Friday, July 31, 2026

Aachamanaadhikam - ఆచమనాదికం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - ఆచమనాదికం

నారదా! శుద్ధమూ స్మార్తమూ పౌరాణమూ వైదికమూ తాంత్రికమూ శ్రౌతమూ ఆని ఆచమనం ఆరువిధాలు. మలమూత్రశౌచం తరవాత చెయ్యవలసినది శుద్ధాచమనం. ఆచాంతంలో (వైదికవిధుల్లో) స్మార్త పౌరాణికాచమనాలూ బ్రహ్మయజ్ఞాదుల్లో శ్రౌతవైద్దికాచమనాలూ ఆస్త్రవిద్యాదిసమయాల్లో తాంత్రికాచమనమూ చెయ్యాలి.

ఆచమించిన తరవాత ఓంకార గాయత్రిని జపిస్తూ శిఖను ముడివేసుకోవాలి. పునరాచమనం చేసి గుండెలనూ చేతులనూ బుజాలనూ మార్జించుకోవాలి. తుమ్మడం ఉమ్మడం పళ్ళుకుట్టుకోవడం అసత్యమాడటం పతితులతో సంభాషించడం - ఇలాంటివి చేసినప్పుడు కుడిచెవ్విని స్పృశించుకోవాలి, అగ్ని జల వాయుదేవతలూ సూర్యచంద్రులూ చతుర్వేదాలూ బ్రాహ్మణుడి కుడిచెవిలో ఉంటాయి.

అటుపైని నదికో నూతికో చెరువుకో వెళ్ళి ప్రాతఃస్నానం చెయ్యాలి. శరీరాన్ని పరిశుభ్రపరచుకోవాలి. నవద్యారాల్లోనూ మలినం ఉంటుంది. తోముకుని కడిగి శుభ్రపరచాలి. అగమ్యాగమన - ప్రతిగ్రహ - రహస్యాచరిత పాపాలన్నీ స్నానంతో ప్రక్షాళితమవుతాయి. స్నానం చెయ్యకుండా ఆచరించే సత్కర్మలన్నీ నిష్ఫలమవుతాయి. కనక నిత్యమూ ప్రాతఃస్నానం చెయ్యాలి. అదీ దర్భలు చేతబట్టుకునే చెయ్యాలి. హోమకాలం దాటిపోకుండా ప్రాతఃస్నానం ముగించుకోవాలి. స్నానంకాగానే సంధ్యావందనమాచరించాలి. ఏడురోజులపాటు ప్రాతఃస్నానం చెయ్యకపోయినా, మూడురోజులు సంధ్యవార్చకపోయినా, పన్నెండు రోజులు అగ్నికార్యం ఎగ్గొట్టినా ద్విజుడు కులభ్రష్టుడవుతాడు.

నారదా! గాయత్రికన్నా గొప్పమంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదు. గానం చేసేవాడిని (జపించేవాడిని) కాపాడుతుంది. కనక గాయత్రి - అన్నారు.

ముమ్మారు ప్రాణాయామం చేసి ప్రణవాక్షర సహితంగా వ్యాహృతిత్రయ సమన్వితంగా (భూర్భువస్స్వః) గాయత్రీమంత్రాన్ని జపించాలి. స్వధర్మనిరతుడూ శ్రుతిసంపన్నుడూ అయిన బ్రాహ్మణుడు వైదికగాయత్రినే జపించాలి తప్ప లౌకికమంత్రాన్ని (వ్యాహృతిరహితం) జపించకూడదు. మంత్రజపంతో కలిపి ప్రాణాయామంచేస్తే అది సగర్భమవుతుంది. ఆమంత్రకంగా ధ్యానమాత్రంగా చేస్తే అగర్భమంటారు. స్నానాంగంగానే దేవ ఋషి పితృతర్పణాలు పూర్తిచేసి గట్టుకి వచ్చి శుభ్రవస్త్రాలు ధరించాలి. అప్పుడూ - విభూతి ధారణ, రుద్రాక్షధారణ. ఇదే వరసలో చెయ్యాలి.

రుద్రాక్షధారణ




Souchakriya - శౌచక్రియ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - శౌచక్రియ

నారదా! వేదాలూ వేదాంగాలూ వల్లించినా ఆచారహీనుడైతే అతడిని అవి ఏవీ కాపాడవు. మృత్యుకాలంలో వదిలేస్తాయి. రెక్కలు వచ్చిన పక్షులు గూడును విడిచినట్లు వెళ్ళిపోతాయి. కనక ఎంతటి పండితుడైనా సరే బ్రాహ్మాముహూర్తంలో(రాత్రి చివరిజాములో) లేవాలి. వేదాధ్యయనం చెయ్యాలి. కొంతసేపు ఇష్టదేవతను ధ్యానించాలి. యోగి అయినట్టయితే ప్రాణాయామాదికం నిర్వహించాలి. జీవుబ్రహ్మైకతను సాధించాలి. ఆ క్షణంలోనే జీవన్ముక్తుడవుతాడు.

రాత్రివేళలో చివరి యాభై అయిదు ఘటికలు ఉషఃకాలం. యాభై ఏడు ఘటికలు అరుణోదయం. యాభై ఎనిమిది ఘటికలు ప్రాతఃకాలం, అటుపైని ఆరవై ఘటికలకు సూర్యోదయం. (సూర్యోదయం నుంచి సూర్యోదయానికి అరవై ఘటికలు). ప్రాతఃకాలంలో బ్రాహ్మణుడు కాలకృత్యాలు తీర్చుకోవాలి. అందుకోసం నైఋతిదిశగా అమ్మువేటు దూరం వెళ్ళాలి. (బాణం వేసినంత దూరం). బ్రహ్మచారి అయితే ఆ సమయంలో యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి. గృహస్థుగానీ వానప్రస్థుడుగానీ అయితే నివీతంగా వెనక్కి వేసుకోవాలి. (వీపుమీద దండలా వేలాడేసుకోవాలి). నేలమీద గడ్డిపరకలు ఒత్తుగా కప్పి నెత్తిమీద అంగవస్త్రం వేసుకుని మౌనం పాటిస్తూ ఉమ్ములు వెయ్యకుండా శ్వాసను నియంత్రించి (ముక్కకుండా) మల మూత్ర విసర్జన చెయ్యాలి. దున్నిననేలమీదగానీ నీళ్ళల్లోగానీ చితిలోగానీ పర్వతాలమీదగానీ పాడుపడిన గుడులలోగానీ పుట్టల మీదగానీ పచ్చికబయళ్ళలోగానీ ఈ విసర్జనలు చెయ్యకూడదు. అలాగే ప్రాణులమిదా గుంటలలోనూ నడదారులలోనూ చెయ్యరాదు. నిలబడి విసర్జించకూడదు.

నారదా! సంధ్యావందన సమయాల్లోనూ భోజన సమయంలోనూ పళ్ళుతోముకుంటున్నప్పుడూ పితృకార్యం చేస్తున్నప్పుడూ దైవకార్యం చేస్తున్నప్పూడూ మలమూత్ర విసర్జనల్లోనూ సంభోగసమయంలోనూ గరుసన్నిధిలోనూ యజ్ఞయాగాదుల్లోనూ దానాలు చేస్తున్నవేళల్లోనూ బ్రాహ్మణుడు మాట్లాడకూడదు. మౌనంగా ఆ పనుల్ని నిర్వహించాలి.

బహిర్భూమికి కూర్చోబోయేముందు - దేవతలారా! ఋషులారా! పిశాచోరగరాక్షసులారా! కంటికి కనిపించని ప్రాణులారా! ఇక్కడనుంచి తొలగిపాండి. నేను మలమూత్రవిసర్జన చేస్తున్నాను - అని ప్రకటించాలి. తొలగిపామ్మని ప్రార్థించాలి.

వాయువు అగ్ని విప్రుడు సూర్యుడు జలాశయం గోవులు - వీటిని చూస్తూగానీ వీటి ఎదుటగానీ విసర్జన చెయ్యకూడదు. పగటి వేళలో అయితే ఉత్తరముఖంగానూ రాత్రివేళలో అయితే దక్షిణముఖంగానూ కూర్చుని విసర్జించాలి. విసర్జించాక వాటిమీద మట్టిగానీ ఎండుటాకులుగానీ గడ్డీగాదమూగానీ కప్పాలి. మూత్రం చుక్కలు దారిపాడుగునా పడకుండా తగిన జాగ్రత్త తీసుకుని (ఎత్తిపట్టుకొని) నీళ్ళ దగ్గరకు వెళ్ళాలి. చెంబుతో నీళ్ళు ముంచి తీసుకుని వేరేచోటుకి వెళ్ళి కడుక్కోవాలి. మట్టిరాసుకుని కడుక్కోవాలి. గట్టున ఉండే శ్వేత - రక్త - కృష్ణ - పీతవర్ణ మృత్తికలు పనికివస్తాయి. బ్రాహ్మణుడు తెల్లమట్టినే ఉపయోగించాలి. మిగతా వారికి ఏదైనా ఫరవాలేదు. తెల్లమన్ను దొరకనప్పుడు దొరికిన మట్టినే బ్రాహ్మణుడూ ఉపయోగించాలి. మట్టితో రుద్దుకోనిదే శుద్దికాదు. అయితే నీళ్ళల్లోనుంచిగానీ గుడినుంచిగావీ పుట్టనుంచి గానీ ఎలకల కలుగుల్నించిగానీ శౌచవిధికోసం మట్టిని తియ్యరాదు. ఒకరు ఉపయోగించగా మిగిలిన మట్టి సుతరామూ పనికిరాదు.

మూత్ర విసర్జనకన్నా రెండురెట్టు మలవిసర్జనకూ, మూడురెట్లు మైథునానికీ మృత్తికా శౌచం చేసుకోవాలి. లింగానికి ఒకటీ చేతికి మూడూ కాళ్ళు రెండింటికీ రెండూ మట్టిముద్దలు పులుముకోవాలి. ఇది మూత్రశౌచం. మలవిసర్జన శౌచానికి రెట్టింపు. లింగదేశంలో రెండూ గుదప్రదేశంలో అయిదూ చేతికి పదీ కాళ్ళు రెండింటికీ కలిపి ఏడూ మట్టిముద్దలు అవసరమవుతాయి. ముందుగా ఎడమపాదానికీ తరవాత కుడిపాదానికీ మృత్తికను పులుముకోవాలి. శౌచక్రమం ఇది. గృహస్థులకన్నా రెట్టింపు బ్రహ్మచారులకూ మూడురెట్లు వానప్రస్థులకూ నాలుగురెట్లు యతీశ్వరులకూ ఈ శౌచం అధికంగా అవసరం. ఒక్కొక్క మట్టిముద్దా కనీసం రాచ ఉసిరికాయంత ఉండాలి. ఎప్పటికప్పుడు ఒక్కొక్క ముద్దగానే తీసుకోవాలి. (ఒకేసారి పెద్దమట్టిముద్దను తీసేసుకుని చిన్నఉండలు చేసి పులుముకోకూడదని)

పగటిపూట అయితే ఇంత శౌచమూ చేసుకోవాలి. రాత్రిపూట ఇందులో సగం, ఆతురుడైతే ఇంతకన్నా సగం, మార్గమధ్యంలో అయితే అంతకన్నా సగమూ శౌచం పాటిస్తే సరిపోతుంది. అశక్తులూ బాలబాలికల విషయంలో మరింత మినహాయింపు ఉంది. మలమూత్రాల దుర్వాసన తొలగిపోయేట్టుగా మట్టి పులుముకుని ప్రక్షాళన చేసుకుంటే చాలు. ఇది అన్ని వర్గాలవారికీ వర్తించే శౌచవిధి అని మనువు చెప్పాడు.

శౌచక్రియ ఎప్పుడూ ఎడమచేతితోనే చెయ్యాలి. కుడిచెయ్యిని ఉపయోగించకూడదు. శరీరంలో బొడ్డుకి క్రిందిభాగాన శుద్దిచెయ్యవలసివచ్చినప్పుడు ఎడమచెేతినీ, బొడ్డుకి పై భాగాన్నయితే కుడిచేతిని ఉపయోగించాలని నియమం.

మలమూత్ర విసర్జన చేసే చోటుకి జలపూర్ణపాత్రను తీసుకువెళ్ళకూడదు. తెలియక అలా తీసుకువెడితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కేవలం నీళ్ళుతాగి మూడురాత్రులు పస్తులుండి తరువాత జపం చెయ్యాలి. ఆలాగని శౌచకర్మకు ఆలస్యం చెయ్యకూడదు. దేశం కాలం ద్రవ్యం శక్తి ఉపపత్తి - వీటిని చూసుకుంటూ శౌచం జరుపుకోవాలి.

మలవిసర్జనకు పన్నెండుసార్లూ మూత్రవిసర్జనకు నాలుగుసార్లూ తగ్గకుండా నీటిని గండూషించాలి. పుక్కిలించిన నీటిని తలవంచి ఎడమవైపుకి ఉమియాలి. అటుపైని ఆచమించి శ్రద్దగా దంతధావనం చేసుకోవాలి. ముళ్ళుండి పాలుగారే చెట్టునుంచి పన్నెండు అంగుళాలు పొడుగుండేట్టు చూసి పుల్లను విరుచుకోవాలి. చిటికెన వేలంత లావుండాలి. ఒక కొసని కుచ్చులాగా నలగగొట్టిగానీ నమిలిగానీ పళ్ళు శుభ్రంగా తోముకోవాలి. కడిమి - బర్రింక - మామిడి - మేడి - బొద్దుగ - వేప - రేగు పుల్లలు ప్రశస్తం. పుల్లను విరుచుకునేటప్పుడు చెట్టును అన్నాద్యాయ మంత్రంతో ఇలా ప్రార్థించాలి - నా అదృష్ట విశేషంవల్ల ఓషధీపతి చంద్రుడు వచ్చాడు. నా ముఖం కడుగుతున్నాడు. ఓ వనస్పతీ! ఆయుర్దాయం బలం యశస్సు వర్చస్సు సంతానం పశుసంపద ధనసంపద బ్రహ్మజ్ఞానం మేధాశక్తి నాకు కలిగించు.

అన్నాద్యాయ వ్యూహధ్వంసే సోమో రాజాయమాగమత్‌ ।
స మే ముఖం ప్రక్షాళ్యతే యశపా చ భగేవ చ ॥

ఆయుర్బలం యశో వర్చః ప్రజాః పశువసూని చ

బ్రహ్మప్రజ్ఞాం చ మేధాం చ త్వం నో దేహి వనస్పతే ॥

దంతకాష్ఠం దొరకనప్పుడుగానీ, దంతధావనం చేసుకోరాని రోజుల్లోగానీ నీటిని పన్నెండుసార్లు గండూషించాలి. బాగా పుక్కిలించి ఉమియాలి. పాడ్యమి అమావాస్య (దర్శ) షష్ఠి నవమి ఏకాదశి రవి వారాల్లో దంతాలకు పుల్ల తగిలించకూడదు. ఏడుతరాలు నశిస్తాయి.

దంతధావనమయ్యాక నోరు పుక్కిలించి కాళ్ళు కడుక్కుని పరిశుభ్రజలాన్ని ముమ్మారు ఆచమించాలి. తడి బొటనవేలూ చూపుడువేళ్ళతో రెండుసార్లు నాసికాపుటాలను తుడుచుకోవాలి. అంగుష్ఠానామికలతో కళ్ళూ చెవులూ తుడుచుకోవాలి. అంగుష్ఠకనిష్ఠికలతో బొడ్డు తుడుచుకోవాలి. తడి అరచేతితో గుండెమీదా తడివేళ్ళతో శిరస్సుమీదా మార్జనం చేసుకోవాలి.

ఆచమనాదికం




Pranayama - ప్రాణాయామం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - ప్రాణాయామం

ఈ ప్రాణాయామం సధూమ - విధూమ, సగర్భ - అగర్భ, సలక్ష్య - అలక్ష్య భేదాలతో ఆరువిధాలు. ప్రాణాయామంతో సమానమైన యోగం ప్రాణాయామమే తప్ప మరొకటి లేదు. రేచక పూరక కుంభకాలు కలిపి ఒక ప్రాణాయామం.

రేచక పూరక కుంభకాలు వర్ణత్రయాత్మకాలు. ఇవ్వికలిస్తే ప్రణవాక్షరం ఏర్పడుతుంది. (అ + ఉ + మ్‌) కాబట్టి ప్రాణాయామం ప్రణవమయం. ఇడానాడిద్వారా వాయువును పీల్చాలి. ఇది రేచకం. దాన్ని ఉదరంలో(ఊపిరి తిత్తులలో) నిలపాలి. ఇది పూరకం. పింగళానాడి ద్వారా మెల్లగా షోడశమాత్రాకాలంలో నిశ్వసించాలి. ఇది కుంభకం. ఇది సధూమ ప్రాణాయామం.

ఆధారం - లింగం - నాభి - హృదయం - తాలుమూలం - ఫాలభాగం - వీటిలో వరసగా రెండూ పదహారూ ఇరవై పదీ ఆరూ నాలుగూ దళాలున్న పద్మాలను లిఖించాలి. నాసాంతంలోనూ ఫాలమధ్యంలోనూ డ - ఫ - క - ఠ వర్ణాలను రచించాలి. అచ్చులను కంఠప్రదేశంలో పొందుపరచాలి. హం - క్షం అనే తత్త్వార్థయుక్త వర్ణాలను సర్వత్రా ఉంచాలి. ఇలాగ వర్ణమూర్తిని భావించి నమస్కరించాలి. వర్ణస్వరూపిణిని ధ్యానించాలి. ఆ దేవి అరుణకమలవాసిని. పుప్పాడి లాంటి రంగు. హరుడిచే నియమింపబడిన చిహ్నాలు ధరించి ఉంటుంది. ఆవిడ రూపం - బిసతంతు తనీయసి - తామరతూడులోపలి దారంలాగా సన్నగా ఉంటుంది. సూర్యుడా అగ్నిదేవుడా పున్నమిచంద్రుడా అనిపించే ముఖం. ఉన్నతమైన వక్షోజాలు ఈ దేవీరూపం హృదయంలో ఒక్కసారి నిలిస్తే చాలు - అతడు ముక్తుడే.

ఓదేవీ! నా పనులన్నీ నీ అర్చనలే. నా స్థితి - నీ స్థితి. నాగతి - తీర్థయాత్ర. నా మతి - నీ చింతన. నా వాక్కు - నీ స్తుతి. నేను సర్వాత్మకుడను. దేవుడను. నా దినచర్య అంతా నీ సమర్చనమే. దేవీ! నేను నువ్వే. ఇతరుడను కాను. నేనే బ్రహ్మను. శోకవిదూరుడను. సచ్చిదానందరూపుడను - అని ఆత్మానుసంధానం చేసుకోవాలి. (బ్రహ్మైక్యానుసంధానం). ప్రథమ ప్రయాణంలో ప్రకాశమానయై, ప్రతిప్రయాణంలో అమృతాయమానయై అంతఃపదవిలో అనుసంచరించే ఆనందరూపిణి అబలను శరణువేడుతున్నాను - అని ప్రార్థించాలి. అటుపైని బ్రహ్మరంధ్రంలో గురువును ధ్యానించాలి.

సకలోపచారాలతోనూ యథావిధిగా మానసపూజ చెయ్యాలి. నియతాత్ముడై సాధకుడు ప్రాతఃకాలంలో బ్రాహ్మీముహూర్తాన చెయ్యవలసిన ప్రాణాయామ ధ్యాన మానసిక పూజావిధానమిది.

శౌచక్రియ




Sadhaachaara Niruupana - సదాచార నిరూపణ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - సదాచార నిరూపణ

నారదా! అడగవలసింది అడిగావు. సదాచారాన్ని అనుష్ఠిస్తే చాలు దేవి సంతోషిస్తుంది. తెల్లవారి లేచింది మొదలుకొని పడుకునే వరకూ సజ్జనులు చెయ్యవలసిన దినచర్య ఏమిటో చెబుతాను. విను, సూర్యోదయంనుంచి సూర్యాస్తమయంవరకూ పుట్టింది మొదలు గిట్టేవరకూ సత్కర్మలే ఆచరించాలి. నిత్యకర్మలూ నైమిత్తిక కర్మలూ కామ్యకర్మలూ ఉంటాయి. వీటిని శ్రద్ధగా చెయ్యాలి. నింద్యకర్మల జోలికి పోకూడదు. జీవికి కడదాకా సహాయంగా నిలిచేది ధర్మమొక్కటే. తల్లిదండ్రులుగానీ భార్యాపుత్రులుగానీ జ్ఞాతిమిత్రులుగానీ ఎవ్వరూ నిలవరు. తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారి.

అందుచేత సాధనాలన్నింటినీ ఉపయోగించుకుని ధర్మాన్ని సమకూర్చుకోవాలి. అదే చీకటినుంచి వెలుగులోకి నడిపిస్తుంది. ఆచారమే ఉత్తమోత్తమ ధర్మం. ఆది ఆయుర్వర్ధకం, వంశవర్ధకం, సంపద్వర్థకం, పాపనాశకం, శుభప్రదం. ఆచారాన్ని మించిన ధర్మం లేదు. ఇహపరాలలో సుఖప్రదం. ఆజ్ఞానులై సంసారసాగరంలో కొట్టుమిట్టాడేవారికి ఇది ధర్మద్వీపం. ముక్తిమార్గప్రదర్శకం. ఆచారంవల్ల శ్రేష్ఠత లభిస్తుంది. ఆచారంవల్ల కర్మఫలిస్తుంది. దానివల్ల జ్ఞానం లభిస్తుంది. ఇది మనువు చెప్పిన వాక్యం. ఆచారమంటే ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమం. పరమతపస్సు. జ్ఞానాదిసర్వవిషయాలకూ అదే సాధకం.

శాస్త్రీయమనీ లౌకికమనీ ఈ ఆచారం రెండు విధాలు. రెండూ అనుష్టింపదగినవే, దేనినీ పరిత్యజించడానికి వీలులేదు. గ్రామ జాతి దేశ కులధర్మాలుంటాయి. వాటిని పాటించాలి ఉల్లంఘించకూడదు. దురాచారుణ్ణి లోకం నిందిస్తుంది. వాడు దుఃఖభాజనుడవుతాడు. వ్యాధి పీడితుడవుతాడు. ధర్మవిరుద్ధమైన అర్థకామాలను పరిత్యజించాలి. అలాగే లోకవిరుద్ధమైన ధర్మాన్నీ పరిత్యజించాలి. అది సుఖప్రదం కాదు కనక.

నారాయణమహర్షీ! మనకు శాస్త్రాలు అనేకం ఉన్నాయి. ధర్మమార్గాన్ని నిర్ణయించడంలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి అనేది పెద్ద సందేహం.

నారదా! సందేహం ఏమీ లేదు. శ్రుతి స్మృతులు రెండూ రెండు కళ్ళు. పురాణమే హృదయం. ఇవి మూడూ చెప్పినదే ధర్మం. మరోటి కాదు. ఈ మూడింటిలోనూ పరస్పరవిరోధం కనిపిస్తే అక్కడ వేదానిదే తుది తీర్పు. స్మృతి పురాణాలకన్నా వేదం చెప్పినదే ప్రమాణం. వేదంలోనే ద్వైధీభావం కనిపిస్తే అప్పుడు అవి రెండూ ధర్మాలుగానే పరిగణించాలి. స్మృతులలో 
ద్వైధీభావం కనిపించినా ఇంతే. వేదంతో సరిచూసుకోవాలి. కొన్నిచోట్ల పురాణాలలోనూ తంత్ర గ్రంథాలలోనూ కనిపించేవాటి నికూడా యథాతథంగా ధర్మాలుగా స్వీకరించాలని కొందరు అంటున్నారు. కానీ అది సరికాదు. వేదవిరుద్ధం కానంతవరకే పురాణాలుగాని తంత్రగ్రంథాలుగానీ ప్రామాణికాలు. ప్రత్యక్షంగా శ్రుతివిరుద్ధమైన ధర్మం ఎవరు చెప్పినా అప్రామాణికమే. ధర్మమార్గ నిర్ణయంలో సర్వదా సర్వథా వేదమొక్కటే పరమప్రమాణం. దానికి అవిరుద్ధంగా ఉంటే స్మృతులూ పురాణాలూ తంత్ర గ్రంథాలూ చెప్పినవికూడా కొండొకచో ప్రామాణికాలు అవుతాయి. మరింకేదీ ప్రామాణికం కానేకాదు.

వేదధర్మాన్ని కాదని ఇతర ప్రమాణాలను పట్టుకుని ఆ మార్గాల్లో నడిచేవారికోసం యమలోకంలో నరకకుండాలు సిద్ధంగా ఉన్నాయి. అందుచేత వేదోక్తమే ధర్మం. దానినే ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. స్మృతులూ పురాణాలూ తంత్రాలూ శాస్త్రాలూ ఏది చెప్పినా వేదమూలమైనంతవరకే ప్రామాణికం. కొందరు ఏవేవో కుశాస్త్రాలను ప్రమాణాలుగా చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారు. అటువంటివారు నరకానికి పోతారు. అక్కడ తలక్రిందులుగా వేలాడతారు. వేదవిరుద్ధమైన ధర్మాలను ఆచరించే వామాచారులూ పాశుపతులూ లింగధారులూ తప్తముద్రాంకితులైన వైఖానసులూ వగైరా అందరూ నరకలోకానిక పోతారు. అందుచేత వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం. దానినే ఆచరించాలి. మరింక దేనిని అనుసరించినా నరకమే.

నారదా! మానవుడు పడుకోబోయేముందు ఆ రోజంతా తాను చేసినదీ చేయించినదీ, అన్నదీ అనిపించినదీ, ఇచ్చినదీ ఇప్పించినదీ ఒక్కసారి సమీక్షించుకోవాలి. ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. ధర్మబద్ధం కాని పనుల్ని మరుసటిరోజునుంచే పరిత్యజించాలి. నిద్రఅయ్యాక తెల్లవారు జామునే లేచి బ్రహ్మధ్యానం చెయ్యాలి. తొడల మీదకి కుడిఎడమలుగా అరికాళ్ళు పైకి వచ్చేట్టు బాసింపీట వేసుకుని కొంచెం ఎత్తయినచోట కూర్చోవాలి. నడుం నిటారుగా నిలబెట్టి వక్షస్సును నిగిడించాలి. కన్నులు మూసుకోవాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. దంతాలను తాటించకూడదు. నాలుకను ఆడించకూడదు. ఇంద్రియాలను నిరోధించాలి. ఇలా కూర్చుని రెండుమూడుసార్లు ప్రాణాయామం చెయ్యాలి. హృదయంలో దీపంలాగా ఇష్టదైవాన్ని ధ్యానించాలి.

ప్రాణాయామం




Bhramaridevi Vruthantham - భ్రామరీదేవి వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - భ్రామరీదేవి వృత్తాంతం

జగజ్జనని చేష్టలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అచింత్య అవ్యక్తరూపకదా! అన్నీ జగత్కల్యాణ కారకాలే. లోకమంటే నిర్వ్యాజమైన ప్రేమ. కన్నతల్లిగదా! బిడ్డలమీద ప్రేమకాక ఏముంటుంది!

యద్యచ్చరితం శ్రీదేవ్యాస్తత్సర్వం లోకహేతవే
 ।
నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా ॥

పూర్వకాలాన పాతాళంలో అరుణుడు అని ఒక మహాదైత్యుడు ఉండేవాడు. దేవద్వేషి మహాబలుడు. మహాఖలుడు, దేవతలను జయించాలనే కోరికతో వాడు హిమవత్పర్వతానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి తీవ్రతపస్సుచేశాడు. గంగాతీరంలో పండుటాకులు తింటూ యోగమార్గాన గాయత్రీ మహామంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. వాడి శరీరంనుంచి బయల్వెడలిన తపోగ్ని జగత్తుని దహించివేయనారంభించింది. అది ఏమిటో తెలియక దేవతలూ మానవులూ గగ్గోలు పెట్టారు. బ్రహ్మను శరణువేడారు. ఆయన గాయత్రీసహితుడై హంసను అధిరోహించి హిమాలయానికి వచ్చాడు. ప్రాణమాత్రావశిష్టుడై రెండవ ఆగ్నిదేవుడిలా వెలిగిపోతున్న అరుణదైత్యుణ్ణి చూశాడు. వత్సా! వరం కోరుకో అన్నాడు. ఈ మాటలు వినపడటంతోనే అమృతం చిలికినట్టయ్యింది. అరుణుడు సాష్టాంగపడ్డాడు. ఇద్దరినీ భక్తిప్రపత్తులతో స్తుతించాడు. మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు.

అరుణా! హరిహరాదిదేవనాయకులు సైతం మృత్యూవుకి అతీతులు కారు. నాకూ మరణం ఉంది. ఇక ఇతరులమాట చెప్పాలా! కనక, దానవోత్తమా! యోగ్యమైన వరం కోరుకో ఇస్తాను. ఇవ్వడానికి శక్యమైనది అడుగు. అంతేగానీ అలవిగానివి అడిగి పంతానికి పోకు. అది బుద్దిమంతుల లక్షణం కాదు.

అయితే చతుర్ముఖా! యుద్దంలోగానీ మరొకచోటగానీ శస్త్రాస్త్రాలతోగానీ పురుషులతోగానీ స్త్రీలతోగానీ ద్విపాత్తులతోగానీ చతుష్పాత్తులతోగానీ రెండూ కలిసిన వాటితోగానీ నాకు మృత్యువులేకుండా వరం అనుగ్రహించు. దేవతలను జయించడానికి కావలసిన బలం ఇయ్యి.

బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. హంసవాహనం కదిలింది. వెళ్ళిపోయాడు. అరుణుడు పాతాళం చేరుకున్నాడు. దైత్యులనందరినీ సమావేశపరిచాడు. బ్రహ్మదేవుడిచ్చిన వరంగురించి చెప్పాడు. వెంటనే అమరావతిమీదకి దండువెళ్ళాలి అన్నాడు. యుద్ధవార్తను తెలియపరిచిరమ్మని ఇంద్రుడి దగ్గరికి దూతను పంపాడు. దేవేంద్రుడు గడగడలాడాడు. దేవతలను తీసుకుని బ్రహ్మదేవుడి సన్నిధికి పరుగుతీశాడు. విష్ణుమూర్తిని కలుపుకుని అందరూ శివుడి మందిరానికి వెళ్ళారు. అరుణాదిదైత్యులను సంహరించడమెలాగా అని విచారణ చేశారు.

అంతలోనే అరుణుడు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. సూర్యచంద్రులనూ దిక్పాలకులనూ తోసిరాజన్నాడు. తానే అన్ని రూపాలూ ధరించి ఆయా పదవులు అధిష్టించాడు. దిక్కుతోచని దిక్పాలకులు శివుడి సన్నిధికి చేరుకున్నారు. పరిస్థితి విషమించిందని మొరపెట్టుకున్నారు.

దేవనాయకులందరూ తలలు పట్టుకున్నారు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంతచేసిందని లోపల లోపల పిసుక్కున్నారు. ఏమి చెయ్యడానికీ తోచలేదు. ఆరుణుడి విజృంభణకు అడ్డుకట్ట చేసితీరాలి. ఎలాగ? ఎలాగ?

సరిగ్గా అదే సమయానికి ఆశరీరవాణి వినిపించింది. జగన్మాతను ఆశ్రయించండి. మీపని నెరవేరుతుంది. అరుణుడు గాయత్రీ జపతత్పరుడు. ఆ మంత్రజపాన్ని వాడు విడిచిపెడితే చాలు మృత్యుయోగ్యుడవుతాడు. ఈ మాటలతో దేవతలకు ఒకదారి దొరికినట్టనిపించింది. వెంటనే ఇంద్రుడు బృహస్పతిని ఆహ్వానించాడు. అరుణుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. వాడు గాయత్రిని విడిచిపెట్టేట్టు ఎలాగోలాగా చెయ్యమన్నాడు. ఇది దేవకార్యం. నీకు తప్పదన్నాడు. ఈలోగా మేమందరమూ భువనేశ్వరిని ఉపాసిస్తాం, అనుగ్రహం సంపాదిస్తాం. నీ కర్తవ్యం తేలిక అవుతుంది - అని చెప్పి దేవగురువును పంపించాడు. ఆయన అటువెళ్ళగానే దేవతలందరూ సుస్నాతులై జాంబూనదేశ్వరిని ఉపాసించారు. మాయాబీజాక్షర సహితంగా మహామంత్రాన్ని జపిస్తూ దేవీయజ్ఞాలు నిర్వహించారు.

బృహస్పతి అరుణుడి దగ్గరికి వెళ్ళాడు. అతడు గద్దించి ప్రశ్నించాడు. బృహస్పతీ! ఎక్కడినుంచి రాక! ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను మీవాణ్ణి కాదు. పైగా శత్రువును.

దైత్యనాయకా! ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నావ్‌? నువ్వు మావాడివి కాకపోవడమేమిటి? మేము ఉపాసించే దేవినే నువ్వూ నిత్యం ఉపాసిస్తున్నావు. మరి పరాయివాడవెలా అవుతావు? దేవపక్షపాతివే. సందేహం లేదు.

బృహస్పతి మాటలకు అరుణుడు హుంకరించాడు. దేవతలు ఉపాసించే దేవిని నేను ఆరాధించడమేమిటి. దేవద్వేషినికదా! కూడదుగాక కూడదు అనుకున్నాడు. దురభిమానానికి పోయాడు. ఆ క్షణంలోనే గాయత్రీమంత్రాన్ని విడిచి పెట్టేశాడు. అంతే - నిస్తేజస్కుడైపోయాడు. బృహస్పతి గమనించాడు, పని జరిగిపోయిందని సంబరపడుతూ నిర్గమించాడు. ఇంద్రుడికి సమాచారం అందించాడు. దేవతలంతా సంతోషించారు. పరమేశ్వరిని మరింత దీక్షగా ఉపాసించారు. ఎట్టకేలకు జగన్మాత సాక్షాత్కరించింది.

జగన్మంగళకారిణి, కోటిసూర్యప్రతీకాశ, కోటికందర్పసుందర, చిత్రానులేపన, విచిత్రవస్త్రద్వయ విభూషిత, విచిత్ర మాల్యాభరణ, చిత్రభ్రమరముష్టిక, వరాభయకర, శాంత, కరుణామృతసాగర, నానాభ్రమర సంయుక్త పుష్పమాలావిరాజిత. చిత్రవిచిత్రమైన అసంఖ్యాక భ్రమరీగణంతో (ఆడుతుమ్మెదల గుంపు) పరివృత. వాటి ఝంకారాలు హ్రీం బీజాక్షరధ్వనులుగా నిరంతరం వినిపిస్తున్నాయి. కోటానుకోట్లుగా తుమ్మెదలు తిరుగాడుతున్నాయి.

సర్వశృంగారవేషాఢ్య, సర్వవేదప్రశంసిత, సర్వాత్మిక, సర్వమయి, సర్వమంగళరూపిణి, సర్వజ్ఞ, సర్వజనని, సర్వేశ్వరి, శివ ఈ జగదంబికను చూడటంతోనే బ్రహ్మాదిదేవతలు సాష్టాంగదండ ప్రణామాలు చేశారు. అత్యద్భుతంగా స్తుతించారు.

అప్పటివరకూ అమ్మవారి ఒక గుప్పిడ మూసిఉంది. అందులో గండుతుమ్మెదలున్నాయి (విచిత్రభ్రమరముష్టిక). ఇప్పుడు ఆ గుప్పిడ విప్పింది. చుట్టూ గుంపులుగా తిరుగుతున్న చిత్రవిచిత్ర భ్రమరకోటులను కోటానుకోట్ల రెట్టుగా వృద్దిపాందించింది. ముల్లోకాలూ తుమ్మెదలే. ఎక్కడచూసినా తుమ్మెదలే. రంగురంగుల తుమ్మెదలు. రకరకాల తుమ్మెదలు. రాగాల తుమ్మెదలు. నాట్యాల తుమ్మెదలు. తుమ్మెదలు. తుమ్మెదలు. అంతటా తుమ్మెదలు. ఆకాశాన్ని ఆవరించిన తుమ్మెదలు. భూగోళాన్ని చీకట్లలో ముంచిన తుమ్మెదలు. గిరిశిఖరాలమీద చెట్టుకొమ్మలమీద అంతటా తుమ్మెదలే, తుమ్మెదలన్నీ ఒక్కపెట్టున ఎగురుకుంటూ వెళ్ళి దైత్యులను ఏరికోరి పీక్కుతిన్నాయి. తేనెతుట్టను కదిలించినవాడిని తేనెటీగలు ముంచెత్తినట్టు. దైత్యుల శస్త్రాలూ అస్త్రాలూ ఎందుకూ కొరగాలేదు. ఒక యుద్దం లేదు. ఒక వాగ్వాదం లేదు. కేవలం మరణమే. ఎక్కడెక్కడ దాగినా వెంటాడి వెంటాడి కుట్టీ చంపాయి. ఎవరు ఎమయ్యారో ఎవరికీ తెలియకుండా మరణించారు. అరుణిడితో సహా అసురులందరూ ఉసురులు కోల్పోయారు. తుమ్మెదలన్నీ తిరిగి వచ్చి జగదంబికను చేరుకున్నాయి. దేవతలు ఆశ్చర్యం ఆశ్చర్యం అని గుండెలు బాదుకున్నారు. ఆశ్యర్యమేముంది, అమ్మవారి మాయ అన్నారు అందరూ చివరికి.

బ్రహ్మాదిదేవతలు ఆనందించారు. పరమేశ్వరిని పునఃపునః స్తుతించారు. షోడశోపచారాలతో అర్చించారు. విలువైన కానుకలు సమర్పించారు. జయజయధ్వనులు చేశారు. దేవలోకంలో దుందుభులు మ్రోగాయి. మునీశ్వరులు వేదనపఠనం చేశారు. అప్పరసలు నృత్యం చేశారు. గంధర్వులు ఆనందగీతికలు ఆలపించారు. మంగళవాద్యాలు మిన్నుముట్టాయి. దేవతలు శిరస్సులు వంచి అంజలి ఘటించారు. జగదీశ్వరి సంతోషించింది. అందరికీ వరాలు కురిపించింది. దేవీభక్తిని అనుగ్రహించింది. అంతర్థానం చెందింది.

