తిరుప్పావై - పదిహేడవ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
ఈరోజు ఆచార్యుడు, ఆచార్యుడి ద్వారా అందే మంత్రం, ఆ మంత్రార్థం అయిన పరమాత్మ, ఆ పరమాత్మ ను అందించే భాగవతోత్తముల సేవ ఇవన్నీ యీ పాశురంలో వివరించింది. నిన్న ద్వారపాలకులు మనవాళ్ళను లోనికి పంపాక, ఒక్కసారి తొంగి చూసారు. అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదట నందగోపుడు, తరువాత యశోదమ్మ, ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు, కాని ఒక కాలికి కడియం వేసి ఉంది. మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి బహుశా వారు కృష్ణ, బలరాములై ఉండొచ్చు అని అనుకున్నారు. ఏ క్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో లేపడం ప్రారంభించారు.
ముందుగా పాశురాన్ని చదువుదాం.
అమ్బరమే, తణ్ణీరే, శోఱే అరం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎళుందిరాయ్
కొంబనార్ క్కు ఎల్లాం కొళుందే! కులవిళక్కే!
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అరివురాయ్!
అంబరం ఊడు అరుత్తు ఓంగి ఉలగళంద
ఉంబర్ కోమనే! ఉరంగాదు ఎళుందిరాయ్;
శెంబోర్ కళ లడి చ్చెల్వ బలదేవా!
ఉంబియుమ్ నీయుమ్ ఉరంగేలోరెంబావాయ్ || 17 ||
ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చూద్దాం..
అమ్బరమే, తణ్ణీరే, శోఱే అరం శెయ్యుంఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎళుందిరాయ్
వస్త్రములను, చల్లటి నీటిని, అన్నమును ఎంతో ఔదార్యంతో, ఏ ప్రయోజనం ఆశించకుండా దానం చేసేవాడా! నందగోపాలా! మాకు స్వామి అయినవాడా! నందగోపాలా! నిద్ర నుండి లెమ్ము! గోపికలు కృష్ణుని కలవడానికి నందుడికి, యశోదాదేవికి, బలరాముడికి కాకా పడుతున్నారు.
కొంబనార్ క్కు ఎల్లాం కొళుందే! కులవిళక్కే!
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అరివురాయ్!
స్త్రీలకందరికీ తలమానికం వంటిదానా! సుకుమారమైన శరీరం గల స్త్రీలందరిలో చిగురు వంటి దానా! మా కులమునకు మంగళ దీపం వంటి దానా! యశోదాదేవి మేలుకో! యశోదమ్మను మంత్రం గా ఊహించింది. అందుకే తెలివితెచ్చుకో అని చెబుతుంది. ఓ అష్టాక్షరీ మహా మంత్రమా! జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంక యశోదమ్మ కూడా అంగీకరించింది. ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు.
అంబరం ఊడు అరుత్తు ఓంగి ఉలగళంద
ఉంబర్ కోమనే! ఉరంగాదు ఎళుందిరాయ్
ఆకాశం వరకు బాగా పెరిగి.. లోకములన్నీ కొలిచిన నిత్యసూరుల నాయకుడా! (ఇక్కడ వామనావతారాన్ని గుర్తు చేసుకుంటున్నారు).
ఓ కృష్ణా! మేలుకో!
ఆయన లేవలేదు. అన్నగారు లేవలేదు కాబట్టి ఆయన కూడా లేవడం లేదని ఆండాళ్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది. కృష్ణావతారంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు ఆ పరమాత్మ. బాలరాముణ్ణి విడిచి ఉండడు. దేవకీ దేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు. ఎవ్వరూ దక్కక పోయే సరికి ఏడో గర్భాన్ని రక్షించటానికి రోహిణీ దేవి గర్భంలో పెంచారు. ఆ పుట్టిన శిశువుకి ఒక బంగారు కడియం వేసారు.
శెంబోర్ కళ లడి చ్చెల్వ బలదేవా!
ఉంబియుమ్ నీయుమ్ ఉరంగేలోరెంబావాయ్
అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనబడుతున్నాయి. అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు, ఇప్పుడు నీగురించి తెలుసుకొని వచ్చాం. లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అండాళ్ తల్లి విన్నవించింది.ఎర్రని బంగారు కడియాలను పాదములకు ఆభరణముగా ధరించిన ఓ బలరామస్వామీ నీవూ, నీ తమ్ముడైన శ్రీ కృష్ణుడూ మేల్కొనండి.
అయితే బలరాముడు లేచి.. మీరు భ్రమపడ్డారు. కృష్ణుడు ఇక్కడ లేడు. నీళాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు.
పూర్తి భావం…..
ద్వారపాలకుని వేడుకొన్నందువలన అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా.. అచట యింకను నిద్రిస్తున్న శ్రీనందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరాముడినీ, శ్రీకృష్ణుడినీ చూసి ఈవిధంగా అంటున్నారు..వస్త్రములను, చల్లటి నీటిని, అన్నమును ఎంతో ఔదార్యంతో, ఏ ప్రయోజనం ఆశించకుండా దానం చేసేవాడా! నందగోపాలా! మాకు స్వామి అయినవాడా! నందగోపాలా! నిద్ర నుండి లెమ్ము! గోపికలు కృష్ణుని కలవడానికి నందుడికి, యశోదాదేవికి, బలరాముడికి కాకా పడుతున్నారు.
స్త్రీలకందరికీ తలమానికం వంటిదానా! సుకుమారమైన శరీరం గల స్త్రీలందరిలో చిగురు వంటి దానా! మా కులమునకు మంగళ దీపం వంటి దానా! యశోదాదేవి మేలుకో! యశోదమ్మను మంత్రం గా ఊహించారు గోపికలు. అందుకే తెలివితెచ్చుకో అని చెబుతుంది. ఓ అష్టాక్షరీ మహా మంత్రమా! జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంక యశోదమ్మ కూడా అంగీకరించింది. ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు.
వాళ్లకి కృష్ణుడు కనిపించలేదు. అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనబడుతున్నాయి. అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు ఇప్పుడు నీగురించి తెల్సుకొని వచ్చాం లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా! అని అండాళ్ తల్లి విన్నవించింది.
ఆకాశం వరకు బాగా పెరిగి.. లోకములన్నీ కొలిచిన నిత్యసూరుల నాయకుడా! (ఇక్కడ వామనావతారాన్ని గుర్తు చేసుకుంటున్నారు).
ఓ కృష్ణా! మేలుకో! ఆయన లేవలేదు. అన్నగారు లేవలేదు కాబట్టి ఆయన కూడా లేవడం లేదని ఆండాళ్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది. కృష్ణావతారంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు. బాలరాముణ్ణి విడిచి ఉండడు. దేవకీ దేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు. ఎవ్వరూ దక్కక పోయే సరికి ఏడో గర్భాన్ని రక్షించటానికి రోహిణీ దేవి గర్భంలో పెంచారు. ఆ పుట్టిన శిశువుకి ఒక బంగారు కడియం వేసారు. ఎర్రని బంగారు కడియాలను పాదములకు ఆభరణముగా ధరించిన ఓ బలరామస్వామీ నీవూ, నీ తమ్ముడైన శ్రీ కృష్ణుడూ మేల్కొనండి.
అయితే బలరాముడు లేచి మీరు భ్రమపడ్డారు. కృష్ణుడు ఇక్కడ లేడు. నీళాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు.
No comments:
Post a Comment