Tuesday, June 9, 2026

The Kadamba tree, a favorite of the gods - దేవతలకు ఇష్టమైన కదంబ వృక్షం

దేవతలకు ఇష్టమైన కదంబ వృక్షం


హైందవ సంస్కృతిలో కదంబ వృక్షానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కదంబ మొక్కను రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవాసి అని అంటూ పూజలు చేస్తారు. ఇక హనుమంతుడి పుట్టుకకు మూలం ఈ వృక్షం.

అంతేకాదు కృష్ణుడు, గోపికల చీరలను దాచింది ఈ చెట్టుపైనే. ఈ కదంబ వృక్షం, భగవద్గీత, మహాభారతంలో కూడా ఈ మొక్క గురించి ప్రస్తావన వుంది. కదంబ వృక్షం చాలా పెద్దది. దీని పుష్పాలు గుండ్రంగా బంతి వలె అందంగా ఉంటాయి.

వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తరభారతం లో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతం లో పార్వతీ వృక్షమనీ అంటారు. ఈ వృక్షానికి కృష్ణుడికీ మంచి అనుబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి.

దక్షిణాదిలో అమ్మవారిని 'కదంబవనవాసిని' అంటారు. కదంబ వృక్షానికి 'ఓం శక్తిరూపిణ్యై నమః' అనే మంత్రంతో పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు చెప్పుతున్నారు.

గ్రహదోషాలు తొలగించు కోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి.

హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. దక్షిణాదిలో అమ్మవారిని 'కదంబవనవాసిని' అనీ, అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు 'నారాయణా నారాయణి' లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు.

No comments:

Post a Comment

Sri Trivikrama Swamy Temple – Cherukuru, Bapatla District, Andhra Pradesh - శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయం – చేరుకూరు, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్

శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయం – చేరుకూరు,  బాపట్ల జిల్లా,  ఆంధ్రప్రదేశ్ విష్ణుమూర్తి ఐదవ అవతారమైన వామనావతారానికి (త్రివిక్రమ స్వామి) సంబంధించి...