మౌని అమావాస్య
పుష్య మాసం శ్రవణ నక్షత్రంలో వచ్చే అమావాస్య మౌని అమావాస్య. యోగం సిద్ధి యోగం.
మౌని అనగా సంస్కృతం లో మౌనం. కావున మౌని అమావాస్య రోజున మౌన ఉపవాస దీక్షను ఆచరించాలి.
ఆంధ్ర రాష్టంలో, మౌని అమావాస్యను చొల్లంగి అమావాస్య గా జరుపుకుంటారు మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో దీనిని దర్శ అమావాస్య అని కూడా పిలుస్తారు.
మహాశివరత్రి కి ముందు వచ్చే సిద్ధి యోగం తో కూడిన అమావాస్య కావున సిద్ధి పొందాలి అనుకునే ఋషులు మునులు మౌనంగా పరదేవతను అర్చిస్తారు.
పుష్యమాసం అనేది శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం అందులోనూ మౌని అమావాస్య ఆధ్యాత్మిక సాధన కోసం అంకితం చేయబడిన రోజు.
హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది జనవరి 29న బుధవారం మౌని అమావాస్య వచ్చింది.
ఈ పవిత్రమైన రోజున గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని, రాజ స్నానం తర్వాత దానధర్మాలు చేస్తే కచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. అనంతరం శివయ్యను స్మరించుకుంటూ, చనిపోయిన పూర్వీకుల కోసం శ్రాధ్దాకర్మాదికాలు చేస్తే వారికి పుణ్యలోకాలు కల్గుతాయంట. వారి ఆశీర్వాదాలు కల్గుతాయని పెద్దలు చెబుతారు. అంతే కాకుండా.. గంగాస్నానం చేస్తే అనేక పాపకర్మల నుంచి విముక్తి లభిస్తుంది. ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ సందర్భంగా మౌని అమావాస్య రోజున ఏ సమయంలో స్నానం చేయాలి.. ఏమేం దానం చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
స్నానం ఎప్పుడు చేయాలంటే..
మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మ శాంతి కోసం శ్రాద్ధ కర్మలు, తర్పణం చేయాలి. స్నానం చేయడానికి, దానధర్మాలు చేయడానికి జనవరి 29న బుధవారం ఉదయం 5:25 గంటల నుంచి ఉదయం 6:18 గంటల వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీలు కాని వారు తర్వాత కూడా స్నానం చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు రాత్రి 9:21 గంటల వరకు సిద్ధి యోగం కూడా ఉంటుంది.ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు.
మౌని అమావాస్య రోజున వీలైతే పవిత్ర నదులలో స్నానం చేయాలి.
రావి చెట్టును పూజించి దీపం పెట్టాలి.
ఈ పర్వదినాన శ్రీహరి లక్ష్మీదేవిని, గంగామాతను పూజించాలి.
మౌని అనగా సంస్కృతం లో మౌనం. కావున
మౌని అమావాస్య రోజున మౌన ఉపవాస దీక్షను ఆచరించాలి.
మౌని అమావాస్య వేళ సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి.
మౌని అమావాస్య రోజున ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు అర్ఘ్యంగా సమర్పించాలి.
మౌని అమావాస్య వేళ దానధర్మాల ప్రాముఖ్యత..
శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య సమయంలో పుణ్య నదులలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఈరోజు చేసే దానధర్మాల వల్ల మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు డబ్బుకు లోటు అనేదే ఉండదు. పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తర్పణాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. ఈ పర్వదినాన పేదలకు మీ శక్తి, సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. అలాగే పేదలకు చలికాలం కావున ఉన్ని దుస్తులు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో కూడా సుఖశాంతులు లభిస్తాయి.
మానసిక ప్రశాంతత కోసం..
జ్యోతిష్యం ప్రకారం, మౌని అమావాస్య వేళ చంద్రుడు, సూర్యుడు మకర రాశిలో ఉంటారు. అంతేకాదు శ్రవణా నక్షత్రంలో మౌని అమావాస్య వస్తుంది ఇదే సమయంలో గురుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో పుణ్య నదులలో రాజస్నానం కూడా చేయాల్సి ఉంటుంది. అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు. అందుకే ఈరోజున ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే, వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు చెబుతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది