Tuesday, February 3, 2026

Magha Puranam 27 - మాఘ పురాణం 27 ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

మాఘ పురాణం - 27 వ అధ్యాయం

ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

పూర్యము భృగుమహాముని వంశమందు ఋక్షక యను కన్య జన్మించి దినదిసాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లికుమారుడు  చనిపోయెను.

ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖంచి విరక్తి భావముతో యిల్లు విడిచి గంగానదీతీరమునకు బోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను.

ఆవిధముగా చాల సంవత్సరములు ఆచరించుటవలన ననేక మాఘమాస స్నానఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సుచేసుకొనుచూ  ప్రాణములు విడిచెను. ఆరోజు వైకుంఠ ఏకాదశి అగుటవలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే యుండి తరువాత బ్రహ్మాలోకమునకు పోయైను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవ కార్యములు తీర్చుటకు అప్సర స్త్రీ గా జేసి "తిలోత్తమ“యను పేరుతో సత్యలోకమునకు పంపెను.

అ కాలంలో సుందోప సుందులనే యిద్దరు రాక్షస సోదరులు బ్రహ్మనుగూర్చి ఘోరతపస్సు చేసిరి.
వారి తవస్సుయొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై "మీ కేమి కావలయునో కోరుకొనుడు” అని యనగా "సామీ! మాకు యితరులవలన మరణము కలుగకుండ నుండునట్లు వరమిమ్ము" అని వేడుకొనగా బ్రహ్మ అటులనే యిచ్చితి" నని చెప్పి అంతర్ధాన మయ్యెను.

బ్రహ్మదేవుని వరము పొందిన నా యిద్ధరు రాక్షసులు మహాగర్వముగలవారై దేవతలను హింసించి, మహర్షుల తపస్సులకు భంగం కలిగించుచుండిరి. యజ్ఞ యాగాది క్రతువులలో మాంసం రక్తం పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి.

ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను "మహానుభావా! సుందోప సుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వం గలవారై తపశ్శాలురను బాధించుచు, దేవలోకమునకువచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో బెట్టి, నానాబీభత్సం చేయుచున్నారు. గాన వారి మరణమునకేదైనా యపాయమాలోచించు” మని దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి, తిలోత్తమను పిలిచి "అమ్మాయి! సుందోపసుందులను రాక్షసులను ఎవరివలనను మరణము కలుగదని వరం ఇచ్చియున్నాను. వరగర్వంతో చాల అల్లకల్లోలం చేయుచున్నారు. గాన నీవు పోయి నీచక చక్యముతో వారికి  మరణము కలుగునటల ప్రయత్నించుము” అని చెప్పను, '

తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు వున్న యరణ్యమును ప్రవేశించెను. ఆమెచేత వీణవట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు నా రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమును విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటుపోయిన నటు, యెటు తిరిగిన నటులామెను అనుసరిస్తూ ప్రేక్షకులవలె వెంటాడుచుండిరి. ఆమెను "నన్ను వరింపుము, నన్ను వరింపుము" యని తిలోత్తమను యెవరికి వారు బ్రతిమలాడసాగిరి.

ఓ రాక్షసాగ్రేశ్వరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు యిష్టమే మిరిద్దరూ నాకు సమానులే, నేను మీ యిద్దరి యెడల ప్రేమతోనున్నాను. ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కానిది, గాన నా కోరిక యొకటున్నది. అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను" అని తిలోత్తమ చెప్పెను.

ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిబెట్టి 'నేను బలవంతుడను' '
నేను బలవంతుడను' అని ఇద్దరును తొడలు గొట్టుకొనిరి, భుజములు చరిచిరి. మాటలు చేతలవరకు వచ్చి ఒకరినొకరు త్రోసుకొనిరి గ్రుద్దుకొనిరి, మల్లయుద్ధము చేసిరి, ఇక ఆయుధములు పట్టుదశవచ్చిగదలు పట్టిరి. ముద్గరాలూ ఎత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు డీకొన్నట్లుగా వున్నది. మేఘాలు ఉరిమినట్లుగా ఉరిమి భయంకరముగా యుద్ధము చేసిరి. గదాయుద్గముమాని కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్దములో ఒకరి ఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలూ తెగి క్రిందపడినవి. ఇద్దరూ చనిపోయిరి.

తిలోత్తమను "దేవతలందరు దీవించిరి. ఆమె బ్రహ్మలోకమునకు పోయి జరిగినదందా తెలియ పర్చగాబ్రహ్మ సంతోషించి, త్రిలోత్తమా! నీవు మంచి కార్యము చేసితివి. నీ వలన సుందోప సుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రత పలమే గాన నీవు దేవలోకానికి వెళ్ళు దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచ్చట అప్సరసలందరికంటే  నీవే అధికురాలవగుదువు అని దీవించి పంపెను.

Magha Puranam 26 - మాఘ పురాణం 26 సుధర్ముడు తండ్రిని చేరుట

మాఘ పురాణం - 26 వ అధ్యాయం

సుధర్ముడు తండ్రిని చేరుట

పాపమా బాలుని జాతకము ఎటువంటిదోగాని తన తల్లి అడవిలో పిలిచే చంపబడినది. ఇప్పుడు పెంపుఢుతల్లి అడవిలో విడిచి పెట్టి వెళ్ళిపోయినది. ఇక అ పిల్లవానిని దినరక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసి మొక్క వున్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై బడినందున ఆ రాత్రి అతనికే అపాయమూా కలుగ లేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచునప్పటికి అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు ఆరోదనకు పక్షులు, జంతువులు, మృగములుకూడ రోదనచేసి ఆ బాలునికి రక్షణగా వుంచి ఆహారము తెచ్చి ఇచ్చుచుండెడివి. ఆ బాలుడు అడవిజంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందూచూ ఏ తులసి చెట్టువద్ద పడివుండెనో, ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను.

అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయంగలవాడయ్యెను. ప్రతి దినము తులసిపూజ భగవన్నామ స్మరణ చేస్తూ న"న్ను కాపాడుము తండ్రీ అనాధరక్షకా" అని ప్రార్ధించుచు, ఒకొక్కప్పుడు విరక్తుడై "ఛీ ఎంత ప్రార్ధించినా నాగతి ఇంతేనా? నేను బ్రతికెందుకు? అని దుఃఖించుచుండగా, ఆకాశవాణి "ఓ బాలచంద్రా! నీ విట్లు విచారింపకుము. ఈ సమీపముననే ఒక కోనేరు వున్నది. మాఘమాసము ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానము చేసిన యెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును" అని పలికిన మాటలు ఆకాశమునుండి వినిపించినవి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘస్నానం చేసి శ్రీహరిని స్తుతించెను.

ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా నీ కేమి కావలయునో కోరుకొనుము” అని యనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనాపాలనా చేయువారైనను లేరు. పుట్టినది మొదలు కష్టములేతప్ప సుఖమన్నది ఎరుగను. ఈవనచరములే నన్నురక్షించి పోషించుచున్నవి. గాన మీ సన్నిధానముకు నన్ను తీసుకొని పొండు. మరేమియు అక్కర లేదు.” అని ప్రార్ధించెను.

"ఓయీ రాజనందనా! నీవు ఇంకను బుకొకమునందు ధర్మముగా పరిపాలన చేయవలసిన యవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి, నీకన్నతల్లిని గురించి బెంగతో వున్నాడు, గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము” అని చెప్పి ఆకొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరుని తోడుయిచ్చి సులక్షణుని వద్దకు పంపెను.

అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా వుండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో, యని తన రాజ్యమంతయు వెదకించి తానును వెదకి వారిజాడ తెలియనందున విచారమనస్కుడై రాచ కార్యములు చూడకుండెను. ఆటువంటి సమయములో ముని వెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని యా బాలుని జన్మవృత్తాంతము తెలియ జేయుసరికి సులక్షణ మవో రాజు అమి తానందభరితు డై ఇాలుని కౌగలించుకొని మునీక(రునికి oo కుమాగునికి మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలుచేసి కుమారునికి సుధర్ముడని పేరుపెట్టి పట్టాభిషేకము చేసెను.

Magha Puranam 25 - మాఘ పురాణం 25 సులక్షణ మహారాజు వృత్తాంతము

మాఘ పురాణం - 25 వ అధ్యాయం

సులక్షణ మహారాజు వృత్తాంతము

వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి నూర్గురు భార్యలు గలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు.తన దేశ ప్రజల కేయాపద వచ్చిననూ తనదిగా భావించి తన్నివారణోపాయం చేసెడివాడు.

సులక్షణ మహారాజెంతటి రాజాధిరాజైననూ యెంతటి తరగని సంపత్తికలవాడైన నేమిలాభం? “అపుత్రస్యగతిర్నాస్తి” అనునటుల పుత్ర సంతానము లేక పోవుటచే తనకు గతులులేవు కదా! కాగా తన వంశము ఎటుల అభివృద్ధి చెందును? తనతో తన వంశము అంతరించి పోవలసినదేనా? అని దిగులు చెందుచుండెను.

ఒకనాడు తాను తన రధమెక్కి నైమిశారణ్యమున గొప్ప తపశ్శాలురున్న ప్రదేశమునకు వెళ్ళెను. అచట తపోధనులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికీ సులక్షణ మహారాజు నమస్కరించి యిటుల పలికెను.

