Saturday, August 15, 2026

Madhuvanam - మధువనం

రామాయణం సుందరకాండ 61వ సర్గ - మధువనం

అందరూ మహేంద్రగిరి శిఖరం నుండి గగన వీధికి ఎగిరారు.

మత్తేభాలవలె, మహాగిరులవలె వారు ఆకాశమంతా క్రమ్ముకున్నారు. వారందరూ సాగి సాగి నందన వనంలా ఉండే మధువనంలో ప్రవేశించారు. వివిధ తరు లతా శోభతో అది సుగ్రీవ రక్షితమై సర్వమనోహరంగా వుంది. ఆ వనంలో ఎవరూ అడుగు పెట్టడానికి వీలులేదు.

సుగ్రీవుని మేనమామ దధిముఖుడు ఆ వనపాలకుడు. ఆయన అప్రమత్తంగా రక్షించే వనంలో ప్రవేశిస్తూనే వానరులందరూ అంగదుని ఛేరి మధుపాన కాంక్ష వెలిబుచ్చగా, ఆ యువరాజు జాంబవంతాది వృద్దులతో సంప్రదించి వానరులకు అనుమతి యిచ్చాడు.

అంతతో పట్టరాని సంతోషం కలిగిన ఆ వానరులు.

గాయన్తి కేచిత్‌ ప్రణమంతి కేచిత్‌
నృత్యన్తి కేచిత్‌ ప్రహసన్తి కేచిత్‌ ।
పతన్తి కేచిత్‌ విచర
న్తి కేచిత్‌
ప్లవంతి కేచిత్‌ ప్రలపంతి కేచిత్‌ః ॥

కొందరు పాటలు మొదలుపెట్టారు. కొందరు ప్రణామాలు, నాట్యాలు, నవ్వులు, తిరుగుళ్ళు, దూకుళ్ళు, అతి ప్రసంగాలు అలా సాగిస్తున్నారు.

ఒక చెట్టుమీది నుండి మరొక చెట్టుకు దూకుతూ, చివరి కొమ్మనుండి నేలకు దుముకుతూ, నేలనుండి వృక్షాగ్రాలకు ఎగురుతూ గడిపారు. ఒకడు పాడుతూంటే ఒకడు నవ్వుతున్నాడు, నవ్వే వానిని చూచి ఏడిచే వాడొకడు, అరిచే వాడొకడు, వాడికి ప్రోత్సాహం ఒకడు:

మధుపానమత్తులై వారు మతులుపోయి చరిస్తున్నారు.

పాన మత్తతలో వారు కొమ్మలు విరిచారు, చెట్లు ధ్వంసం చేస్తున్నారు. చూశాడు దధిముఖుడు, వనపాలుడు.

క్రోధంతో వచ్చి వారించబోయోడు. కొందరిని మందలించాడు, దూషించాడు, దెబ్బలు వేశాడు. వారందరూ ఆ మ
త్తులో దధిముఖుని దండించడం ఆరంభించారు.

గోళ్ళతో రక్కి, పళ్ళతో పీకి, కాళ్ళతో తన్ని నానా హింసలూ పెట్టారు.

అది చూసి హనుమంతుడు మీరందరూ మధుపానం సాగించండి. వీరి విషయం నేను చూస్తాను, అనవిని అంగదుడు కార్యసాధకుడైన హనుమంతుడు చెపితే అకార్యం అయినా చెయ్యవలసిందే, అనగా వారందరూ అంగదుని కొనియాడి మధువనంలో మిగిలిన వృక్షాలవైపు సాగి ఫలాలు భక్షిస్తూ, మధువు త్రాగుతూ అడ్డు వచ్చిన వారిని చావగొడుతున్నారు.

దోసెళ్ళతో కొందరు త్రాగుతూంటే మధుభాండాలు చంకలలో పట్టుకుపోతున్నారు కొందరు, త్రాగి కొట్టుకోవడం మొదలు పెట్టారు, కొందరు చెట్టు మొదట నిలిచారు. కొందరు ఎండుటాకుల మీద దొర్లుతున్నారు. తూలే వారు కొందరు, త్రోసుకునేవారు కొందరు.

కూతలు కూసేవారు, నిద్రపోయేవారు, సింహనాదాలు చేసేవారు, అట్టహాసాలు, తాడనాలు అలా మత్తులో ఉన్నారు వారు.

వారి చేత దెబ్బలు తిన్న వన పాలకులు పిక్కబలం చూపారు.

తన సేవకుల పరాభవం విని దధిముఖుడు వారందరినీ తీసుకుని 
హావృక్షాలు పెరికి వానరయోధులను వారించరాగా హనుదాదులు ఎదురు వచ్చారు,

పానమత్తుడై వున్న యువరాజు అంగదుడు ఒళ్ళు తెలియని దశలో దధిముఖుని నేలమీద పడగొట్టి చితకబొడిచాడు.

ఆ యువకుడి దెబ్బలకు మూర్చపోయాడు దధిముఖుడు. కొంత సేపటికి తేరుకొని తన అనుచరులను వెంటబెట్టుకుని సుగ్రీవుని చేరి మధువనంలో జరుగుతున్న విషయం వివరించి తలవంచి దోసిలి ఒగ్గి, యింత అకార్యానికీ కారకుడు అంగదుడు, అంటూ పాదాలమీద పడ్డాడు.

సుగ్రీవుడు వానిని లేవనెత్తి:

నీకు అభయమిస్తున్నాను. విషయం వివరంగా చెప్పు, అన్నాడు.

వానరేశ్వరా! నీ తండ్రి ఋక్షరజసుడుగానీ, మీ అన్న వాలిగానీ మధువనంలో అడుగుపెట్టలేదు. నువ్వు కూడా ఎప్పుడూ ఆ వనంలో దిగలేదు. అటువంటి వనాన్ని ధ్వంసం చేసి మధువంతా పానం చేశారు అంగదాదులు. మేమందరం వారించబోగా బాగా మాకు పాదతాడనాలు లభించాయి. చక్రవర్తివి నువ్వుండగా మాకు వారే శిక్ష వేశారు, అని దుఃఖిస్తూంటే, చూచి లక్ష్మణస్వామి:

వానరేశ్వరా! ఎందు కీయన దుఃఖిస్తున్నాడు, అని ప్రశ్నించాడు.

లక్ష్మణా! అంగదాదులు 
ధువనంలో ప్రవేశించి యధేచ్భగా త్రాగుతూ తిరుగుతున్నారని చెపుతున్నాడు.

వారందరూ దక్షిణదిశకు అన్వేషణకు వెళ్ళినవారు. ఆ వనంలో వారు స్వేచ్చగా చరిస్తున్నారంటే కార్యసాధకులై వచ్చారన్నమాట. కాకపోతే ఆ సాహసం వారికి రాదు. నిస్సందేహంగా వారు సీతను చూశారు.

హనుమంతుడే ఆ కార్యం సాధించి ఉంటాడు. కార్యసాధనకు యోగ్యమయిన ఆలోచనా శక్తి అతనికే ఉంది. వివేకవంతుడయిన పరాక్రమ సంపన్నుడు మా హను
. అదీకాక-

జాంబవా న్యత్ర నేతాస్యాత్‌
అంగదశ్చ బలేశ్వరః
హనుమాం శ్చాప్యధిష్ఠాతా
న తస్య గతి రన్యధా

నాయకుడు జాంబవంతుడు.
బలాధిపతి అంగదుడు.
అధిష్ఠాత హనుమంతుడు. ఇక కార్యసాధనకు అడ్డేమిటి!

