Monday, December 29, 2025

Mukkoti Ekadashi - ముక్కోటి ఏకాదశి - ఉత్తర ద్వార దర్శనం

ముక్కోటి ఏకాదశి 
వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఏకాదశి నాడు శ్రీ హరివిష్ణువును ఆరాధిస్తారు. ఉత్తర భారతదేశంలో, పౌషమాసంలో వచ్చే ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తులు మోక్షాన్ని (మోక్షం) పొంది స్వర్గలోకానికి చేరుకుంటారని నమ్ముతారు. ఈ ఉపవాసం జీవితంలో సానుకూలతను తెస్తుంది మరియు ప్రాపంచిక ఆనందాలతో నింపుతుంది.

విష్ణువు భక్తులకు ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులు ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువు అవతారములను పూజిస్తారు. 

వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున సముద్ర మథనం జరిగింది. ఈ సముద్ర మథనం సమయంలో అమృతం ఉద్భవించింది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున మరణించిన వ్యక్తులు జీవిత మరియు మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని మరియు వైకుంఠ ప్రాప్తి పొందుతారని విశ్వసిస్తారు.  

ఈ ఏకాదశిని వైకుంట ఏకాదశి అని కూడా అంటారు. పూర్వం వైఖానసుడు అనే ఒకరాజుకి.. ఒకనాడు తన తండ్రి నరకం లో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కల వచ్చింది. అందుకు వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి మోక్షదైకాదశి అని పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కులుగుతుందని పెద్దలు చెబుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశిని ప్రముఖంగా జరుపుకుంటారు. శ్రీరంగం మరియు తిరుపతి ఆలయ వేడుకలు ప్రధానంగా వైకుంఠ ఏకాదశికి ప్రసిద్ధి చెందాయి. వైకుంఠ ఏకాదశిని ప్రధానంగా శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరుపుకుంటారు మరియు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున లక్షలాది మంది భక్తులు విచేస్తారు. ఈనాడు నామ్పెరుమాళ్ ను విలువైన పూలతో అలంకరిస్థారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలంలోని సీతా రామచంద్రస్వామి ఆలయంలో ఈ ఏకాదశిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున రాముడు మరియు లక్ష్మణ విగ్రహాలను ఊరేగింపుగా బయటకు తీస్తారు.

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః 
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః

ఉత్తర ద్వార దర్శనం
ముక్కోటి ఏకాదశి రోజు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి..? ఉత్తర ద్వార దర్శనం లోని అర్ధం, పరమార్ధం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మెదటినెల. దీనినే సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, మన పెద్దలు సంవత్సరకాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదనీ, ఆకాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయి. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు.

అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు. ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే ‘హరివాసరమ’ని, ‘హరిదినమ’ని, ‘వైకుంఠ దినమ’ని అంటారు. 

ఈ ఒక్క ఏకాదశి ‘మూడు కోట్ల ఏకాదశుల’తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. 

సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...