"మునిశ్రేష్టులారా! నేను వంగ దేశాధీశుడను. న పేరు సులక్షణుడందురు. నాకు నూర్గురు భార్యలు అయిననేమి? ఒక్క సంతానమైనను కలుగ లేదు. గాన నాకు పుత్రసంతానం కలుగునట్లొనరింపుడు” అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహా రాజు పలుకులాలకు ముని శ్రేష్ఠులు విని జాలినొందిరి. "రాజా! నీవు సంతానహీనుడవగుటకు కారణ మేమనగా-పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రముని పాలించి యుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘమాసస్నానమైనా చేయలేదు. ఒక్క దానమైననూ ఇవ్వలేదు. ఒక బ్రాహ్మణునకు గుమ్మడి కాయ నైనా దానం చేసియున్నచో ఈజన్మలో పుత్రసంతతి కలిగివుండేది. గాన వెనుక కర్మ ఫలంవలననే నీకీ జన్మలో పుత్ర సంతతి కలుగ లేదు. ఎవరు మాఘమాసములో శుద్ధ సప్తమి రోజున కుష్మాండదానము చేయుదురో వారికి తప్పక పుత్రసంతానము కలుగగలదు. ఇందుకు సందేహమేమియు లేదు" అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి “దీనిని నీ భార్యలచే జీనింపచేయుయు” అని పలికిరి. మహా భాగ్యం అని ఫలమును కండ్ల కద్దుకొని యింటికి వెళ్ళిఫోయినాడు.

భర్తరాకవిని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద దీర్చిరి. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి "భోజనానంతరం సేవింపుడు" అని తన గదియుదు ఫలమును భద్రపరచి తాను భోజనసాలకు పత్నులతో వెడలిపోయెను. నూర్గురు భార్యలలో కడ భార్యకు మిక్కిలి ఆశకలిగి మిక్కిలి ఆశకలిగి ఫలమంతయు నేనే భుజించెదనని తలపోసి, రహాస్యమార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆఫలమును భుజించి ఏమియు ఎరుగనిదానివలే అందరితో కలిసి తిరుగుచుండెను.

సులక్షణమహారాజు, అతని భార్యలు భోజనము చేసి మంత్ర ఫలమువద్దకు వచ్చిరి. బంగారు పళ్ళేమందుంచిన ఫలము కనిపించలేదు. రాజుకు యెక్కడ లేని కోపము వచ్చి సింహగర్జన చేసినాడు. మాకేమియు తెలియ" దని అందరూ ప్రమాణముగా చెప్పిరి.

ఎంతో కష్టపడి మహామునుల అనుగ్రహమువలన సంపాదించిన మంత్ర ఫలమును చేతులారా పోగొట్టుకొంటిని అని దిగులు చెంది బెంగతో మంచము పట్టినాడు. మంత్ర ఫలము తినిన చిన్న భార్య భర్త కడకువచ్చి “నాధా! నా అశకొలదీ ఆఫలము నేనే తినివేసినాను క్షమింపు"మని వేడుకొనెను. అప్పటికి రాజు కొంత తృప్తి చెంది, వంశోద్ధారకుడు ఒక్కడైనా పుట్టగలడని ఊరకుండెను. గారాబముతో అమెను చూచెను.

కనిష్ఠ గర్భవతి అయినందున నవమాసములు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెఱ్ఱతో ఓర్వ లేకపోయారు. ఆమె పుత్రవతి అయినచో తమను రాజు సరిగా చూడడని అలోచించి ఆమె గర్భము చెడులాగున, అమె తిను ఆహారములో ఓషధము కలిపి పెట్టినారు, వరపుత్రుడుగా పుట్టుచున్నాడు గనుక గర్భములోని శిశువునకు ఏ అపాయమూ కలుగలేదు. కాని ఓషధముయొక్క తీవ్రతవలన ఆమెకు పిచ్చిఎత్తినది. ఆ పిచ్చివలన ఒకనాటి రాత్రి ఆమె అడవీలోనికి వెళ్ళిపోయినది. అప్పటికి నిండుచూలాలు అయివున్నందున ఆ యడవిలో బండరాతిమీద మగశికువును ప్రసవించినది. ఆమె ప్రసవించినచోట ఒక పులి కాచుకొని వున్నందున, వెంటనే పురిటి వాసనను పసికట్టి వచ్చి ఆమెను చంపితినెను.

పాపమాపసిబిడ్డ రక్తపుమరకలతో నుండి ఏడ్చుచుండెను. రాజహంసలు ఆహారము కొరకు తిరుగుచూ ఆ రాజబిడ్డను చూచి దగ్గరకు వచ్చి రెక్కలతో ఆ బాలుని తడియార్చి వాటిముక్కులతో
మెత్తటి గడ్డి తెచ్చి పరచి దానిపై పరుండబెట్టినవి.ఆ బాలునికి తేనె పండ్లు తినిపించి ఒక ఏడాది వరకు పెంచినవి. ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాటికి నీరు దొరకవని ఆ బాలుని తీసుకొని కొంత దూరములోనున్న తమజాతి హంసలకు అప్పగించివెళ్ళిపోయినవి.

ఆ హంసలు ఆ బాలునికి కావలసిన పండ్లు, తెనె గుజ్జు మొదలగునవి తెచ్చి పెంచుచుండగా ఒక తపస్వి తనయిద్దరి భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానముచేసి దుస్తులు మార్చుకొనుచుండగా హంసలతో తిరుగుచు తప్పటడుగులు వేస్తూ కొలనువద్దకువస్తున్న బాలుని చూచి మక్కువ కలిగి వారి వెంట తీసుకొనిపోయిరి.

రాజకుమారుడు వారి ఆశ్రమములో మూడు సంవత్సరములు గడిపెను. కొద్దికొద్దిగా మాటలు వచ్చుచున్నవి. వానిని చూచి నాకొడుకు అని పెద్దభార్యకు ఈర్ష్యజనించెను. పిల్లవాడు సాయంత్ర సమయమున ఆడుకొనుచుండగా వానిని ఎత్తుకొనిపోయి అడవిలో దిగ బెట్టి వచ్చెను. భర్తవచ్చి పిల్లవాడేని ఆడిగననూ నిజపుసంగతి చెప్పలేదా దుర్మార్గురాలు.

Magha Puranam 24 - మాఘ పురాణం 24 విశ్వామిత్రునికి వానారముఖము కలుగుట

మాఘ పురాణం - 24 వ అధ్యాయం

విశ్వామిత్రునికి వానారముఖము కలుగుట - శూద్ర స్త్రీ వృత్తాంతము 

మాఘమాసమందలి నదీస్నానము మనుజులకే కాకా దేవతలకు గంధర్వులకు కుడా పరమపవిత్రమైనది.

ఒక మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికివచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్యమాత్రం స్నాన మాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక వుండిపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆగంధర్వుడొక్కడే వెళ్ళి పోయాడు.

ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంటచూచెను. ఆమె అందము యౌవ్వనానికి, విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెనుప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా, మరలనాగంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చిచూడగా విశ్వామిత్రుడు, గంధర్వ స్త్రీతో క్రీడించుచుండిరి. 

అదృశ్యమును చూచి మండిపడుచు "నీవు తపస్వివై యుండి కూడా కామతృష్ణ గలవాడవైతివి గాన నీకు కోతిముఖం సంభవించుగాక" యని విశ్వామిత్రుణ్ణి, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు" మని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. 

విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖము కలిగివుండగా నారదుడు ఈ విషయము తెలిసికొని విశ్వామిత్రునికడకు వచ్చి "విశ్వామిత్రా! క్షణభంగుకరమైన తుచ్చ కామవాంఛకు లోనై నీ తపఃశక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము గంగానదిలో స్నానముచేసి నీ కమండలముతో గంగాజలము తెచ్చి ఈపాషాణముపై చల్లుము అని నారదుడు వివరించగా. 

విశ్వమిత్రుడు గంగానదిలో స్నానముచేసి విష్ణువును ధ్యానించి కమాండలముతో నీరు తెచ్చి పాషాణంగామారిన గంధర్వస్త్రీ పై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. విశ్వమిత్రుడు తపస్సుకు విళ్ళిపోయినాడు.

Magha Puranam 23 - మాఘ పురాణం 23 బ్రాహ్మణ కన్యల విమోచనము

మాఘ పురాణం - 23 వ అధ్యాయం

బ్రాహ్మణ కన్యల విమోచనము


కొంత కాలం క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నల్గురకు నల్గురు కుమార్తె లుండిరి వారు నిండుయవ్వనవతులై ఉండిరి.

కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానంచేయట కొక గురుకులవిద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందంచూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమ్ము వివాహము చేసుకోమని బలవంతము చేయగా. ఆ బ్రాహ్మణవిద్యార్దికి విద్యపూర్తి కానందున వారికోర్కె నిరాకరించెను. అంత నా కన్యలు "నీవు పిశాచివి కమ్మని" శపించగా ఆ విద్యార్థియూ "మీరుకూడ పిశాచులగుదురుగాక" యని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలువద్దనే వుంది అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి.

కొంతకాలమునకు ఒక సిద్ధుడాకోనేటి దగ్గరకురాగా నాపిశాచములు తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచరూపం లెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు "వీరందరిచేత మాఘమాసంలో గాయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచరూపం తొలగిపోవును" అని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నాలుగురకూ యధారూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నానమే కారణము.

Magha Puranam 22 - మాఘ పురాణం 22 గంగాజల మాహాత్మ్యము

మాఘ పురాణం - 22 వ అధ్యాయం

గంగాజల మాహాత్మ్యము

ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమాహాత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధికట్టిన చోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి వారధినిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు  సముద్రమును దాటునపుడు శివుని 
ధ్యానించి, రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి  సముద్రమును దాటెను.అర్జునుడు యుద్ధమునకు బయలు దేరేముందు శివపూజచేసి యుద్ధరంగములో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకొనిరి. గనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణు పాదములనుండి పుట్టినదియు, శివుని శిరస్సునుండి ప్రవహించునట్టియు అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలములో స్నానము చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును. గాన గంగాజలము అంత ప్రాముఖ్యత వున్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది యేమనగాఏ నదిలోగాని, సెలయేరులోగాని, చెరువునందుగాని స్నానము చేయునపుడు 'గంగ గంగ గంగ!' అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్ళు చల్లుకొనినచో అది గంగా జలముతో సమానమయినదగును.

గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము గనుక గంగాజలముతో సాటియగు జలము ఈ ప్రపంచమునందెచ్చటనూలేదు. అని గంగాజలమునుగురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించెను.

Magha Puranam 21 - మాఘ పురాణం 21 దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట

మాఘ పురాణం - 21 వ అధ్యాయం

దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట


దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్యరులయొక్కఅంశమున జన్మించినవాడు. అతడుకూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించివున్నారు.

దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు దత్తాత్రేయుని యాశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి "గురువర్యా మీ అనుగ్రహమువలన అనేక విషయాలుతెలిసికొనివుంటిని. మాఘమాసముయొక్క మాహాత్మ్యమును వినియుండ లేదు. గాన మాఘమాసముయొక్క విశిష్టతనుగురించి, మాఘస్నాన ఫలముగురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను" అని దత్తాత్రేయునికోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికన్ను మన్నించి ఈవిధముగా వివరించిరి.

"భూపాలా! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కరప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందున్నపుడు ఆయనదులకు పుష్కరారంభమగును. గనుక అటువంటి నదులయందు స్నానముచేసి దానపుణ్యము లాచరించినయెడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుట నాకుకూడ సాధ్యము కాదు. అందునూ మాఘమాసమందు నదిలో స్నానముచేసిన గొప్పఫలితం కలుగుటయేగాక జన్మరాహిత్యము కలుగును. గనుక ఏమానవుడైననూ మాఘమాసములో నదీస్నానము తప్పకుండ చేయవలెను. అటుల చేయనియెడల ఆ మనుజుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాపఫలము పాపఫలము అనుభవించక తప్పదు.

మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండగా మాఘ స్నానములుచేసి, ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసినవాడైననూ ముక్తినొందగలడు. అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఈవిధముగా చెప్పుచున్నారు.

పూర్వ కాలమున గంగానదీతీరమున ఉత్తరభాగమున భాగ్యపురమును పట్టణము గలదు. అందు నివసించుజనులు భాగ్యవంతులు. గొప్ప వ్యాపారములు చేసి ధనము సంపాదించి అపార కుబేరునివలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు గలడు. అతడును గొప్ప ధనవంతుడు. బంగారునగలు, నాణెములు రాసుల కొలదీ ఉన్నవాడు.

మరికొంత కాలమునకు 
హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే ఇద్దరన్నదమ్ములు తండ్రిఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్ట మొచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరూ చెరొక ఉంపుడుకత్తెను చేరదీసి కులభ్రష్టులయి ఉండిరి. ఒకనాడు పెద్దకుమారుడు దైవవశమున అడవిలో పెద్దపులి నోటబడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటివెంట నురగలు గ్రక్కుచూ చనిపోయినాడు. ఆ విధముగా హేమాంబరునీ కమారులిద్దదూ చనిపోయినారు.

యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్లిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు. అప్పుడా చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు.

అయ్యా, మేమిద్దరము ఒకేతం డ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసి యున్నాము. అయినా అతనికి నరకమేల నాకు స్వర్గమేల ప్రాప్తించును అని అడిగెను. ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయీ, వైశ్యపుత్రా! నీవు నీ మిత్రుని కలుసుగొనుటకు ప్రతీదినము గంగానదిని దాటి ఆవలగట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో నదిని దాటుచుండగా, కెరటాలజల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన పవిత్రుడవైనావు, మరొకవిషయ మేమనగా - నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాతకములుకూడ నశించును. గాన విప్రుని చూచుటవలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియునుగాక, ఆ బ్రహ్మణుడు పఠించు గాయత్రీమంత్రమును కూడ నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరంమీద పడినది గనుగ నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను. అని చిత్రగుప్తుడు వివరించెను.

“ఆహా! ఏమి నాభాగ్యం! గంగాజలము నామీద పడనంత మాత్రముననే నా కింతటి మోక్షము కలిగినదా" అని వైశ్యకుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.

Monday, February 2, 2026

Magha Puranam 20 - మాఘ పురాణం 20 భీముడు ఏకాదశి వ్రతము చేయుట

మాఘ పురాణం - 20 వ అధ్యాయం

భీముడు ఏకాదశి వ్రతము చేయుట

పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి ఏమాత్రము ఆగనివాడు. బండెడన్నము అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలయునని కుతుహలము. కాని, ఒక విషయములో బెంగతో నుండెను, అదేమందువా? ఏకాదశినాడు భోజనము చేయకూడదు కదా! భోజనము చేసిన ఫలము దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకుపోయి "ఓయీ పురోహితుడా! అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్యదినమని అనెదరుగదా! దాని విశిష్టత యేమి అని భీముడు అడిగెను.

“అవును ఆ రోజు అన్ని దినములకంటెను ప్రశస్తమయినది. శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది. గనుక అన్ని జాతులవారును 
ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పాండవ పురోహితుడగు దౌమ్యుడు పలికెను.

"సరే నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమా! నేను భోజనప్రియుడనన్న సంగతి జగద్విదిత మేకదా! ఒక గడియ అలస్యమైన ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశినాడు ఉపవాసముండుట ఎటులని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. గనుక ఆకలి తీరులాగున ఏకాదశీ వ్రతఫలము దక్కులాగున నాకు వివరింపుము" అని భీముడు పలికెను.

భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వునవ్వి “రాజా! ఏకాదశీవ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యము చేసిననూ కష్టములు కనిపించవు. గాన నీవు దీక్షబూనినచో అకలి కలుగదు. రాబోవు ఏకాదశీ అనగా మాఘశుద్ధ ఏకాదశీ మహాశ్రేష్ఠమయినది. దానికిమించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్కసమయంలో మాఘఏకాదశీరోజు పుషమీనక్షత్రముతో కూడినదై యుండును అటువంటి ఏకాదశికి సమానమగునది మరియొకటి లేదు. సంవత్సరము నందు వచ్చు ఇరువదినాల్గు ఏకాదశులతో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము గాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్పఫలితము కలుగును. ఇందు ఏమాత్రము సంశయము లేదు. గాన ఓ భీమసేనా! నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశీవ్రతము ఆచరింపుము. ఆకలి గురించి దిగులుపడకము. దీక్షతో నున్న యెడల ఆకలి ఏమాత్రమూ కలుగదు. 'నియమము' తప్పకూడదు. అని దౌమ్యుడు భీమునకు వివరించెను.

ధౌమ్యునివలన సంశయము నెరవేరుటచే మాఘశుద్ధ ఏకాదశీనాడు అతినిష్టతో వ్రతముచేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధఏకాదశీ 'భీమఏకాదశి' అని పిలుతురు. అంతియేగాక ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రికూడ మాఘమాసమందే  వచ్చును. గాన మహాశివరాత్రి మహాత్మ్యమును గురించికూడ వివరించెదను. శ్రద్దాళుడవై ఆలకింపుము" అని వశిష్ఠులవారు దిలీపమహరాజుతో ఇటుల పలికిరి.

శివరాత్రి మహాత్మ్యము
ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదే విధంగా మాఘచతుర్దశీ అనగా శివచతుర్దశి. దీనినే 'శివరాత్రి'యని అందురు. అత్యంత ప్రీతివంతనుయిన ఇది మాఘమాసము నందు వచ్చు అమావాస్యకు ముందురోజు. దానినే 'మహాశివరాత్రి' యని అందరూ పిలిచెదరు.

ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతిమాసంఅందువచ్చు మాసశివరాత్రి కన్నా అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు నదిలోగాని, తటాకమందుగాని, లేక నూతివద్దగాని స్నానముచేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళీ బిల్హ్వపత్రములతో పూజించవలయిను. అటుల పూజించి, శివప్రసాదము సేవించి, ఆ రాత్రి అంతయు తప్పని సరిగా జాగరణమువుండి మరునాడు అమావాస్య స్నానంకూడా చేసిన యెడల ఎంతటి పాపములు కలిగివున్ననూ అవన్నియు వెంటనే హరించుకుపోయి, కైలాసప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రికంటె మించినది మరియొకటిలేదు. గనుక మాఘమాసము కృష్ణ పక్షము లోవచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. శివరాత్రి దినమున ప్రతివారూ అనగా జాతిభేదములతో నిమి త్తం లేక అందరూ శివరాత్రివ్రత మాచరించి జాగరణ చేయవలయును.

"మున్ను శబరి నదీతీరమునందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను. తనకు వేటతప్ప మరొక ఆలోచన లేదు.కడుమూర్ఖుడు వేటకు పోఫుట, జంతువులను చంపి వాటినికాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుటతప్ప మరేదియు తెలియదు. జంతువులనువేటాడుటలో నేర్పుగలవాడు.క్రూరమృగములు సహితం బోయవానిని చూచి భయపడి పారిపోయెడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు.

ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళెను.ఆనాడు జంతువు లేమియు కంట పడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సంగీకరీంచ నందున పొద్దుగుంకి పోయిననూ అక్కడున్న మా రేడు చెట్టుపైకెక్కి, జంతువుకొఱకు యెదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలియెక్కువగుచు మంచు కురుస్తున్ననూ కొమ్మలను దగ్గరకులాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోనుచుండెను. ఆ కొమ్మలజున ఎండుటాకులు రాలి చెట్టు క్రిందవున్న శివలింగముమీద పడినవి. ఆరోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రాంతట తిండితినక జాగరణ వున్నాడు. తనకు తెలియకపోయిననూ మారేడుపత్రములు శివలింగముమై పడినవి. ఇంకేమున్నది! శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్ధశిరాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్హ్వపత్రములు పడుట తిండి లేక ఉపవాసము వుండుట ఇవన్ని ఆబోయవానికి మేలుచేసినవి.

జరామరణములకు హెచ్చుతగ్గులుగాని, శిశువృద్ధులుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే.

మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యముకలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే  యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకుపోవుచుండగా కైలాసమునుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంతతడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను.

శివుడు పార్వతి, గణవతి,  కుమారస్వామి, నంది, తుంబుర నారదాది గణములతో కొలువు తీర్చి వున్న సమయములో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమావతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశలప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను.

అంతట యముడు మహేశా! చాల దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. నా రాకకు కారణమేమనగా, ఇంతకుముందు మీదూతలు తీసుకు వచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేయుచున్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలి బాధకు తట్టుకొనలేక బిల్హ్వపత్రములను కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా వున్నాడు.కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. గనుక అతనిని కైలాసమునకు తీసుకొనివచ్చుట భావ్యమా? అంతమాత్రమున అతనికి కైవల్యము దొరుకునా!” అని యముడు విన్నవించుకున్నాడు.

యమధర్మరాజా! ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్హ్వపత్రములు నాపైన వేసి, తిండిలేక జాగరణతో నున్న యీబోయవాడుకూడ పాపవిముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడ ఆ వ్రతఫలం దక్కవలసినదే గనుక ఈ బోయవాడు పాపాత్ముడయినను, ఆనాటి శివరాత్రి  వ్రత మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమయినది. అని పరమేశ్వరుడు యమునికి వివరించెను.  యముడు చేయునది లేక చంద్రశేఖరుని వద్దనుండి వెడలిపోయెను.

Magha Puranam 19 - మాఘ పురాణం 19

మాఘ పురాణం - 19 వ అధ్యాయం

ఏకాదశీ మహాత్మ్యము

సంవత్సరములో వచ్చు పండ్రెండు మాసములలోను మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నది లేనిచొట తటాకమందుగాని, తటాకంకూడ అందుబాటులో  లేనియెడల నూతిదగ్గర కాని, స్నానం చేసినంతమాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నియు హరించిపోవును.

పూర్వము అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీతీరమునందున్న యగ్రహారంలో నివశించుచుండెను. ఆతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్శములు చేసి కీర్తి పొందియున్నారు.

అతడు చిన్నతనమునుండీ గడసరి, పెంకివాడు,అతను తల్లిదండ్రుల భయభక్తులవలన  కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టసహావాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను.

అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంత కాలానికి వృద్ధుడయ్యను. తనకున్న ధనంతో తాను  తినడు ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. అయ్యో! నేనెంతటి పాపాత్ముడనైతిని! ధనము శరీరబలము ఉన్నదను మనోగర్వముతో. జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేకపోయినాను గదా యని పశ్చాత్తాపము నొందుతూ నిద్ర పోయెను. అన్నిరోజులు ఒకే విధముగానుండవుగదా! అనాటి రాత్రి కొందరు, చోరులు అనంతుని యింటిలో ప్రవేశించి ధనం, బంగారం యెత్తుకొనిపోయిరి. 

అనంతుడు నిద్రనుండి లేచిచూడగా, సంపదంతా అపహారింపబడినది, అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ణప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునానదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస స్నానఫలము దక్కేను. నదిలోమునిగి తడిబట్టలతో ఒడ్డుకువచ్చెను. చలికి గడగడ వణకి, బిఱ్ఱబిగిసీపోయినాడు, "నారాయణా" అని ప్రాణాలు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుటవలన తాను చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యేను" అని వశిష్ఠుడు తెలియజేసెను.

Magha Puranam 18 - మాఘ పురాణం 18

మాఘ పురాణం - 18 వ అధ్యాయం

పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట

వశిష్ఠ మహాఋషి దిలీపునకు పార్వతీదేవితో వరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును యిట్లు తెలియజేసెను.

“పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంత మందలి వసంతవాడయను నామముగల పెద్దపల్లె యుండెను. అందోక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్య పేరు తాయారమ్మ.

బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగానున్నది. కాని అతడు ఇంకనూ ధనాశకలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్ను డయ్యెను. కాని ఒక్కనాడైనా హరిని ధ్యానించుటగాని, దానధర్మాలు చేయుటగాని యెఱుంగఁడు. అంతేగాక బీదప్రజలకు వారిఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి అనుకున్న గడువుకు ఋణము తీర్చనందున తప్పుడు సాక్షాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీన పరుచుకొనేవాడు.

ఒకనాడు బంగారు శెట్లి గ్రామాంతరము వెళ్ళెను, ఆరోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు  బంగారు శెట్టి భార్యను చూచి "తల్లీ నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది, ఆకాశంలో మేఖాలు  ఉరుము తున్నాయి, చల్ల గాలికి వణికిపోతున్నాను. మియింటివద్ద ఈ రాత్రిగడువనియ్యి. నీకెంతైనా 
పుణ్యముంటుంది. నేను  సద్బ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను, ప్రాతఃకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోదును” అని బ్రతిమలాడెను.

తయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రముచేసి అందొక తుంగచాపవేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె దయార్ద్రహృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మాణుడు సంతసమంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి ఆర్యా! మాఘస్నానము చేసివెళ్ళెదను, అని అన్నారుగదా ఆ మాఘస్నానమనగానేమి? దాని వలన కలుగుఫలితమేమి? సెలవిండు వినుటకు కుతూహలంగా నున్నది. 

అని యనగా నావృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని "అమ్మా! మాఘమాసము గురించి చెప్పుటకు నశక్యముగాదు. ఈ మాఘమాసములో నదియందుగాని, తటాకమందు
గాని, లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తరువాత చన్నీళ్ళుస్నానముచేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళములతోను, పూలతోను, పండ్లతోను పూజచేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘపురాణము పఠించవలయును. ఇట్లు ప్రతిదినము విడువకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన, దానములు యివ్యవలెను. ఇట్లు చేసినయెడల మానవునికున్న రౌరవాది మహా పాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ యీ నెలరోజులూ చేయ లేనివారు, వృద్ధులు, రోగులు ఒక్క రోజయిననూ అనగా ఏకాదశి రోజునగాని, ద్వాదశినాడుగాని లేక పౌర్ణమి దినమునగాని పై ప్రకారముగా చేసినచో సకలపాపములు వైదొలగి సిరిసంపదలు పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను అని చెప్పగా, ఆ బ్రహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలిసంతసించి తాను ప్రాతః కాలమున బ్రాహ్మణునితో నదికిపోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను.

అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికివచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానము గుఱించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియ జేసెను,

భార్య చెప్పినమాటలకు బంగారు శెట్టికి కోపమువచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు 
పటపట కొరికి ఓసీ వెఱ్ఱిదానా! ఎవరు చెప్పినారే నీకీసంగతి? మాఘమాసమననేమి? స్నాన 
మేమిటి ? వ్రతము దానము. లేమిటి? నీకేమైనా పిచ్చిపట్టినదా? చాలు, చాలు అధిక ప్రసంగము  చేసినచో నోరు నొక్కి వేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణాలు పోవుతున్నవి. ఎవరికిని ఒక్కపైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడ బెట్టిన ధనము దానము చేయమనెదవా? చన్నీళ్లు స్నానము చేసి పూజచేసి దానములు 
చేస్తే వళ్ళూ, ఇల్లూ, గుల్లయి నెత్తిపైన చెంగు వేసుకొని "భిక్షాం దేహి" యని అనవలసినదే, జాగ్రత్త వెళ్ళిపడుకో అని భర్త కోపగించినాడు.

ఆ రాత్రి తాయారమ్మకు నిద్రవట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా ఎప్వుడు నదికి వెళ్ళి స్నానము చేతునా? యని ఆత్రుతగా వున్నది కొన్ని ఘడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధబ్రహ్మణునితో మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకఱ్ఱ తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి. అటుల పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్ళలో మునగవలసి వచ్చెను. అటుల మునుగుగుటచే యిద్దరికీ మాఘమాస ఫలము దక్కినది భార్యను. కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు.

కొని సంవత్సరములు జరిగిన తరువాత  ఒకనాడు ఇద్దరకు ఒక వ్యాధి సోకినది. మరికోన్ని రోజులకు యిద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకు పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి 
తీసుకొనిపోవుచుండిరి. తాయారమ్మను తీసుకొనిపోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై  ఎక్కించుకొని తీసుకొనిపోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.

"ఓ యమభటులారా? ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమిటి? నా భర్తను యమలొకమునకు తీసుకుపోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమేగదా" అని వారినుద్దేశించి అడుగగా, "ఓయమ్మా నీవు మాఘమాసములో, నొక దినమున స్నానము చేసితివి అదియు నావృద్ధ బ్రాహ్మణునివలన విని స్నానము చేయగా నీకీ ఫలం దక్కినది. కాని నీభర్త అనేకులను హింసించి,
అన్యాయముగా ధనార్జన చేసి, అనేకులవద్ద అసత్యములాడి నరకమన్న భయంలేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందుననే యమలోకమునకు తీసుకొనిపోవుచుము" అని యమభటులుపలికిరి.

ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒకే ఒక దినమున స్నానము చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు. నన్ను కొట్టుచు నాతో నాభర్త కూడ నీటమునిగినాడుకచా! శిక్షించుటలో యింత వ్యత్యాసమేల కలిగెను? అని అనగా, ఆ యమభటులు సంశయము కలిగి ఏమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్లి జరిగిన సంగతి, ఆమె వేసిన ప్రశ్నయు తెలియజేసిరి.

చిత్రగుప్తుడును వారి పాపపుణ్యముల పట్టికచూడగా సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పౌరపాటునకు 
చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టినికూడా వైకుంఠమునకు తీసుకొని
పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను.

విష్ణులోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ తన భర్తగతి ఏమయ్యేనో యని ఆత్రుతతో వుండగా బంగారుశె
ట్టిని పుష్పకవిమానముమీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి.

రాజా వింటివా! భార్యవలన భర్తకుకూడ యెటుల మోక్షం కలిగెనో? భర్త దుర్మార్గుడ్తె పిసినిగొట్టుగా వ్యవహరించిననూ భార్య యధాలాపంగా ఒక్క రోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినదికదా! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకం మగుననుటలో సందేహంలేదు.

Chandiswarudu - చండీశ్వరుడు

చండీశ్వరుడు కూడా మనలాగే పుట్టాడు పాంచ భౌతిక శరీరంతో అయన పూర్వ నామధేయం విచార శర్మ. అయన వేదం చదువుకొనేవాడు. 

చిదంబర క్షేత్రంలో యచ్చదత్తుడు అనే బ్రాహ్మణుడికి విచారశర్మ అనే కుమారుడు ఉండేవాడు. విచారశర్మ చిన్నతనం నుండి శివభక్తిలో మునిగిపోయి, ఇసుకతో శివలింగాన్ని చేసి పూజించేవాడు.

ఆవుల్ని కాసే గోపాలకుడు ఒక రోజున ఆవుల్ని తోలుకుంటూ వెళుతున్నాడు. తీసుకువెళ్తూ ఒక ఈనిన ఆవు దగ్గరకు వెళ్ళాడు. ఈనిన ఆవు దగ్గరకి వెళ్ళకూడదు. ఆలా వెళితే ఆ దూడకి మనం ఏదో ఇబ్బంది చేస్తామేమో అని రక్షించడానికి మనల్ని పొడుస్తుంది. తప్పు వాడిది, వెళితే అది కొమ్ము విసిరింది. నా మీద కొమ్ము విసురుతావా అని ఆ గోపాలకుడు ఆ ఆవుని కర్ర పెట్టి నడుం మీద కొడుతున్నాడు.

వేదం చదువుకుంటున్న విచార శర్మ పరుగు పరుగున వచ్చి ఆవుని కాయడం అంటే ఇది కాదురా, కొట్టడం కాదు ఆవుని కాయడం అంటే ఆవుని కాపాడటం. నీకు చేత కాదు ఆవుల్ని కాయడం. నేను కాస్తాను ఆవుల్ని ఇది పరమ పవిత్రమైన వృత్తి.

నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను.నీవు ఈ ఆవులను కొట్టవద్దు. తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు. 

బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.

అంత వేదం చదువుకున్నవాడేమో జగత్తునందు ఏ వస్తువును ఎలా చూడాలో తెలిసున్నవాడేమో అయన ఆవుల్ని ముట్టుకునేటప్పటికీ అవి అమృతం  కింద పాలు పట్టేసివట లోపల పట్టి వెళ్లిలా పొదుగు ముట్టుకుంటే చాలట చెంబుడు పాలిచ్చే ఆవులు నాలుగు బిందెల పాలు ఇచ్చేయడం మొదలెట్టాయి.

వాటికీ ఆలా ఇంటికి వెళ్లి యజమానులకు పాలిస్తే తృప్తి పోయిందట. కొన్నాళ్ళకి 'ఛీ' మనం యజమానులకి ఇవ్వడం ఏంటి మహానుభావుడు మన్నని పోషిస్తున్నవాడు విచారశర్మ. అయన ఏం చెసేవాడు. ఆవులన్నిటిని వదిలి వేదం పన్నాలన్నీ అన్వయం చేసుకుంటూ పైకి అవన్నీ చెప్పుకుంటూ కూర్చునేవాడు. ఆ వేదం వింటూ ఉండేవి ఆవులు అందుకని ఈయనకి పాలిద్దామనుకున్నాయట. ఈయన అడిగిన అడగకపోయినా ఆవులు పక్కకి వచ్చి పాలు వదిలేస్తుండేవి. ఉత్తినే వదిలేస్తున్నాయి కదా అని అయన ఏం చేసేవాడు అంటే కుండలు తెచ్చి క్రింద పెట్టేవాడు. ఆలా కుండలు నిండిపోయి పాలు అయ్యేవి. ఆ పాలు తను తాగేవాడు కాదు విచార శర్మ వెంటనే ఆ పక్కనున్న ఏటిలో స్నానం చేసి ఇసుకతో గుడి కట్టేవాడు.అందులో ఇసుకలింగం తయారుచేసేవాడు. ఈ కుండలలో పాలు తీసి ఒక్కొక్క పాత్రతో పాలు పట్టుకొని "నమస్తే యస్తు భగవాన్ విశ్వేశ్వరరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయయా సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః" అంటూ అభిషేకం చేసేవాడు. ఇక్కడ అభిషేకం పూర్తయ్యేది అసురసంధ్య వెల అయ్యేది. ఈయన ఆవుల్ని పట్టుకొని ఇంటికి వెళ్లిపోయేవాడు.

ఒకరోజున అటుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతూ చూసాడు.చూస్తే ఈ పాలన్నీ పిల్లవాడు వాడు ఇసుకలో పోసేస్తున్నట్టు కనపడింది ఆయనకి. అయన వెళ్లి వూళ్ళో చెప్పాడు. మీ ఆవులు ఇంకా పాలు ఇస్తాయి.ఆ విచారశర్మ పాలు తీసి ఇసుకలో పోసేస్తున్నాడు మధ్యాహ్నం పూట్ల అని. విచారశర్మ తండ్రిని పిలిచారు. ఆయన్ని పిలిచి నీ కొడుకు ఆవుపాలు ఇసుకలో పోసేస్తున్నాడు.అందుకనీ నీ కుమారుణ్ణి మందలించమన్నారు. 

ఆ తండ్రి నిజంగా పిల్లవాడు మధ్యాహ్నం పాలు కుండలతో పాలు తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడడం కోసమని రహస్యంగా వచ్చి ఒక చెట్టు కెక్కి దాంట్లో కూర్చున్నాడు. మధ్యాహ్నం అయేటప్పటికీ ఆవులు పాలు పాలిచ్చాయి. ఆ పాలు తీసి పిల్లవాడు గుడికట్టి ఆ ఇసుకలింగానికి పూజ చేస్తున్నాడు. ఇది చూసాడు తండ్రి మహాగ్రహం వచ్చింది.నిజమే వీడు పాలు ఇలా పోసేస్తున్నాడు క్రింద అభిషేకం అనుకోలేదు ఈయన అంతర్ముఖుడు అయి వున్నాడు కొడుకు. ఆ పిల్లవాడిని కర్ర తీసుకొని విపరీతంగా కొట్టాడు. అంతర్ముఖుడైపోయున్నాడేమో ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు. కానీ పక్కన వున్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ముంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు. మనస్సు రమించిపోతోంది. అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తన్నాడు. కుండ పగిలిపోయింది.

అరేయ్ ఏమిరా కుండ పగిలింది అని ఇలా చూసాడు తండ్రి నిలబడివున్నాడు.అపారమైన కోపం వచ్చింది కొడుక్కి. శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నావు. అని అక్కడ వున్నా గొడ్డలి తీసి ఏ పాదములతో తన్నావో ఆ పాదములను తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు. నీవు తండ్రివైనా శివపరధమ్ చేసావు కనుక నీవు శిక్షితుడవు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీదకు విసిరాడు. తండ్రి రెండు కళ్ళు తెగిపోయి ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు. 



ఆ పిల్లవాడి భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై విచారశర్మ నీకు దివ్య దేహం ఇస్తున్నాను నాకోసం ఇంత గొప్ప పని చేసావు కాబట్టి ఇవ్వాళ నుంచి మా కుటుంబంలో నిన్ను అయిదో వాడిగా తీసుకుంటున్నాను. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు.అయిదవ స్థానం చండీశ్వరుడిదే.

నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.నాకోసం ఆవుపాలతో ఇంత తదాత్మ్యంతో అభిషేకం చేసావు కనుక ఇవ్వాళ నుంచి నా కొడుకులకి కూడా లేని అధికారాన్ని నీకు ఇస్తున్నాను. నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోడానికి వీలులేదు. నీకు చూపించి నీవు తినేసిన తరువాత నువ్వు తీసుకెళ్లమని అనుగ్రహిస్తేనే వాళ్ళు తీసుకోవాలి అందుకని నీకు వరమిస్తున్నాను అని అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు.

చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు.ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. 
భావసమాధిలో ఉంటాడు.ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు.

మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయ ప్రసాదాన్ని (శివనిర్మాల్యం) ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు.

శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు.

ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణా ధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు.లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళి పోతుంది.మీకు ఇచ్చినది ప్రసాద రూపము. 
చండీశ్వరుడు అనుగ్రహిస్తేనే ఫలితం వస్తుంది.

Sunday, February 1, 2026

Magha Puranam 17 - మాఘ పురాణం 17

మాఘ పురాణం - 17 వ అధ్యాయం

కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట

"మునిశ్రేష్ఠా నా వృత్రాంమును తెలియజేయుదును గాన ఆలకింపుము.

"నా జన్మస్థానము గోదావరినది సమీపమందున్న ఒక కుగ్రామము.న తండ్రి పేరు హరిశర్మ. నాపేరు మంజుల. నన్ను నాతండ్రి కావేరీతీర్థవాసియగు జ్ఞానానందుడనువానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి, మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్ళకు మాఘము ప్రవేశించినది.

ఒకనాడు నాభర్త "సఖీ"మాఘమాసము ప్రవేశించినది, మాఘమాసము చాల పవిత్రమైనది, దీని మహత్తు చాల పవిత్రమైనది. నేను నాచిన్నతనమునుండీ ప్రతి సంవత్సరమూ మాఘస్నానములు చేయచున్నాను, నీవు నాభార్యవు గావున నీవును ఈమాఘమాసమంతయు యీకావేరీనదిలో స్నానమాచరించును. ప్రతిదినము ప్రాతఃకాలము నిద్రనుండి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానంచేయుము ప్రభాతసూర్యునికి నమస్కరించిన తరువాత నదిఒడ్డున విష్ణువుయుక్క చిత్రపటము పెట్టి పువ్యులతోను మంచి గంధము అగరు ధూపదీపములను వెలిగించి, స్వామికి ఖండశర్కర పటికి బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరింప్తుము, తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము, దీనివలన నీకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా నుండును” అని హితబోధ చేసెను.

నేను అతనిమాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా జూచితిని. నాభర్త చాలా శాంతస్వరూపుడు, అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపమువచ్చి శపించినాడు.

"ఓసీ మూర్ఖురాల! నాయింటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో నుండతగవు మాఘమాసవ్రతము నీకింత నీచంగా కనిపించినదా?
సరియే నీపాపము నిన్నేశిక్షించును, గాన నీవు కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొఱ్ఱలో మండూకరూపంలో  నుందువుగాక" అని నన్ను శపించెను.

వారి సింహగర్జనకు వణకిపోయితిని. వారి శాపమునకు భయపడిపోతిని వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. నాతప్పు నేను తెలుసుకున్నాను. అన్నా ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని” అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే భర్త పాదములపై  బడి రెండుపాదాలు పట్టుకొని "నాకీశాపము ఎట్లు పోవును మరల నిన్నెటుల కలుసుకొందును నాకు ప్రాయశ్చిత్తములేదా అని 
రిపరివిధాల ప్రార్ధించగా నాభర్త కొంతతడవలొచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా గౌతమమహర్షి గోదావరీ నదీతీరమందున్న తన యాశ్రమమునుండి ఉత్తర దేశయాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధదశమినాటికి కృష్ణానదీస్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించిన యెడల ఆ మహర్షి ప్రభావమువలన్న నీకు నిజరూపముకలుగును” అని చెప్పుచుండగా నేను కప్పరూపముదాల్చితిని. నా భర్త కూడా నామూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్నిదినాలకు కృష్ణానదీ తీరాననున్న ఈ రావిచెట్టు తొఱ్ఱలో నివాస మేర్పరచుకొని జీవించుచూ మీరాకకోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు" అని తన వృత్తాంతము గౌతమమునికి తెలియజేసెను.

"అమ్మాయీ! భయపడకుము నీకీశాపము కలిగి వెయ్యేడ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేకకష్టములు పది జీవించినావు. నీభర్తయును ఏకాంతముగా చాలాకాలముజీవించి హరినామసంకీర్తనలు చేయుచు మృతుడయెను. అతడిప్పుడు వైకుంఠములో వున్నడు. నీవు తనమాటలు విననందున ఎంతకష్టపడినావో తెలిసినదిగదా! మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకలసౌభాగ్యాలు పుత్రసంతతి ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధన మైనట్టిది కూడా. దీనికి మించిన మరియొకవ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనదీ వ్రతము ఇటువంటి వ్రతమాచరింపుమని నీభర్త ఎంత చెప్పిననూ వినిపించుకొనవైతివి. నీభర్త దురదృష్టి గలజ్ఞాని. అతని గుణగణాలు సంతసించెడివారు. నిన్ను పెండ్లియాడినతరువాత తన వంశాభివృద్ధి చూసినవలయుననెడి ఆశతో నుండేవాడు. నీవలన. అతని ఆశలన్ని నిరాశలయి పోయినవి. నీ మూర్ఖత్వమువలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసివచ్చెను? నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొఱ్ఱలో జీవించమని శపించినాడు.

ఈ దినము నా సమక్షములో ధైవసన్నిధిని పడినందున నీభర్త శాపము ప్రకారము, మరల నీ నిజ రూపము పొందగలిగినావు. అందునా యిది మాఘమాసము. కృష్ణానదీతీరము కాగా మాఘమాస వ్రత సమయము నీ కన్నివిధాలా అనుకూలమైన రోజు.అందుచే నీవు వెంటనేశుచివై రమ్ము. స్త్రీలుగాని, పురుషులుగాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణుసాన్నిధ్యము పొందుదురు. ఎవరయినా తెలిసిగాని, తెలియకగాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందును, పాడ్యమిరోజుననూ నదీస్నానమాచరించిన యెడల వారి పాపాలు నశించును. మాఘశుద్ధ పొడ్యమినాడు స్నానముననూ అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానముచేసి శ్రీమన్నారాయణుని పూజించి, పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్దించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపూర్ణము వినిన మోక్షప్రాప్తి కలుగును.

అని గౌతమముని ఆ మునివనితతో చెప్పినటుల మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.

Magha Puranam 16 - మాఘ పురాణం 16

మాఘ పురాణం - 16 వ అధ్యాయం

ఆడకుక్కకు విముక్తి కలుగుట

దిలీప మహా రాజా! సుమిత్రుని కథ ఈశ్యరుడు పార్వతీదేవికి చెప్పినరీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను.ఆదెట్లనా-

మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి యగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచునప్పటికీ మాఘస్నానము మొదలిడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణని పూజించిన యెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అణుమాత్రామైననూ సంశయము లేదు. అని పార్వతీ దేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీ మరల ఇట్లు పలికెను,

"నాధా! శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసినయెడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరిగదా! ఆ వ్రత విధాన మెట్టిదో ఎటుల ఆచరించవలెనో వివరముగా తెలియపరచు" డని పార్వతీ దేవి పరమేశ్యరుని కోరినది.

అంతమహేహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాను "మాఘ శుద్ధ దశమినాడు ప్రాతః కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానముచేసి నది ఒడ్డున గాని, ఇంటివద్దగాని, మంటపమువుంచి,
ఆ మంటపమును ఆవుపేడతో అలికి పంచరంగులతో మ్రుగ్గులు పెట్టి మంటవము మధ్య ఎనిమిది  రేకుల పద్మము వేసి అన్నిరకాల పుష్పములు. ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపుమధ్యమున వుంచి గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు 
రాసి పూజించవలెను.

రాగి చెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్ళును ఉంచి దానిపై కొబ్బరికాయపెట్టి, క్రొత్తవస్త్రము నొకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్టించి పూజించవలెను. ఆ మంటపపు మధ్యలో,
సాలగ్రామమును వుంచి యొక్క సద్బ్రాహ్మణుని ఆహ్వానించి, వారిచేత పంచామృతస్నానం చేయించి, తులసి దళముతోను, పుష్పాలతోను పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలెను,

తరునాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రధాన మివ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను.

మాఘమాసస్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షములో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, పప్పు వుప్పు, కాయగూరలు
పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు వుంచిగాని, క్రొత్త గుడ్డలో మూటగట్టిగాని, దానమియ్య వలయును మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని లేక వినునపుడుగాని చేతిలో అక్షతలు వుంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతున్నిపై వుంచి మరికొన్ని అక్షతలు తలపైవేసుకోవలయును. గాన శాంభవీ! మాఘస్నానము చేసి మాఘశుద్ధదశమినాడు. లక్ష్మీనారాయణులను నిష్టతో పూజించిన యెడల ఎటువంటి మహాపాపము లైనను నశించిపోవును, ఇందులకొక ఉదాహరణకూడ తెలియజేసెదను సావధానురాలవై వినుము.

గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధక్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్ఠా గోష్ఠులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసము ప్రవేశించుటనలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిదిచేసిరి.

గౌతమముని తన శిష్యునితో గూడి కృష్ణా నదిలో సూర్యోదయ సమయములో స్నానముచేసి తీరముననున్న ఒక రావి చేట్టువద్దకువచ్చి

శ్లో
॥ మూలతో బ్రహ్మారూపాయ మధ్యతో విష్ణురూపిణే
        అగ్రాతశ్శివరూపాయ, వృక్షరాజాయతే నమః॥

అని రావి చెట్టునకు నమస్కరించి ఆ చెట్టుమొదట అసీనులయి శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమినాడు ఆ చెట్టు మొదట, మండప మేర్పరచి మ్రుగ్గులు, బొట్లు పెట్టి మామిడాకు తోరణాలుకట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము వుంచి పూజంచినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడు కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు, ఆ రావిచెట్టునకు ఎదురుగా కూర్చొనివుండెను. శిష్యులు వారివద్దనున్న దండముతో దానిని బెదరించిరి. ఆ కుక్క అచటినుండి లేచి ఉత్తరదిశవైపు మళ్ళి మరల తూర్పు వైపునకు తిరిగి, ఆవైపునుండి దక్షిణ దిశకు కదలి మరల యధాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరల బెదరించిరి.ముందు చేసినటులే రెండవసారికూడా. ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు మూడవసారి కూడా వారి దండములతో బెదరగొట్టగా మరల ఆకుక్క రావిచెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి మండపము చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసము ఆయివున్నందున వెంటనే అ కుక్క రూవము వదలి ఒక రాజుగా మారిపోయాడు, ఆ రాజు సకలాభరణాలు ధరించినవాడై మునుల ఎదుట నిలబడి మునులందరికి నమస్కరించెను. అక్కడ నున్న కుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి.

"ఓయి! నీ వెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?" అని గౌతముడు ప్రశ్నించాడు.

"మునిచంద్రమా! నేను కళింగరాజును, మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యం గలదు, నా దేశ ప్రజలను ధర్మమార్గమున పరిపాలన చేయుచూవున్నాను. దానధర్మములనిన నాకు అతిప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని. గోవు, భూమి, హిరణ్య సాలగ్రామదానాలు కూడా చేసి యున్నాను, ఎక్కువగా అన్నదానము తిలదానము చేసియున్నాను. అనేక చెరువులు త్రవ్వించినాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించినాను. ధర్మశాలలను కట్టించినాను, పశువులు త్రాగుటకు నీటిగుంటలు త్రవ్వించినాను. నిత్యము బీదప్రజల నిమిత్తము అన్నసత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్య కార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి, దైవవిగ్రహాలను ప్రతిష్టించినను. సద్బ్రాహ్మణులచేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో వున్న అన్ని ధర్మాలను చేసియిన్నాను. కాని నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా మీకు విశద రచెదను వినుడు.

ఒకానొక దినమున ఒక మునిఫుంగవుడు గొప్ప యజ్ఞమొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయాలన్న సామాన్య విషయము కాదు కదా! దానికి కావలసిన, ధనము వస్తుసముదాయము చాల కావలెను. గాన ఆ మునిపుంగవుడు నావద్దకువచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఏదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశలప్రశ్నలడిగితిని. మునియూ నా సత్కారమునకు మిక్కిలి సంతసించి రాజా! నీకు గుప్త విషయములు తెలియ బేయుదును. ఈ మాసములో మఖర రాశియందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తరువాత నీవు స్నానముచేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్మ్యములు చదువుటకాని లేక. వినుటగావి చేయుము. దానివలన వైకుంఠ ప్రాప్తి కలుగును, అంతియేగాక అశ్వమేధయాగము చేసినయెడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలముగాని, తీర్ధస్నానాలు చేయగా వచ్చిన ఫలముగాని లేక దాన
పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘశుద్గ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమీ ఆదివారం వచ్చినగాని ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైనను విడువగలడు, 

ఒక వేళ ఇతరజాతులవారైననూ మాఘమాసమంతట నిష్ఠతో నదీస్నాన మాచరించి దానధర్మాలు మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును, అని ఆ ముని
వర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటుల మాటలాడి ఇట్లాంటిని.

"ఆయ్యా మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును. అవన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరింపను, ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటికాదు. గాన మాఘస్నానములు చేయుటగాని, దాన పుణ్యాదులు జేయుటగాని, పూజానమస్కారములు ఆచరించుటగాని చేయును. చలిదినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంతకష్టము.! ఇక నాకు ఈనీతి బోధలు చెప్పకుడు నాకున్న ఫలముచాలు" అని ఆ మునితో అంటిని.

నా మాటలకు మునికి కోవంవచ్చినది. ముఖం చిట్లించుకొని సరే, చేను చెప్పవలసినది చెప్పితిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు.

అంతట నేను ఆ మునిచేతులువట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసికొనిపోయెను.

ఆ విధముగా. నేను కొంత కాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తరువాత నాకు కుక్క జన్మ వచ్చినది. ఏడుజన్మలూ నాకు కుక్కజన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా ఏడు జన్మలూ బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణలు చేసితినిగాని నా పూర్వ జన్మ నాకుకలిగినది. దైవ యోగమును ఎవ్వరునూ తప్పించ లేరుగదా! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింప వేడెదను" అని రాజు పలికెను.

ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు ఆ ముని అశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తు గటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నియు యదార్ధములే, నీవుకుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడవై ఆలకింపుము.

"నేను నా శిష్యునితో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణితీరమందుండిన కృష్ణానదిలో మూఘమాస మంతయు స్నానములు-జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమనివచ్చి యుంటివి మేమందరము ఈ వృక్షరాజము క్రీంద విష్ణువిగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్కరూపంలోనున్న నీవు దారినిపోతు ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజాసమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా! నీ శరీరము బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యంగా నున్నావు. పరిశుద్ధులమైభగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువుగాని, పక్షిగాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా వున్నందున శిష్యులు నిన్ను తపోదండముతో తరిమిరి. , నైవేద్యము తినవలయుననెడి ఆశతో ఈ మండపం చుట్టుతిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చినావు, అట్లు మూడు పర్యాయనులు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూమును ప్రసాదించినాడు. అనగా మాఘమాసఫలము భగవంతుని మండపము చుట్టు తిరుగుటనలన పునర్జన్మ వచ్చినదన్న మాట. ఇక మాఘమాసమంతయూ నదిలో స్నాసముచేసి భగవంతుని ఛ్యానించి పురాణపఠనము జేసినచో ఎంతటిఫలము వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని వరివారమంతటికీ నమన్కరించుచుండగా అంతలో ఆ రావి చేట్టులోనున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బైటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై బడీ బెకబెకమని అరచి, అటుఇటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపమువద్దకు వచ్చి కొంచెము చూచుచుండగా హఠాత్తుగా కప్పరూపమును వదలి మునివనితగా మారిపోయెను.

ఆమె నవ యౌవ్వనవతి, అతి సుందరాంగి, ఆమె 
గౌతమఋషినిచూడగానే తనకుజ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది.

అంత గౌతమముని-అమ్మాాయీ! నీ వెవ్వరివెవ్వరిదానవు? నీనామదేయమేమి? నీ వృత్రాంతము తెలియజేయుము అని ప్రశ్నించిరి.

గౌతమమునిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము తెలియుటచే యిట్లు చెప్పదొడంగెను.

Magha Puranam 15 - మాఘ పురాణం 15

మాఘ పురాణం - 15 వ అధ్యాయం

శిష్యుడు పశ్చాత్తాపము పొందుట

సుబుద్ధియు అతని కుమార్తె ఆమెభర్త మొదలగువారు మాఘస్నానమువలన కలిగినఫలితముచే సమస్తదోషమును పోగొట్టుకొని సుఖంచిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగాతిరిగి నీలకంఠుని పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించెను.

“నాధా! సుబుద్ధికుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగ తెలియజేసితిరి మరి 
సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడేమైనాడు? అతడే స్థితిలో నున్నాడు? వివరింపుడు వినకుతుహలముగానున్నది” అని
సాంబ
శివుని కోరినది, అందుల కా పార్వతీపతి యిట్లు వివరించెను.

సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు దేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను తానువేసిన పాపమునకు ఫలిత మనుభవించుచుంటినిగదా యని పశ్చాత్తాపమనస్కుడై గురువు గారి వ్రద్దకు పోయి గురువుపాదములపై బడి "గురువరా! నేను మహా పాపినైతిని. క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోబడిపోయి నీకుమార్తెయగు సుశీలతో కూడితిని. అయినను అదినాదోషము కాదు. నేను పూజ్యా ద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని, దారియందున్న ఉద్యానవనంలో నీకుమార్తె చెలికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవుటచూచి నెమ్మదిగా నావెంటవచ్చినది నేను అటు అడవిమధ్యకు పోయి ఒక కోనేటివద్దనున్న చెట్టు క్రింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నాచెంత జేరి నన్ను మంచిమాటలలో వంచించి తన కామవాంఛ తెలియజేసినది. నేనందులకు ఒప్పుకొనలేదు, నన్ను బలవంతము పెట్టినది, నన్నుక్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభంలేదని “నాతో నీవు క్రీడించకుందువేని నీ ఎదుటనే ప్రాణ త్యాగ మొనరించుకొందును” అని చెప్పుసరికి నాకు భయముకలిగి నిజంగా అమె ప్రాణ త్యాగమే చేసుకున్న చో మీరు నన్ను తప్పక దండించెదరని వెరచి ఆమెతో క్రీడించి, ఆమె వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీలేదు. ఐనను నేను మహాపాప మనుభవించుచున్నాను. నేనుకూడ పాపరహితుడ నెటులకాగలనో సెలవిండని బ్రతిమాలెను.

శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వశించి, తన 
కుమార్తెవలె తన శిష్యునిగూడ పాపరహితుని జేయ నెంచి సుమిత్రా! నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నీవును మావలె పావరహితుడవు
కాగలవు, అదెటులనిన నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అచట పన్నెండు సంవత్సరాలు తపస్సుచేసుకొనుము, ఆ తపస్సుచే కలుగు ఫలితమువలన పా
ము మబ్బు విడిపోయినటుల నశించుపోవును. అప్పుడు నీవు ముక్తుడగుదువు అని శిష్యునితో జెప్పెను.

“ధన్యోస్మిధ
న్యోస్మి" మీయజ్ఞప్రకారము నేనిప్పుడే ప్రయాణసన్నద్ధుడనగుచున్నాను” అని గురువర్యులకుదండ ప్రమాణములాచరించి గంగానదితీరమునకు బయలుదేరెను. అటుల ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమన గుట్టలు, కొండలు, సెలయేళ్లుదాటి ఒక  అరణ్యమధ్యమునకు వెడలెను. అచట మనోహరమైన ఆహ్లాదమొనరించు దృశ్యములు కనుపించినవి. కౄరమృగములు సాధు జంతువులు కలసి మెలసి తిరుగుచున్నవి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి, పరస్పర వైరుధ్యములు ఏ మాత్రము
కనిపించలేదు. అచట ప్రకృతి రమణీయత మనస్సున కానంద మొన్నరించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకొందమని ఓక వటవృక్షము క్రింద విశ్రమించి, నలుదిశల పరికించిచూడగా ఒక ఆశ్రమము కనిపించినది.

వెంటనే లేచి ఆయాశ్రమం వద్దకువచ్చితొంగిచూడగా ఆయాశ్రమములో కొంతమంది పురుషులు, స్త్రీలు బాలికలు కాషాయాంబరములు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూపదీప  నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనము చేయుచుండిరి. మధ్యమధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి "హరిహరీ" యని బిగ్గరగా కేకలువేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి. అదృశ్యమంతటినీ సుమిత్రుడు కనులార గాంచెను. పూజపూర్తయిన తరువాత ప్రసాదం అందరూ సేవించిరి. బైట కూర్చుని వున్న  సుబుద్ధికి కూడ  ప్రసాదమివ్వగా “స్వామి! మీరాచరించిన వ్రత మెట్టిది? దీనివలన ఫలిత మేమి కలుగును! మనుజుడు పాపరహితుడగునా? ఈ నాసందియములను దీర్పవేడుచున్నాను” అని వినయముగా ఆమునిసత్తముల నడిగెను.

పాపములచే పీడింవబడు చున్న సుమిత్రుని ప్రార్థనవిని అచటనున్న మనుజులందరూ మాఘమాస మందాచరించవలసిన ధర్మమును అతనికి వివరించుటకుగాను వారిలో నొకరిని నియమించిరి అంత నా మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహాత్మ్యమును ఇట్లు
వివరించెను.

“విద్యార్థీ! మేము చేసినది మాఘమాసమందాచరించవలసిన మాఘమాసవ్రతము ఈ వ్రతము చేయుటవలన ఎటువంటి పాపములు చేసిననూ, వాటి నన్నింటినీ నశింపచేయును. అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికిన్నీ ఈ వ్రతము చేసినంతమాత్రమున అవి యన్నియు పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా, పాపములన్నియు నశించిపోవును. మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో వుండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నదియందు ఏ మనుజుడు స్నానముచేయునో అట్టిమనుజుడు శ్రీహరికి ప్రియుడగును, ఎట్టిదోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘవురాణమును వినుచు ఆ మాసమంతయు నదీస్నాన మొనర్చువారు వైకుంఠవాసులగుదురు. ఆలాగున చేయనివాడు, అసత్యములాడు వాడు, పెద్దలను, గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పర స్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరత్యము చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు అటులనే ఇండ్లు తగులబెట్టుట, అబద్ధ సాక్షములు చెప్పుట, జనసమర్థముండుచోట మలమూత్రములను విడచుట, గుఱ్ఱములను పశువులను కన్యలను ఇతరులకమ్ముట, మొదలగునవి, చేయువారుకూడ బ్రహ్మహత్య చేసినవారితో సమనము. మరియు ధైవ సంబంధమగు ధనమును అపహారించువాడు, ఏ పుణ్య దినములలోనై న శుచిగా స్నానముచేసి దేవుని ప్రార్థించనివాడు, దాన మిచ్చెదనని వాగ్దానముచేసి ఇవ్వనివాడు, బంగారము, వెండి రత్నములు సాల గ్రామములు దొంగిలించువాడును, జాతి భ్రష్టుడై జార చోరత్యములు చేసి వేశ్యయింటికి తిరుగువాడు వీరందరూ బ్రహ్మహత్యాది మహా పాతకములు చేసినవారితో సమానులగుదురు. ఇవిగాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతిసల్పువాడును, తనకన్న వయసులో పెద్దయగు స్త్రీతో రతి సల్పువాడును, జీవహీంసలు చేయువాడును బీదప్రజలను హింసించువాడును, దోపిడీలు చేయవాడును మహాపాతకులు. అట్టివారుకూడ బ్రహ్మహత్య చేసినవారితో సమానుడు. ఇవిగాక తల్లిదండ్రులను హింసించువాడును, వివాహసంబంధములు చెడగొట్టువాడును, నోరులేని పసిపాపల దొంగిలించి ఇతరులకు అమ్మువాడును, శరణుజొచ్చిన వానిని దండించువాడును, ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువాడును, పరధనము అపహరించువాడును, చేసిన మేలు మరచిన కృతఘ్నుడును, తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసినవానిని జూచి ఎగతాళిచేయువాడును బ్రహ్మహత్య చేసినవానితో సమానుడగును.

గాన మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం, ఈ వ్రతం చేయుటనలన మాకు ఏమాాత్రమూ పైన  చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి వున్ననూ అవి నశించిపోవును, ఇది ముమ్మాటికీ నిజం.
అందుచేతనే మేమందరను మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము.

మాఘమాసం ప్రారంభముకాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికిపోయి స్నానంచేసి సూర్యునికి నమస్కరించి? నీళ్ళు విడువవలెను. తరువాత విష్ణుమందిరమునకుపోయి శ్రీహరికి పూజచేసి, తులసితీర్థము ప్రసాదం పుచ్చుకోవలెను. ఆ విధముగా మాసాంతము వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధయాగము చేసినంత ఫలితం కలుగును, మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత గాన యా మాసమందు ఆచరించిన స్నానమువలన కల్గు ఫలము నిచ్చువాడు అతడేగనుక ఆ వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలెను. ఒక వేళ నదీతీరమందుగాని, చెఱువు దగ్గరగాని విష్ణుమందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని విష్ణు పటమునుగాని తీసుకువెళ్ళి నదీతీరమందు తులసీదళంతోను కస్తూరి గంధం, అగరు దూపదీప నైవేద్యం ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణశ్రవణము గావించవలయును.

ఈ విధముగా మాఘమాసమంతా చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మాణునకు వస్త్రములు,  బంగారము ఇచ్చి పిండివంటలతో భోజనము పెట్టాలి, ధనమున్న నారు బ్రాహ్మణా సమారాధన చేసిన యెడల ముకోటిదేవతలు సంతసించుటేగాక యముడు తన దూతలను పంపజాలడు. పునర్జన్మ కలుగదు. ఈ నావచనములు అనత్యములు కావు. ఇప్పటి వరకూ మాఘస్నాన ఫలిత మంతయు విన్నావుగదా! ఇక మాఘమాసం మూడుదినాలు మాత్రమే వున్నది, గాన ఈమూడు దినములలోను ఈనదిలో స్నానముచేసి పూజా కార్యక్రమమునకు సంసిద్ధుడవుకమ్ము" అని మునీశ్వరులు తెలియజేసెను.

అంత సుమిత్రుడు తనగురువగు సుబుద్ధి తన పాపపరిహార్ధము గంగానదీ తీరమునకు బోయి తపస్సు చేసుకో మనిచెప్పినారు. అని మునీశ్వరునితో చెప్పగా మరల ఆ ముని యిట్లు చెప్పినాడు.

"నీగురువు చెప్పిన విషయం యదార్ధము. నీగురుపుత్రికతో గూడి రతిసల్పినావు. అందు నీదోష మేమియు లేకున్ననూ మహాపాపము మాత్రము సంక్రమించింది. అది నిన్ను వెంటాడుచునే యున్నది. తరుణోపాయము చేయనిచో ఈజన్మలోను మరుజన్మలోను కూడ నరక బాధలు తప్పవు. గాన ఈ మాఘమాసమందలి మూడుదినములయినను స్నానముచేసి, శ్రీహరిని పూజించుము, తరువాత నీవు గంగా తీరమునకుపోయి నీ గురుపు చేప్పినవిధముగా భక్తితో తపస్సు చేసిన యెడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు మానవుని మనస్సు స్వార్ధము, చంచలభావము గలది. నీవు ఇంద్రియాలన్నింటిని బంధించి ఏకాగ్రచిత్తముతో లక్ష్మీనారాయణుని ధ్యానించుము" అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడుదినములుండి మాఘస్నానములు చేసి, నదీతీర మందు విష్ణువును పూజించి, పురాణపఠనము గావించెను. తదనంతరము ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి గంగా నదీతీరమునకు తపస్సు జేయుటకై వెళ్లిపోయెను.

Kadaliphala Phalam - కదలీ ఫలం అరటి పండు కాయ ఆకు

కదలీ ఫలం అరటి పండు కాయ ఆకు

భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్లవానుడు. అప్లవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు.

ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు 'కందని' (కందళి) అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ. కానీ ఆమెకు దైవభక్తి ఎక్కువ.ఎప్పుడూ ధ్యానం లో నిమజ్ఞురాలై ఉండేది. ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. దుర్వాసుడు తన భార్యయగు కందనితో సమస్త భోగములు అనుభవింపసాగాడు. తనే కోపి. తనకన్న తన భార్య మరీ కోపి. కలహప్రియ. కానీ ఆమెకు దైవ భక్తి ఎక్కువ. ఆమె ఎప్పడూ దైవభక్తిలో లీనమై ధ్యానం చేస్తూ ఉండేది. పతి భక్తి కన్నా దైవభక్తి ఎక్కువ. దుర్వాస మహాముని యొక్క నిత్యనైమిత్తిక పూజలకు సహాయంచేయక ఎప్పుడూ ధ్యానానిమజ్ఞురాలై ఉండెడిది. కొంతకాలానికి తన తప్పు తెలుసుకొని శని దేవుని ప్రార్ధించి ఎప్పుడూ తన భర్త యొక్క దేవుని సేవలో అర్హమయే ఒక పూజా వస్తువుగా మార్చమని కోరింది. శని దేవుడు ఆమె భక్తికి మెచ్చి ఆమె కోరికని విన్నాడు.

ఒకనాడు దుర్వాసమహర్షి కందళీ దేవితో నేను కొంత సమయం విశ్రాంతి తీసుకొందును సంధ్యాసమయంనకు పూర్వం మేల్కొలుపు అని కోరి విశ్రమించినాడు. ఆమెనూ ధ్యాన నిమజ్ఞురాలై కాలాతీతమును గమనించలేదు. ధ్యానం నుండి బయటకు వచ్చి చూచుసరికి కాలాతీతమైనది. అంత కందళీ దేవి మహర్షిని నిద్ర లేపగా, లేచిన మహర్షి కాలాతీతమును గమనించి కోపోద్రేకుడై ఆ మహర్షి ఆమెను భస్మం చేశాడు. ఆ విషయం మామ యగు ఔర్వ మహర్షికి తెలియగా వచ్చి అల్లుని నిందించి అవమానాల పాలగుదవని శపించాడు. 

కొంతతడవకు శాంతించి జ్ఞాననేత్రం ద్వారా ఇదిఅంతయు శనిదేవుని వల్ల జరిగినదని తెలుసుకొని కోపించి శనిదేవుని శపించ బోవ అంత శనిదేవుడు ప్రత్యక్షమై కందళి దేవి యొక్క కోరికను వివరించి ఆమె భస్మమును పూజకు పనికివచ్చే విధముగా మార్చమని కోరెను. అంత ఆమె యొక్క భస్మరాశిపై పవిత్ర మంత్రజలం ప్రోక్షించి ఆమెను ఒక కదళీ వృక్షంగా మార్చి ఈ వృక్షం యొక్క ఆకులూ,పళ్ళు సమస్తము దేవుని పూజకు అర్హమవుతాయని పలికి తన తపోదీక్షలో లీనమైనాడు.

శ్రీవత్స

Magha Puranam 27 - మాఘ పురాణం 27 ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

మాఘ పురాణం - 27 వ అధ్యాయం ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము పూర్యము భృగుమహాముని వంశమందు ఋక్షక యను కన్య జన్మించి దినదిసాభివృద్ధి పొందుచుండెను...