వీరందరూ 
ధుపానానికి ఉపక్రమించారంటే సీతాదేవిని చూసి వచ్చారన్నమాటే.

కాకపోతే బ్రహ్మదత్త
యిన ధువనంలో కాలు పెట్టడానికి అంగదాధులకు ఎన్ని గుండెలు కావాలి. వారు సీతను చూశారు, అనడంతో రామ లక్ష్మణులు పరమానందం పొందారు:

అప్పుడు సుగ్రీవుడు:

కార్యసాధకులయి వచ్చిన అంగదాదులు ఏం చేసినా క్షమించాలి. సింహసదృశులయిన హనుమదాదులందరినీ మేము చూడగోరుతున్నాం. సీతాన్వేషణ విశేషాలు వినగోరుతున్నాం, అన్నాడు.

ఆ మాట విని దధిముఖుడు సుగ్రీవ రామ లక్ష్మణులకు నమస్కరించి తన అనుచరులతో మధువనం చేరాడు.

అప్పటికి మత్తు వదులుతూన్న వానరవీరులను సమీపించి, చేతులు జోడించి, అంగదుని సమీపించి:

యువరాజా! మా అపరాధం మన్నించండి. ఈ వనం మీద మీకూ అధికారముంది. ఒకనాడు వాలి వానరేశ్వరుడు, అదే రీతిగా సుగ్రీవుడు, ఆ తరువాయి నువ్వు. అందువల్ల క్షమాభిక్ష కోరుతున్నాను.

ఇప్పుడు మేము సుగ్రీవునికి ఈ వార్త నివేదించగా ఆయన సంతోషంతో అందరినీ రమ్మన్నాడు. త్వరగా మిమ్మల్ని చూడగోరుతున్నాడు అనగా, 

అంగదుడు: వానర వీరులారా! రామచంద్రుని కీ విషయం తెలిసివుంటుంది. అందువల్ల మనం త్వరగా వెళ్ళాలి. మధుపానముత్తులై హాయిగా నిద్రించే వానరవీరులను తీసుకుని సుగ్రీవ సన్నిధానానికి వెళ్ళాలి. పెద్దలు ఎలా చెపితే అలా నడుచుకుంటాను, నేను యువరాజునయినా కార్యసాధకులను అజ్ఞాపించడం ఉచితం కాదు, అన్నాడు.

ప్రభువయినవాడెవ్వడూ యింత వినయంగా మాట్లాడడం మేమెరగం. ప్రభుత్వమదం వినయాన్ని దరిజేరనివ్వదు. అహంకారం దాని లక్షణం. ఇది నీ భావిశ్రేయస్సుకు మంచిది.

నీ మాట మీద మే మందరం సుగ్రీవ సన్నిధానానికి రావడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నారు వారు.

అయితే నడవండి, అని అంగదుడు ఎగిరాడు.

ఒక్కమారుగా యంత్ర ఉక్షిప్తమయిన పర్వతాలవలె వానరయోథులు ఎగిరారు.

వాయు విచలితములయిన మేఘసముదాయంలా గర్జిస్తూ వస్తూంటే సుగ్రీవుడు:

రామభద్రా! నువ్వు నిశ్చింతగా వుండు. 
నవారు సీతను చూసే వస్తున్నారు. ఎలా అంటావా! నేను పెట్టిన గడువు దాటిన తరువాయి నా ఎదుటపడగల వానరుడు లేడు. గడువుదాటి వస్తున్నారంటే పనిచేసుకు వచ్చారన్నమాట, ఆలా కాకపోతే మా అంగదుడు నా ముందుకు రానే రాడు. పయిగా వారు మహోత్సాహంలో వున్నారని విన్నాంకదా! దాని అర్థం కార్యం సాధించారనే. అదీకాక మా తాత తండ్రులు ప్రాణప్రదంగా రక్షించే మధువనం ధ్వంసం చేశారంటే ఎంత ఉత్సాహంతో వున్నారో యోచించు.

నిస్సందేహంగా సీత కనిపించి వుంటుంది, హనుమంతుడే చూచి వుంటాడు. మా హనుమ ధీశాలి, కార్యసాధకుడు.

హనూమతిహి సిద్ధిశ్చ
తిశ్చ తి సత్తమ-

జాంబవంతుడు నాయకుడు, అంగదుడు బలేశ్వరుడు, హనుమంతుడు సాధకుడు. అటువంటప్పుడు 
రోలా జరగడానికి వీలులేదు. నువ్వు నిశ్చింతగా వుండు, అంటూండగా కిలకిల ధ్వానం చేరింది.

ఆ ఉత్సాహధ్వానం వినే సుగ్రీవుని వాలం పెరిగింది; 
నసు సంతోషంతో పొంగింది.

వానరు లందరూ రామదర్శన లాలసులై అంగదునీ, హనుమంతునీ ముందుంచుకుని క్రిందికి దిగారు.

హనుమంతుడు చేతులు జోడించి, రాముని ముందు నిలిచి:

స్వామీ! సీతాదేవి క్షేమంగా వుంది, అన్నాడు.

సుగ్రీవునికి తన ఊహ నిజ
యినందుకు ఆనందం కలిగింది. లక్ష్మణుడు ఆదరనయనాలతో హనుమంతుని చూశాడు. రామభద్రుడు సంతోష వదనంతో చూశాడు.

చూడామణి

Chudamani - చూడామణి

రామాయణం సుందరకాండ 69వ సర్గ వరకు - చూడామణి

రామభద్రుడు:

ఓ వానర వీరులారా! సీతాదేవి ఏ స్థితిలో వుంది. నా యందు ఆవిడ ఏ దృష్టితో వుంది. అంతా వివరంగా చెప్పండి, అన్నాడు.

అప్పుడు వానరులందరూ సర్వవృత్తాంతం ఎరిగిన హనుమంతుని రాముని ముందుకు నడిపించారు.

హనుమంతుడు దక్షిణ దిశగా తిరిగి మనసా సీతాదేవికి నమస్కరించి రాముని చూచి:

రామభద్రా! అమ్మవారిని అన్వేషించడానికి దక్షిణ సముద్రం నూరు యోజనాలు దాటి లంకలో అడుగుపెట్టాను. అక్కడ సీతాదేవిని దర్శించాను.

ఆ పతివ్రతా శిరోమణి తన మనస్సు నీ మీదనే లగ్నంచేసి నీకోసమే జీవిస్తున్నది. రావణుని ఉద్యానవనంలో రాక్షసీ జనమధ్యంలో వారి పరుష భాషణలతో హింస పడుతున్నది. ఆమెకు వారే రక్షకులుగా వున్నారు.

దీనురాలై, ఏకవేణితో, భూమిమీదనే శయనిస్తూ, మంచుదెబ్బతిన్న పద్మంలా వుంది.

క్రూర రావణుని హీంసలు పడలేక ప్రాణత్యాగానికి సన్నద్ధమవుతూండగా నేను వారించి ఓదార్చడానికి ప్రాతిపదికగా ఇక్ష్వాకువంశ కీర్తనం ఆరంభించాను.

అప్పుడు నన్ను విశ్వసించి నాతో మాట్లాడింది. నేను విషయమంతా వివరించాను.

మీ మైత్రిమాట విని సంతోషించింది. మీకు గుర్తుగా చిత్రకూటం మీద వాయసం కథ చెప్పింది. ఆవిడ తిలకం జారినప్పుడు మణిశిలతో మీరు తిలకం దిద్దిన వృత్తాంతం గుర్తుచేసింది.

