కాశీ ఖండం
అగసత్యునికి కుమారస్వామికి వారణాసి మహిమను వివరిస్తున్నాడు:- ఇక్కడ మరణం సంభవీస్తే ముక్తిలబిస్తుంది అంట ఈ మణి కర్ణిక లోకి గంగ చేరింది. మణి కర్ణిక లో గంగ చేరిన దగ్గర నుంచి ఇది దేవతలకు నిత్య ఆవాసం అయింది. పరబ్రహ్మ నివాస క్షేత్రం భగీరధుడు రాజర్షి బాగీరధిని భూమి పైకి తెచ్చి తన పితా మహులందరికి ఉత్తమ లోకాలను కల్గించాడు.
ఈ కాశి వద్దనే బంగారం ఉద్భ వించింది. ఇది శ్రీ విష్ణువు యొక్క చక్ర పుష్కరిణి మణి శ్రవణం అనే పేరు తొ పిలువబడుతుంది. గంగా స్నానం విశ్వనాధ దర్శనం ముక్తినిస్తుంది. అన్ని విఘ్నాలను పోగొట్టే వరుణా నది ఉంది. కాశీకి దక్షిణం గా అసి నదికి ఉత్తరంగా వరుణా నదిని ఉన్నది.
ఈ ఆల్బం లో పురాతన కాశీ క్షేత్ర దర్శనం, సంపూర్ణ కాశీ ఖండం, కాశీ క్షేత్ర విశిష్టత ఉన్నాయి. ఋగ్వేదంలో కాశీ నగరాన్ని " జ్యోతి స్థానం " అని వర్ణించారు. స్కంధ పురాణం లోని కాశీ ఖండం లో అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు "ముల్లోకాలూ నాకు నివాసమైయిన అందులో కాశీ క్షేత్రం మాత్రం నాకు మందిరం " అని చెప్పినట్లుగా వర్ణన ఉంది. ఈ నగర ప్రాశస్త్యం గురించి వివరించడానికి ఇదొక్కటి చాలు.
కాశి కి వారణాసి అనే పేరు ఎందుకు వచ్చింది..?
శివుడే స్వయంగా సృష్టించిన పవిత్ర క్షేత్రం "వారణాసి" సుమారు 5వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. గంగా నదితో "వరుణ", "అస్సి" అనే రెండు నదుల సంగమస్థానం మధ్య ఉన్నందున కాశీ కి "వారణాసి" అనే మరో పేరు వచ్చింది. వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి నది సంగమ స్థానం ఉన్నాయి.
ఇంకో కథ ఏంటంటే
"వరుణ" నదికే పూర్వకాలం "వారణాసి" అనే పేరు ఉండేది. కనుక ఈ నగరానికి కూడా అదే పేరు వచ్చింది. "వారణాసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని రాశేవారు. అది తరువాత ‘బవారస్’గా మారింది. వారణాసిని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే నామాలతో ప్రస్తావించారు. యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపురాలలో ఒకటైన కాశీకి విచ్చేశారు అని ఆధారాలు వున్నవి.
ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో ఒకటి. పూరాతత్వ పరిశోధనల లెక్కల ప్రకారం ఇవి క్రీస్తు పూర్వం 11-12 శతాబ్ధా లలోనే నివాసాలు ఆరంభమయ్యాయని తెలుస్తోంది. ఇది ఆర్యుల మత, తత్వ శాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతోంది. కాశీ పట్టణం గురించి ప్రధమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఆ విశ్వనాథుడు శరీరం అయితే.. కాశీ ఆయన ఆత్మ అని తరతరాలుగా భారతీయ ఆధ్యాత్మిక జగత్తు చెబుతుంది . ప్రపంచం మొత్తం ప్రళయంలో నాశనమైనా కాశీ మాత్రం చెక్కుచెదరదని మన పురాణాలు చెబుతున్నాయి. వారణాసి అంటేనే ఆలయాలకు నెలవు.
కాశి క్షేత్రాని ఎవరు నిర్మించారు..?
ఒక లెక్క ప్రకారం కాశీ లో దాదాపు 23 వేల ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మందిరం, దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లోఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న స్వామి "విశ్వేశ్వరుడు" , "విశ్వనాథుడు" పేర్లతో పూజలందుకొంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగిలిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వంశం చేయబడి తిరిగి నిర్మించబడింది.
అయితే 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ దాని రెండు గోపురాలకు బంగారు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించింది. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించుకోవడం ఆచారం. అలాగే.. కాశీ విశ్వనాథాలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి మందిరం కూడా ఉంది.
గంగా తీరం నిర్మించబడ్డ స్నాన ఘట్టాలు. ఇక్కడ స్నానం ఆచరించడానికి దేశం నలుమూలల నుంచీ భక్తులు వస్తుంటారు. కేవలం తమ పాపాలు పోగొట్టుకోవడానికే కాకుండా.. తమ వారికి పిండ ప్రదానం చెయ్యడానికి వస్తుంటారు. వారాణసిలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహనకాండలకు వాడతారు. వీటిలో దశాశ్వమేధఘట్టం, పంచ గంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి.
కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం కూడా అతి ముఖ్యమైనది. ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా, ఆధునిక విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసి నదీతీరంలో ఉంది. ప్రస్థుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. తులసి రామాయణం సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడింది. సీతారాముల ఆలయం కూడా ఉంది. కాల భైరవ, కేదార తదితర మహిమాన్విత ఆలయాలకు నెలవు వారణాసి నగరం. ఆధునిక దేవాలయం గా పిలవబడే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అంతరిక్ష పరిశోధనలకై జైపూర్ రాజా నిర్మించిన జంతర్ మంతర్ కూడ ప్రసిద్ది చెందింది.
కాశీ ఖండం అనే కావ్యాన్ని ఎవరు రచించారు..!!
కాశి ఖండ ప్రార్ధన
ఆది పూజ్యం ,ఆది వన్ద్యం ,సిద్ధి బుద్దీశ్వరం ప్రభుం
శుభ ,లాభ తనూజం తం ,వందేహం ,గణ నాయకం
విశ్వేశం ,మాధవం దుమ్దిం,దండ పాణించభైరవం
వందే కాశీం ,గుహాం ,గంగాం ,భవానీం ,మణి కర్ణికాం
న గాయత్ర్యా సమో మంత్రం –న కాశీ సదృశీ పురీ
న విశ్వేశ సమం లింగం –సత్యం ,సత్యం ,పునః పునః
కలౌ విశ్వేశ్వరోదేవః –కలౌ వారాణశీ పురీ
కలౌ భాగీరధీ గంగా –కలౌ దానం విశిష్యతే
కాశ్యాం హి కాశ్యతే కాశీ –కాశీ సర్వ ప్రకాశికా
సాకారీ విదితా ఏవ –తేన ప్రాప్తాహి కాశికా
కాశీ బ్రహ్మేతి వ్యాఖ్యానం –తబ్రహ్మ ప్రాప్యతే
త్రాహి –తస్మాత్ కాశీ గుణాన్ ,సర్వే-తత్ర తత్ర వదన్తిహి
కాశీ కాశీ తి కాశీతి –రాసానా రస సం యుతా
యస్య కస్యాపి భూ యాశ్చేత్త్ –స రసజ్నో న చేతరః
కాశీ ఖండం అనే కావ్యాన్ని శ్రీ నాధుడు రచించారు. కాశీఖండము శ్రీనాథుడు రచించిన తెలుగు కావ్యము. ఇది క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన. స్కాంద పురాణంలో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కథా భాగాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. ఇందులో వారణాశిగా ప్రసిద్ధిచెందిన కాశీ క్షేత్ర మహత్యం, దాని వైశిష్ట్యం, కాశీ యాత్రా విశేషాలు, శివునికి కాశీకి గల అనుబంధం సవివరంగా చర్చించడం జరిగింది.
వింధ్య పర్వతం యొక్క గర్వ భంగం
ఒకప్పుడు నారద మహర్షి నర్మదా నది లో స్నానం చేసి ఓంకార నాధుడిని దర్శించి ఆ రేవా నది ఒడ్డున ఉన్న వింధ్య పర్వతాన్ని చూశాడు. నారదుని చూసి వింధ్యాద్రి పరవశించింది. మూడు లోకాలలో సంచరించే మహర్షికి తెలిసిన ఆశ్చర్యకర విశేషాలను అడిగి తెలుసుకొన్నది. మేరు పర్వతం మొదలైన వాటికి భూమిని దర్శించే భాగ్యం ఉందని, హిమాలయం శివ పార్వతుల నివాస స్తానము, పర్వతాలకు రాజు కనుక దానికి గౌరవించాలి అన్నాడు వింధ్యుడు. మేరువు స్వర్ణ మయం అయినా ,రత్నాల తో నిండి ఉన్నా తాను గౌరవించాలసిన పని లేదని పలికాడు. మందేహాదులకు నిలయమైన ఉదయ పర్వతం కూడా ఉంది కదా, నీలం రంగులో నీలాద్రి ఉన్నది, సర్వ సర్ప సమూహాలున్నరైవతాద్రి ఉన్నది, హేమ, త్రికూట, క్రౌంచ పర్వతాలు భూ భారాన్ని నిర్వహింప లేవు మొత్తం మీద ఈ భూ భారాన్ని మోసే శక్తి, సామర్ధ్యాలు నాకు మాత్రమె ఉన్నాయని చెప్పింది.
అనీ వింధ్య పర్వతం నారదమునితో ప్రగల్భాలుపలికింది.
నారదునికి వింధ్యాద్రి నిజ రూపం తెలిసింది. గర్వం తో అందర్ని చులకనగా మాట్లాడుతున్నాడని గ్రహించాడు నారదుడు. కాని ఉపాయం గా వింధ్యాద్రి తో ‘’వింధ్య రాజా ! నిజం చెప్పావు. మేరు పర్వతం నీ చేత కించపరచ బడింది. నేనూ అదే అనుకొన్నాను నీ నోటి నుంచి నిజం బయటకి వచ్చింది. అయినా ఏదో పేరు, ప్రతిష్టా సంపాదించుకొన్న వారి గురించి మనకెందుకు చింత? మనం విమర్శించటం ఉచితం కాదు నీకు స్వస్తి ‘’అని చెప్పి ఆకాశ మార్గం లో వెళ్లి పోయాడు.
నారదుని మాటలు వింధ్యద్రికి ఆచార్యం కలిగించాయి మేరువును ఎలా జయించాలి ? యెగిరి వెళ్లి మేరువు మీద పడదామను కొంటె, మా రెక్కల్నిటిని వాజ్రాయుధం తో ఇంద్రుడు నరికేశాడాయే. మేరు పర్వతం ఇంత ఔన్నత్యాన్ని ఎలా పొందుతోంది ? దాని గొప్ప తనానికి ఈర్ష్య నాలో పెరిగి, దహిస్తోంది. భూములన్నీ దాన్ని ఎలా చుట్టి వస్తున్నాయి. భూభారం ఎలా మోస్తోంది ? సాక్షాత్తు సూర్య భాగవానుడే మేరువు చుట్టూ నిత్యం ప్రదక్షిణం చేస్తుంటాడు. కనుక నేను కూడా నిలువుగా పెరిగి నా ఔన్నత్యాన్ని నిరూపించుకోవాలి.
అనుకుని సూర్యగమనానికి అడ్డుకోనేంత ఎత్తుకు వింధ్య పర్వతం పెరిగి పోయింది. వింధ్య అహంకారపు విశ్వరూపాన్ని చూసిన దేవతలకు దిక్కు తోచలేదు. వారు శివుణ్ణి వేడుకొనగా అగస్త్య మహా ముని పరిష్కరించగలడు అని అంటాడు. అప్పుడు దేవతలు అగస్త్యుడుకి జరిగిన విషయాన్ని చెబుతారు.
అగస్త్యుడు వెంటనే తన భార్య తో కలిసి వింధ్యను చేరుకున్నాడు. ఆ మహారుషిని చూసిన వింధ్య సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అప్పుడు వింధ్య నేను మీకు ఏ విధంగా సేవ చేయగలనో ఆదేశించండి,` అంటూ వినయాన్ని పలికించింది. ఓ పర్వతరాజమా! నేను కార్యార్థినై దక్షిణ దిక్కుగా వెళ్తున్నాను. మరి నువ్వేమో దారికి అడ్డుగా ఉన్నావయే! ఏమనుకోకుండా కాస్త తల వంచావంటే సులువుగా అటు పక్కకి చేరుకుంటాను, అన్నారు అగస్త్యులవారు.
ఓస్! అదెంత భాగ్యం!` అంటూ అగస్త్యుని మాటలకు తలవంచింది వింధ్య. వింధ్య శిరసు వంచడమే ఆలస్యం... అగస్త్యుడు అటుపక్కా చేరుకున్నాడు. ఆపై మరో విన్నపం సుమా! నేను ఏ క్షణంలో అయినా తిరిగి రావచ్చు. నేను మళ్లీ తిరిగివచ్చే దాకా కాస్త ఇలాగే ఉన్నావంటే నేను సులువుగా ప్రయాణాన్ని పూర్తిచేసేయగలను, అన్నారు అగస్త్యులవారు. అయ్యో! అదెంత పని. మీరు మళ్లీ ఇటుగా వచ్చి, నన్ను దాటి వెళ్లేవరకూ... నేను ఇలాగే ఉంటాను, అని మాట ఇచ్చింది వింధ్య. అగస్త్యునికి కావల్సింది ఆ మాటే! అలా వింధ్యను దాటుకుని దక్షిణ భారతానికి పయన మయ్యాడు వింధ్య తన మాటని నిలబెట్టుకునేందుకు, తలవంచుకుని ఉండిపోయింది. గర్వంలో మిడిసిపడేవారు చివరికి తలవంచుకోక తప్పదని వింధ్య గాధ రుజువు చేస్తోంది.
అగస్త్య ముని తీర్ధ అధ్యయనం
అగస్త్య దంపతలు గోదావరి తీరానికి చేరి సంచరిస్తున్నా ఇంకా మనసులో కాశి భావం తొలగి పోలేదు. పదే పదే తలుచుకొంటునే ఉన్నారు. పిచ్చి వారి వలె ఇద్దరు గాలిని చూసి ‘’కాశీ పట్నం కుశల మేనా ?ఎప్పుడు మళ్ళీ కాశీకి వేడతాము అని అనుకుంటున్నారు. కొల్హాపురం చేరి అక్కడి మహా లక్ష్మి అమ్మ వారిని దర్శించారు. ముల్లోకాలను భయ పెట్టిన కోలాసురుడిని సంహరించిన లక్ష్మీ దేవి ఇక్కడ కొలువై ఉంది. మహా లక్ష్మి ని ఇద్దరు మనసా రా స్తోత్రం చేసి, ప్రార్ధించారు.
అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఇలా పలికింది..
‘’మిత్రా వరుణ సంభవా అగ్స్త్యమునీ ! పతివ్రతా శిరోమణీ లోపాముద్రా !’’
అని సంబోధించి, లోపాముద్రా దేవి ని తన సమీపం లో కోర్చో బెట్టుకొని, ఆమె శరీరాన్ని స్పర్శించింది మహా లక్ష్మి అమ్మ వారు. కోలాహల రాక్షసుని అస్త్రం చేత బాధింప బడ్డ నా శరీరాన్ని నీ స్పర్శ తో స్వాస్త్యం పొందుతున్నాను ‘’అని పలికి , లోపాముద్రను కౌగిలించుకొని , సౌభాగ్యాలను కారణాలైన ఆభరణాల తో ఆమె ను అలంకరించింది.
మహర్షితో ‘’రుషి సత్తమా ! నీ తాప కారణం తెలిసింది కాశీ ని వదిలి నందుకు నీ మనసు అమిత బాధ పడుతోంది. ఏదైనా వరం ఇవ్వాలని ఉంది ‘’అన్నది .దానికి ముని ‘’అమ్మా మహా లక్ష్మీ !వరం ఇవ్వ దలిస్తే మళ్ళీ మాకు కాశి సందర్శన భాగ్యం అనే వరమే ఇవ్వు. ఇంకేమి వద్దు ‘’అన్నాడు. లక్ష్మీ దేవి ‘’తధాస్తు ‘’అని దీవించి స్వస్తత కలిగించింది. ’’మహర్షీ !రాబొయె ద్వాపర యుగం లో పందొమ్మిదవ బ్రహ్మ కాలం లో నువ్వు వ్యాసుడవు అవుతావు. మళ్ళీ వారణాసి కి వెళ్లి వేద శాస్త్రాలను పరిష్కరించి. ధర్మబోధ చేస్తావు. ప్రస్తుతం ఇక్కడి నుండి నువ్వు బయల్దేరి వెళ్లి స్కందుని దర్శనం చేసుకో. అతడు నీకు వారణాసి రహస్యమంతా వివరంగా చెబుతాడు.’’ అని చెప్పి ఇద్దరినీ దీవించి పంపించింది.
అగస్త్య మహాముని లోపాముద్ర దేవితో ముక్తి క్షేత్రాలు యొక్క ప్రాముక్యత వివరించుట
కొల్హాపుర మహా లక్ష్మీదేవి సందర్శనం తో పులకించిన అగస్త్య లోపాముద్ర దంపతులు తమకు అమ్మ వారి దర్శనం పరోపకారం వల్ల కలిగిన ఫలం అని భావించారు. అక్కడి నుండి త్రిపురాంతకం చూసి శ్రీశైలం చేరారు. శ్రీశైల శిఖరం చూసి పునర్జన్మ లేని దాని దర్శనానికి ఆనంద పడ్డారు. శ్రీశైల పర్వతం ఎనభై నాలుగు యోజనాల విస్తీర్ణం కలదని భార్యకు తెలియజేశాడు ముని. లోపాముద్ర భర్త తో ‘’స్వామీ ! భర్త అనుజ్న లేకుండా భార్య యే పనీ చేయ రాదు కదా. ఇక్కడి శిఖరాన్ని చూస్తె పునర్జన్మ లేదు కదా మరి మనకింక కాశీ తో పనేమిటి ?’’అని అడిగింది.
దానికి మహర్షి ‘’ఈ విషయాన్ని పూర్వం మహర్షులు చర్చించి కొన్ని నిర్ణయాలు చేశారు. ఆ వివరాలను నీకు తెలియజేస్తాను. ముక్తి క్షేత్రాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది తీర్ధ రాజం అని పేరు పొందిన ప్రయాగ. ధర్మార్ధ మోక్ష కామాలనిచ్చేది నైమిశారణ్యం, కురుక్షేత్రం, హరిద్వారం, ఉజ్జయిని, అయోధ్య, మధుర, ద్వారక, అమరావతి, సరస్వతీ సాగర సంగమం, గంగా సాగర సంగమం, కాంతి త్రయంబకం. సప్త గోదావరీ తీరం, కాలంజరం, ప్రభాస తీర్ధం, బదరికాశ్రమం, కాశి, ఓంకారక్షేత్రం, పురుషోత్తమం, గోకర్ణం భ్రుగు కచ్చం, భ్లు తుంగం, పుష్కరం, శ్రీశైలం, ధారారా తీర్ధం, మానసతీర్ధం మొదలైనవి మొక్షాన్నిచ్చేవి. గయా తీర్ధం పితృదేవతలకు మోక్షాన్నిస్తుంది.
అప్పుడు భార్య మానస తీర్ధాన్ని గురించి వివరించమని కోరింది. అగస్త్యుడు ‘’సత్యం, క్షమా, ఇంద్రియ నిగ్రహం, సర్వ భూత దయ, నిష్కాపట్యం, దానం దమం, శమం సంతోషం అనేవి మానస తీర్ధాలు. వీటన్నిటి తో బాటు బ్రహ్మచర్యం, ప్రియ భాషణం, జ్ఞానం, ధృతి, తపస్సు కూడా మానస తీర్ధాలే. తీర్ధాలలో స్నానం స్నానమే కాదు. ఇంద్రియ నిగ్రహం, మనసు పరిశుద్ధత లేకుండా ఎక్కడ స్నానం చేసినా మలినాలు, పాపాలు పోవు. మనసు లో మాలిణ్యం లేని వాడే సుస్నాతుడని పిలువబడుతాడు. దానం తపస్సు శౌచం లేకుండా చిత్తం ప్రశాంతిని నిర్మలత్వాన్ని పొందడు.
ఇంద్రియాలను నిగ్రహించి ఉన్న చోటే నైమిశం కురుక్షేత్రాదులు. రాగ ద్వేషాలను వదిలి జ్ఞాన జలములో ధ్యానం చేత పవిత్రుడయ్యే వాడు మానస తీర్ధ స్నానం చేసిన వాడే. ఉత్తమ లోకాలను పొందుతాడు. ఋషులు తిరుగాడిన నేల, స్నానం చేసిన తీర్ధాలు పుణ్యప్రదాలు, పరమ పవిత్రాలు. కనుక అక్కడ స్నానం చేస్తే ఉత్తమ లోకం వస్తుంది. తీర్ధాలలో ఉపవాసం చేసి దానాలిచ్చి, అగ్నమాది క్రతువులు చేయాలి. ఎవరి మనసులో విద్యా తపస్సు ఉంటాయో వారికి తీర్ధయాత్రలు ఫలిస్తాయి. గర్వం లేని వాడు సత్య భాషి, దృఢ వ్రతుడు, సర్వ భూత సముడు పొందే ఫలాన్ని తీర్ధయాత్ర చేసిన వారు పొందుతారు. తీర్ధాలకు వచ్చి అక్కడి దేవతలను ముందుగా ప్రార్ధించాలి. అప్పుడు స్నానం చేస్తేనే ఫలితం ఉంటుంది.
శ్రద్ధ తో తీర్ధ యాత్ర చేస్తే పాప ప్రక్షాళనం జరుగుతుంది. ఇతరుల కోసం తీర్ధయాత్ర చేస్సిన వాడికి పదహారవవంతు ఫలం దక్కుతుంది. తీర్ధం లో ఉపవాసం శిరో మున్దనం చాలా ముఖ్యమైనవి. క్షౌరం వల్ల శిరోగత పాపాలు పోతాయి. తీర్ధాలలో శ్రాద్ధం పిండ ప్రదానం చేస్తే పితృ దేవతలు తృప్తి చెందుతారు. తీర్ధయాత్ర సర్వ సాధక మైనది. మోక్ష ప్రదాయక మైనది, కాశి, కంచి, హరిద్వారం, అయోధ్య, ద్వారక, మధుర, ఉజ్జయిని మోక్షపురాలు గా ప్రశిద్ధి చెందాయి. శ్రీశైలం మోక్షదాయకం అంతకంటే కేదారం గొప్పది ఈ రెంటికంటే గొప్పది ప్రయాగ. దీనికంటే అవిముక్త క్షేత్రం కాశి మహా గొప్పది కాశిలో చనిపోతే మోక్షమే, అందుకే తీర్ధకోటికి అందని ముక్తి కాశీ లో లభిస్తుంది.
సప్త పురి వర్ణనం వృత్తాంతని అగస్త్య ముని తన భార్యకు వివరించుట
పూర్వం విష్ణుదూతలు శివ శర్మ అనే అతనికి చెప్పిన విషయాన్ని తెలియజేస్తా విను ‘’అన్నాడు మహర్షి తన భార్యతో. శివ శర్మ మొదట అయోధ్య కు చేరాడు. సరయు నదిలో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అయిదు రాత్రులు ఉండి ప్రయాగ చేరాడు. తివేణీసంగమం లో పవిత్ర స్నానం చేసి, గంగా నది ఇక్కడే కలుస్తుందన్న విషయం తెలిసికొన్నాడు. సప్త పాతాళాలలో వ్రేళ్ళూనుకొని ఉన్న అక్షయ వట వృక్షాన్ని భక్తితో దర్శించాడు. బ్రాహ్మణులకు సమారాధన చేశాడు.
ఇది ధర్మార్ధ కామ మొక్షాలనిచ్చే క్షేత్ర రాజం. బ్రహ్మ హత్యా దోషాన్ని కూడా నివారించే శక్తి ఈ క్షే త్రానికి ఉంది. విష్ణు స్థానమైన వేణీ మాధవాన్ని దర్శించాడు. రజో రూపం లో ఉండే సరస్వతి, తమో రూపం లో ఉండే యమునా, సత్వ రూపం లో ఉన్నగంగా నది ఇక్కడ కలిసి నిర్గుణ బ్రహ్మ రూపాన్ని పొందినాయి. ఈ త్రివేణీ సంగమం బ్రహ్మ లోకానికి నిచ్చెన. ఇది తీర్ధ రాజం బిందు మాధవుడు సేవించు కాశీ పట్నం వరుణ, అసి నదుల మధ్య ఉంది ప్రయాగ నుండి అక్కడికి చేరాడు. మణి కర్ణిక లో స్నానం చేసి విశ్వేశ్వరుడిని దర్శించాడు. కాశి ఎప్పటికప్పుడు కొత్తగా కనీపిస్తుంది.ఉత్తమ ప్రబంధాలలో స్రవించే రసం లాగా కాశి మనోజ్ఞం గా ఉంటుంది. సంసారులకు చింతామణి వంటిది. ముక్తి లక్ష్మీపీఠమణి ఇక్కడ సకల జీవ రాసులు దేవతల తో సమానం సప్త క్షేత్రాలలో కాశి ఒరిపిడి రాయి వంటిది. ఇతర క్క్షేత్రాలను దర్శించిన వారు కూడా మళ్ళీ కాశీ కే చేరుకొంటారు.
అక్కడి నుండి శివ శర్మ ఉజ్జయిని వచ్చాడు. తన లీలచే లోకం లోని పాపాలను పోగొట్టుతుంది కనుక అవంతి అనీ మహాకాళుని సమీపం లో కోటి లింగాలున్నాయి. హాటకేశ్వరుడైన మహా కాలుడు తారకేశ్వరుడై ఒకే లింగాన్ని మూడు గా భేదించి మూడు లోకాలను ఆక్రమించాడు. ఇక్కడున్న సిద్ధ వటం వద్ద ఉండే జ్యోతిని దర్శించాడు. ఇక్కడి నుంచి కంచి నగరం చేరాడు. కాంతి నిచ్చేది కనుక దీన్ని కాంతి లేక కంచి అంటారు. ఇక్కడ మహా విష్ణువు ను లక్ష్మీ దేవిని సందర్శించాడు. తీర్ధ విధులు నిర్వర్తించి, ద్వారా వతి అంటే ద్వారక చేరాడు. అన్ని వర్ణాల వారికి ఇది పుణ్య ద్వారం కనుక ద్వారక అనే పేరొచ్చింది. ఇక్కడ మరణిస్తే వైకుంఠమే చేరుతారు.
శ్రీమహావిష్ణువుకు నిలయం తర్వాత మాయాపురికి వచ్చాడు. దీనినే హరిద్వారం అని మోక్షద్వారం అని, గంగా ద్వారం అనీ పిలుస్తారు. కొద్ది కాలం ఇక్కడున్నాడు. చలి జ్వరంవచ్చి తీవ్రం గా బాధ పడ్డాడు. సప్తపురీ యాత్రలను సంపూర్ణంగా చేద్దా మనుకొంటే, ఈ విపత్తు వచ్చిందని బాధ పడ్డాడు. ఎక్కడికి కదల లేక నలభై తొమ్మిది రోజులు అక్కడే ఉండి మరణించాడు. వైకుంఠము నుండి విమానం వచ్చి శివ శర్మ ను విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు.
యమపురి వర్ణనం వృత్తాంతని అగస్త్య ముని తన భార్యకు వివరించుట
సాధ్వి లోపాముద్ర భర్త అగస్త్య ముని ని ‘’శివశర్మ హరిద్వారం లో మరణించిన మోక్షం పొందకుండా, విష్ణు లోకానికి ఎందుకు వెళ్లాడు అని ప్రశ్నించింది. దానికి మహర్షి వివరించి చెబుతున్నాడు. అన్ని క్షేత్రాలు ముక్తి క్షేత్రాలు కావనియు దాని గురించిన వివరాలను చెప్పాడు. శివశర్మను యమ లోకానికి తీసుకొని వెళ్లారు ముందుగా విష్ణు దూతలు అక్కడ విక్రుతాకారులు కన్పించారు. అది పిశాచాలోకమని పాప కర్మలు చేసిన వారు, పరిశుద్ధ మైన మనస్సు లేని వారు ఇక్కడికి వస్తారని చెప్పారు. ఆ తర్వాతా కొంత దూరం లో మనోహరాకారులు, శ్యామలాకారులు కనిపించారు. అది గుహ్య లోకమని, న్యాయం గా డబ్బు సంపాదించిన వారు ఇక్కడికి వస్తారని చెప్పారు. సంపాదించిన డబ్బును దాస్తారు. కనుక గుఖ్యక లోకం అంటారు వీరిది దాన ధర్మాలు తెలియవు.
సుఖం గా మాత్రం ఉంటారు .బ్రాహ్మణులను పూజించి గోదానం ఇస్తారు. దేవతల్లాగా స్వర్గ సౌఖ్యం పొందుతారు. కొంత దూరం పోయిన తర్వాతా గాంధర్వ లోకం కనిపించింది డబ్బున్న వారిని సంగీతం తో సంతోష పెట్టినవారిక్కడికి వస్తారు. ఈ గాంధర్వ విద్య తోనే నారదుడు దేవర్షి అయ్యాడు. తర్వాత విద్యాధర లోకం చేరారు. అన్ని విద్యలలో నిష్ణాతులు ఈ లోకం లో ఉంటారు. ఇంతలో యమధర్మరాజు అనుచర గణం తో అక్కడికి చేరాడు. ఆయన సౌమ్యమైన ఆకారం తో, తెల్లని వస్త్రాల తో కనిపించాడు. యముడంటే అందరు భయపడతారు. కాదా ఇంత సాధువు లాగా ఉన్నాడేమి… దుఖితుల దుఖాన్ని పోగొట్టే రాజులు యమధర్మరాజు సభా సదులు గా ఉంటారు.
ఉసీనరుడు, సుధాన్వుడు, వృష పర్వుడు, జయద్రధుడు, రాజ సహస్ర జిత్తు, దృఢ దానవుడు, రిపున్జయుడు, యవనాశ్వుడు, దంత వక్త్రుడు, నాభాగుడు, రిపు మంగళుడు, కరంధముడు, ధర్మ సేనుడు, పరమర్ధనుడు, పరాన్తకుడు మొదలైన నీతి మంతులైన రాజులు, ధర్మా ధర్మాలు తెలిసిన వారు సుధర్మ సభ లో ఉంటారు. శివ, విష్ణు నామాలను సదా జపించే వారు యమునికి దూతలు గా పని చేస్తారు. వీరు విష్ణు శివ కీర్తనలను చేసే వారి దగ్గరకు పోరాదని యమశాసనం. యమ ధర్మరాజు రచించిన ‘’లలిత ప్రబంధం ‘’అనే మహా గ్రంధం నామాన్ని స్మరించే వారికికూడా పునర్జన్మ ఉండదు అని విష్ణు దూతలు శివశర్మ కు చెప్పినట్లు అగస్త్య ముని లోపాముద్ర కు తెలియజేశాడు. అక్కడి నుండి విష్ణు దూతలు శివ శర్మను అప్సరలోకానికి, ఆ తర్వాత సూర్య లోకానికి తీసుకొని వెళ్లారు.
అప్సరస, సూర్య లోక వృత్తాంతని అగస్త్య ముని తన భార్యకు వివరించుట
విష్ణు దూతలు శివశర్మ ను అప్సరస లోకానికి తీసుకొని వెళ్లారు. అక్కడ ద్యూత విద్య లో నేర్పరులు అయిన ఆడవారుంటారు, సమస్త భాషలలో వారు ఉంటారు. క్షీరసాగర మధనం లో జన్మించిన వారు, మన్మధుని త్రిభువన విజయాస్త్రాలు వారే, ఊర్వశి, మేనక, రంభ, చంద్రలేఖ, తిలోత్తమ, వపుష్మతి, కాంతిమతి, లీలావతి, ఉత్పలావతి,మొదలైన వారు అప్సరస గణం. వీరి సంఖ్య 6,000 ఇతర స్త్రీలు కూడా కొందరుంటారు, వీరంతా లావణ్యం తో, నిత్య యవ్వనం తో, దివ్యామ్బరాలతో ఉంటారు కోరిక తీర్చే వ్రతాలు చేసి ఉద్యాపనాలు చేసిన వారు అప్సరస లోకం కి చేరుకొంటారు. వీరంతా సంగీత నృత్యాలలో అఖండులు.
సూర్య సంక్రమణం నాడు దానం చేసిన వారు, ’’మొదాత్‘’అనే మంత్రాన్ని అనుష్టించి దానాలిచ్చిన వారు ఇక్కడికి చేరుకొంటారు. తర్వాత సూర్య లోకానికి చేరుకొన్నాడు శివశర్మ. సూర్య లోకము తిమ్మిది యోజనాల విస్తీర్ణం కలది. విచిత్రాలైన ఏడు గుర్రాలు, ఒకే చక్రం ఉన్న రధం పై అనూరుడు సారధి గా సూర్యుడు నిత్య సంచారం చేస్తూంటాడు.
క్షణకాలంలోనే ఆవిర్భావ, తిరోభావాలను పొందే సూర్యుడు ప్రత్యక్ష వేద పురుషుడు. ఆదిత్యుడే సాక్షాత్తుబ్రహ్మ. సూర్యుని వల్లనే సకల జీవరాశులు ఆహారాన్ని సంపాదించుకొంటున్నాయి. ప్రత్యక్షసాక్షి, కర్మసాక్షి. గాయత్రీ మంత్రం తో సకాలం లో వదల బడిన అర్ఘ్యం నశించదు. అది మూడు లోకాల పుణ్యాన్ని అందిస్తుంది. సూర్యోపాసన చేసే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మిత్ర, పుత్ర, కలత్రాలు అష్ట విధ భోగాలు స్వర్గ మోక్షాలు కలుగుతాయి.
సూర్యుడు సాక్షాత్ వాచ్యుడు, గాయత్రి సూర్యుని గూర్చి చెప్పే వాచకం ఇది. గాయత్రి మంత్రం చేత రాజర్షి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయాడు. గాయత్రియే విష్ణువు, శివుడు, బ్రహ్మా అమ్శుమాలి అని పిలువబడే సూర్యుడు దేవత్రయ స్వరూపుడు అన్ని తేజస్సులు సూర్యనిలో ఉన్నాయి. ఆయనే కాల స్వరూపుడు, కాలుడు కూడా తూర్పున ఉదయించి సమస్త విశ్వాన్ని ధరించే విశ్వ సృష్టికర్త పడమర దిశ లో సర్వతోముఖుడై కనీపిస్తాడు. ఉత్తరాయణ, దక్షిణాయణ పుణ్య కాలాలో షడతీతుల్లో, విష్ణు పంచకం లో ఎవరు మహా దానం చేస్తారో పిత్రుక్రియలు నిర్వహిస్తారో, వారు సూర్య సమాన తెజస్కులై, సూర్య లోకం లో నివశిస్తారు మరియు ఆదివారం లేదా సూర్య గ్రహణం నాడు దానం చేస్తే ఉత్తమ లోక ప్రాప్తి.
సూర్య దేవుని మంత్రాలు
హంసుడు, భానుడు, సహస్రామ్శువు, తపనుడు, తాపనుడు, రవి, వికర్తనుడు, వివశ్వంతుడు, విశ్వ కర్మ, విభావనుడు, విశ్వ రూపుడు, విశ్వ కర్త, మార్తాండుడు, మిహిరుడు, అంశుమతుడు, ఆదిత్యుడు, ఉష్నగుడు, సూర్యుడు, ఆర్యముడు, బ్రద్నుడు, ద్వాదశాదిత్యుడు, సప్త హయుడు, భాస్కరుడు,ఆహాస్కరుడు, ఖగుడు, శూరుడు, ప్రభాకరుడు, శ్రీ మంత్ర్హుడు, లోక చక్షువు, గ్రహేశ్వరుడు, త్రిలోకేశుడు, లోకసాక్షి, తమోరి, శాశ్వతుడు, శుచి, గభస్తి, హస్తాంషుడు, తరణి, సుమాహారిణి, ద్యుమణి, హరిదాశ్వుడు, అర్కుడు, భాను మంతుడు, భయ నాశనుడు, చందోశ్వుడు, వేద వేద్యుడు, భాస్వంతుడు, పూషుడు, వృషాకపి, ఏక చక్ర ధరుడు, మిత్రుడు, మందేహారి, తమిశ్రఘ్నుడు, దైత్యఘ్నుడు, పాప హర్త, ధర్ముడు, ధర్మ ప్రకాశకుడు, హీళి,చిత్రభానుడు, కలిఘ్నుడు, తార్ష్య వాహనుడు, దిక్రుతి, పద్మినీ నాభుడు, కుశేషయ కారుడు, హరి, ఘర్మ రశ్మి, దుర్ని రీక్షుడు, చందాంశువు, కశ్యపాత్మజుడు, అనే డెబ్బది రెండు పేర్లు సూర్యునికి ఉన్నాయి.
ఇందులో ప్రతి నామం మొదట ఓం అని చేర్చి, ఉచ్చ రిస్తూ, సూర్యుని చూస్తూ నమస్కరిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. రెండు చేతులతో ఎర్రగా తోమిన రాగి చెంబు నిండా నిర్మలమైన జలాన్ని నింపి మోకాళ్ళ పైన భూమి మీద కూర్చుని, గన్నేరు పూలు, రక్త చందనం, గరిక, అక్షతలు ఆ పాత్రలో ఉంచి, సూర్యుడిని ధ్యానిస్తూ, ఫాల భాగం దగ్గర ఆ చెంబు నుంచుకొని స్తిర చిత్తం తో, పైన చెప్పిన72 సూర్య నామాలను ఉచ్చరిస్తూ సూర్యునికి అర్ఘ్యాన్నిచ్చే వాడేప్పుడు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లు తాడు, వ్యాధులు నశిస్తాయి’’, అని శివ శర్మకు విష్ణు దూతలు వివరించారని భార్య లోపాముద్రకు అగస్త్య ముని చెప్పాడు.
అగ్ని లోక వర్ణనం
ఇంద్ర, అగ్ని లోక వర్ణనం గురించి అగస్త్య ముని తన భార్య లోపాముద్రకు వివరించుట
శివశర్మను ఇంద్ర లోకానికి తీసుకొని వెళ్లారు. విశ్వకర్మ తన తపో బలం తో దీన్ని నిర్మించాడు పగలే వెన్నెల అక్కడ, చింతామణి అన్నిటిని క్షణం లో తయారు చేస్తుంది. కనుక నేతగాల్లు బంగారపు పని వారు మొదలైన వారుండరు, అన్నీ ఇచ్చే కామధేనువు ఉందికనుక వంట వాళ్ళు ఉండరు.