నారదా! ఇదీ భ్రామరీవృత్తాంతం. సర్వపాపవినాశకం. సర్వవాంఛాప్రదం. సంసారార్ణవతారకం 
దేవీసాయుజ్యదాయకం - అని నారాయణమహర్షి ముగించాడు.




SRI DEVI BHAGAVATHAM PART 11 - శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము

నారాయణమహర్షీ! ఆశ్చర్యకరమైన దేవీమాహాత్మ్యాన్ని అత్యద్భుతంగా వర్ణించి చెప్పావు. నన్ను
ధన్యుణ్ణి చేశావు. ఇప్పుడింక దేవిని ఆనందింపజేసే ఆచారం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఏయే సదాచారాలను పాటిస్తే అమ్మవారు సంతోషించి కృపాదృష్టి కురిపిస్తుందో తెలియజెయ్యి.
































శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము




Vaivaswatamanusantati - వైవస్వతమనుసంతతి

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - వైవస్వతమనుసంతతి

నారదా! మిగిలిన మనువుల కథలుకూడా చెబుతాను. శ్రద్ధగా ఆలకించు. వీరిని స్మరిస్తే చాలు దేవీభక్తి కుదురుకొంటుంది. వైవస్వతమనువుకి ఆరుగురు కొడుకులున్నారు. కరూషుడు, వృషద్రథుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు. ఆరుగురూ మహాబలశాలులే. కాళిందీ తీరంలో నిరాహారులై తీవ్రంగా తపస్సు చేశారు. కొంతకాలానికి అంతశ్శుద్ది లభించింది. జగత్తు అంతా ఆత్మలోనే కనపడింది. ఈ దర్శనానికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. మరింత నిష్ఠగా తపస్సు కొనసాగించారు. పన్నెండేళ్ళు గడిచాయి. జగదీశ్వరి సాక్షాత్కరించింది. భక్తివినమ్రులై సాగిలి మ్రోక్కారు.

మహేశ్వరి జయేశాని పరమే కరుణాలయే ।
వాగ్భవారాధనప్రీతే వాగ్భవప్రతిపాదితే ॥

క్లీంకారవహే దేవి 
క్లీంకారప్రీతిదాయిని ।
కామరాజమనోమోదదాయినిశ్వరతోషిణి ॥

మహామాయే మోదపరే మహాసామ్రాజ్యదాయిని 

విష్ణ్వర్కహరశక్రాదిస్వరూపే భోగవర్దిని ॥

ఆరుగురు రాకుమారులూ ముక్తకంఠంతో ఆ మహేశ్వరిని స్తుతించారు.ప్రనన్నురాలయ్యింది. రాజపుత్రులారా! మీరు మహాత్ములు, తపస్సులు, నిష్కల్మషులు, అంతశ్శుద్ధిని సాధించివవారు. నన్ను ఉపాసించారు. మనస్సుల్లో ఉన్న కోరికలన్నీ అడగండి. నేను ప్రసన్ననయ్యాను. తీరుస్తాను - అంది. 

మహాదేవీ! నిష్కంటకరాజ్యాన్ని ఇయ్యి. సత్పుత్రులను ప్రసాదించు. దీర్ఘాయుష్మంతుల్ని చెయ్యి. అవ్యాహతంగా భోగభాగ్యాలు అనుభవించేటట్టు యశస్సూ తేజస్సూ సన్మతీ కలిగేట్టు మా ఆరుగురికీ వరం ప్రసాదించు.

జగన్మాత తథాస్తు అంది. మీరు ఆరుగురూ క్రమంగా ఆరు మన్వంతరాలకు అధిపతులవుతారని అదనంగా వరమిచ్చి ఆశీర్వదించి వెళ్ళింది. అలాగే జరిగింది. ఆరుగురూ మహారాజులై భోగభాగ్యాలు అనుభవించి సత్సంతానాన్ని పొంది జన్మాంతరంలో మనువులయ్యారు. మొదటివాడు దక్షసావర్ణిగా తొమ్మిదవ మనువు అయ్యాడు. రెండవవాడు మెరుసావర్ణిగా పదవ మన్వంతరానికీ, మూడవవాడు సూర్యసావర్ణిగా పదకొండవ మన్వంతరానికీ, నాల్గవవాడు చంద్రసావర్ణిగా పన్నెండవ మన్వంతరానికీ, అయిదవవాడు రుద్రసావర్ణిగా పదమూడవ మన్వంతరానికీ, ఆరవవాడు విష్ణుసావర్ణిగా పధ్నాల్లవ మన్వంతరానికీ అధిపతులయ్యారు.

ఈ పదునల్గురు మనువులూ దేవీపాదచింతకులు. పరమపూజ్యులు. లోకవంద్యులు. మహాప్రతాపశాలులు. భ్రామరీదేవి అనుగ్రహానికి నోచుకున్నవారు.

నారాయణమహర్షి నోటినుంచి బ్రామరీదేవి అనే పదం రావడమేమిటి నారదుడు పట్టుకున్నాడు. మహర్షీ! ఎవరు ఈ భ్రామరీదేవి? అవతారగాథ ఎమిటి? దయచేసి వివరించు. అమృతమైనా మొహం మొత్తుతుందేమోగానీ దేవీకథామృతం ఎంతగ్రోలినా తనివితీరడంలేదు. వినిపించు - అని ప్రార్థించాడు. నారాయణ మహర్షి నారదా అంటూ ప్రారంభించాడు.

భ్రామరీదేవి వృత్తాంతం



Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము నక్షత్రం - రేవతి అధిపతి - బుధుడు గణము - దేవ జాతి - పురుష వృక్షం - విప్ప జంతువు - ఏనుగు నాడి - అంత్య పక్షి - నెమలి అధిదేవత - ...