ఇదిగో ఈ చూడామణి ఆనవాలుగా యిచ్చింది. ఆ రాక్షసా వాసంలో మరొక్క మాసంకంటె జీవించనని చెప్పింది, అని విషయాలు విస్తరంగా చెప్పాడు.

రాముడు చూడామణిని అందుకుంటూనే గుండెలకు హత్తుకుని కన్నీరు విడుస్తూ సుగ్రీవుని వైపు తిరిగి:

లేగదూడ కోసం ఆవు ఎంత తపన పడుతుందో ఈ మణిని చూడడంతో నేను సీతకోసం అంత బాధ పడుతున్నాను. కల్యాణ వేదిక మీద ఆ జనక మహారాజు దీనిని ఆమెకు శిరోభూషణంగా అలంకరించాడు, ఈ మణి పవిత్ర జల సంభూత, దీనిని దేవేంద్రుడు కానుకగా యిచ్చాడు. దీన్ని చూస్తూంటే మా తండ్రిగారినీ, మా మామగారినీ చూసినట్లనిపిస్తున్నది. ఇది ఆమెకే అలంకారం, అని హనుమంతునివైపు తిరిగి:

మారుతీ! దాహపీడితుడికి స్వాదుజలంవలె నీ మాటలు నా బాధకు ఉపశమనం కలిగిస్తున్నాయి. నా జానకి యింకా ఏం చెప్పిందో వివరించు; జానకి లేని జీవితం క్షణం కూడా భరించలేను. నన్ను కూడా ఆమె దగ్గరకు తీసుకువెళ్ళు. ఆ రాక్షసుల మధ్య ఏం బాధలు పడుతున్నదో, మేఘాచ్చాదిత శరచ్చంద్రునివలె వుండి వుంటుంది. రోగికి ఔషధంలా నాకు నీ మాటలే, జీవనాధారం, ఆ ప్రియభాషిణి చెప్పిన మాటలన్నీ వినిపించు, అన్నాడు.

రామభద్రా! చిత్రకూటం మీద మీరుభయులూ విశ్రాంతి తీసుకునే వేళ నువ్వు నిద్రపోయేవేళ ఒక వాయసం వచ్చి జానకమ్మను హింసిస్తుండగా నువ్వు మేలుకాంచి దర్భను బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి విడిచావట, ఆ కాకికి ముల్లోకాలలోనూ అభయం దొరకక నిన్నే శరణువేడితే అప్పుడు అమోఘ
యిన ఆ అస్త్రానికి లక్ష్యంగా కన్ను వదులుకున్నదట.

అలనాడు వాయసంమీద అస్త్రం ప్రయోగించిన రాముడు రాక్షసుల విషయంలో ఎందుకు ఉపేక్ష వహిస్తున్నాడు. లక్ష్మణుడయినా ఎందుకు రావడంలేదు.

బహుశ నేను చేసిన పాపకర్మలు పూర్తికాలేదేమో! లేకుంటే యింత కాలం ఆ 
హావీరులు ఉదాసీనంగా ఎందుకుంటారు, అని కన్నీరు విడిస్తుంటే నేను:

తల్లీ! రాముడు నీ విరహవ్యధతో నిశ్చేష్టుడై వున్నాడు. లక్ష్మణుడు అన్నగారి దుఃఖం చూడలేక బాధపడుతున్నాడు.

ఇంతకాలం నీ జాడ తెలియలేదు. ఇప్పుడింక నువ్వు చింతించకు. వారుభయులూ హుటాహుటిని వచ్చి లంక దహించి, ఈ రావణుని బంధుకోటితో సహా కడతేర్చి తమతో తీసుకువెడతారు. ఆయనకు ఆనవాలుగా ఏదయినా ఇయ్యి, అని అడిగాను.

అప్పుడావిడ అటూ యిటూ చూసి, జుట్టు ముడిలోని ఈ మణి యిచ్చింది.

నేను తీరుగు ప్రయాణానికి బయలుదేరుతూంటే,

హనుమా! సింహసదృశ పరాక్రమ సంపన్నులయిన రామ లక్ష్మణులనూ వానరేశ్వరునీ అడిగానని చెపుతూ, రా
లక్ష్మణులను దర్శించగలగడం నీ అదృష్టం, అని నన్ను అభినందించింది.

అప్పుడు నేను:

తల్లీ! నా వీపుమీద కూర్చో. ఈ క్షణంలో వారి దగ్గర దింపుతాను, అన్నాను.

అప్పుడావిడ!

హనుమా! ఈ 
నస్సు నా స్వాధీనంలో వుండగా పరపురుష స్పర్శ సహించను. అలనాడు కాలం ఎదురు తిరగడంవల్ల, ఆ రాక్షసుడు నన్ను ముట్టగలిగాడు, ఇక రాముడు నన్నీ దుఃఖసాగరం నుండి ఎలా ఉద్దరించాలో అదంతా అయనతో నువ్వు ఆలోచించు. ఈ రాక్షసపీడ చూశావుగదా! అంతా ఆయనకు చెప్పు. నీకు శుభమగుగాక! అని క్షణం ఆగి:

పోనీ ఈ రోజు యిక్కడెక్కడయినా విశ్రాంతి తీసుకుని వెళ్ళరాదా! నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవరకూ నేను వుంటానో వుండనో! నా దుఃఖాలకు అంతు కనబడడంలేదు, మీ వానర, భల్లూక సేనలు ఈ అనంత విశాల సాగరాన్ని ఎలా దాటగలవయ్యా!

దాశరథులకు మాత్రం యిది సాధ్యమా!

వాయుదేవుడు, గరుత్మంతుడు, నువ్వూ తప్ప మరెవరూ ఈ సముద్రం దాటలేరు కదా.

మరి ఈ అసాధ్యాన్ని నువ్వు ఎలా సాధిస్తావో చూడాలి. అందుకు నువ్వే స
మర్థుడవు. రాముడు స్వయంగా వచ్చి రాక్షస సంహారం చేసి నన్ను తీసికెళ్ళడం ఆయనకు యశస్కరం.

ఈ రాక్షసుడు రామునికి భయపడినందువల్లనే కపట మార్గాన నన్ను హరించాడు. రాముడు తన పరాక్రమం ప్రదర్శించాలి. అదంతా నువ్వు చెప్పాలి, అని అన్నది,

అప్పుడు నేను:

అమ్మా! వానరేశ్వరుడు సుగ్రీవుడు కృత నిశ్చయుడై వున్నాడీ విషయుంలో

వానర భల్లూక పతులందరూ ఆయన కను సన్నలలో నడుస్తారు. వారు సంకల్పించారంటే సాధించి తీరతారు. వారికి అవరోధం లేదు. వాయుమార్గాన భూ ప్రదక్షిణం చేయగల యోధులు వారందరూ.

అక్కడ నా కంటె మహామహులూ, నాతో సమానులూ వున్నారే తప్ప తక్కువ వారెవరూ లేరు. దూతగా నన్ను పంపారు. అంటే వారికంటె తక్కువ వాడీనే కదా, పెద్దలను దూతకృత్యానికి పంపరు కదా!

ఈ వానరయూధనాధులు ఒక్క ఊపులో లంకలో వ్రాలుతారు. ఇక ఆ రాజ సింహులు నా వీపుమీద వచ్చి యిక్కడ సూర్య చంద్రునివలె దిగుతారు.

