Tuesday, June 2, 2026

Parijata Puja - పారిజాత పూజ

పారిజాత పూజ

పురాణాల ప్రకారం, క్షీరసాగర మథనంలో ఉద్భవించిన పారిజాతం దేవతా వృక్షం, దీని పువ్వులతో సోమవారం నాడు పరమశివుడిని పూజిస్తే పరమేశ్వరునితో పాటు, లక్ష్మి నారాయణల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

పారిజాత చెట్టుతో సంబంధం ఉన్న మరొక పురాణం ఉంది, మహాభారతంలో పాండవులు తన తల్లి కుంతితో కలిసి అడవిలో నివసించినప్పుడు, కుంతీదేవి శివారాధన చేసేందుకు పువ్వులు లేకపోయే సరికి అర్జునుడి ప్రార్ధన మేరకు దేవేంద్రుడు పారిజాత చెట్టును భూమి మీదకి తెచ్చాడు.

అలా భూమికి వచ్చిన ఈ చెట్టును ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. ఇది చాలా శక్తివంతమైన చెట్టు అని వారి ప్రగాఢ విశ్వాసం.

పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మరియు సముద్ర మథనం నుండి పుట్టిన పారిజాత పుష్పాలతో సోమవారం పూజిస్తే, జాతకంలోని చంద్రదోషాలు తొలగిపోయి, లక్ష్మీ కటాక్షంతో అపారమైన మనశ్శాంతి లభిస్తుంది.

ఈ చెట్టుకి కాసే పువ్వులు చాలా అందంగా తెల్లని రేకులు మరియు నారింజ-రంగు కాడలతో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే సోమవారం పూట ఈ చెట్టును పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

దేవలోకపు పవిత్ర సువాసనలు గల ఈ పూలతో సోమవారం వేద మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం, అర్చన జరిపిస్తే.. ఇంట్లోని దారిద్ర్యం, నెగటివ్ ఎనర్జీ క్షణాల్లో మాయమవుతాయి.

పారిజాత పుష్పాలు రాత్రి పూసి, తెల్లవారేసరికి రాలిపోతాయి; ఇవి అహంకారాన్ని వదిలి, సర్వస్వాన్ని శివుడి పాదాలకు సమర్పించాలనే పరమ సత్యాన్ని సూచిస్తాయి.


పంచమహాపాతకాలను పోగొట్టే పారిజాతపుష్పం
పారిజాత పుష్పాలు 9 రకాలు

1. ఎర్ర (ముద్ద) పారిజాతం

2. రేకు పారిజాతం

3. తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం (ఎక్కువగా అందుబాటులో ఉన్నది)

4. పసుపు పారిజాతం

5. నీలం పారిజాతం

6. గన్నేరు రంగు పారిజాతం

7. గులాబీరంగు పారిజాతం

8. తెల్లని పాలరంగు పారిజాతం

9. ఎర్ర రంగు పారిజాతం

ఎరుపు రంగు పారిజాతంతో విష్ణువును ఆరాధించరాదు. ఎరుపు తమోగుణం. విష్ణువు సత్వగుణం.
పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి. చెట్టు నుండి కోసి వాడరాదు.

పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాక్కోకూడదని వరం పొందినది.

రంగు,..వైశాల్యం,..గుణం,..దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి.

ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు. ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.

భూ స్పర్శ, మృత్తికా (మట్టి) స్పర్శ, జల స్పర్శ, హస్త స్పర్శ తరువాత స్వామి స్పర్శ. ఈ 5 స్పర్శల తోను పంచ మహా పాతకాలను పోగొట్టేదే పారిజాతపుష్పం.

No comments:

Post a Comment

Puri Jagannath Rath Yatra - పూరీ జగన్నాథ్ రథయాత్ర

పూరీ జగన్నాథ్ రథయాత్ర ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ...