దీపారాధన
నిత్య దీపారాధన వలన అనేక దోషాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలిగి, సంపదలు పెరుగుతాయి.
దీపారాధన ఎలా చెయ్యాలి?
అలాగే దీపారాధనకు ఉపయోగించే వత్తుల వలన కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం.
మంచి పత్తితో చేసిన వత్తులతో దేవునికి దీపారాధన చేస్తే పితృదేవతల దోషాలు తొలగిపోతాయి.
తామర వత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధల నుంచి ఉపశమనం కులుగుతుంది.
అరటినార వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది.
జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన గణపతి అనుగ్రహం కలుగుతుంది. అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది.
పసుపురంగు వత్తులతో దీపారాధన చేయడం వలన ఉదర వ్యాధులు తగ్గుతాయి.
దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోతాయి. ఇంటిపై ప్రతికూల శక్తులు ఏమీ పనిచేయవు.
సంతాన గోపాలస్వామికి దీపారాధన చేస్తే ఆ స్వామి అనుగ్రహంతో సంతానం కలుగుతుంది.
వత్తులను పన్నీటిలో అద్ది నేతితో దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది.
దీపారాధనలో నూనె శనికి ప్రతినిధి. దీపం సూర్యునికి ప్రతీక. మనకు, మన ఇంటికీ ఉండే దోషాల నివారణార్ధం మనకు వెలుగు (తెజస్సు ) కలగాలని, నూనె హరించినట్లే మన కష్టాలు హరించి, వెలుగు రావాలని దీపారాధన ప్రధాన ఉదేశ్యం. అయితే మనకి తెలియకుండానే దీపారాధన చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటాము. అలా జరగకుండా చూసుకోవడం వలన మన ఇంట్లో సకల సౌభాగ్యాలు కలుగుతాయి .
అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు.
ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి శవం వద్ద వెలిగిస్తారు.
దీపాన్ని ఏకాహారతి లేదా అగరవత్తితో వెలిగించాలి.
దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి.
దేవుడికి ఎదురుగా దీపాన్ని ఉంచరాదు.
దీపం కొండెక్కితే " ఓం నమః శివాయ " అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి.
No comments:
Post a Comment