సర్వశత్రు సంహార సమర్దుడు, సింహసమ పరాక్రమోపేతుడు, రామ భద్రుడు ధనుర్ధారియై లంకానగర ద్వారంలో నిలబడడం త్వరలోనే నువ్వు చూడగలవు,

వాడి గోళ్ళూ, నిశిత దంతాలూ, ఆయుధాలుగా మా వానర గణాధిపతులు సింహ శార్దూల బలసంపన్నులు. వారు మత్తగజ సన్నిభులై నీ ముందుంటారు.

వార్షుకాభ్రాలవలె, మహాపర్వతాలవలె వారు ఈ లంకానగర సమీప గిరి సానువులమీద సింహనాదాలు చేస్తూంటే వినే రోజు ఎంతో దూరంలో లేదు.

రామభద్రుడు శత్రుసంహారం చేసి వనవాసం ముగించి నిన్ను వెంట బెట్టుకుని అయోధ్యానగరం చేరి తీరతాడు, అని జానకీదేవిని ఓదార్చాను;

అని హనుమంతుడు పలకడంతో రా
భద్రుడు సంతుష్ట చిత్తుడయాడు.

అరిఘ్నం సింహ సంకాశం
క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం
లక్ష్మణంచ ధను ష్పాణిం
లంకాద్వార ముపస్థితం


సుందరకాండ సమాప్తం

(అదికవి వాల్మీకి అనుగ్రహించిన శ్రీ మద్రామాయణంలో సుందరకాండకు ఇది ఉషశ్రీ స్వేచ్చానువాదం.)

యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం సమత రాక్షసాంతకం.


(రామనామం వినిపించే ప్రతిప్రాంతంలో ఆనంద బాష్పాలతో తలవంచి నిలబడే మూరుతికి నమస్కారం. ఇది భక్తుల దృష్టిలో హనుమంతుని రూపం)

అంజనా నందనం - వీరం
జానకీ శోకనాశనం
కపీశం అక్ష హంతారం
వందే లంకా భయంకరం
.

అదీ ఆయన రూపం.

Angada - అంగదుడు

రామాయణం సుందరకాండ 60వ సర్గ - అంగదుడు

మారుతి మాటలు విని అంగదుడు:

సీతను చూసి వచ్చామే కాని ఆవిడను తీసుకురాలేదని చెప్పడం మనవంటి మహాపరాక్రమ సంపన్నులకు ఉచితంకాదేమో! మన హనుమ రాక్షస సంహారంచేసే వచ్చాడు కనక మనం సీతను తీసుకువెళ్ళడం మంచిది. సీతను రా
లక్ష్మణుల ముందుంచి న పరాక్రమం చాటుకుందాం, అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు.

నాయనా! సుగ్రీవుడు కాని, రాముడు కాని మనకు అన్వేషణ కార్యం అప్పగించారే తప్ప మరేమీ చెప్పలేదు. అయినా 
నం సాహసించి సీతను తీసుకువెడితే ఆ రాజశార్దూలుడు మనలను ఏ దృష్టితో చూస్తాడో! అది తన వంశ ప్రతిష్ఠకు భంగకరం అనుకుంటాడేమో! మనకు తెలీదు.

ఏమంటే సీతను తాను తెచ్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడాయన. ఆ మాట చెల్లించుకోవాలి. ఇప్పుడు మనం నువ్వు చెప్పినట్లు చేశామో అయన మనస్సు వికలమయి తీరుతుంది. మన శ్రమ వ్యర్థమవుతుంది.

అందువల్ల వెళ్ళి జరిగిన విషయం చెప్పడమే 
న కర్తవ్యం. అప్పుడాయన ఏం చెపితే అలా చెయ్యడానికి మనం సిద్ధంగానే ఉన్నాం కదా! అనగా అంగద, హనుమదాదులందరూ అంగీకరించారు.

మధువనం

Aalochanalu - ఆలోచనలు

రామాయణం సుందరకాండ 59వ సర్గ - ఆలోచనలు

హనుమంతుడు ఇంకా చెపుతున్నాడు:

రామకార్యం, సుగ్రీవయత్నం సఫలమయినట్లే. సీతాదేవిని చూసిన అనంతరం ఆ శీలవతి పట్ల నా మనస్సు నిర్మల భక్తి భావంతో వుంది. ఇక రావణుడు, వాని తపశ్శక్తి ఎంతటి దంటే ఈ సర్వలోకాలనూ రక్షించనూ గలడు, దహింపజెయ్యనూ గలడు. అంత శక్తిమంతుడు. ఆ తపశ్శక్తి కారణంగానే వాడు సీతను తాకినా నశించలేదు. ఆవిడ నిజంగా ఆగ్రహిస్తే అగ్నికంటె తీక్షణ మయింది. వాని తపో
గ్ని ఎంత!

సరే. ఇప్పుడింక మనం రామ లక్ష్మణులను తీసుకుని సీతాదేవిని దర్శించాలి.

లంకా నగరాన్ని ధ్వంసంచేసి, మూలబలంతో రావణుని కడతేర్చే శక్తి నాకు లేకపోలేదు. మీ వంటి మహాయోధులు కూడా కలిస్తే వేరే చెప్పవలసింది లేదు.

ఐంద్ర, రౌద్ర, వాయవ్య, బ్రహ్మాస్త్రాలు నన్నేమీ చెయ్యలేవు. మరి మీ ఆజ్ఞలేదు కనక కాని, అప్పుడే రావణ వంశ నాశనం, చేసేవాడిని.

మన మహానాయకుడు జాంబవంతుడు విజృంభిస్తే ఎదురేముంది.

అందాకా ఎందుకు! 
న యువరాజు అంగదుడు చాలు. వీరులు పనస, నీలులు కదిలితే మందరగిరిని పిండిచేస్తారు. మైంద ద్వివిదులను ఎదుర్కొనే శక్తి దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస నాగజాతులలో ఎవరికుంది? వీరు బ్రహ్మ వర ప్రభావ సంపన్నులు. అమృతం అందుకున్నవారు. వీరిద్దరూ చాలు లంకను కూల్చడానికి, నేనే లంకానగరాన్ని బూడిదచేసి వచ్చాను. అక్కడ రామలక్ష్మణ సుగ్రీవ జయనాదాలు చేశాను; అన్నాడు.

అంగదుడు

Anveshana Gaadha - అన్వేషణ గాథ

రామాయణం సుందరకాండ 58వ సర్గ - అన్వేషణ గాథ

మహేంద్రగిరి మీద అందరూ సుఖాసీను లయారు.

అప్పుడు జాంబవంతుడు చిరునవ్వుతో హనుమంతుని చూస్తూ:

నాయనా! సీతాదేవిని ఎలా చూడగలిగావు! క్రూర రావణుని లంకలో ఆవిడ ఎలా వున్నది? అసలు నువ్వు ఎలా వెళ్ళావు? ఈ వివరాలన్నీ మాకు యథాతథం వినిపించు. విన్నాక తరువాయి కథ ఆలోచిద్దాం, అన్నాడు.

ఆ మాట వినగానే హనుమంతునికి శరీరం పులకించింది.

సీతాదేవికి మనసా నమస్కరించి, కథ ఆరంభించాడు.

