శివుడు తన సేననూ సేనాధిపతులనూ ఉత్సాహపరిచాడు. దేవదానవ మహాసైన్యాలకు సంగ్రామం మొదలయ్యింది. మహేంద్రుడు వృషపర్వుడితో భాస్కరుడు విప్రచిత్తితో చంద్రుడు దంభుడితో కాలుడు కాలస్వరుడితో హుతాశనుడు గోకర్ణుడితో కుబేరుడు కాలకేయుడితో విశ్వకర్మ యముడితో మృత్యువు భయంకరుడితో యముడు సంహారుడితో వరుణుడు వికంకణుడితో వాయువు చంచలుడితో బుధుడు ఘృతపృష్ఠునితో శనైశ్చరుడు(శని) రక్తాక్షుడితో జయంతుడు రత్నసారుడితో అశ్వినులు దీప్తిమంతుడితో విసవుడు వర్చసుడితో నలకూబరుడు ధూమ్రుడితో ధర్ముడు ధురంధరుడితో మంగళుడు ఉషాక్షుడితో భానుడు శోభాకరుడితో మన్మథుడు పిఠరుడితో ఇంకా ఇలాగే గోధాముఖ - చూర్ణ - ఖడ్గ - ధ్వజ - కాంచీముఖ - పిండ - ధూమ్ర - నంది - విశ్వ - పలాశాది దానవులతో ద్వాదశాదిత్యులు, ఏకాదశభయంకరులతో ఏకాదశరుద్రులూ, ఉగ్రచండాదులతో మహామారీ నందీశ్వరాదులూ ముఖాముఖి తలపడి ఘోరంగా యుద్ధం చేశారు. ప్రళయంకన్నా భీషణంగా జరుగుతోంది. శివుడుమాత్రం ఆదే వటమూలంలో అదే యోగాసనంలో కాళీసుతుడు తోడుగా కూర్చున్నాడు.
శంఖచూడుడుకూడా సంగ్రామోచితవేషధారియై సభామంటపంలో కోటిదానవపరివృతుడై రత్నసింహాసనంమీద కూర్చున్నాడు, ఎప్పటికప్పుడు యుద్ధవార్తలు వింటున్నాడు. శంకరుడి సైన్యంలో ఏ యోధుడు ఏ దానవుడి చేతిలో ఓడిపోయాడో తెలుసుకుంటున్నాడు.
దానవుల ధాటికి తట్టుకోలేక దేవసైన్యాలు పలాయనం చిత్తగిస్తున్నాయి. సేనాపతి కుమారస్వామి గమనించి తానే స్వయంగా అగ్రభాగాన నిలిచి సేనలను ఉత్సాహపరిచాడు. తన తేజశ్ళక్తితో సేనాబలాన్ని వృద్దిపాందించాడు. ఒంటిచేతితో నూరు అక్షౌహిణుల దానవ సైన్యాన్ని క్షణంలో సంహరించాడు. కాళికాదేవి మూర్తీభవించిన క్రోధంగా సమరాంగణాన స్వేచ్చగా తిరుగుతూ దానవవీరుల రక్తం తాగుతోంది. లక్షలాదిగా ఏనుగులనూ గుర్రాలనూ చేతజిక్కించుకుని అవలీలగా నోట్లో కుక్కుకుంటోంది. శిరస్సులు తెగిపడిన మొండేలు కరాళనృత్యం చేస్తున్నాయి. హతశేషులైన దానవ మహావీరులకు గుండెలు జారిపోయాయి. ఎవరికి వారుగా పలాయనం చిత్తగించారు. కానీ వృషపర్వ - విప్రచిత్తి - దంభ - వికకంకణులుమాత్రం నలుగురూ ఒకటై కుమారస్వామితో పోరాడుతున్నారు. రణరంగంలో ప్రవేశించింది మొదలు మరింక వెనుదిరిగి చూడకుండా మహామారి దానవులను చంపుకుంటూ పోతోంది.
కట్టకడపటికి స్కందుడు తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. వృషపర్వాదులు నలుగురూ దానిని అడ్డుకోలేక సంక్షుబ్ధులై నిలబడ్డారు. అంతేకానీ భయార్తులై పారిపోలేదు. ఆకాశంనుంచి పుష్పవృష్ఠి కురిసింది.
