Sunday, January 4, 2026

Dampatula Tambulamu Nomu Katha - దంపతుల తాంబూలము నోము కథ

దంపతుల తాంబూలము నోము కథ

ఒక రాజుభార్య దంపత తాంబూలము నోముపట్టి ఉల్లంఘన చేసెను. అందువల్ల భార్యాభర్తల కెడబాటు వచ్చెను. సిరిసంపదలు కూడ తక్కువయ్యెను. ఇట్లు కొన్నాళ్ళుండి సహించలేక యా చిన్నది అడవిలోకివెళ్ళి అచ్చట ఏడ్భుచూ కూర్చుందెను. భూమి పై విహారానికి వచ్చిన  పార్వతీపరమేశ్వరులు ఆమెను చూచి ఎందులకు ఎడ్చుచున్నా వని యడుగగా,  అందుకు ఆమె భర్త దేశాంతర మెళ్ళినాడు. సిరిసంపదలు తగ్గిపోయినవి. అందుచేత విచారించుచున్నానని చెప్పెను.

అప్పుడు పార్వతీ పరమేశ్వరులు నీవు క్రిందటి జన్మమున దంపత తాంబూలము నోముపట్టి ఉల్లంఘనము చేసినావు. అందుచేత నీకీ విచారము కలిగినది. ఇప్పుడీ కథ చెప్పి అక్షింతలు వేసికొని, ఏడాది తాంబూలమిచ్చి ఎడాది అయిన తరువాత ఉద్యాపన చేసికొనవలసినదని చెప్పి యదృశ్యులైరి. 

ఆ ప్రకారం రాజు భార్య నోముపటగా దేశాంతరం వెళ్లిన భర్త తిరిగి ఆమె చెంతకు చేరెను. 
సిరిసంపదలతో సుఖముల ననుభవించెను.

ఉద్యాపనము: దంపతులకు తలంటి నీళ్ళుబోసి మున్నూట అరువది ఆకులు, మున్నూట అరువది పోకలు, తాంబూల సరంజాము ఒక పళ్లెమైనను, వొందానయైనను కొని దానిలో నుండి దంపతలకు భోజనము పెట్టి అందివయ్యవలెను. 

కధలోపమైనను వ్రతలోపముకాకూడదు. భక్తి తప్పినను ఫలము తప్పదు.

No comments:

Post a Comment

Gayatri Mahima - Goutamudi Katha - గాయత్రీ మహిమ - గౌతముడి కథ

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ మహిమ - గౌతముడి కథ జనమేజయా! ఒకప్పుడు ప్రాణికోటి కర్మవశాన పదిహేను సంవత్సరాల కరువు వచ్చింది. వానలు లే...