మీ రందరూ చూస్తూండగానే మహేంద్రగిరి మీద బయలుదేరి గగన వీధికి లేచాను కదా! సముద్రం మీద వెడుతూండగా నా దారికడ్డుగా ఒక సువర్ణగిరి కనిపించింది. అది నాకు అవరోధంగా నిలబడుతున్నదనే అనుమానం కలిగి దాన్ని ముక్కలు చేసి తీరాలనుకొని నా వాలంతో కొట్టగా దాని శిఖరం వేయి ముక్కలయింది.

అప్పుడా గిరి: నాయనా! నీ తండ్రి వాయుదేవుడూ నా స్నేహితుడు. నన్ను మైనాకుడంటారు. ఈ సముద్రం నా నివాసం. పర్వతాలకు రెక్కలుండేవని నువ్వు విని ఉంటావు. వాటితో ఎగురుతూ అవి భూత కోటిని నాశనం చే
స్తూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు నరికాడు. అప్పుడు వాయువు సాయపడి నన్ను ఈ సముద్రంలో చేర్చాడు.

ధర్మపరుడయిన రామునికి సాయం చేయడం నా విధి. మీ తండ్రి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నీకు సాయపడాలని ఉంది, అన్నాడు.

నా ప్రయాణ ప్రాధాన్యం వివరించి వాని సెలవు పొంది బయలుదేరాను. తీవ్రవేగుడనై వెడుతూంటే దారిలో నాగమాత సురస అడ్డుపడి:

ఓ వానరా! దేవతలు నిన్ను నాకు ఆహారంగా అనుగ్రహించారు. చిరకాలానికి నా ఆకలి తీరుతున్నది, అనగా నేను చేతులు జోడించి:

అమ్మా: నేను దాశరథియైన రాముని పనిమీద వెడుతున్నాను. భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో రాముడు దండకారణ్యానికి రాగా అక్కడ దుష్టరావణుడు సీతను అపహరించాడు. రాముని దూతనై నేను సీతాన్వేషణకు వెడుతున్నాను. ఆవిడను దర్శించి, ఆ వృతాంతం రామునికి నివేదించి వచ్చి నేను నీ నోట పడతాను, నన్ను నమ్ము అన్నాను.

ఆ కామరూపిణి సురస: ఓరీ! నన్ను దాటి వెళ్ళడం ఏ ప్రాణికీ తరం కాదు, అంది.

నేను పది ఆమడలు పెరిగాను.

సురస అంతకంటె పెద్ద నోరు తెరిచింది.

ఉత్తర క్షణంలో నేను అంగుష్ఠ దేహుడనై ఆమె గర్భంలో ప్రవేశించి అంతలోనే ఈవలకు రాగా, నన్ను చూసి నాగమాత:

వానరా! నాకు సంతోషంగా వుంది. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నీ సంకల్పం ఫలిస్తుంది. సీతా రాములకు సమాగమం కలిగించు, అంది.

గరుత్మంతునివలే గగనవీధికిఎగిరాను.

దక్షిణముఖంగా సాగుతున్నాను,

అంతలో నన్ను క్రిందికి లాగుతున్నట్లనిపించింది ఎదో శక్తి,

క్రిందికి చూశాను. ఏమీ కనబడలేదు. అటూ యిటూ చూశాను. ఏ ప్రాణీలేదు. నా వేగం ఆగిపోయి క్రిందికి దిగిపోతున్నాను. బాగా నీటిలోకి చూశాను. 

ఆ సాగరంలో భయంకర రూపంతో అట్టహాసంతో ఒక రాక్షసి కనిపించింది.

ఓ మహాకాయుడా! ఎక్కడికి పోతున్నావు. చిరకాలంగా ఆహారం లేక ఆకలితో బాధపడుతున్నాను. నిన్ను తిని నా బాధ తీర్చుకుంటాను, అంది.

ఆ రాక్షసి నోరుకంటె విశాలంగా నా దేహం పెంచాను. అది దాని నోరు విశాలం చేస్తున్నది. పెరిగి పెరిగి ఒక్కసారిగా నా శరీరాన్ని సంకోచింపజేసి దాని ఉదరంలోకిపోయి గుండె చీల్చి బయటపడ్డాను. పర్వత దేహంతో అది నీటి మీద తేలింది. చూసిన చారణులు:

భయంకర రూపిణి అయిన సింహిక హనుమంతుని చేతులలో ప్రాణాలు వదిలింది, అనుకుంటూంటే వింటూ సాగి సాగి లంకా నగరపు సరిహద్దులో ప్రవేశించాను.

సూర్యుడు అస్తమిస్తున్నాడు.

లంకలో దిగాను.

దిగుతూన్న సమయంలో-

ప్రళయకాలమేఘంలా ఒక మహారాక్షసి భీకరాట్టహాసంతో నా ఎదుట నిలబడింది. దాని శిరోజాలు అగ్ని శిఖలవలె వున్నాయి. అది నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా ఎడమ పిడికిలి బిగించి ఒక్క పోటు పాడిచాను.

నేల కూలుతూ: ఓ మహావీరుడా! నేను లంకా నగర అధిష్ఠానాన్ని. నన్ను జయించిన నీకు లంకలో ఎదురులేదు, అని కన్ను మూసింది.

చీకటి పడింది. నగరంలో అన్వేషణ ప్రారంభించాను. లంక అంతా చుట్టబెట్టినా సీత జాడలేదు. విపరీత దుఃఖంతో నగర ప్రాకారంతో సమంగా వున్న మరొక సువర్ణ ప్రాకారాన్ని చూశాను. అందులో ఉద్యానవనం. దాని పేరు అశోకవనం. దానిలో శింశుపావృక్షం మీద కూర్చుని చూడడం మొదలు పెట్టాను.

ఆ చెట్టు మొదట ఉపవాసంతో కృశించి, ఏకవేణితో దీనవదనంతో భర్తృ చింతాపరాయణయై వున్న సీతను చూశాను.

ఆమెచుట్టూ వికృతాకారాలతో క్రూరస్వభావంతో రాక్షసీజనం.

రక్త మాంసాలతో బ్రతికే పెద్ద పులుల మధ్య ఆడు లేడిలా వుంది.

ఈ రాక్షస స్త్రీల బాధలు భరించలేక ప్రాణాలు వదిలి పెట్టె దశలో వుండగా చూశాను.

అంతలో రావణ భవనం నుండి అందెల ధ్వనులు అశోక వనముఖంగా వస్తున్నట్లు వినిపించింది.

నేను కొంచెం జంకి ఎవరికీ కనిపించకుండా కొమ్మల చాటున చేరి చూస్తున్నాను.

రావణుడు తన పత్నీ సమూహంతో వచ్చాడు.

సీతాదేవి ఆ రావణుని చూస్తూనే భయంతో ముడిచిపెట్టుకు కూర్చుంది.

గజ గజలాడే ఆమెను చూస్తూ రావణుడు.

ఓ సుందరీ! ఇంక నీకు రెండు మాసాలు గడువుంది. ఈ లోపున నీ మనసు నాపై మరలదో నీ రక్తం త్రాగక తప్పదు, అని గర్జించాడు.

సీత: రాక్షసాధమా! అమిత తేజశ్శాలి రాముడు నా భర్త. ప్రఖ్యాత మయిన ఇక్ష్వాకుల ఇంటి కోడలిని. అటువంటి నన్ను నోటికి వచ్చినట్లు ఆడుతున్న నీ నాలుక ఊడి నేలపడకుండా ఉన్నదే!

నాడు పర్ణశాలలో ఆయన లేనప్పుడు వచ్చావు కనక ఇంకా బ్రతికి వున్నావు. ఆయన కొలువులో సేవకత్వం కూడా నీకు దొరకదు. ఆయన అజేయుడు. అని క్రోధంతో మాట్లాడుతూంటే రావణుడు కన్నుల నిప్పులు కురుస్తూ పిడికిలి బిగించి ఆమెను సంహరించబోగా అక్కడి నారీజనం హా హా రవాలు చేశారు.

వారి మధ్యనున్న మండోదరి వచ్చి వారించి:

నీకు ఈ సీత దేనికి! దేవ గంధర్వ యక్ష కాంత లెందరు లేరు నీ అంతఃపురంలో.

వారితో హాయిగా భోగా లనుభవించు, అని తీసుకువెళ్ళింది. వాడు వెళ్ళాడు.

ఇక్కడి రాక్షస స్త్రీలు పరిపరి విధాల వినరాని మాటలతో సీతను హింసిస్తున్నారు. ఆ సమయంలో అప్పుడే నిద్రనుంచి లేచి త్రిజట వారందరినీ చేర బిలిచి:

ఓసీ! మీ కాలం మూడింది. ఈ సీతను ఎవరూ ఏమీ చెయ్యలేరు. మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఈ బాల జనక రాజపుత్రి, దశరథుని కోడలు, మహాపతివ్రత.

ఇప్పుడే నాకు కల వచ్చింది.

ఈమె భర్త లంకకువచ్చి రాక్షసులను ఓడించాడు. ఆయనను విజయలక్ష్మి వరించింది. ఈ సమయంలో వచ్చిన కల నిజమయి తీరుతుంది. కనుక మనం ఇప్పుడే ఈమెను ప్రార్థించి ప్రాణభిక్ష కోరుకోవాలి, అనగానే అందరూ ఆమె పాదాలమీద పడ్డారు.

మీ మాట నిజమే అయితే మీ అందరికీ నేను అభయం ఇస్తున్నాను, అంది సీత.

అప్పుడే నేను పరాక్రమం ప్రదర్శించి వారికి ప్రాయశ్చిత్తం చెయ్యాలనుకున్నాను. కాని బాగా ఆలోచిస్తే అది వుచితం అనిపించలేదు.

అప్పుడు ప్రశాంత సమయంలో ఇక్ష్వాకు వంశకీర్తనంతో ప్రసంగం ప్రారంభించాను.

నా మాటలు వింటూ సీతాదేవి కన్నీరు విడుస్తూ:

ఓ వానరోత్తమా! నువ్వెవరవు? ఇక్కడకు నిన్నెవరు పంపారు? రామునితో నీకెలా స్నేహమయింది? అని అడిగింది.

అప్పుడు నేను:

అమ్మా! బలశాలియైన వానరేశ్వరుడు సుగ్రీవుడు. నేనాయన భృత్యుడను. నీ భర్త రామచంద్రుని ఆదేశానుసారం వచ్చానిక్కడికి. ఇదిగో ఈ ఉంగరం ఆనవాలుగా యిచ్చాడు. నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను, నీ అభిమతమయితే వారి దగ్గరకు నిన్ను తీసుకువెడతాను అన్నాను. 

జానకి: నాయనా! ఆయన స్వయంగా వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకువెళ్ళాలి. అప్పుడు నేను; అమ్మా! అయనకు ఆనవాలుగా ఏమయినా యిస్తావా, అని అడిగాను.

ఆవిడ ఈ మణి యిచ్చింది.

అది అందుకుని, ఆవిడకు ప్రదక్షిణం చేసి తిరిగి రావడానికి సన్నద్ధమయ్యాను.

అప్పుడావిడ : నాయనా! నా అవస్థ అంతా వివరంగా చెప్పి, రెండు మాసాలలోగా వారు రాకపోతే నేను జీవించనని చెప్పు, అని విచారించింది. నేను ఓదార్చాను.

ఓదార్చి నా శరీరం పర్వతమంత పెంచాను.

ఆవిడ శోకం చూసిన నాకు రావణునిపై క్రోధం రేగింది. ముందుగా ఆ వనాన్ని ధ్వంసం చేయడం ఆరంభించాను. అది చూసి రాక్షస స్త్రీలు రావణునితో చెప్పారు. ఆయన మహాబలిష్ఠులయిన కింకర గణాన్ని పంపాడు. శూల ముద్గరాయుధాలతో వచ్చారు వారు. నేను తోరణ ద్వారం మీది దూలం అందుకుని వారిని యమపురికి పంపాను, హతశేషులు వార్తాహరులయ్యారు.

నేను నెమ్మదిగా అక్కడున్న చైత్యద్వారం మీదికి చేరాను. దానికి కాపలా ఉన్నవారిని ఒక స్తంభంతో కడతేర్చాను,

రావణుడు జంబుమాలిని పంపించాడు.

వీడు, వారి సేనాపతి ప్రహస్తుడున్నాడే వాడి కొడుకు.

వాడు తన బలగంతో దిగాడు. అందరినీ ఒక దూలానికి ఎరచేశాను.

అప్పుడు మంత్రి కుమారులు వచ్చారు.

వారిని కూడా అంతకు ముందు వచ్చిన వారికి తోడు పంపాను. సేనాపతులు వచ్చారు. వారు అయిదుగురు, మహాయోధులు, వారు కూడా యమపురి చేరారని విని రావణుడు తన ముద్దులకొడుకయిన అక్షుని పంపాడు. వాడు చతురంగబలాలతో వచ్చాడు. వీడు మండోదరి కుమారుడు.

వచ్చిన అక్షుని రెండు కాళ్ళూ పట్టి గిర్రున త్రిప్పి విసిరేశాను. అది విన్న లంకేశ్వరుడు ఆగ్రహంతో ఇంద్రిజిత్తును వదిలాడు. వీడు చాలా ఘటికుడు. ముందుగా వాని సేనను చిత్తు చేశాను. చూశాడు ఇంద్రజిత్తు, ఈ వానరుడు సామాన్యుడు కాడనుకుని బ్రహ్మాస్త్రంతో బంధించాడు. అది చూసి మిగిలిన సేవకులు నన్ను త్రాళ్ళతో బంధించి రావణుని కొలువుకూటానికి కొనిపోయారు.

ఆ దుష్టుడు నన్ను చాలా ప్రశ్నలు వేశాడు. జానకీ దర్శనార్థం వచ్చాననీ, అందుకే యింత చేశాననీ చెప్పి, నేను సుగ్రీవ సచివుడను, రామదూతను, వాయుదేవుని ఔరసపుత్రుడను.

మా రాజు సుగ్రీవుడు నీ క్షేమ సమాచారాలు తెలుసుకు రమ్మని, ఇంకా ఏమన్నాడంటే;

రావణా! రాముడు నా స్నేహితుడు. ఆయన భార్యను అపహరించిన రాక్షసుని సంహరించడానికి నేనంగీకరించాను. వాలిని సంహరించడానికి అయన అంగీకరించాడు. అగ్ని సాక్షిగా మైత్రి ఏర్పడింది మాకు.

రాముడు ఒకే ఒక్క బాణంతో వాలిని నేల కూల్చాడు, సుగ్రీవుడు వానరేశ్వరుడయ్యాడు. మమ్ము దశ దిశలకూ పంపాడు, నేను నీ దగ్గరకు దూతగా వచ్చాను.

వానర వీరుల సంగతి మీరెవరూ ఎరుగరు. వారు దేవసమ పరాక్రములు. వారందరూ వచ్చి నీసేనను నాశనం చెయ్యకముందే సీతాదేవిని రామునికి అప్పగించు, అని మా ప్రభువు సందేశం.

ఇలా నేను చెపుతూంటే రావణుడు క్రోధతామ్రాక్షుడై నన్ను తక్షణం సంహరించమని ఆజ్ఞాపించాడు,

ఆయన తమ్ముడున్నాడు ధీమంతుడు విభీషణుడు. ఆయన రాజనీతి చెపుతూ దూతవధ చాలా అన్యాయమనీ, దూతకు అంగవికలత్వం పెద్ద శిక్ష అనీ అనగా ఆ రాజు నా తోకకు నిప్పు పెట్టమన్నాడు.

రాక్షసులందరూ నా తోకకు గుడ్డలు చుట్టి అంటించారు, నన్ను కర్రలతో, పిడికిళ్ళతో హింసించారు. అలా రాజవీధులుత్రిప్పుతూంటే నగరం అంతా చూసాను. చూడడం అయింది.

శరీరాన్ని సంకుచితం చేసి కట్లు సడలించి, అంతలో పర్వతాకారుడనై మండుతున్న తోకతో లంకానగర సౌధ, భవన, ప్రాసాదాలన్నీ తగులబెట్టాను, అంతా అయాక సీత ఏమయిందో అని చింతలో పడ్డాను.

అప్పుడు ఆకాశచారులమాటలను బట్టి సీతాదేవి సురక్షితంగా వుందని గ్రహించాను. నా లాంగూలాన్నే దహించని అగ్ని సీతాదేవికి. హానిచేస్తాడా, అనుకుంటూ మళ్ళీ ఓ మారు ఆవిడను దర్శించి లంకలోని అరిష్టపర్వతం ఎక్కి గగనమార్గాన ఇలా వచ్చాను, ఇది యింతవరకూ జరిగిన కథ.

ఇక జరగవలసింది ఆలోచించండి, అన్నాడు.

ఆలోచనలు

Mitrasamaagamam - మిత్రసమాగమం

రామాయణం సుందరకాండ 56, 57 సర్గలు - మిత్రసమాగమం

ఆకాశ సముద్రంలో-
చంద్రుడే కలువ
సూర్యుడు నీటి కోడి.
పుష్యమీ, శ్రవణ నక్షత్రాలు హంసలు.
పునర్వసు మహా మీనం.
అంగారకుడు మొసలి.
స్వాతి నక్షత్రం హంసపథం.
ఐరావతం ద్వీపం.
మేఘాలే శైవలిని.
చంద్రకిరణాలు వాయు విచలిత తరంగాలు.
పద్మాలు, నాగ, యక్ష, గంధర్వులు.

అటువంటి సాగరాకాశాన్ని వేగగమన నౌకతో దాటుతున్నాడు, హనుమంతుడు.

సూర్య, చంద్ర, తారామండలాలను మింగుతున్నాడా అన్నట్టు సాగుతున్నాడు. మేఘమండలాలను లాక్కుంటూ వెడుతున్నాడు.

ఒక్కసారి వాటిలో దూరి, మరొకసారి పైకివచ్చి దోబూచులాడుతున్నాడు. 
బ్బుల మాటున - ధవళ వస్త్రధారి హనుమంతుడు - చంద్రుని వలె వున్నాడు.

గరుత్మంతునివలె గోచరిస్తున్నాడు.

దారిలో మైనాకగిరిశిఖరాన్ని హస్తస్పర్శతో అనందింపజేసి ముందుకు సాగి మహేంద్రగిరిని సుదూరాన చూచి సింహనాదం చేశాడు. దీర్ఘవాలాన్ని ఆడిస్తూ ఆనందంతో చేసిన ఆ మహాధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. ఆకాశం బ్రద్ధలవుతుందా అన్నట్లుంది ఆ ధ్వని. 

ఈవలి ఒడ్డున వున్న వానరవీరులు ఆ మహాగర్జన విని, అది ఏమా అని ఎదురు చూస్తున్నారు. వారిలో వృద్ధుడైన జాంబవంతుడు వారందరినీ దగ్గరగా చేర బిలిచి:

నాయనా! విన్నారా! ఆ గర్జ! కార్యసాధకుడు కాకపోతే అలా గర్జించలేడు. నిస్సంశయంగా మనవాడు విజయం సాధించి వస్తున్నాడన్నాడు.

పర
 సంతోషంతో వారందరూ పర్వతశిఖరాల మీద, చెట్ల చివరి కొమ్మల మీద గంతులు వేస్తూ హనుమంతుని రాకకోసం నిరీక్షిస్తున్నారు. మేఘం మీద మేఘం వస్తున్నట్టు దిగే హనుమంతునికి దోసిలి ఒగ్గి నిలిచారు.

హనుమంతుడు మహేంద్రగిరిమీద రెక్కలు లేని పర్వతంలా దిగాడు. అందరూ హనుమంతుని చుట్టూ చేరారు.

అనాయాసంగా అంత ప్రయాణం చేసి వచ్చిన హనుమకు వారందరూ దుంపలూ, పళ్ళూ కానుక లర్పించారు.

వృద్దుడయిన జాంబవంతునికి, యువరాజయిన అంగదునికి అభివాదం చేశాడు. చేస్తూనే:

ఆలోచించాడు; హనుమంతుడు. 

"దృష్టాసీతా" చూశాను సీతను, అని- 

రాక్షసస్త్రీజన మధ్యంలో, ఏకవేణితో, ఉపవాస కృశీభూతదేహంతో, రా విరహ శోకంతో మలినవస్త్రంతో ఉన్నది, అన్నాడు.

చూశాను అనేమాట అమృత ప్రాయంగా విని వారందరూ సింహ నాదాలతో, కిల కిలా రావాలతో, ఉరుములతో, తోకలు పొడుగుచేస్తూ పైకెత్తుతూ. నేలమీద తాడిస్తూ, గిరిశిఖరాలకు దూకుతూ, చెట్లమీదికి ఎగురుతున్నారు. 

అంగదుడు: హనుమా! నీ వల్ల మా అందరి ప్రాణాలూ నిలిచాయి. ఇప్పుడు మనం రామ దర్శనం చెయ్యగలం. నీ పరాక్రమ, ధైర్య, ప్రభు భక్తులు ప్రశంసనియాలు, నీ అదృష్టం వల్ల నువ్వు జానకిని చూడగలిగావు. సీతా వియోగ దుఃఖం రామునికి ఉండదు, అంటూండగా మిగిలిన వారందరూ హనుమంతుని యాత్రా విశేషాలు వినడానికి చుట్టూ చేరి కూర్చున్నారు. ఆ వానరవీర మధ్యంలో అంగదుడు దేవ పరివృతుడైన దేవేంద్రుని వలె ఉన్నాడు.

ఆ వానర యోధులతో పర్వత శిఖరం శోభిస్తున్నది.

అన్వేషణ గాథ

Aascharyam - ఆశ్చర్యం

రామాయణం సుందరకాండ 55వ సర్గ - ఆశ్చర్యం

క్రుద్ధః పాపం న కుర్యాత్కః 
క్రుద్ధో హన్యా ద్గురూ నపి

క్రుద్ధః పరుషయా వాచా
నరః సాధూ నధిక్షిపేత్‌


లంక ముట్టించి హనుమంతుడు సముద్రతీరం చేరి నీటిలో తోక తడుపుకుంటూ మంటలలో మాడే లంకా నగరాన్ని చూస్తున్నాడు.

ఒక వంక భయం, మరొకవంక అసహ్యం కలిగాయి. ఈ అకార్యం ఎందుకు చేశాను. ఆగ్రహం కలిగితే దానిని వివేకంతో అణచిపెట్టాలేకాని యింత అఘాయిత్యం చెయ్యడమా! కోపాన్ని నిగ్రహించుకోగలవారే ధీమంతులు.

కోపంలో చెయ్యని పాపం వుండదు. గురుహత్య, సజ్జనహింస వంటి పనులు కోపిష్ఠి అనాయాసంగా సాగిస్తాడు. ఎవరితో ఏం మాట్లాడాలో కూడా వాడికి తెలియదు. అందుచేతనే పాముకుబుసం విడిచేటట్లు ధీమంతులు క్రోధాన్ని విసర్జించాలి.

దుర్బుద్దుడనై, లజ్జా విహీనతతో ఈ దహనకాండ సాగించాను. సీతాదేవి ఏమవుతుందో అనే ఆలోచనే లేదు నాకు. ఇప్పుడింక ఏం చెయ్యను. స్వామి ద్రోహం జరిగిపోయింది.

ఈ లంకాదహనంతో సీతాదేవికూడా తగుల బడివుంటే ఏం కావాలి? నా సర్వ ప్రయత్నం వ్యర్థం. రావణుడిమీద ఆగ్రహంతో సర్వనాశనం చేసుకున్నాను.

ఇప్పుడింక నేను అగ్నిగుండంలో దూకాలి. మహాసాగర బడబాగ్నికి ఆహుతి కావాలి. లేదా సముద్రంలో తిమింగలాలకు ఆహారం అవుతాను.

సుగ్రీవుని సమ్ముఖానికి ఎలా వెళ్ళగలను? రామ లక్ష్మణులను చూడగలనా ఈ దశలో. ఈ లంకాదహనంతో ముల్లోకాలూ కపి ప్రకృతిని పరిహసించి తీరతాయి. రాజసంతో ఎంత దారుణానికి ఒడిగట్టాను.

సీత మరణించిందని వినగానే రామ లక్ష్మణులు ప్రాణం విడిచిపెడతారు. అది చూచిన సుగ్రీవుడు బంధుకోటితో ప్రాణత్యాగం చేస్తాడు. అయోధ్యలో భరత శతృఘ్నులు మాత్రం జీవిస్తారా!

కోపం కారణంగా యింతపని చేసిన అదృష్టహీనుణ్ని, అని చింతించే, హనుమంతునికి కొన్ని శుభశకునాలు గోచరించగా:

మాంగళ్యదేవతయైన సీతను అగ్ని దహించదు. ఆవిడే అగ్ని రూపిణి. అగ్నిని అగ్ని బాధిస్తుందా! రాముని భార్యను, పతివ్రతా శిరోమణిని అగ్ని దరిజేరలేదు.

సీతా రాముల ప్రభావంచేత కాకపోతే అగ్ని నా లాంగులాన్ని మండించి నన్ను భాధించకుండా వుంటుందా! నా తోకను తగలబెట్టని అగ్ని సీతపై ప్రసరిస్తుందా!

అవసర
యితే జానకీదేవియే అగ్నిని దహిస్తుంది, కాని అగ్నికి ఆవిడను దహించే శక్తిలేదు, అనుకుంటూండగా, గగన చారులయిన చారణులు:

ఓహో! హనుమంతుడెంత భయంకర కృత్యం సాధించాడు. సర్వలంకానగరం భస్మమై ఆర్తనాదాలతో వున్నా, జానకీదేవి అచంచలంగా ఆశోకవనంలో యథాపూర్వం వున్నది.

ఆ మాటలు విన్నాడు. అతని హృదయం సంతోషతరంగిత మయింది. అయినా ఒక్కమారు తన కంటితో అమెను చూసి వెళ్ళాలని నిశ్చయించుకుని శింశుపా వృక్షం చేరి, ఆ ఛాయలో వసివాడకుండా వున్న సీతను చూసి:

అమ్మా! నేను అదృష్టవంతుడను, అని చేతులు జోడించాడు.

నాయనా! ఇంత సాహసం నీకే సాధ్యం, సత్కీర్తిని సాధించే బల పరాక్రమాలు నీకే ఉన్నాయి. ఒక్క విషయం, మరచిపోకు. రామచంద్రుడు లంకానగరాన్ని తన బాణాలతో చీకాకు పరచి నన్ను తీసుకువెళ్ళడం మంచిది. ఏది ఎలా చెయ్యాలనేది ఆయనకు 
నం చెప్పనవసరంలేదు, అని జానకీదేవి అనగా హనుమంతుడు:

అమ్మా! త్వరలోనే రామచంద్రుడు వానర భల్లూక సేనా సమేతం వచ్చి అఖిల శత్రునాశనం చేసి నీ మనస్సుకి ఆనందం కలిగిస్తాడు! ఇక నాకు సెలవమ్మా, అని బయలుదేరి సముద్రతీరాన వున్న అరిష్ట పర్వతం అధిరోహించాడు.

మహోన్నతమైన ఆ గిరి శిఖరాల మీద మేఘాలు ఉత్తరీయాలవలె వున్నాయి. రాళ్ళమీద సూర్యకిరణాలు పడి కనులు మిలమిల లాడిస్తున్నట్టుంది. సెలయేటి మంద్రధ్వనులు వేదగానాన్ని తలపించాయి. అకాశాని కెదిగిన దేవదారు వృక్షాలు పర్వతుడు మహామహులు పైకెత్తినట్లున్నాయి. గాలికి వూగిసలాడే రెల్లుతోటలతో అది కంపిస్తున్నట్టుంది. వాయుపూరితములయి వెదురువనాలు నిర్విరామంగా కూజిస్తున్నాయి. మహాసర్పాల వూపిరి పర్వతం విడిచే నిట్టూర్పులా, మంచునిండిన గండశిలలు ధ్యానసమాధులలో మునులవలె వున్నాయి.

వివిధ వర్ణశోభిత సుమరాజితో తరువులు.

ఆ పరిసరాలలో మహర్షి, యక్ష, కిన్నర, గంధర్వులు.

సింహాలతో గుహలు.

శార్దూలాల విహారాలు.

ఆ పర్వతం ఎక్కి ఒక్కమారు కలయజూసి దేహం పెంచి, కుప్పించి, గగనవీధికి లేచాడు.

అ పాదతాడనానికి పర్వతం, ముక్కముక్క అయింది. పిడుగుపడి మోడువారి నట్లయాయి మహావృక్షాలు. విరిగిపడే గుహలలో సింహాల గర్జనలు దిక్కులు దద్దరిల్ల జేశాయి.

ఆ కొండమీది విద్యాధర స్త్రీలు భయభీతలై జారిన వస్త్రాలతో చెదరిన అలంకారాలతో గగన మార్గానికి లేచారు.

కాకోల విషసర్పాలు తలలు చుట్టుకుని, నడుములు విరిగి మరణించాయి. అంత ఎత్తయిన కొండ హనుమంతుని పాదపీడనంతో పాతాళానికి దిగి, అక్కడ ఒక కొండ వుండేదని గుర్తులేకుండా పోయింది. గగన వీధిని బయలుదేరాడు హనుమంతుడు.

మిత్రసమాగమం

Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...