స్కందుడి మహావిజృంభణం విన్న శంఖచూడుడు తక్షణం తన దివ్యవిమానం అధిరోహించాడు. తిన్నగా రణరంగానికి వచ్చాడు. వస్తూనే మేఘంలా శరవర్షం కురిపించాడు. సంగ్రామస్ధలి అంధకారబంధురమయ్యింది. మరుక్షణంలో అగ్నిజ్వాలలు వ్యాపించాయి. నేల మండుతోంది. భయవిహ్వలులై దేవసైనికులు దశదిశలకూ పారిపోయారు. మంటలను చల్లార్చలేక నందీశ్వరాదులు సైతం వెనుదిరిగారు. కార్తికేయుడొక్కడే మండుతున్న సమరభూమిలో ధైర్యంగా నిలబడ్డాడు.
శంఖచూడుని ఉత్సాహం ఉప్పాంగింది. స్కందుడిచుట్టూ శిలావర్షం కురిపించాడు. అవి పర్వతవలయమయ్యాయి. వృక్షశ్రేణితో ఆచ్చాదించాడు. సర్పాలను కుంభవృష్టిగా కురిపించాడు. కార్తికేయుడి చేతిలో ఉన్న ధనుస్సును నడిమికి రెండుగా విరగ్గొట్టాడు. దివ్యరథాన్నీ రథపీఠాన్నీ నుగ్గునుగ్గు చేశాడు. మయూరవాహనాన్ని తూట్లు పొడిచాడు. శక్తి ఆయుధాన్ని గుండెలకు గురిపెట్టి విసిరాడు. ఆ దెబ్బ తట్టుకోలేక షణ్ముఖుడు క్షణకాలం మూర్చపోయాడు. వెంటనే తేరుకుని విష్ణుదత్తమైన దివ్యధనుస్సు అందుకొని వజ్రనిర్మితమైన రథం అధిరోహించి దిక్కులు పిక్కటిల్లేలాగా ధనుష్టంకారం చేశాడు. మహోల్బణుడై శస్త్రాస్త్రాలను ప్రయోగించి తన చుట్టూ ఉన్న పర్వతాలనూ వృక్షాలనూ సర్పాలనూ ధ్వంసం చేశాడు. కమ్ముకున్న మంచుతెరలనుంచి బయటపడ్డ భాస్కరుడిలా ప్రకాశించాడు. పర్జన్యాస్త్రం ప్రయోగించి దవానలంలాగా వ్యాపిస్తున్న మంటలను ఆర్పివేశాడు. శంఖచూడుడి రథాన్ని ధనుస్సునూ తుత్తునియలు చేశాడు. సారథిని సంహరించాడు. రథాశ్వాలను చీల్చిచెండాడాడు. కిరీటాన్ని పడగొట్టాడు. శక్తి ఆయుధాన్ని మంత్రించి ప్రయోగించాడు. అది సరాసరివెళ్ళి దానవేంద్రుడి వక్షఃస్థలాన్ని బలంగా ఢీకొట్టింది. క్షణకాలం మూర్చపోయి వెంటనే తెప్పరిల్లాడు. మరోరథాన్ని అధిరోహించి మరోధనుస్సు ధరించి మాయా శరజాలం కురిపించి గుహుణ్ణి కప్పివేశాడు. ఇదంతా నిమేషమాత్రంలో జరిగింది. విష్ణుతేజోవృతమై శతసూర్యసంకాశమై ప్రళయాగ్నిశిఖాసదృశమై ధగద్ధగలాడుతున్న శక్తి శరాన్ని సంధించి వదిలాడు. తిరుగులేని దానిదెబ్బకు షాణ్మాతురుడు మూర్చపోయాడు. కాళికాదేవి వెంటనే వచ్చి అతడిని చేతుల్లోకి ఎత్తుకుని శివుడిదగ్గరదించి తాను మళ్ళీ రణరంగానికి దూసుకువెళ్ళింది,
శివుడు తన దివ్యశక్తితో కుమారస్వామిని పునరుజ్జీవితుడిని చేశాడు. అనంతంగా బలాన్ని ప్రసాదించాడు. స్కందుడు ప్రతాపవంతుడై లేచికూర్చున్నాడు.
