరశురామావతారం ఎత్తి హతమార్చుతాను. కార్తావీర్యార్జునుడు నా సుదర్శన చక్రాయుధమే. ఒకనాడు సుదర్శనుడు ' నా వలనే నీవు ఎందరినో రాక్షసులను, లోకకంటకులను సంహరించావు. నేను లేకుంటే నీవు చంపలేక పోయేవాడివి' అని మిడిసిపడినాడు. అట్లైన కార్తావీర్యార్జునుడిగా నీవు భూలోకమునందు జన్మించు! నేను పరశురాముడిగా అవతారం దాల్చి నీతో తలపడతాను. అప్పుడు నీవు లేకున్నా నేను జయించలేనేమో నీవే చూస్తావు" అని సంఘర్షించాము. ఆకారణంగానే సుదర్శనుడు భూమిపై జన్మించాడు" అని గతాన్ని చెప్పి దేవతలను పంపించాడు శ్రీమహావిష్ణువు.
అనంతరం విష్ణుమూర్తి భూలోకంలో పరశురాముడిగా జమదగ్ని రేణుకా ముని దంపతులకు జన్మించి, పెరిగి పెద్ద అవుతాడు. సకల విద్యలు, శాస్త్రాలు అభ్యసించి మహావీరుడుగా ఎదుగుతాడు పరశురాముడు.
చాల కాలం తరువాత ఒకనాడు అడవిలో క్రూర మృగాలు గ్రామాలపై బడి బాధిస్తుండగా వాటిని వేటాడుటకు బయలుదేరుతాడు కార్తావీర్యార్జునుడు. దినమంతా క్రూర జంతువులను వేటాడి, అక్కడే వున్న జమదగ్నిమహర్షిని దర్శించడానికి ఆశ్రమానికి తన సైన్యంతో సహా వెళ్తాడు కార్తావీర్యార్జునుడు.
జమదగ్ని కుమారుడు పరశురాముడు ఇంట్లోలేని సమయంలో జమదగ్ని మహర్షి, ఆశ్రమవాసులు రాజును, సైన్యాన్ని ఆదరించి, సేదదీర్చి, రాజుకు సైనికులకు పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించి సంతృప్తి పరుస్తారు. రాజు - ఇంతమంది సైనికులకు భోజనాలు పెట్టిన ఆశ్రమవాసుల్ని చూసి విస్మయం చెంది కార్తావీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని సమీపించి "మహర్షి! ఇంత పెద్ద సైన్యానికి ఎలా భోజనం ఏర్పాటు చేశారు. మీ దగ్గర అంత ధాన్యం లేదు కదా! ఎలా సాధ్యం అయింది. " అడిగాడు.
" మహారాజా! ఇది నా గొప్పతనం కాదు. నా దగ్గర దైవ ప్రసాదితమైన కామదేనువు సంతతికి చెందిన ఒక గోవు ఉన్నది. దాని మహిమ వలననే మీకు ఆతిథ్యం ఇయ్యడం సాధ్యమైంది. " అని వివరించాడు జమదగ్ని మహర్షి.
" ఇలాంటివి రాజు దగ్గర వుంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలడు. కాబట్టి మహర్షి! ఈ గోవును నాకు ఇవ్వండి. బదులుగా మీకు ఏమి కావాలంటే అవి ఇస్తాను. భూమి, ధాన్యం, ధనం, బంగారం ఏది కోరుకుంటే అది ఇస్తాను. ఆవును మాత్రం నాకివ్వండి. మీరివ్వకపోతే బలవంతంగానైనా తీసుకపోవలసి వస్తుంది. కాబట్టి మీరే సగౌరవంగా ఇచ్చి పంపుతే గౌరవంగా ఉంటుంది" నయానా భయానా చెప్పాడు కార్తావీర్యార్జునుడు. జమదగ్ని మహర్షి నిర్ద్వంద్వంగా నిరాకరించాడు.
కార్తావీర్యార్జునుడు బలవంతంగా గోవును తోలుకొని తన రాజధాని మహిష్మతి నగరాన్ని చేరుతాడు. ఇంటికి వచ్చిన పరశురాముడు విషయం తెలుసుకుని కోపోద్రిక్తుడై మహిష్మతి నగరంపై దండెత్తి, భీకరాకృతి దాల్చి కార్తావీర్యార్జునుడి సమస్త సైన్యాన్ని సంహరించాడు. కార్తావీర్యార్జునుడితో జరిగిన మహభయంకర యుద్ధంలో అతడి సహస్ర బాహువులను, తలను ఖండిస్తాడు పరశురాముడు.
