దేవుడి హుండీలో దక్షిణ
దేవుడి హుండీలో ఎంత దక్షిణ వేయాలి, ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..?
మనసునిండా భక్తితో గుడికి వెళ్లి కానుకలు సమర్పించుకుంటారు భక్తులు. అయితే ఎవరి స్థామతకు తగ్గట్టు వారు హుండీలో డబ్బులు వేస్తారు. మరి హుండీలో ఎన్ని డబ్బులు వేస్తే మంచింది...?
మనసు ప్రశాంతత కోసం.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కోసం.. సంతానం, కుటుంబసమస్యల లాంటి ఎన్నో ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలి తెలియక.. ఆ దేవుడికి మొరపెట్టుకోవడం కోసం గుడికి వెళ్తుంటారు భక్తలు. ఇక అన్నీ ఉన్నా.. భక్తితో గుడికి వెళ్ళేవారు కూడా ఎందరో. గుడిలో అడుగు పెట్టగానే భాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి.. పాజిటీవ్ వైబ్రేషన్స్ తో హ్యాపీగా ఉంటుంటారు.
అంతే కాదు తమ స్థోమతకు తగ్గట్టు కానుకలు కూడా సమర్పించుకుంటారు. తిరుమల తిరుపతి లాంటి పెద్ద పెద్ద దేవాలయాలలో దేవుడికి బంగారు కిరీటాలు చేయిస్తుంటారు. నగలు చేయిస్తారు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తిరుపతి హుండీలో రోజు పేదా ధనిక అందరు ఎక్కవ మొత్తం లో కానుకలు వేస్తూ ఉంటారు.
అలా చిన్నా పెద్ద గుడులలో హుండీలలో అంతో ఇంతో కానుకలు వేయడం సాధారణం. అయితే హుండీలో కానుకలు వేయడానికి కూడా ఓ లెక్క ఉందట. ఈ విషయం మీకు తెలుసా..?
ముందుగా తిరుమల తిరుపతి నుంచి మొదలుపెడుదాం.. తిరుమలకు ఏడు కొండల పైన ఏడుగురు సప్త రుషులు ఉన్నారు కాబట్టి.. తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో రూ.7 వేస్తే.. అనేక రోగనాశనం అని అంటున్నారు. ఆరోగ్యాలు కలగడం కోసం తిరుమల హుండిలో7 రూపాయలు వేయాలట.
ఇక అమ్మవార్ల విషయానికి వస్తే.. విజయవాడ దుర్గమ్మవారితో పాటు నవ రాత్రులు పూజ చేసే అమ్మవార్ల గుడిలో నవరాత్రుల సంఖ్య తొమ్మిది కాబట్టి.. శత్రు బాధలు, శని బాధలు దూరం కావాలంటే హుండీలో 9 రూపాయలు వేయాలని అంటున్నారు. అమ్మవారి గుడి అనే కాదు. ఏగుడిలో ఈ సంఖ్య తో డబ్బు హుండీలో వేసినా.. ఆ ఫలితం కలుగుతుందట.
ఇక 11 రూపాయలు ఎందుకు వేయాలంటే.. 11 సంఖ్య చంద్రుడికి అనుకూలమైన సంఖ్య. 11 రూపాయలను హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి అంతే కాదు ఎప్పటి నుంచో వెంటాడుతున్న బాధలు కూడా మాయం అవుతాయని అంటున్నారు.
మనం ఏ పూజ చేసినా..గణపతిని ముందుగా తలుచుకుంటాము. అలాంటి మహాగణపతి అనుగ్రహ సంఖ్య 21. ఈ నేపథ్యంలో హుండిలో 21 రూపాయలు వేస్తే దురదృష్టం పోతుందట.. అదృష్టం వరించడంతో పాటు.. పని మొదలు పెట్టిన విఘ్నాలు తొలగిపోతాయి అంటున్నారు. అంతే కాదు గురు అనుగ్రహ సంఖ్య 54. అందుకే హుండీలో 54 రూపాయలు వేస్తే సకల విజయాలు కలుగుతాయని తెలుస్తోంది.
జాతక దోషాలు తొలగిపోవడానికి.. అనుకున్న కోరికలు నెరవేరటానికి హుండీలో 101 రూపాయి వేయాలట. ఈ సంఖ్య కల్పవృక్ష ఆధార సంఖ్య కావడంతో ఈ ఫలితం వస్తుంది అంటున్నారు. ఇక చాలా నిష్టంగా పూజించే శ్రీచక్ర యూల సంఖ్య 108. అందుకే 108 రూపాయలు హుండీలో వేస్తూ.. సకల సిద్ధి కలగడంతో సకల కోరికలు నెరవేరుతాయట
ఇక తెలిసి తెలియక పాపాలు చేసేవారు. 116 రూపాయలు హుండీలో వేసి ప్రార్దిస్తే.. పుణ్యప్రాప్తి కలుగుతుంది. సప్త జన్మల పాపం తొలగిపోతుందట. అన్ని ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు పెద్దలు.
Subscribe to:
Post Comments (Atom)
Flowers dear to Lord Vishnu - విష్ణువుకి ఇష్టమైన పూలు
విష్ణువుకి ఇష్టమైన పూలు అహింసా ప్రథమం పుష్పం! పుష్ప మింద్రియనిగ్రహః! సర్వభూతదయా పుష్పం! క్షమా పుష్పం విశేషతః! శాంతిపుష్పం తపః పుష్పం! ద్యానప...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment