Tuesday, June 9, 2026

Varaha Lakshmi Narasimha Swamy Temple, Simhachalam, Visakhapatnam - వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, సింహాచలం, విశాఖపట్నం

వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, సింహాచలం, విశాఖపట్నం

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న సింహాచలం కొండలపై ఉంది.

ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కొండ (సింహాచలం) పై ఉంది.

సింహాద్రి అప్పన్నకు చందనోత్సవం

'పాహీ! శ్రీమన్నారాయణ!' అని ప్రహ్లాదుడు పిలవగానే, గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామివారి పాదాలు పాతాళంలోకి దిగబడ్డాయి. అందుకే వరాహ నారసింహుడి పాద దర్శనం భక్తులకు లభించదు.

ప్రహ్లాదుడి తదనంతరం కాలక్రమంలో వరాహ నారసింహకృతి మట్టిపుట్టలో నిక్షిప్తమైంది. ఆ తర్వాత కొంతకాలానికి పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఊర్వశి తన దివ్యదృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది.

ఆ రాత్రికి అక్క డే బస చేయడంతో...స్వామివారు కలలో కనిపించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని ఉత్సవం చేయాలని కోరాడు. పురారవ చక్రవర్తి ఎంత వెతికినా ఫలితం ఉండదు.

రెండో రోజు మళ్లీ కనిపించిన స్వామివారు తాను 12 అడుగులున్న పుట్టలో ఉన్నానని చెబుతాడు. అలా స్వామివారి విగ్రహాన్ని వెలికితీసి వైభవంగా చందనోత్సవం నిర్వహించినట్టు చెబుతారు.

స్వామి 12 అడుగుల పుట్టలో వచ్చినందుకు గుర్తుగా ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని సమర్పిస్తూ వస్తున్నారు.

పురూరవుడితో పునరుద్ధరణ జరిగిన చందన సేవ ఏటా అక్షయ తృతీయనాడు వైభవంగా సింహాద్రిపై కొనసాగుతోంది.

ఆలయ ప్రత్యేకతలు:
నిజరూప దర్శనం ఏడాదికి ఒక్కరోజే: ఇక్కడ స్వామివారు వరాహ మరియు నరసింహ (సింహం-మనిషి) రూపాల కలయికగా ఉంటారు. స్వామివారి ఉగ్రరూపాన్ని చల్లబరచడానికి ఏడాది పొడవునా చందనం పూతతో కప్పి ఉంచుతారు.

అక్షయ తృతీయ:
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజున మాత్రమే ఈ చందనాన్ని తీసివేసి, స్వామివారి అసలు రూప (నిజరూప) దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు.

కప్ప స్తంభం: ఆలయంలో ఉన్న 'కప్ప స్తంభం' చాలా ప్రసిద్ధి చెందింది.

శిల్పకళ: ఈ ఆలయం ఒడిశా (కళింగ) మరియు ద్రావిడ నిర్మాణ శైలుల అద్భుత కలయికతో నిర్మించబడింది.

No comments:

Post a Comment

Sri Trivikrama Swamy Temple – Cherukuru, Bapatla District, Andhra Pradesh - శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయం – చేరుకూరు, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్

శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయం – చేరుకూరు,  బాపట్ల జిల్లా,  ఆంధ్రప్రదేశ్ విష్ణుమూర్తి ఐదవ అవతారమైన వామనావతారానికి (త్రివిక్రమ స్వామి) సంబంధించి...