మృగశిర కార్తె
కార్తెలు: జోతిష్యులు 27 నక్షత్రాలు, గ్రహాల ఆధారంగా జాతకాలు,పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటున్నారు.
అశ్విని నుంచి రేవతి వరకూ సూర్యుడు ఏ నక్షత్రంలోకి ప్రవేశిస్తే ఆ కార్తె మొదలవుతుంది. దాదాపు రెండువారాలకు ఓ నక్షత్రంలో సంచరిస్తాడు ప్రత్యక్షనారాయణుడు. రోహిణి నక్షత్రంలో సంచరించే సమయంలో రోహిణికార్తె అయితే, మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే సమయంలో మృగశిర కార్తె మొదలవుతుంది. అయితే వీరి లెక్కల ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. అలా సంవత్సరానికి 27 కార్తెలు. ప్రస్తుతం రోహిణి కార్తె పూర్తై, మృగశిర కార్తె ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ పనులకు ఈ కార్తె చాలా ప్రత్యేకమైనది.
తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం చివరలో వచ్చే రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు కూడా పగులుతాయని సామెత ఉంది. రోహిణి కార్తె పూర్తి కాగానే తొలకరి చినుకులను మోసుకొస్తుంది మృగశిర కార్తె! జూన్ 8 వ తేదీ నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానున్న సందర్భంగా అసలు మృగశిర కార్తెకు చేప మందుకు సంబంధం ఏమిటి? ఈ రోజున చేపలు ఎందుకు తినాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మృగశిర కార్తె పెట్టగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. అప్పటి వరకు వేసవి వేడితో, గ్రీష్మ తాపంతో అల్లాడిన ప్రజలు మృగశిర కార్తె రాగానే ఉపశమనం పొందుతారు. నైరుతి రుతుపవనాల ఆగమనంతో తొలకరి చినుకులతో మొదలై, భారీ వర్షాలు కురియడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తారు.
ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయ దారులు, గ్రామీన ప్రాంతం వరు ఎక్కువగా వీటిపై ఆధారపడి చేతి వృత్తులు, వ్యవసాయం సాగు ఈ కాలగణనతో కార్తెల అధారంగా వారి పంటల నిర్ణయం, సాగు చేసుకుంటారు.
మృగశిర కార్తె యొక్క ముఖ్యమైన విశేషాలు మరియు ఆచారాలు:
తొలకరి వర్షాలు: ఈ కార్తె ప్రవేశంతోనే ఎండల తీవ్రత తగ్గి, నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది.
వ్యవసాయం: వర్షాలు మొదలవడంతో రైతులు పొలాలను దున్నుకోవడం, విత్తనాలు వేయడం వంటి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు.
చేపల భోజనం: మృగశిర కార్తె మొదటి రోజున చేపలు (చేప ప్రసాదం) తినడం తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన ఆనవాయితీ. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి మరియు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి చేపలు తినాలని పెద్దలు చెబుతారు.
బెల్లం-ఇంగువ: ఈ కార్తె ప్రారంభం రోజున చేపలు తినని శాఖాహారులు బెల్లంలో ఇంగువ కలుపుకుని తినడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉంది. ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు ఉండలుగా చేసుకుని తినేవారు. అంతేకాదు ఈ కాలంలో విరివిగా దొరికే చింతచిగురు పప్పు ఇంగువ పోపుతో తింటే చేపలు తిన్నంత ప్రయోజనం ఉంటుందని పెద్దలు చెబుతారు.
ఇది వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి రక్షణనిస్తుందని నమ్ముతారు.
ఈ కార్తె నుండి వర్షాలు పడతాయని మనవారి భావన. ఇదే సమయంలో మన ప్రాంతంలోకి నైఋతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. పంచాగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్కవర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది.
No comments:
Post a Comment