రణరంగానికి దూసుకువెడుతున్న కాళికాదేవి వెంట మధుభాండాలతో గంధర్వయక్షకిన్నర వీరులు తరలివెళ్ళారు. కాళికాదేవి సింహనాదం చేసింది. వికటాట్టహాసం చేసింది. మధుభాండాలు సేవించి కరాళనృత్యం చేసింది. దానవవీరులు భయకంపితులై మూర్భపోయారు. ఉగ్రదంష్ట్రా - ఉగ్రదండా - కోటకీ - యోగినీ - డాకినీ గణాలు మధుభాండాలు సేవిస్తూ వికృతంగా అరుస్తూ వికటాట్టహాసాలు చేస్తూ భీషణంగా గంతులు వేస్తున్నాయి. శంఖచూడుడు ఇటువైపు దృష్టిసారించాడు. దానవులకు అభయం ఇచ్చి కాళికాదేవితో కయ్యానికి కాలుదువ్వేడు. కాళిక అగ్నులు కురిపించింది. దానవరాజు పర్జన్యాస్త్రంతో చటుక్కున చల్లార్చాడు. వారుణాస్త్రాన్ని గాంధర్వంతోఅణిచివేశాడు. మాహేశ్వరాన్ని వైష్ణవంతో మట్టికరిపించాడు. కోపం పట్టలేక కాళికాదేవి నారాయణాస్త్రం ప్రయోగించింది. దానవప్రభువు వినయంగా రథందిగి భక్తితో శిరసు వంచి నమస్కరించాడు. ప్రళయాగ్నిశిఖలాగా వస్తున్న ఆ అస్త్రం దారిమళ్ళి ఆకాశంలో కలిసిపోయింది. ఆశ్చర్యచకితయైన కాళిక ఈసారి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టింది. బదులుగా బ్రహ్మాస్తాన్నే ప్రయోగించి విజయదరహాసం చేశాడు దానవేశ్వరుడు. దివ్యాస్త్రాలన్నీ అయిపోయాయి. యోజనాయతమైన శక్తి ఆయుధాన్ని విసిరింది. శంఖచూడుడు దాన్ని దివ్యాస్త్రాలతో శతఖండాలు చేశాడు, ఉక్రోషం ఆపుకోలేక కాళికాదేవి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించబోయింది. అంతలోకీ అశరీరవాణి వినిపించింది -
కాళీ! ఎందుకు ఈ వృధాప్రయాస. శంఖచూడుడి మృత్యువు ఏ అస్త్రంలోనూ లేదు. ఏ శస్త్రంలోనూ లేదు. అతడి మెడలో ఆ నారాయణ కవచం ఉన్నంతవరకూ, అతడి భార్య శీలానికి భంగం కలగనంతవరకూ అతడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. అజయ్యుడు. జరామృత్యువులకు అతీతుడు. ఇది బ్రహ్మ ఇచ్చిన వరం.
కాళికాదేవి పాశుపతాన్ని ఉపసంహరించుకొంది. ఆకలిగొన్న పులిలాగా చెలరేగి దానవవీరులను పదిలక్షలమందిని దోసిటబట్టి నోట్లో వేసుకుంది. శంఖచూడుణ్ణికూడా అలాగే పట్టుకుని మింగేద్దామనుకుంటూ ముందుకు వచ్చింది. దానవచక్రవర్తి అగ్నిశిఖలవంటి విశిఖాలతో నిలవరించాడు. గ్రీష్మసూర్యకాంతిలా తళతళలాడుతున్న ఖడ్గాన్ని విసిరింది. దాన్ని నూరుముక్కలు చేశాడు. ఈసారైనా పట్టుకుని మింగేద్దామని మళ్ళీ ప్రయత్నించింది. కానీ ఆ యోగసిద్దుడు అందకుండా తప్పించుకున్నాడు. ఆ కోపాన్ని రథంమీద చూపించింది. పిడిగుద్దుతో తునాతునకలు చేసింది. సారథిని పిడికిటబట్టి పిసికి ముద్దచేసింది. దానవరాజుకు గురిచూసి శూలం విసిరింది. అతడు దాన్ని లీలావిలాసంగా ఎడంచేత్తో పట్టుకొన్నాడు. కాళిక మరింతగా రెచ్చిపోయి ముష్టిఘాతం తగిలించింది. పిడుగుపడ్డంత పనిఅయ్యింది. విలవిలలాడాడు. తూలిపోయాడు. మూర్చిల్లాడు. క్షణంలో తేరుకుని లేచి నిలబడ్డాడు. కాళికాదేవి బాహాబాహికి దిగింది. శంఖచూడుడు నమస్కరించాడు. ఆవిడ చేతుల్లో ఉన్న శస్త్రాస్త్రాల నన్నింటినీ ఊడలాక్కున్నాడు. విరిచిపారేశాడు. కానీ తానై ఆ దేవిమీదికి ఏ ఆయుధాన్నీ ప్రయోగించలేదు. భక్తుడు. వైష్ణవుడు. మాతృభక్తి పరాయణుడుకదా శంఖచూడుడు.