ఇంద్ర పదవి ఉన్నతమైనది, నూరు అశ్వ మేదాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుంది. అర్చిష్మతి, సమయమని, పుణ్యవతి, అమలావతి, గంధవతి, అలక, ఈశాన్య లోకం స్వర్గం తో సమానం. ఇంద్రుడిని సహస్రాక్షుడు, దివస్పతి, శతమన్యుడు అనీ పిలుస్తారు. నారదాది మహర్షులు తరచు వచ్చి ఆశీర్వదిస్తారు. అన్ని లోకాలకు స్తైర్యం, ధైర్యం ఇంద్ర లోకమే. మహేంద్రుడు ఓడిపోతే మూడు లోకాలు ఒడి పోయినట్లే. రాక్షసులు, మనుష్యులు, గంధర్వ, యక్షులు ఇంద్ర పదవికోసం ఘోర తపస్సు చేస్తారు. నూరు యాగాలు భూలోకం లో చేసి జితెన్ద్రియుడైన వారికి ఇంద్ర పదవి దక్కుతుంది యుద్ధంలో వీర మరణం పొందినవారు ఇక్కడికే చేరుతారు.
అగ్నిహోత్రుని నగరమే అర్చిష్మతి. అగ్నిదేవుడిని నిష్ఠతో ఉపాశించిన వారికి ఈలోకం దక్కుతుంది. శీతాకాలంలో చలి బాధను తట్టుకొనలేక పోయే వారికి కట్టెలను దానం చేసిన వారు, ప్రతి పౌర్ణమి నాడు ఇష్టులు ఆచరించే వారు ఇక్కడ నివసిస్తారు. అనాధ ప్రేతకు అగ్ని సంస్కారం చేసినా, దాన్ని ప్రోత్స హించినా అగ్ని లోక ప్రాప్తి ఖాయం.
గురువు, దేవుడు, వ్రతము, తీర్ధము, అన్నీ అగ్నిదేవుడే. అన్ని వస్తువులు అగ్నిస్పర్శ తో పవిత్రమవుతాయి. అందుకే అగ్నికి పావనుడు అని పేరొచ్చింది. శివశర్మ విష్ణుదూతలను అగ్ని దేవుడు ఎవరు? /అని ప్రశ్నించాడు దానికి వారు సవివరం గా సమాధానం చెప్పారు నర్మదా నదీ తీరం లో విశ్వానరుడనే శివభక్తుడున్నాడు. శాండిల్య గోత్రజుడు, జితేంద్రియుడు బ్రహ్మమ తేజశ్వి ఆశ్రమ ధర్మాలను చక్కగా పాటించి, అనుకూల వతి అయిన భార్యను తెచ్చుకొన్నాడు అతిధి సత్కారాలు చేస్తూ కపటం లేకుండా కాలం గడిపాడు అతని భార్య శుచిష్మతికి చాలా కాలం సంతానం కలుగ లేదు. ఒక రోజు ఆమె భర్తను సమీపించి, గృహస్తులకు ఉచితమైన తత్వాన్ని తనకు బోధించ మని కోరింది.
దానికి ఆయనతాను ఆమెకు అన్నీ సమకూర్చాను కదా ఇంకా ఏమైనా కావాలంటే కోరుకో మన్నాడు. ఆమె మహేశ్వరుని తో సమాన మైన పుత్రుని ప్రసాదించమని అర్ధించింది.
ఆయన అలానే అని చెప్పి కాశీనగరం చేరాడు. రోజూ గంగా స్నానం నిత్యం విశ్వేశ్వరాది దేవ దర్శనం చేశాడు. .తన భార్య కొరికి వెంటనే తీరాలి అంటే యే లింగాన్ని అర్చించాలి అని ఆలోచించాడు అక్కడ కాలేషుడు, వృద్ధ కాలేషుడు, కలశేశ్వరుడు, కామేషుడు, చందేషుడు, జ్యేష్టేషుడు, త్రిలోచనుడు, జంబు కేషుడు, జైగీషుడు, దశాశ్వ మేధ ఘట్టం లోని ఈశ్వర లింగం, చండీషుడు, ద్రుక్కేషుడు, గరుదేషుడు, గోకర్నేషుడు, గనేశ్వరుడు వీటిలో దేన్నీ అర్చిన్చాలనే సందేహ కలిగింది ఆ తర్వాత ఆతని దృష్టిలో గౌరీశ లింగం, ధర్మేష లింగం, తారకేశ్వర లింగం, సర్వేశ్వర లింగం, ప్రతీశ లింగం, ప్రీతి కేశ్వర లింగం, పర్వతేశ్వర, బ్రహ్మేశ, అధ్యమేశ్వర, బృహత్పతీశ్వర, విభాన్దేశ్వర, భార భూతేశ్వర, మహాలక్ష్మీశ్వర, మరుటేశ, మొక్షీశ, గంగేశ, నర్మదేశ్వర, మార్కండేయేశ్వర, మణి కర్నేశ, రత్నేశ, సిద్దేశ్వర, యామునేశ, లాంగావీశ, విశ్వేశ, అవిముక్టేశ, విశాలక్ష్మీశ, వ్యాఘ్రేశ్వర, వరాహేశ్వర, వ్యాశేష, వృషభధ్వజేశ, వరుణేశ, విదేశ, వసిష్టేశ, శానైశ్చరేశ, ఇంద్రేశ, సంగమేశ, హరిశ్చంద్రేశ, హరికేశ్వర, త్రిసందీశ, మహాదేవ, శివ, భవానీశ, కపర్దీశ, కందుకేశ, మక్షేశ్వర, మిత్రా వరుణేశ, లో ఎవరు తన కోర్కె తీరుస్తారని మీమమాంస పడ్డాడు.
చివరకి సిద్దేశ్వర లింగాన్ని పూజిస్తే సకల సిద్ధ కలుగుతుందని భావించాడు. అక్కడే వీరేశ్వర లింగం ఉందని గ్రహించాడు. ఇదే ఉక్తమైన లింగం అని నిర్ణయించుకొన్నాడు. దీనినే పూర్వం వేద శిరుడు అనే మహర్షి శత రుద్రీయ అభిషేకం చేసి శరీర లింగైక్యం పొందాడని జ్ఞాపకం చేసుకొన్నాడు అలాగే జయద్రధుడు, విదూరుడు మున్నగు వారికోర్కేలను తీర్చింది ఈ లింగమే అని భావించాడు అనేక రకాలైన నియమాల తో నిష్టతో వీరేశ్వర లింగాన్ని అభిషేకిస్తూ దీక్ష గా సేవించాడు. అతని తీవ్ర తపస్సుకు మెచ్చి బాల మహేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
ఆయన్ను పరి పరి విధాల స్తుతించి తనకు ఈశ్వరుని తేజస్సు గల కుమారుని ఇవ్వ మని కోరాడు. .శివుడు ‘’నేను నీ భార్య సుచిష్మతి గర్భాన ‘’గృహపతి’’గా జన్మిస్తున్నాను. అతడు దేవతలకు ప్రీతీ కల్గిస్తాడు
తవ పుత్రస్య మేష్యామి, శుచిష్మత్యాం మహా మతే
ఖ్యాతో గృహ పతి ర్నామనా, శుచిహ్ సర్వామర ప్రియః
అనే శ్లోకాన్ని ఎవ్వరు శ్రద్ధ గా పఠిస్తారో వారికి శివుని వంటి కుమారుడు కలుగుతాడు అని ఆశీర్వాదించి అంతర్దానమైనాడు. ఈ కధను లోపాముద్రకు అగస్త్యుడు చెప్పాడు.
గృహపతిజననం ప్రాముక్యత గురించి అగస్త్య ముని తన భార్య లోపాముద్రకు వివరించుట
విశ్వానర, శుచిష్మతి దంపతులకు శివుని వరంగా సంతానం కలిగిన విషయాన్ని చెబుతున్నాడు. చంద్రుడు ఉత్తమ నక్షత్రం లో ఉండగా, గురుడు కేంద్రంలో ఉన్నప్పుడు శుచిష్మతికి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ సమయం లో ముల్లోకం లోని జనులు"గంధవాహా, గంధవాహా"అని ఉచ్చరించారు. అప్పుడు ఆకాశం లోని మేఘాలు ఉత్తమ వాసనలను వర్షించాయి. దేవ దుందుభులు మ్రోగాయి. అంతా నిండి ఉన్న తమస్సు హరించింది. రజోగుణం నాశనమై, సాత్వికత ఆవరించింది. అప్పుడు దేవ వేశ్యలైన అప్సరలందరూ ఆడుతూ పాడుతూ నృత్యాలు చేశారు.
అంతటా ఆనందం తాండవించింది. మహర్షిలు అత్రి, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, అంగిరసుడు, వసిష్టుడు, కశ్యపుడు, విభాన్దుడు, లోమషుడు, చరనుడుడు, భరద్వాజుడు, గౌతముడు, భ్రుగువు, గాలవుడు, గర్గుడు, జాత కర్ణుడు, పరాశరుడు, ఆపస్తంభుడు, యాజ్ఞవల్క్యుడు, దక్షుడు, వాల్మీకి, ముద్గలుడు, శాతాతపుడు, లిఖితుడు, శిలాదుడు, శంఖుడు, జమదగ్ని, సంవర్తుడు, మాతంగుడు, భరతుడు, అంశుమంతుడు, వ్యాసుడు, కాత్యాయనుడు, కుత్సుడు శౌనకుడు, సుశ్రుతుడు, శుకుడు, రుష్యశ్రుమ్గుడు, దుర్గాషుడు, రుచి, నారదుడు, తుంబురుడు, ఉత్తంకుడు, వామ దేవుడు, చ్యవనుడు, ఆశితుడు, దేవతలుడు, శాలంకాయనుడు, హారీతుడు, విశ్వామిత్రుడు, భార్గవుడు, మృకండుడు, దాల్భ్యుడు, ఉద్దాలకుడు, ధౌమ్యుడు, ఉపమన్యువు, వత్సుడు, మొదలైన మునీశ్వరులు, ముని కన్యలు అక్కడికి చేరారు. బ్రహ్మ, బృహస్పతి, విష్ణువు, నంది భ్రుగులతో శంకరుడు గౌరీదేవి, దేవేంద్రునితో దేవతలు, పాతాల వాసులగు నాగులు విలువైన మణులను తెచ్చారు.
వీరంతా ఆకాశం లో వెన్నెలలా వ్యాపించారు బ్రహ్మ దేవుడు దగ్గర నుండి జాత కర్మ జరిపించి, ’’ఆగ్నే గృహపతే ‘’అనే వేదోక్త మంత్రం చేత అందరు ఆశీర్వాదించి, మళ్ళీ తమ ప్రదేశాలకు వెళ్లిపోయారు. మంచి తేజస్సు, వర్చస్సు గల ఆ శిశువు ను అందరు పొగిడారు. ఆ తల్లిదండ్రుల భాగ్యమే భాగ్యం అన్నారు గృహపతి అని నామ కారణం చేశారు. నాల్గవ మాసం లో అన్నప్రాశన, ఏడాదిన్నరకు చూడా కర్మ చేశారు. శ్రవణా నక్షత్రం లో కర్ణ వేధ జరిపించారు. అయిదవ ఏడు న ఉపనయనం చేశారు, ఉపా కర్మ కూడా చేసి వేద విద్యనునేర్పించటం ప్రారంభించారు తలిదంద్రులైన విశ్వానరుడు శుచిష్మతి దంపతులు.
వేదం ప్రారంభించిన మూడేళ్లలో పద, క్రమాదులు పూర్తీ చేశాడు బాలుడు. గురుముఖతా నామ మాత్రమె నేర్చి, స్వయం కృషితో వేదవిశారదుడని పించుకొన్నాడు. నారద మహర్షి వీరి ఆశ్రమానికి వచ్చి కుమారుడైన గృహపతిని చూసి, అతని వినయానికి ముచ్చట పడి, తన ఒడిలో కూర్చో బెట్టుకొన్నాడు. అతని శరీర లక్షణాలను పరీక్షించాడు దేవముని. దారంతో అతని శరీరావయవాలను కొలిచాడు. అడ్డమూ, నిలువు కలిపి నూట ఎనిమిది అంగులున్నాడని చెప్పాడు. ఇలాంటి లక్షణం పృధివీపతికే ఉంటుందని తెలిపాడు. అతని అవయవాలలో అయిదు సూక్ష్మాలుగా, అయిదు దీర్ఘాలుగా, ఏడు రక్తాలుగా, ఆరు ఉన్నతాలుగా, మూడు విశాలంగా, అయిదు సూక్ష్మాలుగా గంభీరాలుగా ఉన్నాయని తేల్చాడు. ఇలా 32 అవయవాలు ఉండాలని సూచించాడు.
దీర్ఘావయవాల వల్ల దీర్ఘాయువు కలుగుతుంది. తమ పుత్రుడు గృహ పతికి అరిష్టం సంభవించే సూచనలున్నాయని నారద మహర్షి చెప్పినందుకు తలిదంద్రులైన విశ్వానరుడు, సుచిష్మతి తీవ్ర అందోళనపడ్డారు. ఒక రోజు కొడుకు అర్ధరాత్రి తలిదండ్రుల రోదనకు మెలకువ వచ్చి దుఖానికి కారణం అడిగాడు. వారు వివరంగా చెప్పారు. అతడు వరాకినిని చంచల మైన పురుగు ఏమి చేయగలదు? నేనిప్పుడే ప్రతిజ్ఞచేస్తున్నాను. మీ కుమారుడి నైన నేను నా మృత్యువుకు కారణ భూతం అవుతున్న విద్యుద్వహ్నిని నాశనం చేస్తాను అన్నాడు. వారా మాటకు పరమ సంతోష పడ్డారు. శివుని మహిమలను గుర్తు చేసుకున్నారు.
కుమారుడైన గృహపతి వెంటనే బయల్దేరి కాశీపట్నం చేరాడు. మణికర్ణికా ఘట్టం చేరి గంగా స్నానం తో పునీతుడై, విశ్వేశ్వర దర్శనం చేసుకొన్నాడు ఆజ్యోతిర్లిన్గాన్ని దర్శించి ధన్యుడయాడు విశ్వేశ్వరుని అభిషేకం చేసి, నీలోత్పలాల తో పూజ చేశాడు. ఒక శివ లింగాన్ని ప్రతిష్ట చేసి, కంద మూలాలను తింటూ రోజూ వెయ్యి ఎనిమిది పుష్పాలతో పూజిస్తూ ఆరునెలల పది హేను రోజులు గడిపాడు. రాలిన ఆకులను మాత్రమె భక్షిస్తూ, జలం మాత్రమె త్రాగుతూ మరో ఆరు నెలలు ఆ శివలింగానికి పూజ జరిపాడు. ఇలా రెండు సంవత్సరాలు తీవ్ర ధ్యానం చేశాడు. అప్పుడు అతనికి పన్నెండవ ఏడు వచ్చి, నారదుడు చెప్పిన గండం సమీపించింది.
వజ్రాయుధంతో ఇంద్రుడు వచ్చి గృహపతి ఎదుట ప్రత్యక్షమైనాడు. వరం ఇస్తాను గ్రహించామన్నాడు. గృహ పతి ‘’నీ వరం నాకక్కర లేదు. నాకు వరం ఇవ్వాల్సిన వాడు శంకర మహా దేవుడొక్కడే ‘’అని కరాఖండీ గా చెప్పాడు. దేవేంద్రుడు ‘’నా కంటే శంకరుడు అంటూ వేరే లేడు. నేనే దేవ దేవుడిని వరం కోరుకో ‘’అన్నాడు గృహ పతి‘’అహల్యా జారుడివి నువ్వు. నేను పశు పతిని తప్ప వేరొకరి నుండి వరాన్ని గ్రహించను ‘’అని చెప్పేశాడు. కోపావేశం తో ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తి ఆ బాలుని మీదకు వచ్చాడు.
వెంటనే మహా శివుడు ప్రత్యక్షమై బాలుని శరీరాన్ని స్పృశించాడు. అప్పుడు గౌరీపతి గృహ పతి తో ‘’ఇంద్రుడిని వజ్రాయుధం చూసి నువ్వు భయపడ్డావు. అది కాని, యముడు కాని నిన్నేమీ చేయలేరు. నేనే ఇంద్రుని రూపం లో వచ్చి నిన్ను భయపెట్టాను. నీకు వరమిస్తున్నాను, ఇప్పటి నుంచి నువ్వు ‘’అగ్ని ‘’అనే పేరుతో పిలువబడతావు. నువ్వు దేవతలకు ముఖం గా ఉంటావు.
అన్ని జీవ రాసుల జఠరాలలో నివశిస్తావు. దేవేంద్ర, యమధర్మ రాజుల మధ్య ఉన్న దిక్కుకు నువ్వు అధిపతివి అవుతావు. నువ్వు స్తాపించిన ఈ లింగం ‘’అగ్నీశ్వరుడు ‘’అని పిలువబడతాడు ఈ లింగం అన్ని లింగాల కంటే తెజస్వంతమైనది.
దీన్ని అర్చించిన వారికీ విద్యుత్ వల్లా, అగ్ని వల్లా భయం ఉండదు. అగ్ని మాన్ద్యభయం ఉండదు. అకాల మరణం రాదు. సర్వ సమృద్దినిస్తుంది అని పరమేశ్వరడు వరమిస్తాడు. గృహపతి అయిన అగ్ని తల్లి దండ్రులు చూస్తుండగానే దేవ విమానమెక్కి ఆగ్నేయ దిశకు వెళ్ళాడు. శివుడు అగ్నిని ఈ దిశకు అదిపతి గా అభిషేకించాడు శివుడు ఆగ్నేయ లింగం లో ప్తతిష్టితమై, భక్తుల కోర్కెలను తీరుస్తున్నాడు. ఈ విషయాలన్నీ విన్న శివశర్మ, భర్త అగస్త్యముని వల్ల విన్న లోపాముద్రా దేవి పరమానందం అనుభవించారు.
నైరుతి ,వరుణ లోక వర్ణన
శివ శర్మ నైరుతి మొదలైన లోకాలను గురించి తెలియజేయమని విష్ణు దూతలను కోరగా వివరిస్తున్నారు. మొదటిది నైరుతి పుణ్యవతి పుణ్య జనులకు ఆవాసం. వేద మార్గాన్ని అనుసరించే వారు ఇక్కడికి వస్తారు. దయా ధర్మాలతో ప్రవర్తించే అన్త్యజులకు కూడా ఈ లోకం లభిస్తుంది అని పింగాక్షుని ఉపాఖ్యానాన్ని తెలిపారు.
విన్ధ్యాటవి లో ఒక పల్లెకు పింగాక్షుడు ప్రభువు మంచి శూరుడు నిర్దాక్షిణ్యంగా జంతువులను, మనుష్యులను చంపే వారిని కఠినంగా శిక్షించేవాడు అడవిలో ప్రయాణించే వారిని వెంట ఉండి దాటిస్తాడు ఒక సారి ఇతని బంధువు ప్రయాణీకులను హింసిస్తున్నాడని విన్నాడు రహస్యంగా వచ్చి వాడిని పట్టుకొన్నాడు ఇతరులకు అపకారం చేయవద్దని వాడు దోచుకొన్న దానికి రెట్టింపు ఇచ్చి గౌరవంగా సాగనమ్పాడు.
ఇంకో సారి మరో బృందం వస్తుంటే కొందర్ని వాళ్ళను చంపమని దోచుకోమనీ హెచ్చరికలు వచ్చాయి అప్పుడు వారంతా తాము పింగాక్షుడున్నాడనే ధైర్యం తో వచ్చామని కావాలంటే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామని ప్రాణాలను రక్షించమని యాత్రికులు వేడుకొన్నారు .ఈ మాటలను విన్న పింగాక్షుడు వారిని భయపడవద్దని అనునయిస్తూ ,ఆ చోటుకు చేరుకొన్నాడు .ఇంతలో ఒక భిల్లుడు అక్కడికి వచ్చి తన అనుచర గణం తో పింగాక్షుడిని చంపమని ఆదేశించాడు .ఇరువైపులా ఘోర పోరాటం జరిగింది శత్రువులైన భిల్ల గణాన్ని ఓడించి బంధించాడు.
కాని అతని ధనుస్సు బాణాలు ముక్కలు ముక్కలయ్యాయి శత్రువులు అనేకులవటం తో వారి చేతిలో మరణించాడు పింగాక్షుడు. నైరుతి దిక్కు నుండి దేవ దూతలు వచ్చి పింగాక్షుని దేవవిమానం లో తీసుకొనివచ్చి నైరుతి దిక్కుకు ప్రభువును చేశారు. అక్కడి నుండి శివశర్మ ను వరుణ లోకానికి విష్ణుదూతలు తీసుకొని వెళ్లారు. ప్రజలకోసం బావులు, చెరువులు త్రవ్వించిన వారు వరుణ లోకానికి వస్తారు. దారిలో నీడ కోసం రావి, మద్ది చెట్లను నాటించె వారు ఈ లోకం చేరుతారు. చలివెంద్రాలను ఏర్పాటు చేసే వారు వరుణ లోకానికి చేరతారు. జలదారా మండపాలను నీడ నిచ్చే మండపాలను నిర్మించిన వారికిది నెలవు.
వరుణుని జన్మ వృత్తాంతం ను అగస్త్య ముని తన భార్య కు వివరించుట
కర్దమ ప్రజాపతికి శుచిష్మన్తుడనే కుమారుడున్నాడు. వినయ శీలి సుగుణవంతుడు ధైర్యశాలి ఒక రోజు ఇతడు కొందరు బాలురతో కలిసి ఒక సరస్సులో స్నానానికి వెళ్లాడు. నీటిలో దిగగానే అతడిని ఒక మొసలి పట్టుకోంది ఈ విషయాన్ని స్నేహితులు తండ్రికి తెలియజేశారు.
ఆయన అప్పుడు శివధ్యానం లో ఉన్నాడు. తన సర్వజ్ఞత్వం వల్ల ఒక సరస్సులో కొంత మందిముని బాలురు జలక్రీడలాడటం కనీపించింది. అందులో రుద్రరూపుడైన ఒక ముని బాలుడు‘’ఓయి సముద్రాదిపా!భక్తుడైన కర్దమ ప్రజాపతి కుమారుడడేక్కడ ఉన్నాడు ? శివుని సామర్ధ్యం తెలియకుండా దుష్క్రుత్యానికి పాలు పడ్డావు ‘’అని గర్జించాడు .
సముద్రుడు భయపడి బాలుడిని రత్నాలతో అలంకరించి శిశు మారకమైన మొసలిని బంధించి తెచ్చి శివుని పాదాల చెంత పడేశాడు. శివుని పాదాలకు. అప్పుడు శివుడు మన్నించి ఆ బాలుని తండ్రి కర్దమ ప్రజాపతి వద్దకు తీసుకొనివెళ్ళి అప్పగించమని ప్రధమగణాలకు చెప్పాడు .
తండ్రి కుమారుని చూచి సంతోషం తో కౌగలించుకొని యోగాక్షేమాలను విఛారించాడు. బాలుడు జరిగిన వృత్తాంతం అంతా తండ్రికి తెలియజేశాడు. తండ్రి అనుమతి గ్రహించి బాలుడు కాశీలో శివ లింగాన్ని ప్రతిష్టించి అయిదు వేల సంవత్స రాలు శిలలాగా నిశ్చలం గా శివుని కోసం తపస్సు చేశాడు. మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తనకు జలాల పై ఆధి పత్యం కావాలని బాలుడు విన్నవించాడు .
అప్పుడు భవానీ పతి ‘’నువ్వు వాపీ ,కూప తటాకాది ,నదీ నదాలకు సమస్త జలాలకు అదిపతి వి అవుతావు. సమస్త రత్నాలకు అదిపతి వి నీవే పశ్చిమ దిక్కునకు అధిపత్యం నీదే పాశపాణివై సమస్త దేవతలకు ఇష్టుడవవుతావు. నువ్వు స్థాపించిన లింగం ‘’వరుణేశ్వర లింగం ‘’గా ప్రసిద్ధి చెందుతుంది మణి కర్నేశ్వరుని నైరుతి దిశలో సంస్తాపితమై ఉంటుంది. ‘’అని వరమిచ్చి అంతర్ధాన మయ్యాడు. శుచిష్మంతుడు అనే ఆ బ్రాహ్మణ బాలుడు నైరుతి దిశకు అధిపతి అయాడు.
గంధ వతి
వరుణ నగరానికి ఉత్తరాన వాయువు నగర మైన గంధవతి నగరం ఉంది. దీని అదిపతి ప్రభంజనుడు అంటే వాయు దేవుడు శివభక్తుడై ఈ ఆధిపత్యాన్ని పొందాడు. పూర్వం కశ్యప ప్రజాపతి వంశం లో జన్మించిన ధూర్జటి అనే పుణ్యాత్ముడు కాశీ లో పవనేశ్వర లింగాన్ని స్తాపించి దీక్షగా శివుని కోసం తపస్సు చేశాడు. శివడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ధూర్జటి శివుని స్తోత్రం చేశాడు. దానికి శివుడు ‘’నీవు స్తాపించిన లింగం వాయు లింగం గా ప్రసిద్ధి చెందుతుంది. ఈ పవమానేశ్వర లింగాన్ని అర్చించిన వారు సర్వలోక పూజితుడవుతాడు పడమటి దిశకు నువ్వు అధిపతివి అవుతావు ‘’అని దీవించి అదృశ్యమైనాడు.
అలకాపుర వర్ణనం
గంధవతికి తూర్పుగా కుబేరుని అలకాపురి ఉంది. ఇతడు శివునికి మిత్రుడు కూడా నవనిధులకు దాత. శివశర్మ కుబేరుడేవరు? ఆదిపత్యం ఎలా వచ్చ్చింది? శివమిత్రుడేలా అయాడు… అని ప్రశ్నిస్తే సమాధానం గా విష్ణు దూతలు ఇలా చెప్పారు .పూర్వం కామ్పిల్య నగరం లో సోమయాజుల వంశం లో యజ్న దీక్షితుడైన యజ్నదత్తుడు అనే సద్బ్రాహ్మణుడున్నాడు అందరి చేత గౌరవింపబడుతున్నాడు నిత్యాగ్ని హోత్రం చేస్తూ క్రతువులు నిర్వహిస్తు బ్రాహ్మణ ధర్మాన్ని వేద విధి గా సాగిస్తున్నాడు ఆయనకు ‘’గుణనిది ‘’అనే కుమారుడున్నాడు .
కొడుకు ఇంట్లో కనిపించలేదని ఎప్పుడైనా ఆయన అడిగితే అప్పుడే దేవతార్చన చేసి వెళ్ళాడని భార్య అబద్ద ఆడుతూ కొడుకును వెనకేసుకోచ్చేది ఒక సారి తండ్రికి కోపం తెప్పించవద్దని హితవు చెప్పింది. దానితో అసలు ఇంటికి రావటం మానేశాడు. పందోమ్మిదేల్లు వచ్చేసరికి వివాహం చేశారు. కాని భార్యనూ అలక్ష్యం చేస్తూ దురాచారాలను ఏమాత్రం తగ్గించుకో లేదు. ఒక రోజు తల్లికి తండ్రి ఇచ్చిన నవరత్నాల ఉంగరాన్ని దొంగిలించి జూదం లో పోగొట్టుకొన్నాడు. దాన్ని ధరించిన జూదగాడిని దీక్షితుల వారు చూసి ఎక్కడిదని గద్దించాడు. వాడు నిజం చెప్పాడు కోపం తో ఇంటికి చేరిన గుణ నిది తండ్రి భార్యను ఉంగరం ఎక్కడుంది అని అడిగితే ఆమె దాన్ని మాయ మాటలతో కప్పి పుచ్చింది. ఇంట్లో వెండిగిన్నె మొదలైన వాటిని గురించి అడిగినా సరైన సమాధానం రాలేదు.
ఆమెను కోపగించి కొడుకును ఇంటికి రానివ్వవద్దని హెచ్చరించాడు. అన్ని దారులు మూసుకు పోయాయి గుణనిది కి ఒక శివ రాత్రి నాడు శివభాక్తుడొకడు శివుని నైవేద్యం పెడదామని మధుర పదార్ధాలను చేయించి శివాలయానికి వెళ్లాడు. అక్కడే చాలా రోజుల నుంచి ఆకలి తో అలమటిస్తున్న గుణనిది నెమ్మదిగా భక్తుడు వెళ్లిపోయే దాకా ఆగి అక్కడ జరిగే భజనలు స్తోత్రాలను విని చూసి ప్రసాదం కోసం వేచి ఉన్నాడు. అందరు వెళ్లిపోయిన తర్వాత గర్భాలయం చేరాడు. అక్కడ ఉన్న దీపారాధన కొండేక్కుతున్నట్లు గమనించి ,అందులో అక్కడే ఉన్న చమురు పోసి వత్తిని ఎగా దోశాడు .తన కొంగు చింపి వత్తి చేసి నూనె లో తడిపి మరింత కాన్తికోసం వెలిగించాడు .లోపలి నైవేద్యాన్ని చేత్తో పట్టుకొని బయటికి పరిగెత్తుతుండగా ,అక్కడే నిద్రిస్తున్న ఒక భక్తుడిపై పడ్డాడు.
అతడు కేకలువేస్తె అందరు వచ్చి దొంగతనానికి గుణనిది వచ్చాడని భావించి చావ బాదారు. వెంటనే అతడు మరణించాడు. శివున అనుచర గణం అక్కడికి వచ్చి అతన్ని తీసుకుపోబోతుంటే యమదూతలు అడ్డ గించారు. అప్పుడు శివదూతలు శివ నిర్మాల్యాన్ని తాకితేనే పాపాలు పోతాయని శివరాత్రి పర్వ దినం నాడు గుణనిది ఉపవాసంతో దాన్ని తెచ్చు కోన్నాడని దీపారాదన చేశాడని పూజ, భజనలు చూశాడని విన్నాడని కనుక అతనికి పుణ్యమే తప్ప పాపమే లేదని వాధనతో తెలిపి శివలోకానికి తీసుకొని వెళ్లారు.
గుణనిది తర్వాతా జన్మలో కలింగ రాజు అరిన్దముడికి దమనుడు అనే కొడుకు గా పుట్టాడు తండ్రి తర్వాత రాజ్యమేలాడు. అతనికేమీ భక్తీ విషయాలు తెలీవు. అయితే తన రాజ్యం లో అన్ని శివాలయాలలో దీపాలు వెలిగించాలి అని శాసనం చేసి అమలు చేశాడు.
జీవించి ఉన్నంతకాలం దీన్ని అమలు చేశాడు. దమనుడు మరణించాడు ఈ దీపారాధనా పుణ్యం చేత అతడు అలకాపురం కు రాజయ్యాడు పద్మ కల్పం లో బ్రహ్మమానస పుత్రుడుగా పులస్త్యుడు జన్మించాడు. పులస్త్యుని కొడుకు విశ్వావసువు. ఇతడు విశ్వకర్మ చేత అలకాపురిని నిర్మింపజేసుకొన్నాడు శివుని కోసం దీర్ఘ తపస్సు చేశాడు తరువాతి కల్పం అయిన మేఘ వాహన కల్పం లో యజ్నదత్తుని కుమారుడు గుణనిది శివానుగ్రహం కోసం తపస్సు చేశాడు.
దీపారాధన పుణ్యం చేత కాశీ నగరాన్ని పొందాడు అక్కడ ఒక శివ లింగాన్ని స్తాపించి తపస్సు చేస్తే మహేశ్వరుడు విశాలాక్షి తో ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటే శివుని పాదాలను నిత్యం తన కళ్ళ తో చూసే భాగ్యాన్ని ఇవ్వమని వేడుకొన్నాడు శివుడు సంతోషించి అతడిని చేతితో తాకి తనను దర్శించే భాగ్యం కల్గించాడు.
అప్పుడు అమ్మ గ్రహించి తీక్షణం గా అతని వైపు చూస్తె ఎడమ కన్ను చూపు లేకుండా పోయింది. అప్పుడు ఈశ్వరుడు ‘’ఇతడు క్రూర దృష్టి తో నిన్ను చూడ లేదు ఇతడు నీకుమారుడు నీ తపస్సును మెచ్చుకొంటు నీ అదృష్టాన్ని వర్ణిస్తున్నాడు ‘’అన్నాడు అతనితో ‘’నీ తపస్సుకు మెచ్చాను నువ్వు నవ నిధులకు అధిపతివి అవుతావు. గుహ్యకులకు అంటే డబ్బు దాచుకొనే వారికి నువ్వు అధిపతివి. అందరికి దనం ఇచ్చే‘’ధనడుడవు ‘’అని పించుకొంటావు. అలకాపట్నం అన్నిటా శ్రేష్టమైంది. విశాలాక్షీ దేవి అతనికి శివభక్తీ స్తిరం గా ఉంటుందని అనుగ్రహించింది. అతనిచే కాశీ లో ప్రతిష్టింపబడ్డ లింగం ‘’కుబేర లింగం ‘’గా ప్రసిద్ధి చెంది పూజించిన వారికీ దారిద్ర్యాన్ని రాకుండా కాపాడుతుందని తెలిపి అదృశ్య మయ్యారు. ఈ విధంగా గుణనిది ధనడుడైన కుబేరుడి అలకాపురాన్ని ఏలుతు దిక్పాలకుడయ్యాడు అలకాపురమే కైలాసం అయింది. అదే శంకరాలయం
సోమ లోక వర్ణనం
అలకాపురి కి ముందు ఈ శానుని పట్నం ఉంది. అక్కడ తపోధనులైన రుద్రా భక్తులుంటారు. అజైక పాదుడు, ఆహిర్బుద్నుడు మొదలైన ఏకాదశ రుద్రులు శూలాలు ధరించి ఈ లోకంలో ఉంటారు. వీరంతా కాశీలో ఈశానేశ లింగాన్ని స్తాపించి అర్చించి తపస్సు చేసినవారే. వీరందరు దిక్కులకు ఈశ్వరు లవుతున్నారు. జటాజూతాలతో ఫాల నేత్రాలతో ఉంటారు నీల గళులు.
వృషభ ధ్వజులు
పగటి వేళ పురాన్ని చంద్రుడు తన కాంతి తో ప్రకాశింపజేస్తున్డటం చూసి సోమశర్మకు సందేహం వచ్చి ప్రశ్నించాడు విష్ణు గణాన్ని. ఇదే సోమలోకమని అదిపతి చంద్రుడని చెప్పారు. అమృత వర్షంతో చంద్రుడు ఈ లోకాన్ని వెన్నెల తో తడుపుతుంటాడు. సోమనాధుని తండ్రి అత్రి భగవానుడు. ఇతడు ప్రజాపతి అయిన బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేశాడు. ఆయన రేతస్సు ఊర్ధ్వ ముఖంగా ప్రయాణించి సోమత్వాన్ని పొందింది. ఆ రేతస్సును బ్రహ్మ గారి అనుజ్నచేత పది మంది స్త్రీలు భుజించి గర్భాన్ని పొందారు. నెలలు గడిచిన కొద్దీ గర్భాన్ని భరించలేక పోయి, పది దిక్కులలోనూ సోములను కన్నారు. ఆ పదీ ఒక ఆకారంగా మారి సోముడు అనే పేరు తో భూమిమీద పడ్డాడు. అతన్ని బ్రహ్మ రదారూఢుని చేసి ఇరువది ఒక్క సార్లు భూ ప్రదక్షిణ చేశాడు.
ఆ సోమ నుండి తేజం భూమి మీద పడింది ఆ తేజస్సు వల్ల అన్ని ఓషధులు, జన్మించాయి. విశ్వం ఆ ఒషదులన్నిటిని ధరించి కాంతివంతమయింది. సోముడు బ్రహ్మ కృప వల్ల వృద్ధి పొందాడు. తామర తూడులు మాత్రమె తింటూ తపస్సు చేశాడు. కాశీ పట్టణ రూపాన్ని పొంది అక్కడ తన పేరా అమృత లింగాన్ని స్తాపించాడు. ఒషధులకు, ఉదకాలకు, అగ్ర జన్ములకు కారణమయ్యాడు. అక్కడ ఒక బావి త్రవ్వించి, అందలి నీటికి అమృత జలం అని పేరు పెట్టాడు. ఆ నీటిలో స్నానం చేసి త్రాగిన వారికి జ్ఞానాభి వృద్ధి కలుగుతుంది. శివుడు సోముని కళల లో ఒక కల ను గ్రహించి తన శిరసున ధరించాడు .
దీంతో జగత్తంతా సంజీవితం పొందింది. ఆ తర్వాతశాపం పొంది పదిహేను రోజులు వృద్ధిని పది హేను రోజులు క్షీణతను పొందాడు. అతని లోకానికి బ్రహ్మాది దేవతలు వచ్చి పోతుంటారు. అత్రి భ్రుగువు మున్నగు ఋషులకు నిలయం. సోమునికి ‘’కుహు, సిని, ద్యుతి, పుష్టి, ప్రభావసు, కీర్తి ధృతి, లక్ష్మి ‘’మొదలైన తొమ్మిది మంది దేవతలు సేవించారు. యజనము తసస్సు చేశాడు. చంద్రేశ్వరలింగ సమీపంలో రాజసూయ యాగం చేశాడు.
చంద్రేశ్వర దర్శనం చేసిన వారికి పూజించిన వారికి పాప ప్రక్షాళన జరుగుతుంది. అక్కడ సిద్ధ యోగీశ్వర పీఠం ఉండి. సాధకుల కోసం అనేక పీఠంలున్నాయి. అక్కడి నుండి నక్షత్రలోకానికి శివ శర్మణు విష్ణు దూతలు తీసుకొనివెళ్లారు.
శుక్ర లోక వర్ణనం
శుక్రలోక వృత్తాంతాన్ని శివ శర్మకు విష్ణు దూతలు వివరిస్తున్నారు. శుక్రా చార్యుడు వెయ్యేళ్ళు కణ ధూమ పానాన్ని చేసి, శివుని కృప వల్ల మృత సంజీవినీ విద్య సాధించాడు. శుక్రుని కద వింటే అప మృత్యు భయం ఉండదు. భూత ప్రేతాలు దరికి రావు, ఒకప్పుడు అందకాసురినికి, శివునికి యుద్ధం జరిగింది. చనిపోయిన, రాక్షస గణాన్ని బ్రతికించేందుకు శుక్రుడు సంపాదించిన మృత సంజీవినీ విద్యనూ ఇప్పుడు సార్ధకం చేసే సమయం ఆసన్న మైందని కోరాడు.
అంధకుని మాటలు విన్న భ్రుగువు సమయానికి మృత సంజీవిని విద్య ను జ్ఞాపకం చేసి నందుకు సంతోషపడి, రాక్షస గణాన్ని రక్షించే బాధ్యత తీసుకొంటానని అభయం ఇచ్చాడు. యుద్ధం లో చని పోయిన వారిని పునర్జీవితులను చేశాడు. శివుని ప్రధమ గణం బెంబేలెత్తి పోయారు.
శివునికి విషయం తెలియజేశారు యుద్ధం లో మరణిన్స్తున్న రాక్షసులను శుక్రుడు బ్రతికిస్తున్నాడని, తమకేమీ దారికానపడటం లేదని చెప్పారు. పరమ శివుడు నందీశ్వరుని పిలిచి, శుక్రా చార్యులను ఎత్తుకు రమ్మని ఆనతిచ్చాడు. అతడు వెంటనే వెళ్లి ఏనుగు పట్టు పట్టి, మీదకు వచ్చే రాక్షసులను కొమ్ములతో కాళ్ళతో చంపి తీసుకొచ్చి ఈశ్వరుని ముందు పడేశాడు.
శివుడు శుక్రుడిని పండును తిన్నట్లు నోట్లో వేసుకొని క్షణం లో మింగేశాడు. రాక్షసులకు ఈ విషయం తెలిసి లబో దిబో మన్నారు. ప్రమద గణం విజ్రుమ్భించి. రాక్షసులను సంహరించారు. అందకుడికి శివుడికి మహా యుద్ధం జరిగింది. శివుడు అతన్ని సంహరించాడు.
శివుని పొట్టలో ఉన్న శుక్రుడు బయటికి వచ్చే మార్గం కోసం వెతుకుతున్నాడు. శివుని ఉదరం లో పాతాళాది లోకాలను దర్శించాడు. ఆచార్యుడు ఆరు సంవత్సరాలు శివుని పొట్ట లో ఉండిపోయి బయట జరిగే యుద్ధాన్ని, బ్రహ్మాది లోకాలను చూశాడు. చివరికి ‘’శాంభవ యోగం ‘’చేత భార్గవుడు శివుని ముఖం నుండి బయటకు వచ్చి శివుని ఎదుట నిలబడినమస్కరించాడు.
శివుడు అతని పై కటాక్షం చూపి తన ముఖం నుండి వెలువడ్డాడు. కనుక తన కుమారుని తో సమానం అని చెప్పి వెళ్లి పోమన్నాడు. తన ఉదరం లో శుక్రుడు మరణించకుండా ఉన్నాడని, అతని యోగశక్తి అద్భుతమని కొనియాడాడు. మహేశ్వరుడు.
శుక్రుడు మృత సంజీవినీ విద్యనూ ఎలా సంపాదించాడని:- శివశర్మ అడుగగా విష్ణు దూతలు వివరించారు. పూర్వం శుక్రుడు కాశీ లో శివ లింగాన్ని స్తాపన చేసి భక్తీ తో తపస్సు చేశాడు. ఇంద్రియాలను జయించి, మనసును స్వాధీన పరచుకొని చేసిన అతని తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు.
శుక్రుడు ఆయన్ను సర్వ విధాలా స్తోత్రాలు చేసి ప్రసన్నుడిని చేసుకొన్నాడు. ’’నీకు ఇద్దరు కుమారులు కలుగుతారు. నా ఉదరం లో సంచరించావు కనుక నా వల్ల పుత్ర జన్మ పొందుతావు. నేను నీకు ఒక ప్రత్యెక వరాన్నిస్తున్నాను. ఇది బ్రహ్మా, విష్ణువులకు కూడా తెలీకుండా రహస్యం గా ఉంచాను. మంత్రపూర్వకంగా నా వద్ద ఉన్న మృత సంజీవినీ విద్యనూ నీకు ఇస్తున్నాను.
నువ్వు తపస్ సంపంన్నుడివి కనుక పొందే అర్హత ఉంది. దీన్ని నియమాల తో అభ్యసిస్తే చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. నీ దృష్టి పడ్డ వారి కార్యాలకు విఘాతం కలుగుతుంది. నువ్వు స్తాపించిన లింగం శుక్రేశ లింగం గా ప్రసిద్ధి చెందుతుంది. దీనిని అర్చిస్తే వంధ్యత్వం రాదు ‘’అని చెప్పి శివుడు శుక్రేశ లింగం లో లీనమై పోయాడు. విశ్వేశ్వర లింగానికి దక్షిణం లో శుక్రేశ లింగం ఉన్నది ‘’అని లోపాముద్రా దేవికి అగస్త్య మహర్షి చెప్పాడు.
అంగారక, గురు, శని లోక వర్ణన
అంగారక లోక వర్ణన
యెర్రని శరీరం గల లోకమే అంగారక లోకం అతడు భూమి కుమారుడు అందుకే కుజుడు అనే పేరు, దాక్షాయణీ వియోగం తో శివుడు ఘోర తపస్సు చేశాడు. ఆయన తల భాగం నుండి ఒక చెమట బిందువు భూమి పై పడింది. దాని నుంచి లోహితాన్గుడు అనే కుమారుడు పుట్టాడు. అందుకే అతని తల్లిగా భూదేవి ని చెపుతారు. ఆమె పోషణ లో పెరిగి మహేయుడు అనే పేరు పొంది ఉగ్రపురి లో ఉగ్రం గా తపస్సు చేశాడు. అక్కడి నుండి కాశి చేరి లింగ స్తాపన చేసి మహాతపస్సు చేశాడు.
ఇది పంచ ముద్రా స్తానం లో కంబలాశ్వ తరువుకు ఉత్తరం గా ఉంది. అందుకే అంగారకుడనే పేరొచ్చింది. శివుడు సంతోషించి గ్రహాధి పత్యాన్నిచ్చాడు. అన్గాకరేశ్వర లింగాన్ని పూజిస్తే గ్రహ పీడ తొలగిపోతుంది. అంగారక చతుర్ధి నాడు గణ నాధుడు జన్మించాడు.
గురు లోక వర్ణన
విష్ణు దూతలు గురు లోకం చేరాడు శివ శర్మ పూర్వం బ్రహ్మ మూడు లోకాలను సృష్టించాలని సంకల్పించుకొని మొదటగా మానసము నుండి ఆయన తో సమానమైన ఏడుగురు పుత్రులకు జన్మనిచ్చాడు. వారే అంగిరసుడు, మరీచి మొదలగు వారు. వీరంతా సృష్టి చేసే సమర్ధులు.
అన్గిరసుడు బుద్ధికి దేవతల వంటి వాడు శాంతుడు జితక్రోధి, మెత్తని వాక్కు కలవాడు వేదార్ధ వేది, రూప శీలగుణ సంపన్నుడు కాశీ లో శాంభవ లింగాన్ని స్తాపించి శివుని అర్చించా. ఆ లింగం నుంచి ఒక తేజో రాశి ఏర్పడింది. దానికి నమస్కరించి స్తుతి చేశాడు. దానికి సంతృప్తి పడి ‘’నీ స్తోత్రం చాలా ఉదాత్తం గా ఉన్నది నువ్వు వాచస్పతి అనే పేరు పొందుతావు. బుద్ధికి నీ వంటి వాడు ఉండడు .’’అని చెప్పాడు బ్రహ్మ తో అతడిని వాచస్పతి ని చేయమని, దేవాచార్య పదవినివ్వ మనిచెప్పగా అలానే చేశాడు. అతనిచే స్తాపింపబడిన లింగం బృహస్పతీశ్వర లింగంగా లోకం ప్రసిద్ధమైంది. ఈ లింగాన్ని అర్చిన్చితే పంచ మహాపాతకాలు నశిస్తాయి.
శని లోక వర్ణన
విష్ణు దూతలు శివ శర్మ ను శని లోకం చూపించారు. మరీచికి కశ్యపుని వలన సూర్యుడు ఉదయించాడు. అతని భార్య త్వష్ట ప్రజాపతి కుమార్తె సంజ్ఞాదేవి. సూర్య తేజస్సును పొంది ఆమె కాంతి విహీనమయింది సూర్యునికి అప్పటి నుండి మార్తాండుడు అనే పేరు వచ్చింది. సూర్య తేజస్సును భరిస్తోంది సంజ్ఞవల్ల ముగ్గురు సంతానం కలిగారు. వైవశ్వతుడు మొదటి వాడు. యముడు రెందోకొడుకు. యమునా నది కన్యకా. ఇక సూర్యుని తేజస్సు భరించలేక సంజన తన చాయను ఏర్పరిచింది.
ఛాయ తో ఆమె’’నేను నా తండ్రి దగ్గరకు వెడుతున్నాను. నువ్విక్కడ సుఖంగా ఉండు. నా కూతురు యమున ను జాగ్రత్తగా పోషించు ‘’అని అప్పగించి వెళ్లిపోయింది. త్వష్ట ప్రజాపతి కూతురుని ఆహ్వానించలేదు. భర్త దగ్గరకే పొమ్మన్నాడు. మళ్ళీ సూర్యుడి వద్దకు వెళ్లటం ఇష్టం లేక ఒక అరణ్యం చేరిబడబ అనే ఆడ గుర్రం గా మారి తపస్సు చేస్తూ ఉంది. ఛాయ సూర్యుని వల్ల ఎనిమిదవ మనువు అయిన సావర్నుని పుత్రుని గా కన్నది. యమునను సవతి తల్లి గా ఆరడి పెట్టింది. యముడు జాతి వైరాన్నిపూనాడు
సంజ్ఞా రూపం లో ఉన్న చాయను యముడు శపించాడు. తన్నటానికి కాలు పైకెత్తాడు ఆ కాలు పడిపోవు గాక అని ఆమె శపించి నది. భర్త దగ్గరకు వెళ్లి ఏడ్చింది. ఆమెకు బుద్ధి చెప్పాడు. సంతానాన్ని సమాన ప్రేమ తో చూడాలని హితవు చెప్పాడు. యముడు తనను క్షమించ మని తండ్రిని కోరుకొన్నాడు. కానీ తల్లి శాపానికి తిరుగులేదని పురుగులు అతని మాంసాన్ని తింటాయని భూలోకం లో పడటం తప్పదని చెప్పాడు.
మళ్ళీ తన అనుగ్రహం వల్ల కాలు వస్తుందని అభయమిచ్చాడు తన దగ్గర ఉన్నది సంజ్ఞా కాదని తెలుసుకొని సూర్యుడు ఆమెను వెతికిబడబ గా ఉండటం తెలుసుకొని తానూ గుర్రం వేషం లోకి వెళ్ళాడు. ఆమె పరపురుషుడేమో నని అనుమానించి శుక్రాన్ని తన ముక్కు రంద్రాలనుంచి బయటికి పంపింది. ఆ శుక్రము నుంచి అశ్వి నీ దేవతలు సూర్య తేజం తో జన్మించారు.
సంజ్ఞ కు విషయం చెప్పాడు రవి. శని సూర్యుని అనుమతి తో కాశీ వెళ్లి శివుని కోసం తపస్సు చేసి అనుగ్రహాన్ని పొంది. గ్రహాది పత్యాన్ని పొందాడు. పోయిన కాలు వచ్చే సింది అందుకే శని మార్గం లో వక్రత ఉంటుంది. శనేశ్వర లింగం శుక్ర లింగానికి ఉత్తరం గా ఉంది. దీన్ని అర్చిస్తే ఉత్తమ లోక ప్రాప్తి, గ్రహ పీడా నివారణా జరుగుతాయి.
సప్తర్షి లోక వర్ణన
అగస్త్య మహర్షి, భార్య లోపాముద్ర తో ‘’హరిద్వారం లో ప్రాణాలను కోల్పోయిన శివ శర్మ సప్తర్షి మండలాన్ని చూశాడు. ఆ తర్వాత విష్ణు లోకాన్ని, చూశారు. దేవకాన్తలు అతనికి స్వాగతమిచ్చారు. కొద్ది సేపు ఉండమని కోరారు బ్రహ్మ మానస పుత్రు లైన మరీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, అంగీరసుడు, వసిష్టుడు, ఏడుగురు ఇక్కడ ఉంటారు. వీరినే సప్త బ్రహ్మలు అని పురాణాలు చెబుతున్నాయి.
