శయన ఏకాదశి - తొలి ఏకాదశి - దేవశయని ఏకాదశి
హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే పండుగ తొలి ఏకాదశి.
యోగనిద్ర: ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు .( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది).
చాతుర్మాస్య ప్రారంభం: ఈ ఏకాదశి నుంచే పవిత్రమైన నాలుగు నెలల చాతుర్మాస దీక్ష మొదలవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.
హరి జాగరణ: విష్ణుమూర్తి మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) నాడు మేల్కొంటాడు.
మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది.
వ్రతంలోని ప్రధాన నియమాలు:
ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది.
భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, శ్రీ లక్ష్మీనారాయణుడిని భక్తితో పూజిస్తారు. ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.
జాగరణ: రాత్రి సమయంలో జాగరణ చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు.
పారణ: ఏకాదశి తర్వాతి రోజైన ద్వాదశి తిథి ఉదయం పూజ ముగించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఉపవాసం విరమిస్తారు.
తొలి ఏకాదశి ప్రాశస్త్యం:
ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది.
ఈ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.ఇది తొలి ఏకాదశి పర్వదినం విశిష్టత.
పురాణం: భవిష్యోత్తర పురాణంలో , సృష్టికర్త అయిన బ్రహ్మ ఒకప్పుడు తన కుమారుడైన నారదునికి శయని ఏకాదశి ప్రాముఖ్యతను వివరించినట్లే, కృష్ణుడు యుధిష్ఠిరునికి దాని ప్రాముఖ్యతను వివరిస్తాడు . ఈ సందర్భంలోనే మందత మహారాజు కథ చెప్పబడింది. ఆ ధర్మరాజు దేశం మూడు సంవత్సరాలు కరువును ఎదుర్కొంది, కానీ వర్ష దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి రాజు పరిష్కారం కనుగొనలేకపోయాడు. చివరికి, అంగిరస మహర్షి రాజుకు దేవశయని ఏకాదశి వ్రతం ఆచరించమని సలహా ఇచ్చాడు . అలా చేసిన తరువాత, విష్ణువు అనుగ్రహంతో , రాజ్యంలో వర్షాలు కురిశాయి.
ఈ రోజున, దక్షిణ మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో, చంద్రభాగ నది ఒడ్డున ఉన్న పండర్పూర్లో, పండర్పూర్ ఆషాఢ ఏకాదశి యాత్ర అనే పేరుతో ఒక భారీ యాత్ర లేదా ఊరేగింపు ముగుస్తుంది . పండర్పూర్, విష్ణువు యొక్క రూపమైన విఠలుని పూజిస్తారు. ఈ రోజున మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది యాత్రికులు పండర్పూర్కు వస్తారు. వారిలో కొందరు మహారాష్ట్రకు చెందిన సాధువుల చిత్రాలతో కూడిన పల్లకీలను తీసుకువస్తారు. అలంది నుండి జ్ఞానేశ్వరుని చిత్రం , నర్సి నామ్దేవ్ నుండి నామ్దేవ్ చిత్రం, దేహు నుండి తుకారాం యొక్క చిత్రం , పైఠాన్ నుండి ఏకనాథ్ , త్రయంబకేశ్వరం నుండి నివృత్తినాథ్ , ముక్తాయినగర్ నుండి ముక్తాబాయి , సాస్వాద్ నుండి సోపాన్ మరియు షెగానన్ మహారాజ్ యొక్క చిత్రం . ఈ యాత్రికులను వార్కారీలు అంటారు . వారు విఠ్ఠలకు పారణ భక్తుడైన భక్త తుకారాం మరియు జ్ఞానేశ్వర్ యొక్క అభంగాస్ (స్తోత్రాలు పాడటం) పాడతారు.
No comments:
Post a Comment