"అసువులు బాసిన కార్తావీర్యార్జునుడి పార్థీవ దేహం నుండి సుదర్శనుడు బయటికి వచ్చి పరశురాముడికి నమస్కరించి "నా గర్వం, అహంకారం, అహంభావం తొలగి పోయాయి ప్రభు. విశ్వప్రభువైన నీతోనే గర్వించి ఆత్మస్థుతి చేసుకున్నాను. నా గొప్పదనం నీ వలన సంప్రాప్తించినదే అని గుర్తించలేని అజ్ఞానిని. క్షమించు ప్రభు!" అని పరశురామావతారమూర్తిని స్థుతించి, వైకుంఠం జేరి, చక్రాయుధ రూపు ధరించి శ్రీ మహావిష్ణు దివ్యహస్తంను అలంకరించాడు సుదర్శనుడు.
Renuka Devi - రేణుక దేవి
రేణుక దేవిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పిలుస్తారు. త్రిమూర్తులను సృష్టించి పసిపాపలుగా ఆడించినందున తనని జగదంబ అని పిలుస్తా ఎల్లరకు అమ్మ కనుక ఎల్లమ్మ అని ఊరికి ఎల్లల్లో ఉండటం వలన ఎల్లారమ్మ అని చండాల వాటికలో ఉద్భవించినందున మాతంగి అని లజ్జా గౌరీ అని క్షేమకరీమాత అని కుంకుడు చెట్టు కింద వెలుచుట వలన కుంకుళ్లమ్మ అని ఆటలమ్మ మసూచి వంటి వ్యాధుల నివారణ చేయటం వలన మారెమ్మ అని పోచమ్మ అని ముత్యాలమ్మ అని ఇలా వివిధ పేర్లతో కొనియాడుతారు భక్తులు దక్షిణ భారతదేశంలోనే కాక ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఉత్తరాఖండ్ కాశ్మీరు ప్రాంతంలో అమ్మవారి యొక్క తంత్ర సాధన చాలా ప్రసిద్ధిగాంచినది విదేశాలు అయినటువంటి థాయిలాండ్, మలేషియా సింగపూర్ ఇండోనేషియా మొదలగు ప్రాంతాలలో అమ్మవారి పూజ చాలా వైభవంగా జరుపుకుంటారు ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ దేవేరి త్రికాలజ్ఞాని త్రినేత్రదారుడు బృగు వంశమునందు జన్మించినటువంటి సప్తర్షి జమదగ్ని మహర్షి యొక్క ఇల్లాలు జమదగ్ని మహాముని క్రోధ దేవతల యొక్క ఆశీర్వాదము వలన నేరము చేసిన వారిని తన యొక్క కోపోజ్వాలలో భస్మిపట్లము చేయగల సమర్థులు.
జమదగ్ని జననము
బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులలో ఒకరైనటువంటి భృగు మహర్షి వంశము చాలా ప్రాశస్తం పొందినది అమ్మవారిని సేవించి లక్ష్మీదేవినే తనకు కుమార్తెగా పొందిన మహా ఋషులు భృగు మహర్షి ఆయనకు చ్యవనుడు అనే కుమారుడు జన్మించెను ఆయన పులోమజా అను పతివ్రత వలన ఋచీకుడు అను మహామునికి జన్మనిచ్చింది. ఋచీకుని భార్య సత్యవతి వారికి పుట్టిన సంతానమే జమదగ్ని.