వీరి భార్యలు సంభూతి, అనసూయ, క్షమా, ప్రీతీ, సన్నతి, స్మృతి, ఊర్జ..వీరు లోక మాతలు గా ప్రసిద్ధులు. సప్తర్షులు తమ తపస్సుచే ముల్లోకాలను ధరిస్తున్నారు. వీరిని సృష్టించిన బ్రహ్మ దేవుడు వీరితో ‘’కుమారులారా !మీమీ ప్రయత్నాలతో నానా రూపాలుండే ప్రజల్ని సృష్టించండి ‘’అని ఆదేశించాడు. వారు తండ్రి కి నమస్కరించి కాశీ చేరి తపో నిష్ఠలో ఉన్నారు. సమస్త జీవులకు ముక్తి నివ్వటానికి శివుడు వచ్చాడు. వీరు తమ పేర్ల తో లింగాలను స్థాపించి శివుడిని అర్చిస్తూ తపస్సు చేశారు. మెచ్చిన శివుడు వారికి ‘’ప్రజా పతులు ‘’అనే బిరుదు నిచ్చాడు. సప్తర్షి లింగ దర్శనం చేస్తే సప్తర్షి లోకానికి చేరతారు.
గోకర్ణం అనే పేరు గల సరస్సు పడమటి భాగం లో ఉన్న అత్రీశ్వర లింగాన్ని చూస్తె బ్రహ్మ తేజస్సు పెరుగుతుంది. కర్కోటం అనే దిగుడు బావికి ఈశాన్యం లో ఉన్న మరీచీ మండలం లో స్నానం చేస్తే సూర్య కాంతిలాంటి దేహ వర్చస్సు కలుగుతుంది. అక్కడి మరీచీ లింగ దర్శనం మరీచీ లోకానికి చేరుస్తుంది. స్వర్గ ద్వారానికి పశ్చిమాన పులహుడు, పులస్త్యుడు స్థాపించిన లింగాలను దర్శించి పూజించిన వారు ప్రజాపతులవుతారు.
రమ్యమైన హరికేశ వనంలో అంగీరశేశ్వరుని చూస్తె అంగీరస లోకంలో స్థానం లభిస్తుంది. వరుణా నది ఒడ్డున ప్రతిష్టింప బడ్డ వశిష్టేశ్వర లింగ దర్శనం వల్ల, తీర్దేశ్వరుని సందర్శించిన వారికి సప్తర్షి లోక నివాస భాగ్యం కలుగుతుంది. అక్కడ అతిలోక సౌందర్యం తో విరాజిల్లుతున్న అరుంధతీ దేవిని చూశాడు.
ఆమె దర్శనమే పుణ్య ప్రదం. ఆమె మహా పతివ్రతగా గణన కెక్కింది. ఆమె నామ స్మరణ చేతనే గంగా స్నాన పుణ్య ఫలం లభిస్తుంది. సాక్షాత్తునారాయణుడే ఆమె పాతి వ్రత్యాన్ని మిగిలిన పతివ్రతల ముందు లక్ష్మీ దేవి ఎదుటనే పొగిడాడు. ’’అరుంధతి ని మించిన పతివ్రత లోకం లో ఎక్కడా లేదు. ఆమె రూప, శీలా, సౌందర్యాలు, కాలోచిత భర్త్రు సేవ, చాతుర్యం, ఎవ్వరికీ లేవు. ఆమె పలుకులు మాధుర్య పూరితాలు.
ఆ గాంభీర్యం, గురు సంతోషణం అరుంధతీ దేవికి ఉన్నట్లు మరెవ్వరికి లేవు, అరుంధతి ని స్మరించిన స్త్రీలు ధన్యులు, అదృష్ట వంతులు, పరిశుద్ధులు అవుతారు. అరుంధతి పుణ్య చరిత్రను ఏ ఇంట్లో చెప్పు కొంటారో అప్పుడు వారి లెక్కకు అరుంధతి మొదటి వ్రేలు నలన్కరిస్తుంది.
అని విష్ణు మూర్తి లక్ష్మీ దేవితో అరుంధతి పాతి వ్రత్య గరిమను వివరించాడు. శివ శర్మ ఎంతో సంతోష పడ్డాడు. ఆ తర్వాత విష్ణు దూతలు అతడిని ధ్రువ లోకానికి తీసుకొని వెళ్లారు అని అగస్త్యముని లోపాముద్రాదేవికి వివరించాడు.
ధ్రువ చరిత్ర
శివ శర్మ విష్ణు గణాలను ఏక పాదం మీద నిలిచి, ఏదో ఆలోచిస్తున్నట్లు, కాంతుల చేత ముల్లోకాలకు మండప స్థంభం వంటి వాడుగా, కాంతులు వేద జల్లుతూ, అనంత తేజో విరాజం గా ఉన్న, ఆకాశం లో సూత్ర ధారిలా, దాన్ని కొలుస్తున్న వాడిలా. యూప స్థంభం లా నిలబడి ఉన్న ఈ మహా పురుషుడు ఎవరు ?అని ప్రశ్నించాడు.
ఆ మహనీయుడే ద్రువుడని చెప్పి ధ్రువ చరిత్రను తెలియజేశారు. స్వయం భువునకు ఉత్తాన పాదుడనే కుమారుడున్నాడు. అతనికి సురుచి అనే భార్య వల్ల ఉత్తముడు అనే పెద్ద కొడుకు, సునీతి అనే భార్య వల్ల ధ్రువుడు అనే చిన్న కొడుకు కలిగారు.
ఒక రోజు సునీతి ఏదో పని లో ఉండి తనకుమారుడు ధ్రువుడిని సర్వాంగ సుందరం గా లంకరించి దాసికిచ్చి రాజు దగ్గరకు పంపింది. అతను తండ్రికి నమస్కరించి నిల బడ్డాడు. అప్పటికే ఉత్తముడు రాజు గారి తోడ మీద కూర్చుని రాజసం ఒలక బోస్తున్నాడు. బాల్య చాపల్యం చేత ధ్రువుడు కూడా తండ్రి తోడ మీద కూర్చొనే ప్రయత్నం చేస్తు కాళ్ళ మీద నుంచి పాకుతున్నాడు. అప్పుడు చుప్పనాతి సురుచి నువ్వు బాలిసుడివి. మహా రాజు అంకాన్ని చేరే అదృష్టం నీకు లేదు. అభాగ్యు రాలి గర్భం లో జన్మించావు. నేల మీద పాకే నువ్వెక్కడ ?సింహాసనం మీద కూర్చునే ఉత్తముడేక్కడ ?అని లాగి పారేసింది. రాజు కూడా ఏమీ అనలేక పోయాడు. కానీ లోపలి పోయి కన్నీళ్లు పెట్టు కొన్నాడు రాజు.
అమాయకుడైన ధ్రువుడు ఏమీ చేయ లేక తండ్రికి నమస్కరించి తల్లి సునీత వద్దకు చేరి ఏడ్చాడు. తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం తనకు ఎందుకు కలగ లేదని, ఆ అర్హత సంపాదించ టానికి తానేం చేయాలని అడిగాడు. అప్పుడు తల్లినాయనా ధ్రువా !సురుచి మానవతి అయిన భార్య. .ఆమె అంటే రాజు గారికి అభిమానం ఎక్కువ నా దురదృష్టం వల్ల నేను ఆయన ప్రేమకు ఎక్కువ గా నోచుకో లేక పోయాను. పుణ్య వశం చేత ఉత్తముడు ఆమె గర్భం లో జన్మించి రాజ యోగ్యుడైనాడు అని చెప్పి పుణ్యం రావాలంటే ఎలా వస్తుందో వివరించింది.
సాత్వికxమైన మనస్సు, దయాదృష్టి, శివ పూజ, శాస్త్ర జ్ఞానము, చదువు, అరిషడ్వర్గాలను జయించటం, తియ్యని మాట, పనులలో శ్రద్ధ, అలస్యం చేయక పోవటం, గురు భక్తీ, నిష్కాపట్యం, దైన్యం లేని సంభాషణ, శబ్ద పాండిత్యం, బంధు గణాలను ఆదరించటం, క్రయ, విక్రయాలలో కఠినత్వం భార్యతో మృదువు గా మాట్లాడటం, తీర్ధాలు సేవించటం, యుద్ధం లో వీర మరణం, పిల్లల మీద వాత్సల్యం, యాచకులకు, వికలాంగులకు దానం చేయటం, తల్లి దండ్రుల సేవ, నిత్య ధర్మా చరణ,ఉత్తమ శీలం, మంచి వారితో స్నేహం, ఇతి హాస పురాణాలను వినటం, ఆపదలలో ధైర్యం, సంపద చేరినపుడు స్తైర్యం, యతీశ్వరుల యెడ ఔదార్యం, దేహాన్ని కృశింప జేసుకోవటం, ఇంద్రియ జయం, తపో నియమం అనే ఉత్తమ గుణాల చేత తపో వృక్షం ఫలిస్తుంది. నువ్వు రాజు గారి కుమారుడవే కాని విశేష పుణ్యం చేయలేదు. నువ్వు చేసిన కర్మ కు తగిన ప్రతి ఫలమే లభిస్తుంది. కనుక దుఖించకు అని ఓదార్చింది.
తల్లి సునీతి మాటలు విన్న ధ్రువుడు అమ్మా !నేను బాలుడిగా మాట్లాడుతున్నానని అనుకో వద్దు. ఉత్తాన పాద రాజు గారి కుమారుడిని కనుక తపస్సు చేస్తాను. ఎవరికీ లభించనంతటి గొప్ప పదవిని నేను సాధిస్తాను. నన్ను ఆశీర్వడించి పంపించు అని కోరాడు అప్పుడామె ధ్రువా !నీకిప్పుడు తోమ్మిదేళ్ళే నీకు ఆజ్న ఇచ్చే సమర్ధత నాకు లేదు. కానీ నీ మనో నిశ్చయం నాకు సంతృప్తి నిచ్చింది. కన్నీటి తోనే నిన్ను తపస్సుకు అంగీకారిస్తున్నాను అని ఆశీర్వదించి పంపింది.
ధ్రువ బాలకుడు అక్కడి నుండి బయల్దేరి నిర్జరారణ్యం ప్రవేశించాడు. దారిలో సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది. వారికి నమస్కరించాడు. తన చరిత్ర అంతా వారికి దీనంగా వివరించి, వారి మనసులను దోచాడు. అతడి కోరిక ఏమిటని అడిగారు. అప్పుడు ధ్రువుడు వినయంగా వారితో నా సోదరుడు ఉత్తముడు మా తండ్రి తోడ మీద కూర్చునే అదృష్టాన్ని పుణ్యం వల్ల పొందాడు.
నాకూ ఆ అర్హత కావాలి మా తండ్రి సింహాసనం వేరొకరికి దక్కరాదు. ఇది ఇతరుల సింహాసనం కంటే ఉన్నతమైంది. అది ఇంద్రాదులకు కూడా పొందరానిది. మా తండ్రి వదిలిన సింహాసనం కాదు నాకు కావాల్సింది. నా బలం చేత సాధించుకొన్న సింహాసనం నాకు కావాలి. అది నాకు ఎలా వస్తుంది ?దాని సాధనకు నేనేమి చేయాలి అని ప్రార్ధించాడు.
అప్పుడు వారిలో మరీచి మహర్షి శ్రీ మన్నారాయణుని భజించకుండా ఆ యోగ్యత రాదు. అన్నాడు. అంగీరసుడు ఈలోకం లో సంపదను అనుభవించాలంటే కమలాక్షుని సేవిన్చాల్సిందే అనగా, పులస్తుడు ఎవరిని స్మరిస్తే సమస్త పాపాలు నశిస్తాయో అతడే మహా విష్ణువు అని, పులహుడు ఎవని మాయ చేత అంత ప్రవర్తిస్తోందో ఆ అచ్యుతు డే సర్వాన్ని ఇస్తాడు అని, క్రతువు ఈ జగాలకు ఎవరు అంత రాత్మ యో ఆ విష్ణువు సంతోష పడితే ఇవ్వనిది ఉండదు అని వసిష్ఠ మహర్షి ఎవరి కను బొమల అజ్ఞచేత అష్ట సిద్ధులు ప్రవర్తిస్తాయో, ఆ హృషీ కేషుని ఆరాధించు అని అందరు విష్ణువే ఏదైనా ఇవ్వ గల సమర్ధుడని బోధించారు.
అప్పుడా ధ్రువ బాలుడు మహర్షి సత్తము లారా !నిలబడినా, నడుస్తున్నా, పడుకొన్నా, నిద్రిస్తున్నా, మేలుకొన్నా కూర్చున్నా, ఎప్పుడూ నారాయణుడిని స్మరించాలి ద్వాదశాక్షరీ మంత్రం వాసు దేవాత్మకం. ఆ జపం తో శ్రీ మన్నారాయనుని జపించి నేను నా కోర్కెను తీచుకొంటాను. ఆయన మనసు కరగిస్తాను. ఈ మంత్రాన్ని పూర్వ బ్రహ్మ, మునులు ఉపాసిన్చారని తెలుస్తోంది అన్నాడు మహర్షులు ద్వాదశాక్షర మంత్రం తో వాసు దేవుడిని ప్రసన్నం చేసుకోమని సలహా నిచ్చి మనస్పూర్తిగా ఆశీర్వా దించి అంతర్హితులయ్యారు. ధ్రువుడు వాసు దేవ మనస్కుడై తపస్సు చేసుకోవ టానికి అక్కడి నుండి బయల్దేరాడు.
No comments:
Post a Comment