కాళికాంబ చేతులు సాచి దానవప్రభువును పట్టుకుంది. ఆకాశానికి ఎత్తింది. గిరగిరా తిప్పి విసిరేసింది. అంత ఎత్తునుంచి నెలకుపడ్డా శంఖచూడుడు చెక్కుచెదరలేదు. వెంటనే లేచి నిలబడ్డాడు. భద్రకాళికకు శిరసువంచి నమస్కరించాడు. తన దివ్యవిమానం అధిరోహించి యుద్దం కొనసాగించాడు. భద్రకాళి దానవవీరులను పిండి కడుపునిండా రక్తంతాగి నేలను మట్టుకుంటూ శివుడి దగ్గిరికి వెళ్ళింది. రణవృత్తాంతాన్ని యథాక్రమంగా వివరించి చెప్పింది. శంభూ! నేను పాశుపతం ప్రయోగించబోతే అశరీరవాణి వినిపించింది. దానితో ఉపసంహరించుకున్నాను. శంఖచూడుడు మహాబలశాలి. మహాపరాక్రమశీలి. నా బాణాలనూ అస్త్రాలనూ ఖండించాడే తప్ప తనంత తానుగా నామీదకి ఏ ఆయుధమూ ప్రయోగించలేదు. పైగా భక్తితత్పరుడై నమస్కరించాడు. నిజంగా అతడు మహాజ్ఞాని. జితేంద్రియుడు - వింటున్న శంకరుడు మృదువుగా నవ్వాడు.
తత్త్వజ్ఞాన విశారదుడైన శివుడు ఈసారి స్వయంగా రణరంగంలోకి దిగాడు. అతనివెంట ప్రమథగణాలు నడిచాయి. అల్లంత దూరాన చూసి దానవప్రభువు విమానం దిగి శిరసువంచి నమస్కరించి సాష్టాంగపడ్డాడు. తిరిగి విమానం అధిరోహించి ధనుస్సు ఎక్కు పెట్టాడు.
నారదా! చంద్రచూడ శంఖచూడుల యుద్ధం పూర్తిగా వందసంవత్సరాలు సాగింది. జయమూ లేదు పరాజయమూ లేదు. శస్త్రాలకి శస్త్రాలూ అస్త్రాలకి అస్త్రాలుగా నడిచింది. రథంమీద శంఖచూడుడు, వృషభం మీద చంద్రచూడుడు. హెచ్చుతగ్గులు లేని ద్వంద్వయుద్దం నూరేళ్ళు సాగింది.
కాళికాదేవి పాశుపతాన్ని ఉపసంహరించుకొంది. ఆకలిగొన్న పులిలాగా చెలరేగి దానవవీరులను పదిలక్షలమందిని దోసిటబట్టి నోట్లో వేసుకుంది. శంఖచూడుణ్ణికూడా అలాగే పట్టుకుని మింగేద్దామనుకుంటూ ముందుకు వచ్చింది. దానవచక్రవర్తి అగ్నిశిఖలవంటి విశిఖాలతో నిలవరించాడు. గ్రీష్మసూర్యకాంతిలా తళతళలాడుతున్న ఖడ్గాన్ని విసిరింది. దాన్ని నూరుముక్కలు చేశాడు. ఈసారైనా పట్టుకుని మింగేద్దామని మళ్ళీ ప్రయత్నించింది. కానీ ఆ యోగసిద్దుడు అందకుండా తప్పించుకున్నాడు. ఆ కోపాన్ని రథంమీద చూపించింది. పిడిగుద్దుతో తునాతునకలు చేసింది. సారథిని పిడికిటబట్టి పిసికి ముద్దచేసింది. దానవరాజుకు గురిచూసి శూలం విసిరింది. అతడు దాన్ని లీలావిలాసంగా ఎడంచేత్తో పట్టుకొన్నాడు. కాళిక మరింతగా రెచ్చిపోయి ముష్టిఘాతం తగిలించింది. పిడుగుపడ్డంత పనిఅయ్యింది. విలవిలలాడాడు. తూలిపోయాడు. మూర్చిల్లాడు. క్షణంలో తేరుకుని లేచి నిలబడ్డాడు. కాళికాదేవి బాహాబాహికి దిగింది. శంఖచూడుడు నమస్కరించాడు. ఆవిడ చేతుల్లో ఉన్న శస్త్రాస్త్రాల నన్నింటినీ ఊడలాక్కున్నాడు. విరిచిపారేశాడు. కానీ తానై ఆ దేవిమీదికి ఏ ఆయుధాన్నీ ప్రయోగించలేదు. భక్తుడు. వైష్ణవుడు. మాతృభక్తి పరాయణుడుకదా శంఖచూడుడు.
కాళికాంబ చేతులు సాచి దానవప్రభువును పట్టుకుంది. ఆకాశానికి ఎత్తింది. గిరగిరా తిప్పి విసిరేసింది. అంత ఎత్తునుంచి నెలకుపడ్డా శంఖచూడుడు చెక్కుచెదరలేదు. వెంటనే లేచి నిలబడ్డాడు. భద్రకాళికకు శిరసువంచి నమస్కరించాడు. తన దివ్యవిమానం అధిరోహించి యుద్దం కొనసాగించాడు. భద్రకాళి దానవవీరులను పిండి కడుపునిండా రక్తంతాగి నేలను మట్టుకుంటూ శివుడి దగ్గిరికి వెళ్ళింది. రణవృత్తాంతాన్ని యథాక్రమంగా వివరించి చెప్పింది. శంభూ! నేను పాశుపతం ప్రయోగించబోతే అశరీరవాణి వినిపించింది. దానితో ఉపసంహరించుకున్నాను. శంఖచూడుడు మహాబలశాలి. మహాపరాక్రమశీలి. నా బాణాలనూ అస్త్రాలనూ ఖండించాడే తప్ప తనంత తానుగా నామీదకి ఏ ఆయుధమూ ప్రయోగించలేదు. పైగా భక్తితత్పరుడై నమస్కరించాడు. నిజంగా అతడు మహాజ్ఞాని. జితేంద్రియుడు - వింటున్న శంకరుడు మృదువుగా నవ్వాడు.
తత్త్వజ్ఞాన విశారదుడైన శివుడు ఈసారి స్వయంగా రణరంగంలోకి దిగాడు. అతనివెంట ప్రమథగణాలు నడిచాయి. అల్లంత దూరాన చూసి దానవప్రభువు విమానం దిగి శిరసువంచి నమస్కరించి సాష్టాంగపడ్డాడు. తిరిగి విమానం అధిరోహించి ధనుస్సు ఎక్కు పెట్టాడు.
నారదా! చంద్రచూడ శంఖచూడుల యుద్ధం పూర్తిగా వందసంవత్సరాలు సాగింది. జయమూ లేదు పరాజయమూ లేదు. శస్త్రాలకి శస్త్రాలూ అస్త్రాలకి అస్త్రాలుగా నడిచింది. రథంమీద శంఖచూడుడు, వృషభం మీద చంద్రచూడుడు. హెచ్చుతగ్గులు లేని ద్వంద్వయుద్దం నూరేళ్ళు సాగింది.
No comments:
Post a Comment