సత్యవతి గాది మహారాజు యొక్క ఏకైక పుత్రిక తమకు ఒక్కగానొక్క సంతానము అయినటువంటి సత్యవతికి వివాహము జరిపించి రాజ్యమునంతటిని సామంతులకు అప్పగించి నిశ్చయించారు సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి ముని వంశస్థుడు సత్శీలత కలిగినటువంటి ఋచీకునికి ఇచ్చి వివాహము జరిపించెను తాను క్షత్రియ కులకాంత అవుట వలన తమకి జన్మించే సంతానము కూడా క్షత్రియ గుణములతో పుడతాడు అది ముని అయిన తన భర్త వంశమునకు కీడు వంటిది అని భావించి ఋచీకునికి తనకు కేవలం సాత్విక గుణములు కలిగిన బిడ్డ కావాలన్న కోరికను విన్నవించెను. అలానే మగసంతానము లేని తన తల్లిదండ్రులకు కూడా క్షత్రియ గుణములు కలిగిన బిడ్డను ప్రసాదించమని అడిగాను. సత్యవతి కోరిక మేరకు అత్తకు భార్యకు సంతానము నివ్వదలిచి యాగము చేసి రెండు కుండలలో పరమాన్నముతో నింపి ఒకటి అత్తగారిని ఇంకొకటి భార్యని భుజించమని అత్తగారికి ఇచ్చి పంపెను. ఆ రెండు కుండలలో క్షత్రియకుల సతి అయిన గాది యొక్క భార్యకి క్షత్రియ గుణములు గల బిడ్డను, ముని భార్య అయిన సత్యవతికి సాత్విక గుణములుగల బాలుడు పుట్టవలెను అనే ఉద్దేశంతో రెండు కుండలను విడివిడిగా ఇచ్చిన కానీ అల్లుడు ఋచీకుడు యందు అనుమానం కలిగిన సత్యవతి తల్లి తనకు మంచి బిడ్డ పుట్టవలెను అను ఉద్దేశంతో ఋచీకుడు తన భార్య కుండలో ఏవైనా శక్తులు నింపాడేమో అనుకొని స్వార్థంతో సత్యవతికి ఇచ్చిన కుండా భుజించి తనకు ఇచ్చిన ప్రసాదాన్ని సత్యవతికి ఇచ్చెను. అవి భుజించిన వారి గర్భంలో మారు బిడ్డలు పెరుగుచుండరి. అది గ్రహించిన ఋచీకుడు తన భార్య క్షత్రియ బిడ్డను మోస్తుంది అన్న విషయం తనకి తెలియజేశాను. అంతట భయమొందిన సత్యవతి ఆ బిడ్డను తన కుటుంబ తరువాతి తరమునకు చెందనున్న తన కోడలి గర్భమునకు మార్చమని ఋచీకుడుని అడిగింది. ఋచీకుడు అలాగే చేశాడు. అత్తకు మరియు భార్యకు కూడా సాత్విక గుణములు కలిగిన సంతానము కలిగిరి. గాది తన బిడ్డకు విశ్వామిత్రుడు అని నామకరణము చేసినది. సత్యవతి తన బిడ్డకు జమదగ్ని అను నామకరణం చేసినది అలా సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు, సత్యవతికి జమదగ్ని జన్మించితిరి. ఆ ముని బిడ్డ జమదగ్ని క్రోధ దేవతల ఆశీర్వాదంతో తనకు కోపం కలిగించిన వారిని తన క్రోధాగ్ని జ్వాలలతో భస్మము చేయగల శక్తి పొందెను.
రేణుక జననము
పూర్వం మధ్య భారత దేశము నందు వైగంగా నది తీరాన విదర్భ రాజ్యము విలసిల్లుతుండేది. ఆ రాజ్యము ఇష్వాకు వంశస్తులైనటువంటి ప్రశ్నజిత్తు మహారాజు ఏలుబడిలో ఉండేది రాజ్యం అంతటినీ తన కుటుంబంలా భావించి పాలించే రాజుకి సంతానం లేకపోవడం ఒక తీరని లోటులా మారిపోయింది. తన ఆస్థాన అర్చకుల ఆదేశం మేరకు రాజుగారు పుత్రకామేష్టి యాగం చేయించి అమ్మవారి కృప వలన యాగశికల నుండి తేజవంతమైనటువంటి ఒక పసిపాప కాంతులనీనుతూ ఆవిర్భవించెను. సంతోషించిన రాజు ఆ పాపకు రేణుక అను నామకరణం చేసిరి
రేణుక పుట్టిన తర్వాత తన తల్లి చనిపోవటం వలన రేణుక యొక్క పోషణ భారం ఆస్థాన పరిచారకురాలు అయినటువంటి మాతంగికి అప్పగించారు రాజుగారు. మాతంగి పర్యవేక్షణలో ఆస్థానంలో అందరి ప్రేమ అభిమానాలతో అల్లారుముద్దుగా పెరగసాగింది. క్షత్రియ కాంత అయినందున సమస్త యుద్ధ విద్యలు నేర్చుకొని మహారాగ్నికి ఉండవలసిన అన్ని లక్షణాలను ఇనుమడింప చేసుకొనెను. వేదవేదాంగాలు, ధనుర్విద్య మొదలగు విద్యలను అవపాసన చేసుకొనెను. యుద్ధ విద్యలతో పాటు భగవంతునిపై ఎనలేని భక్తి నమ్మకం తో కొంతకాలం తపస్సు ఆచరించెను. అలా కొన్ని కాలం గడిచిన తరుణంలో అగస్త్య మహాముని కోరిక మేరకు ప్రశ్నజిత్తు రేణుకను భృగుకులా వంశస్తుడైనటువంటి జమదగ్ని మహామునికి ఇచ్చి పరిణయము చేయనిచయించిరి.
రేణుక జమదగ్నిల కళ్యాణం (కుండలినీపురం)
రేణుక జమదగ్నుల గృహస్థాశ్రమం జమదగ్నికి సూర్యుని శాపం
మహర్షి జమదగ్ని ఋషివర్యులు అందరి సమక్షంలో గృహస్థాశ్రమ ధర్మాలను త్యజించి వాన ప్రస్తాశ్రమం తీసుకునెను. అప్పుడు వాళ్లు కుండలినీపురం వదిలి ప్రస్తుత వైశాఖవనంగా చెప్పబడే నల్లమల అడవులలో ఉన్న అలంపూర్ సంస్థానానికి చేరుకున్నారు. అక్కడ తమ ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే కొలువై ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామిని శక్తిమాత అలంపూర్ యోగినీ దేవతలకు అధినేత్రి అయినటువంటి జోగులాంబని సేవిస్తూ నిత్య కర్మలను అనుష్టించేవారు. ఒకానొక రోజు రేణుక ఎప్పటి వలె నీరు తెచ్చుకొనుటకు తుంగభద్రా నది తీరానికి వెళ్ళెను అక్కడ నీటిలో గంధర్వలోకంలో తమ చెలికత్తెలతో శృంగార కేళీ జరుగుతున్న చిత్రరథుడు అను గంధర్వుడి నీడ కనిపించెను. ఆ కామకేళిని చూసి మనస్సు చెల్లించిన రేణుక ఒకసారె తేరుకొని పొడి ఇసుకతో కుండను చేయుటకు ప్రయత్నించెను. కానీ ఇసుక నిలువటలేదు. వెంట వచ్చిన సర్పము చేతికి అందక మాయమయ్యాను. తాను పాతివ్రత్యముని మరిచి వానప్రస్థాశ్రమంలో ఉండగా ఇటువంటి ఆలోచన చేసి ఘోర పాపము చేసితిని అని భావించి ఒట్టి చేతులతో ఆశ్రమానికి చేరుకొనెను. అది అంతయు జ్ఞానదృష్టితో తెలుసుకొని జమదగ్ని కోపోద్రిక్తుడై రేణుకకు వెంటనే ఆశ్రమ బహిష్కరణ విధించెను. అంతియేకాక భయంకరమైన చర్మవ్యాధితో బాధపడుతూ పంచభూతాల నిరాదరణకు లోనుకమ్ము అని శపించెను. దిక్కుతోచని రేణుక తన సేవకురాలు మాతంగితో అడవులబాట పట్టెను. మాతంగి రేణుకకు సేవలు చేస్తూ కాలము గడుపుతుండగా ఒకనాడు దారిలో ఏకనాథ్, జోగినాథ్ అని ఇద్దరు సాధుపుంగవులు రేణుకని గుర్తించి ఆమె ఈ స్థితికి కారణం తెలుసుకొని బాధపడెను. రేణుకను రక్షించి దలచిన వారు రేణుకకు ఒక పాతివ్రత్య వ్రతమును బోధించెను.
పితృవాక్య పాలన చేసిన పరుశురాముని చూసి మహర్షి తల్లిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న పరుశురామును చూసి మూడు కోరికలు కోరుకోమనెను. అంతట సంతోషించిన పరశురాముడు తన తల్లిని బ్రతికించమని వేడుకొను జమదగ్ని కుమారునికి కొంత పుణ్య జలముని తన కమండలం నుండి తీసి పరుశురామునికి ఇచ్చి తలాముండెం జోడించి వాటిపై చల్లమని ఆదేశించిన పరశురాముడు కంగారులో మాతంగి తల రేణుకకు రేణుక తల మాతంగి జోడించి నీరు చల్లుతాడు. ఇద్దరు స్త్రీలు తమ యొక్క మారిన దేహములతో పైకి లేస్తారు అది చూసి చికిత్యుడైన పరుశురాముడు వాళ్ళని మారిన అమ్మలు మారెమ్మగా పిలుస్తాడు అలా మారెమ్మ యొక్క ఆవిర్భావం జరిగింది ఆ మారమ్మయే తమిళనాడులో మారీ అమ్మన్ గా ప్రసిద్ధి చెందినది.
Sri Matangi Devi Sahasra Namavali - శ్రీ మాతంగి దేవి సహస్రనామావళి
శ్రీమాతంగీ దేవి సహస్రనామావళి ఓం సుముఖ్యై నమః । ఓం శేముష్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సురసాయై నమః । ఓం శశిశేఖరాయై నమః । ఓం సమానాస్యాయై నమః ।...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...